నా పేరు సయ్యద్ నాగ్పాషా. టీవీ9 తెలుగులో చీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. 2025 ఫిబ్రవరి నుంచి టీవీ9 తెలుగు వెబ్ సైట్తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ, క్రికెట్కు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. అలాగే వైరల్, పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ కూడా రాస్తుంటాను. 2018లో కేరీర్ ప్రారంభించాను. జర్నలిజంలో 8 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో 2018 నుంచి 2021 వరకు సాక్షి వెబ్సైట్, ఖమ్మం యూనిట్ ఆఫీస్లో, 2021 నుంచి 2023 సుమన్ టీవీ వెబ్సైట్లో, 2023 నుంచి 2025 జనవరి వరకు ఐడ్రీమ్ వెబ్సైట్లో పనిచేశాను. 2017లో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందాను.
బాల్ తగిలి చనిపోయిన భారత క్రికెటర్ ఎవరో తెలుసా? ఇప్పటి వరకు 174 మందిని బలిగొన్న క్రికెట్ బాల్
క్రికెట్ బంతి తగిలి ప్రాణాలు కోల్పోయిన భారత క్రికెటర్ రమణ్ లాంబా విషాద ఘటన ఇప్పటికీ గుర్తుండిపోయే సంఘటన. 1998లో ఢాకాలో ఫీల్డింగ్ చేస్తుండగా బంతి తలకు తగలడంతో తీవ్ర మెదడు గాయానికి గురై మూడు రోజుల తర్వాత మరణించారు. చారిత్రక అధ్యయనాల ప్రకారం 1858 నుంచి 2016 వరకు క్రికెట్కు సంబంధించిన 174 మరణాలు నమోదయ్యాయి.
- SN Pasha
- Updated on: Aug 18, 2026
- 8:00 am
డ్రగ్ టెస్ట్లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్! భయాందోళనలో ప్రయాణికులు
ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్న విస్తృత డ్రగ్ స్క్రీనింగ్లో మరో ఇద్దరు పైలట్లు ప్రాథమిక పరీక్షలో విఫలమైనట్లు సమాచారం. తుది నిర్ధారణ కోసం వారి నమూనాలకు మరో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఫలితాలు వచ్చే వరకు ఇద్దరి నీ విమాన విధుల నుంచి తప్పించారు.
- SN Pasha
- Updated on: Aug 17, 2026
- 9:47 pm
26 కేసులు గెలిచిన ఫేక్ లాయర్! పోలీసులు అరెస్ట్ చేస్తే.. తన కేసు కూడా వాదించి గెలిచాడు!
కెన్యాలో న్యాయవాదిగా పరిచయం చేసుకున్న బ్రియాన్ మ్వెండా ఏకంగా 26 కేసులు గెలిచినట్లు వార్తలు సంచలనం సృష్టించాయి. అయితే అతను అధికారికంగా న్యాయవాది కాదని లా సొసైటీ ఆఫ్ కెన్యా గుర్తించింది. మరో న్యాయవాది గుర్తింపును ఉపయోగించి పోర్టల్లో వివరాలు మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి.
- SN Pasha
- Updated on: Aug 17, 2026
- 9:25 pm
బీటెక్ మధ్యలో ఆపేసి.. ఇప్పుడు ఏకంగా బ్లాక్ హోల్పై అధ్యాయనం చేస్తున్న హైదరాబాదీ సైంటిస్ట్!
హైదరాబాద్లో జన్మించిన రోహన్ పి. నాయుడు 18 ఏళ్లకే ఇంజినీరింగ్ చదువు వదిలి ఖగోళ శాస్త్రం వైపు అడుగుపెట్టారు. ప్రస్తుతం ఎంఐటీలో పరిశోధకుడిగా ఉన్న ఆయన నేతృత్వంలోని అధ్యయనం, బిగ్బ్యాంగ్ తర్వాత 660 మిలియన్ సంవత్సరాల నాటి MoM-BH-1 అనే వస్తువును పరిశీలించింది.
- SN Pasha
- Updated on: Aug 17, 2026
- 8:39 pm
ప్రహరీ గోడ నిర్మాణం.. పిల్లర్లు అవసరమా? సిమెంట్ ఇటుకలు సరిపోతాయా? ఏది బెస్ట్?
ఇంటి ప్రహరీ గోడ నిర్మాణంలో పిల్లర్లు అవసరమా? సిమెంట్ ఇటుకలు సరిపోతాయా? అనేది గోడ ఎత్తు, పొడవు, నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. పొడవైన, ఎత్తైన గోడలకు ఆర్సీసీ పిల్లర్లు అదనపు బలం ఇస్తాయి. నాణ్యమైన ఇటుకలు లేదా సిమెంట్ బ్లాక్స్తో సరైన పునాది, మోర్టార్, క్యూరింగ్, ఇంజినీరింగ్ డిజైన్తో నిర్మిస్తే గోడ మరింత సురక్షితంగా ఉంటుంది.
