నా పేరు సయ్యద్ నాగ్పాషా. టీవీ9 తెలుగులో చీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. 2025 ఫిబ్రవరి నుంచి టీవీ9 తెలుగు వెబ్ సైట్తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ, క్రికెట్కు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. అలాగే వైరల్, పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ కూడా రాస్తుంటాను. 2018లో కేరీర్ ప్రారంభించాను. జర్నలిజంలో 8 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో 2018 నుంచి 2021 వరకు సాక్షి వెబ్సైట్, ఖమ్మం యూనిట్ ఆఫీస్లో, 2021 నుంచి 2023 సుమన్ టీవీ వెబ్సైట్లో, 2023 నుంచి 2025 జనవరి వరకు ఐడ్రీమ్ వెబ్సైట్లో పనిచేశాను. 2017లో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందాను.
ప్రపంచపు మొదటి క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించారు? ఇప్పటికీ ఉందా? ఎంత ఖర్చుతో కట్టారు?
ప్రపంచంలోనే తొలి క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందిన లార్డ్స్కు 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 1814లో నిర్మించిన ఈ మైదానం ఇప్పటికీ క్రికెట్కు మక్కాగా కొనసాగుతోంది. 1983 వరల్డ్కప్ ఫైనల్ నుంచి 2019 వరల్డ్కప్ థ్రిల్లర్ వరకు ఎన్నో చారిత్రక మ్యాచ్లకు లార్డ్స్ వేదికగా నిలిచింది.
- SN Pasha
- Updated on: Jul 29, 2026
- 2:25 pm
అబ్బ.. ఈ పాము ఒక్కటి దొరికితే చాలు లైఫ్ సెట్టు! ధర తెలిస్తే ఇప్పుడే వెతికేందుకు వెళ్తారు..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాముగా గుర్తింపు పొందిన హై బ్లూ గ్రీన్ ట్రీ పైథాన్ ధర రూ.3.8 కోట్లకు పైగా పలికింది. అరుదైన నీలం రంగు, ప్రత్యేక జన్యువులు, క్లిష్టమైన బ్రీడింగ్ ప్రక్రియ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలెక్టర్ల భారీ డిమాండ్ ఈ పామును అత్యంత విలువైన జీవిగా మార్చాయి.
- SN Pasha
- Updated on: Jul 29, 2026
- 1:44 pm
వామ్మో.. భూమిపైనే కృత్రిమ సూర్యుడిని తయారు చేస్తున్న చైనా! ఎందుకంటే..?
కృత్రిమ సూర్యుడి నిర్మాణంలో చైనా కీలక విజయాన్ని సాధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్కండక్టింగ్ ఫ్యూజన్ అయస్కాంతాన్ని విజయవంతంగా పూర్తి చేసి పరీక్షించింది. 2030 నాటికి ఫ్యూజన్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్న చైనా, కార్బన్ రహిత అపరిమిత శక్తి ఉత్పత్తి దిశగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
- SN Pasha
- Updated on: Jul 29, 2026
- 12:31 pm
రేషన్ కార్డు దారులకు గుడ్న్యూస్.. ఒక్కో వ్యక్తికి 18 కేజీల బియ్యం!
ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున బియ్యం అందించనున్నారు. రేషన్ డీలర్లు మాత్రం నిల్వ, పంపిణీ, ఈ-పాస్ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- SN Pasha
- Updated on: Jul 29, 2026
- 10:56 am
వామ్మో.. పాత వెస్టిండీస్ పుట్టుకొచ్చిందా? వీళ్లను తట్టుకొని 2027 వన్డే వరల్డ్ కప్ గెలుస్తామా?
