పెట్రోల్ డీజిల్
పెట్రోలియం నుంచి ఉత్పత్తి చేసే పెట్రోల్, డీజిల్ ఇంధనం అత్యంత ముఖ్యమైన వనరులలో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఇది అత్యంత ఎక్కువగా ఉపయోగించే ఇంధనం కావడం విశేషం. ఆధునిక రవాణా వ్యవస్థలతో పాటు పరిశ్రమలు, వ్యవసాయంలో ఈ ఇంధనాన్ని వాడుతున్నారు. ప్రస్తుతం భారత దేశంలో ఎక్కువ వాహనాలు, యంత్రాలు పెట్రోల్ లేదా డీజిల్తోనే నడుస్తున్నాయి. దీని ధరలు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) ధరలపై ఆధారపడి మారుతుంటాయి. గ్లోబల్ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్-డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి పెట్రోల్-డీజిల్ విక్రయాలపై విధించే పన్నులు పెద్ద వనరుగా ఉంది. పెట్రోల్-డీజిల్పై విధించే పన్నులలోని అత్యధిక భాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు చేరుతుంది.
భారతదేశంలో సాధారణంగా డీజిల్తో పోలిస్తే పెట్రోల్పై ఎక్కువ పన్నులు విధించబడుతాయి. అందువల్ల పెట్రోల్ ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. చాలా చల్లని దేశాల్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా దీని ఇగ్నిషన్ ఇతర ఇంధనాల కంటే సులభంగా జరుగుతుంది. కార్లు, బైక్లు వంటి తేలికపాటి వాహనాల్లో తక్కువ బరువు కలిగిన పెట్రోల్ను అధికంగా వినియోగిస్తారు. పెట్రోల్ కంటే ఎక్కువ భారంగా ఉండే డీజిల్ను ట్రక్కులు, ట్రాక్టర్లు, బస్సులు, జనరేటర్లు వంటి భారీ యంత్రాల్లో వాడుతారు.
Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు.. వాహనదారులకు షాకిచ్చిన మరో సంస్థ.. నేటి నుంచి కొత్త ధరలు..
గత నెలలో నయారా సంస్ధ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. ఇప్పుడు మరో ప్రైవేట్ ఇంధన సంస్థ అయిన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వాహనదారులకు షాక్ తగిలినట్లయింది.
- Venkatrao Lella
- Updated on: Apr 1, 2026
- 5:27 pm
Petrol Prices: కేంద్ర ప్రకటనతో పెద్ద ఊరట.. ప్రస్తుతం లీటర్ పెట్రోల్, డీజిల్పై ట్యాక్సులు ఎంత పడుతున్నాయంటే.?
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం ఒకేసారి భారీగా తగ్గించింది. ఈ తగ్గింపు వల్ల వాహనదారులకు ప్రత్యక్ష బెనిఫిట్ జరగనప్పటికీ.. ఆయిల్ కంపెనీలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సుంకం తగ్గింపు తర్వాత లీటర్ పెట్రోల్, డీజిల్పై ఎంత డ్యూటీ పడుతుందనేది చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Mar 29, 2026
- 4:56 pm
Petrol Prices: లీటర్ పెట్రోల్ కేవలం రూ.50 మాత్రమే.. ఆ పన్నులు తీసేస్తే భారీ ఉపశమనం..!
పెట్రోల్, డీజిల్ ధరల్లో ట్యాక్సులు, రాష్ట్రాలు విధించే వ్యాట్లు గణనీయమైన భాగాన్ని కలిగి ఉంటాయి. దీంతో వీటి వల్ల ధరలు పెరుగుతున్నాయి. వీటిని తగ్గిస్తే ధరలు సగానికి సగం తగ్గుతాయి. ప్రస్తుతం కేంద్రం ఎక్సైంజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుుంది. దీంతో ధరల్లో మార్పులు జరగనున్నాయి.
- Venkatrao Lella
- Updated on: Mar 27, 2026
- 5:56 pm
Nirmala Sitharaman: పెట్రోల్, డీజిల్ సుంకాల తగ్గింపుపై మంత్రి నిర్మలమ్మ రియాక్షన్ ఇదే..!
Nirmala Sitharaman: కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 తగ్గించడంతో పెట్రోల్పై సుంకాన్ని రూ.3కి, డీజిల్పై సున్నాకు తీసుకువచ్చింది. ప్రపంచ ఇంధన మార్కెట్లోని హెచ్చుతగ్గుల నుండి దేశ ప్రజలను కాపాడాలనే ప్రభుత్వ నిబద్ధతను ఈ చర్య ప్రతిబింబిస్తుందని సీతారామన్ ఒక ఎక్స్-పోస్ట్లో తెలిపారు..
- Subhash Goud
- Updated on: Mar 27, 2026
- 11:47 am
Petrol Prices: పెట్రోల్ ధరలపై బిగ్ షాకింగ్ న్యూస్.. ఒకేసారి రూ.5.30 పెంపు.. సిటీల వారీగా కొత్త ధరలు ఇవే..
