పెట్రోల్ డీజిల్
పెట్రోలియం నుంచి ఉత్పత్తి చేసే పెట్రోల్, డీజిల్ ఇంధనం అత్యంత ముఖ్యమైన వనరులలో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఇది అత్యంత ఎక్కువగా ఉపయోగించే ఇంధనం కావడం విశేషం. ఆధునిక రవాణా వ్యవస్థలతో పాటు పరిశ్రమలు, వ్యవసాయంలో ఈ ఇంధనాన్ని వాడుతున్నారు. ప్రస్తుతం భారత దేశంలో ఎక్కువ వాహనాలు, యంత్రాలు పెట్రోల్ లేదా డీజిల్తోనే నడుస్తున్నాయి. దీని ధరలు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) ధరలపై ఆధారపడి మారుతుంటాయి. గ్లోబల్ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్-డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి పెట్రోల్-డీజిల్ విక్రయాలపై విధించే పన్నులు పెద్ద వనరుగా ఉంది. పెట్రోల్-డీజిల్పై విధించే పన్నులలోని అత్యధిక భాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు చేరుతుంది.
భారతదేశంలో సాధారణంగా డీజిల్తో పోలిస్తే పెట్రోల్పై ఎక్కువ పన్నులు విధించబడుతాయి. అందువల్ల పెట్రోల్ ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. చాలా చల్లని దేశాల్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా దీని ఇగ్నిషన్ ఇతర ఇంధనాల కంటే సులభంగా జరుగుతుంది. కార్లు, బైక్లు వంటి తేలికపాటి వాహనాల్లో తక్కువ బరువు కలిగిన పెట్రోల్ను అధికంగా వినియోగిస్తారు. పెట్రోల్ కంటే ఎక్కువ భారంగా ఉండే డీజిల్ను ట్రక్కులు, ట్రాక్టర్లు, బస్సులు, జనరేటర్లు వంటి భారీ యంత్రాల్లో వాడుతారు.
Telangana: వాహనదారులకు గుడ్న్యూస్.. రాష్ట్రంలో పెట్రోల్ నిల్వలపై కీలక ఆప్డేట్
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, దేశంలో 90 రోజుల వరకు ఇంధన నిల్వలు ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. అనవసర పుకార్లను నమ్మి ఇళ్లలో నిల్వ చేసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అధికారిక ప్రకటన విడుదల చేయాలని ఆయన కోరారు.
- Anand T
- Updated on: Mar 11, 2026
- 3:28 pm