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను వణికించిన వెస్టిండీస్ పేస్ ఎటాక్ మళ్లీ పునరాగమనం చేస్తున్నదా? జేడెన్ సీల్స్, జస్టిన్ గ్రీవ్స్, షామర్ జోసెఫ్ అద్భుత బౌలింగ్తో పాకిస్థాన్ను చిత్తు చేశారు. 1975, 1979 ప్రపంచకప్లలో ప్రత్యర్థులను భయపెట్టిన కరేబియన్ పేస్ సంస్కృతి మరోసారి కనిపిస్తోందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- SN Pasha
- Updated on: Jul 29, 2026
- 11:24 am
Video: ఆర్మీ యూనిఫామ్లో తొలిసారి ఇంటికి.. ఎదురుగా తండ్రి అంతిమయాత్ర! కన్నీళ్లు పెట్టించే సీన్
గుండెపోటుతో తండ్రి మృతి చెందిన వార్త తెలిసిన అగ్నివీర్ సైనికుడు సన్నీ రావత్ 1,100 కిలోమీటర్లు ప్రయాణించి స్వగ్రామానికి చేరుకున్నాడు. యూనిఫాంలోనే తండ్రికి చివరి వందనం చేసిన అతని భావోద్వేగ క్షణం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో సైనికుల కుటుంబాల త్యాగాలను మరోసారి గుర్తు చేస్తూ లక్షలాది మందిని కదిలిస్తోంది.
- SN Pasha
- Updated on: Jul 29, 2026
- 8:01 am
భారీ వర్షాలు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. ఆదిలాబాద్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
- SN Pasha
- Updated on: Jul 29, 2026
- 6:50 am
హైదరాబాద్ మియాపూర్లో విషాదం.. తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి వ్యక్తి గల్లంతు
హైదరాబాద్ మియాపూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. వైశాలినగర్ రైల్వే అండర్పాస్ సమీపంలోని తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి హఫీజ్పేట్కు చెందిన బాలయ్య గల్లంతయ్యారు. హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
- SN Pasha
- Updated on: Jul 29, 2026
- 6:14 am
టీమ్ అంటే ఇలా ఉండాలి.. 2027 వన్డే వరల్డ్ కప్ కొట్టాలంటే సరైన జట్టు!
2027 వన్డే ప్రపంచకప్ కోసం మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు కల్పించాడు. బలమైన బ్యాటింగ్, పేస్ బౌలింగ్ కలయికతో జాఫర్ ఎంపిక చేసిన జట్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
- SN Pasha
- Updated on: Jul 28, 2026
- 1:35 pm
ఎవరీ సారాంశ్ జైన్..? రిటైర్మెంట్ ఏజ్లో టీమిండియాలోకి.. ఏం చూసి ఇతన్ని ఎంపిక చేశారంటే?
వాషింగ్టన్ సుందర్ గాయంతో శ్రీలంక టెస్ట్ సిరీస్కు భారత జట్టులోకి వచ్చిన సారాంశ్ జైన్ ఎవరు? మధ్యప్రదేశ్ తరఫున అద్భుత ప్రదర్శనతో పాటు 181 వికెట్లు, 2,223 పరుగులు చేసిన ఈ ఆల్రౌండర్కు ఇదే తొలి భారత టెస్ట్ పిలుపు. ఐపీఎల్లో అవకాశం రాకపోయినా ఇప్పుడు టీమిండియాలో చోటు దక్కింది.
- SN Pasha
- Updated on: Jul 28, 2026
- 12:20 pm
హైదరాబాద్ ప్రయాణికుడికి చేదు అనుభవం.. భారీ పరిహారం చెల్లించాలని రైల్వేకు కోర్టు ఆదేశం!
రైలు దారి మళ్లించిన విషయాన్ని ముందుగా తెలియజేయకపోవడంతో ఓ ప్రయాణికుడు వ్యాపార సమావేశం, విమానం రెండింటినీ కోల్పోయాడు. ఈ కేసులో హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ దక్షిణ రైల్వేను రూ.35,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ప్రయాణికులకు సకాలంలో సమాచారం ఇవ్వడం రైల్వే బాధ్యత అని కమిషన్ స్పష్టం చేసింది.
- SN Pasha
- Updated on: Jul 28, 2026
- 11:55 am
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కొత్త కుర్రాడికి ఛాన్స్
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్గా కొనసాగుతుండగా, సరన్ష్ జైన్కు తొలి టెస్ట్ పిలుపు లభించింది. జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్ ఫిట్నెస్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. తొలి టెస్టుకు వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేడు.
- SN Pasha
- Updated on: Jul 28, 2026
- 9:38 am