- SN Pasha
- Updated on: Aug 17, 2026
- 8:10 pm
రూ.17 వేలకే 10 ఎకరాలు..! ఎక్కడ, ఎలా కొనాలి? పూర్తి వివరాలు ఇవే
రూ.17 వేలకే 10 ఎకరాల భూమి ఎక్కడ దొరుకుతుందో తెలుసా? అది భూమిపై కాదు.. చంద్రుడిపై! లూనార్ ఎంబసీ వంటి సంస్థలు చంద్రుడిపై భూమిని విక్రయిస్తున్నట్లు చెబుతున్నాయి. ఒక ఎకరానికి సుమారు రూ.1,700 నుంచి రూ.3,400 వరకు ధరలు ఉంటాయని ప్రచారం ఉంది.
- SN Pasha
- Updated on: Aug 17, 2026
- 7:00 pm
సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్! ప్రత్యేకతలు ఇవే..
హైదరాబాద్ ఎర్రగడ్డలో 22.6 ఎకరాల్లో రూ.1,100 కోట్లతో నిర్మించిన టిమ్స్ సనత్నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. 1,000 పడకల సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో అత్యాధునిక వసతులు ఏర్పాటు చేశారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ నుంచి సిబ్బందితో పాటు కొత్తగా సుమారు 200 మంది వైద్య సిబ్బందిని నియమించారు.
- SN Pasha
- Updated on: Aug 17, 2026
- 6:26 pm
Sonal Dinusha: టీమిండియాపైనే తన తొలి సెంచరీ కొట్టాడు.. ఎవరీ సోనల్ దినూష?
టీమిండియాపై శ్రీలంక యువ ఆల్రౌండర్ సోనల్ దినూష తొలి టెస్టు సెంచరీ సాధించాడు. 168 బంతుల్లో 100 పరుగులు చేసి శ్రీలంకను కష్టాల నుంచి గట్టెక్కించాడు. 90 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సమయంలో ధనంజయ డి సిల్వాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఎడమచేతి బ్యాటర్, స్పిన్నర్గా దినూష శ్రీలంకకు భవిష్యత్తు ఆశాకిరణంగా మారుతున్నాడు.
- SN Pasha
- Updated on: Aug 17, 2026
- 5:50 pm
బిచ్చగాళ్లు సైతం ట్యాక్స్ కడతారని తెలుసా? మీ మతిపోగొట్టే నిజాలు
రోడ్లపై బిక్షాటన చేసి వచ్చిన డబ్బుతో వస్తువులు కొనుగోలు చేసినప్పుడు, ఆ వస్తువులకు GST వర్తిస్తే ధరలోని పన్ను భాగాన్ని వారు కూడా భరిస్తారు. అయితే వారు నేరుగా ప్రభుత్వానికి GST చెల్లించరు. దుకాణదారుడు పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తాడు. ఇది ఆదాయపు పన్ను కాకుండా వినియోగదారుడిపై పడే పరోక్ష పన్ను భారం మాత్రమే.
- SN Pasha
- Updated on: Aug 17, 2026
- 4:46 pm
మనలాగే జంతువులకు కూడా కంటిచూపు తగ్గి సైట్ వస్తుందా? పెట్ లవర్స్ తెలుసుకోవాల్సిందే!
మనుషుల్లాగే జంతువులకు కూడా వయసు పెరిగేకొద్దీ చూపు తగ్గే అవకాశం ఉంటుంది. కుక్కలు, పిల్లుల్లో న్యూక్లియర్ స్క్లెరోసిస్, కాటరాక్ట్ వంటి కంటి సమస్యలు రావచ్చు. వస్తువులకు ఢీకొనడం, మెట్ల దగ్గర తడబడటం, చీకటిలో ఇబ్బంది పడటం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త. చూపు తగ్గినా వాసన, వినికిడి వంటి ఇతర ఇంద్రియాలతో జంతువులు జీవించగలవు.
- SN Pasha
- Updated on: Aug 17, 2026
- 3:59 pm
రైలులో మద్యం తీసుకెళ్లవచ్చా? ఏపీ, తెలంగాణలో రూల్స్ ఏం చెబుతున్నాయ్?
రైలులో మద్యం తీసుకెళ్లవచ్చా ? ఎన్ని సీసాలు అనుమతిస్తారు? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. దేశవ్యాప్తంగా ఒకే పరిమితి లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాష్ట్ర ఎక్సైజ్ నిబంధనలు కీలకం. సీల్ చేసిన బాటిల్ ఉన్నంత మాత్రాన అన్ని చోట్ల అనుమతి ఉండదు.
- SN Pasha
- Updated on: Aug 17, 2026
- 3:05 pm
భార్య గర్భవతి అని తెలియగానే విడాకులు ఇచ్చిన భారత క్రికెటర్!
టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ తొలి వివాహం 2012లో ముగిసింది. చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజారాతో పెళ్లి చేసుకున్న కార్తీక్.. ఆ తర్వాత ఆమెకు, క్రికెటర్ మురళీ విజయ్కు మధ్య సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో విడాకులు తీసుకున్నారు.
- SN Pasha
- Updated on: Aug 17, 2026
- 2:36 pm