ప్రైవేట్ సంస్థ నయారా దేశంలో పెట్రోల్ ధరలను పెంచింది. పెరుగుతున్న సరఫరా, రవాణా ఖర్చుల కారణంగా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పెంపు తర్వాత హైదరాాబాద్లో పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది. నగరాల వారీగా ధరలు ఎలా ఉన్నాయో ఇందులో చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Mar 26, 2026
- 6:56 pm
Fuel Quality: పెట్రోల్ బంకుల్లో మోసాలకు చెక్.. వైరల్ వీడియోలో ఎవ్వరికి తెలియని అసలు నిజాలు!
Fuel Quality and Quantity: చాలామంది వాహనదారులు ఒక నమ్మకంతో ఉంటారు. రూ.100, 200, 500 లాంటి రౌండ్ ఫిగర్ కాకుండా.. రూ. 110, 210, 310 లేదా 510 లాంటి 'ఆడ్ నంబర్ల'కు పెట్రోల్ కొట్టిస్తే మిషన్లలో సెట్ చేసిన..
- Subhash Goud
- Updated on: Mar 26, 2026
- 12:26 pm
Fuel Price: వాహనదారులకు తీపికబురు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన!
Petrol, Diesel Prices: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరుగుతాయని, నిల్వలు కూడా తగ్గిపోతాయని సోషల్ మీడియాలో పుకార్లు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ వార్తలతో భయపడిన ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అయితే ఇలాంటి వార్తలను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
- Subhash Goud
- Updated on: Mar 26, 2026
- 7:00 am
Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ బంకుల మూసివేత.. కిలో మీటర్ మేర క్యూ కట్టిన వాహనాలు
Hyderabad: పెట్రోల్ బంకులు మూసేస్తున్నారని పుకార్లతో భారీగా హైదరాబాదులో క్యూ కట్టిన వాహనదారులు. నగరంలో ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల కిలోమీటర్ మేర వాహనదాలు కూ కట్టాయి. ఒక్కసారిగా భారీగా రద్దీ ఏర్పడటంతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సర్ది చెబుతున్నారు. అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది.
- Subhash Goud
- Updated on: Mar 25, 2026
- 7:43 am
Petrol Prices: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండో రోజు.. ఒకేసారి ఎంతంటే..?
దేశ ప్రజలకు బిగ్ షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం పవర్ పెట్రోల్, పారిశ్రామిక డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. పవర్ పెట్రోల్ ధర లీటర్పై రూ.2 పెరగ్గా.. శుక్రవారం నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి.
- Venkatrao Lella
- Updated on: Mar 21, 2026
- 11:31 am
Petrol: సాధారణ పెట్రోల్ కంటే ప్రీమియం పెట్రోల్ ఎందుకు ఖరీదైనది? రెండింటి మధ్య తేడా, ప్రయోజనాలు ఏంటి?
Premium Petrol - Regular Fuel: సాధారణ పెట్రోల్తో పోలిస్తే ప్రీమియం పెట్రోల్ ధర సాధారణంగా లీటరుకు కొన్ని రూపాయలు ఎక్కువగా ఉంటుంది. తాజా ధరల పెంపు తర్వాత ఈ వ్యత్యాసం మరింత పెరిగింది. మెరుగైన పనితీరు, ఇంజిన్ రక్షణ పేరుతో కంపెనీలు ఈ అదనపు ధరను వసూలు చేస్తాయి. ప్రీమియం పెట్రోల్ను ఎంచుకోవడం వల్ల లీటరుకు ఎక్కువ ఖర్చయినా, దానితో పాటు కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
- Subhash Goud
- Updated on: Mar 20, 2026
- 6:20 pm
Diesel Price: దిమ్మదిరిగే షాకిచ్చిన చమురు కంపెనీలు.. భారీగా పెరిగిన డీజిల్ ధర
Industrial Diesel Price: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లను దాటిన తరుణంలో భారతదేశంలో ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగాయి. అదే సమయంలో, ఎల్పిజి సంక్షోభం ఇప్పటికే నెలకొని ఉంది. పర్యవసానంగా, ముడి చమురు ధరలలో ఈ పెరుగుదల సామాన్య ప్రజల జేబులపై..
- Subhash Goud
- Updated on: Mar 20, 2026
- 4:09 pm
Crude Oil: పెరుగుతున్న ముడి చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?
Crude Oil: ఇరాన్ - అమెరికా యుద్ధం ప్రభావంతో ప్రపంచ చమురు మార్కెట్ తీవ్ర గందరగోళాన్ని చూసింది, ముడి చమురు ధరలు దాదాపు నాలుగు సంవత్సరాలలో మొదటిసారిగా బ్యారెల్కు 100 డాలర్లు దాటాయి. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా తీవ్ర సరఫరా అంతరాయాలు మార్కెట్పై ఒత్తిడిని సృష్టించాయి. ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
- Subhash Goud
- Updated on: Mar 13, 2026
- 7:12 am