నా పేరు సయ్యద్ నాగ్పాషా. టీవీ9 తెలుగులో సీనియర్ సబ్ఎడిటర్గా పనిచేస్తున్నాను. 2025 ఫిబ్రవరి నుంచి టీవీ9 తెలుగు వెబ్ సైట్తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ, క్రికెట్కు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. అలాగే, వైరల్, పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ కూడా రాస్తుంటాను. 2018లో కేరీర్ ప్రారంభించాను. జర్నలిజంలో 7ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో 2018 నుంచి 2021 వరకు సాక్షి వెబ్సైట్, ఖమ్మం యూనిట్ ఆఫీస్లో, 2021 నుంచి 2023 సుమన్ టీవీ వెబ్సైట్లో, 2023 నుంచి 2025 జనవరి వరకు ఐడ్రీమ్ వెబ్సైట్లో పనిచేశాను. 2017లో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందాను.
భారత్ ట్యాక్సీ వచ్చేస్తోంది..! ఇక డ్రైవర్లకు, వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు! ప్రారంభం ఎప్పుడంటే..?
కేంద్ర ప్రభుత్వం ‘భారత్ ట్యాక్సీ’ పేరుతో సరికొత్త యాప్ను తీసుకొచ్చింది. జనవరి 1 నుండి అందుబాటులోకి రానున్న ఈ యాప్, ఓలా, ఉబర్ అధిక ఛార్జీలకు ప్రత్యామ్నాయంగా నిలవనుంది. తక్కువ ధరలకే ప్రజలకు సేవలు అందిస్తూ, డ్రైవర్లకు 80 శాతానికి పైగా ఆదాయం లభించేలా రూపొందించబడింది.
- SN Pasha
- Updated on: Dec 17, 2025
- 8:04 am
ఇక వ్యవసాయం, వైద్య రంగంలోకి AI.. ఇండియాలో రంగం సిద్ధం చేస్తున్న గూగుల్!
గూగుల్ భారత్లో బిలియన్ల డాలర్ల భారీ పెట్టుబడులు ప్రకటించింది. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, భారతీయ భాషల AI అభివృద్ధికి 8 మిలియన్ డాలర్ల నిధులతో పాటు, ఆరోగ్య నమూనలకు 400 డాలర్లు, భారతీయ భాషా పరిష్కారాలకు 50 వేల డాలర్ల గ్రాంట్లు అందించింది.
- SN Pasha
- Updated on: Dec 17, 2025
- 7:00 am
మీ కష్టార్జితాన్ని ఇలా ప్లాన్ చేసి పొదుపు చేయండి! మిమ్మల్ని లక్షాధికారులు కాకుండా ఎవరూ ఆపలేరు!
SIP ద్వారా లక్షాధికారి కావాలని కలలు కంటున్నారా? సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడి ద్వారా ఇది సాధ్యమే. SIPలు చిన్న మొత్తాలతో పెద్ద కార్పస్ నిర్మించడానికి, కాంపౌండింగ్ ప్రయోజనం పొందడానికి సహాయపడతాయి. నెలకు రూ.30,000 SIPతో 13 సంవత్సరాలలో రూ.1.12 కోట్ల నిధిని ఎలా సాధించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
- SN Pasha
- Updated on: Dec 17, 2025
- 6:00 am
ఈ కర్ర ముందు బంగారం కూడా పనికిరాదు! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలప.. ధర తెలిస్తే కళ్లు తిరిగిపోతాయి!
గంధపు చెక్క కంటే ఖరీదైనది ఆఫ్రికన్ బ్లాక్వుడ్ (డాల్బెర్జియా మెలనోక్సిలాన్). దీని ధర కిలోకు లక్షలుంటుంది, గంధం కంటే చాలా రెట్లు ఎక్కువ. ఆఫ్రికాలో దొరికే ఈ అరుదైన, బలమైన కలప సంగీత వాయిద్యాలకు ప్రసిద్ధి. నెమ్మదిగా పెరగడం, పరిమిత లభ్యత దీనికి అధిక విలువను తెచ్చాయి.
- SN Pasha
- Updated on: Dec 16, 2025
- 11:22 pm
రూ.10 వేలలోపు మంచి స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ లిస్ట్లో ఒక ఫోన్ని ఎంచుకోండి!
ఈ సంవత్సరం ఇండియన్ మొబైల్ మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ఫోన్లు అత్యంత ప్రాచుర్యం పొందాయి. 10,000 లోపు ధరలో POCO, Samsung, Motorola వంటి బ్రాండ్ల నుండి హై-ఎండ్ ఫీచర్లతో కూడిన ఫోన్లు విడుదలయ్యాయి. POCO M7 5G, Samsung Galaxy M06 5G, Moto G06 Power వంటివి అత్యుత్తమ బ్యాటరీ, కెమెరా, పనితీరుతో తక్కువ ధరకే లభిస్తున్నాయి.
- SN Pasha
- Updated on: Dec 16, 2025
- 9:21 pm
2026: కొత్త ఏడాదిలో వినియోగదారులకు గట్టి షాక్ ఇవ్వనున్న ఎయిర్టెల్, జియో! అసలు మ్యాటర్ ఏంటంటే..?
మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులకు 2026 నాటికి 20 శాతం టారిఫ్ పెంపు షాక్ తగలనుంది. మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం, 4G, 5G ప్లాన్ల ధరలు 16-20 శాతం పెరగొచ్చు. తక్కువ ధరల ప్లాన్ల నిలిపివేత, ప్రీమియం సేవలు ఈ పెరుగుదలకు సూచన. ఎయిర్టెల్ వంటి బలమైన కంపెనీలు లాభపడతాయి.
- SN Pasha
- Updated on: Dec 17, 2025
- 12:06 am
పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైలు.. లగ్జరీ విమానాన్ని తలపించే ఇంటీరియర్! చూస్తే మతిపోవాల్సిందే..
భారత రైల్వేల ప్రతిష్టాత్మక వందే భారత్ స్లీపర్ రైలు తొలిసారిగా పరుగులు తీయనుంది. విమానం వంటి లగ్జరీ ఇంటీరియర్స్, వై-ఫై, ఇన్ఫోటైన్మెంట్, హై-స్పీడ్తో ఇది ప్రయాణ అనుభవాన్ని మార్చనుంది. పట్నా-న్యూఢిల్లీ మార్గంలో నడిచే ఈ రైలు 16 కోచ్లు, 827 మంది ప్రయాణికులతో వేగవంతమైన, ప్రీమియం సేవలను అందిస్తుంది.
- SN Pasha
- Updated on: Dec 16, 2025
- 8:52 pm
ఉద్యోగులకు బిగ్ అలర్ట్..! మారిన రూల్స్.. ఆ నిధుల నుంచి 80 శాతం విత్డ్రా చేసుకోవచ్చు! పూర్తి వివరాలు ఇవే..
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) నిబంధనలలో ప్రభుత్వం పెద్ద మార్పులు చేసింది. ఇప్పుడు పెట్టుబడిదారులు తమ నిధులలో 80 శాతం వరకు ఒకేసారి విత్డ్రా చేసుకోవచ్చు, మిగిలిన 20 శాతం పెన్షన్గా అందుతుంది. రూ.10 లక్షల వరకు ఉన్నవారు 100 శాతం విత్డ్రా చేసుకోవచ్చు.
- SN Pasha
- Updated on: Dec 16, 2025
- 11:52 pm
ఇంట్లో మీరొక్కరే సంపాదిస్తున్నారా? అయితే 2026లో కేంద్ర ప్రభుత్వం మీకో గుడ్న్యూస్ చెప్పనుంది! ఏంటంటే..?
బడ్జెట్ 2026లో కేంద్ర ప్రభుత్వం 'ఉమ్మడి పన్ను రిటర్న్' ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే, పెళ్లి అయిన జంటలు ఒకే పన్ను రిటర్న్ దాఖలు చేసి రూ.6-8 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. కుటుంబానికి ఒకే ఆదాయం ఉన్న వారికి ఇది గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తుంది.
- SN Pasha
- Updated on: Dec 16, 2025
- 11:37 pm
దురాశ పనికిరాదు..! పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్ బఫెట్ కీలక సూచన!
స్టాక్ మార్కెట్లో కొత్త పెట్టుబడిదారులు పెరిగినా, పెట్టుబడి ఎలా పెట్టాలనేది ముఖ్యం. వారెన్ బఫెట్ ప్రకారం, స్వీయ అవగాహన, అత్యాశకు దూరంగా ఉండటం, దీర్ఘకాలిక దృష్టి, క్రమశిక్షణతో కూడిన సొంత ఆలోచన తప్పనిసరి. స్టాక్లను వ్యాపారంగా భావించి, బెంజమిన్ గ్రాహమ్ సూత్రాలను అనుసరిస్తే విజయవంతంగా సంపదను పెంచుకోవచ్చని ఆయన సూచించారు.
- SN Pasha
- Updated on: Dec 16, 2025
- 9:42 am
రూ.150తో ఒక్క స్టాక్ కొంటే.. జస్ట్ ఒక్క ఏడాదిలోనే ఎన్ని వేల లాభం వచ్చిందంటే?
RRP సెమీకండక్టర్ స్టాక్ ఏడాదిలో రూ.150 నుండి రూ.11,000 దాటి, పెట్టుబడిదారులకు 73 రెట్ల లాభాన్ని అందించింది. ట్రేడింగ్ నుండి సెమీకండక్టర్ తయారీకి మారుతున్న ఈ సంస్థ, అధిక వాల్యుయేషన్, తక్కువ ప్రమోటర్ హోల్డింగ్, రుణాలతో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది.
- SN Pasha
- Updated on: Dec 16, 2025
- 8:00 am
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్..! కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అకౌంట్లోకి డబ్బులు..
మీ పీఎఫ్ ఖాతాదారులా? మీకు శుభవార్త! 2025-26 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతం నుండి 8.75 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నిర్ణయంతో దాదాపు 8 కోట్ల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారు. పెరిగిన వడ్డీ మీ ఆర్థిక భవిష్యత్తును మరింత పటిష్టం చేస్తుంది.
- SN Pasha
- Updated on: Dec 16, 2025
- 7:30 am