నా పేరు సయ్యద్ నాగ్పాషా. టీవీ9 తెలుగులో సీనియర్ సబ్ఎడిటర్గా పనిచేస్తున్నాను. 2025 ఫిబ్రవరి నుంచి టీవీ9 తెలుగు వెబ్ సైట్తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ, క్రికెట్కు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. అలాగే, వైరల్, పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ కూడా రాస్తుంటాను. 2018లో కేరీర్ ప్రారంభించాను. జర్నలిజంలో 7ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో 2018 నుంచి 2021 వరకు సాక్షి వెబ్సైట్, ఖమ్మం యూనిట్ ఆఫీస్లో, 2021 నుంచి 2023 సుమన్ టీవీ వెబ్సైట్లో, 2023 నుంచి 2025 జనవరి వరకు ఐడ్రీమ్ వెబ్సైట్లో పనిచేశాను. 2017లో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందాను.
లవర్ను కలిసేందుకు ఒంటరిగా ఆమె ఇంటికి వెళ్లాడు! ఆ తర్వాత రక్తపు మడుగులో..
ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లా రసూల్పూర్ గ్రామంలో ఓ యువకుడు తన ప్రేయసిని కలవడానికి వెళ్ళగా, ఆమె కుటుంబ సభ్యులు అతనిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. గాయపడిన జస్తగిర్ అనే యువకుడు ముంబైలో పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- SN Pasha
- Updated on: Apr 24, 2025
- 8:45 pm
వరుడి నోట్లో రసుగుల్లా పెట్టి.. చేతులు కడుక్కుంటానంటూ లోపలికి వెళ్లి.. పెళ్లి మధ్యలో ప్రియుడితో..!
ఒక వివాహ వేడుకలో వధువు తన ప్రియుడితో పారిపోవడం తో కుటుంబంలో తీవ్రమైన గొడవలు చెలరేగాయి. వరుడు కోపంగా తన తలపాగాను విసిరివేశాడు. వధువు కుటుంబం వారి రెండవ కుమార్తె వివాహాన్ని రద్దు చేయమని కోరింది, కానీ వరుని కుటుంబం అంగీకరించలేదు.
- SN Pasha
- Updated on: Apr 24, 2025
- 8:32 pm
ఉగ్రదాడిలో గాయపడిన వారికి ఉచిత చికిత్స అందిస్తాం: ముఖేష్ అంబానీ
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో గాయపడిన వారికి పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఉచిత వైద్య సహాయాన్ని ప్రకటించారు. రిలయన్స్ ఫౌండేషన్ సర్ హెచ్ఎన్ ఆసుపత్రిలో గాయపడిన వారందరికీ ఉచిత చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ఈ దారుణమైన దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల అంబానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
- SN Pasha
- Updated on: Apr 24, 2025
- 8:13 pm
Pahalgam: ఉగ్రదాడి.. బీజేపీ ఐటీ సెల్పై కేసు నమోదు! ఎందుకంటే..?
కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత తీవ్ర వివాదం చెలరేగింది. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళినప్పుడు ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని బిజెపి ఐటీ సెల్ ఆరోపించడంతో, కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీనిపై బెంగళూరులోని పోలీసులు బిజెపి ఐటీ సెల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
- SN Pasha
- Updated on: Apr 24, 2025
- 7:57 pm
Pahalgam: ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమీషన్లోకి కేక్! సెలబ్రేషన్స్ కోసమేనా?
పహల్గామ్లోని ఉగ్రవాద దాడి తర్వాత, ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు ఒక వ్యక్తి కేక్ డెలివరీ చేస్తున్న వీడియో వైరల్గా మారింది. ఈ ఘటన భారీ నిరసనలకు దారితీసింది. ప్రజలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. ప్రధాని మోడీ దాడికి తీవ్రంగా స్పందించారు.
- SN Pasha
- Updated on: Apr 24, 2025
- 7:40 pm
PM Modi: భారత ప్రధాని మోదీని అభినందిస్తున్నాను! పాకిస్థాన్ క్రికెటర్ సంచలన కామెంట్
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ చేసిన తీవ్ర హెచ్చరికను పాకిస్థాన్ మాజీ క్రికెటర్ దినేష్ కనేరియా ప్రశంసిస్తున్నారు. మోదీ ప్రసంగం ఇంగ్లీషులో ఉండటాన్ని, ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని ఇవ్వడంలో ఆయనను అభినందిస్తున్నట్లు ట్వీట్ చేశాడు. దీనితో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని హెచ్చరించారు.
- SN Pasha
- Updated on: Apr 24, 2025
- 7:08 pm
Sadhguru: ఉగ్రవాద లక్ష్యం సమాజాన్ని భయంతో కుంగదీయడమే! పహల్గామ్ దాడిపై సద్గురు
పహల్గామ్లోని ఉగ్రవాద దాడిని సద్గురు తీవ్రంగా ఖండించారు. దీనిని పిరికి దాడిగా అభివర్ణిస్తూ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఉక్కు హస్తంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. దీర్ఘకాలిక పరిష్కారాలకు విద్య, ఆర్థిక అవకాశాలు, సమాన సంక్షేమం అవసరమని నొక్కి చెప్పారు. ఐక్యతతో దేశం ఎదుర్కోవాలని ఆయన కోరారు.
- SN Pasha
- Updated on: Apr 24, 2025
- 2:20 pm
ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ తీర్మాణం! ఈ దాడి పాక్ ప్రేరేపితమే అంటూ..
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) పహల్గామ్లోని ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. దీనిని పాకిస్తాన్ ప్రేరేపితమని, హిందువులను లక్ష్యంగా చేసుకుని దేశంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు జరిగిన కుట్ర అని పేర్కొంది. మృతులకు సంతాపం తెలిపిన కాంగ్రెస్, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, భద్రతా వైఫల్యాలపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
- SN Pasha
- Updated on: Apr 24, 2025
- 1:48 pm
PM Modi: వేటాడి వేటాడి.. మట్టిలో కలిపేస్తాం! పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ మాస్ వార్నింగ్!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిహార్లో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. మధుబనిలో బహిరంగ సభలో ప్రసంగించి, డిజిటలైజేషన్, గ్రామీణ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. రూ.869 కోట్ల రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు. పంచాయతీలకు నిధులు, మహిళలకు 50% రిజర్వేషన్ల గురించి ప్రస్తావించారు.
- SN Pasha
- Updated on: Apr 24, 2025
- 1:16 pm
వచ్చే ఏడాది IPLలో ఆడతా..! పాకిస్థాన్ క్రికెటర్ ఓపెన్ స్టేట్మెంట్
ప్రస్తుత భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో, పాకిస్థాన్ క్రికెటర్ మొహమ్మద్ అమీర్ ఐపీఎల్లో ఆడాలనే తన కోరికను వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ ఆటగాళ్లపై ఐపీఎల్లో నిషేధం ఉన్నప్పటికీ, అమీర్ తన ఆశలను వదులుకోలేదు. అతను కెనడా పౌరసత్వం పొందే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నాడు. అయితే, తాజా ఉద్రిక్తతల దృష్ట్యా, అతని ఆశలు నెరవేరడం కష్టమే.
- SN Pasha
- Updated on: Apr 24, 2025
- 11:42 am
CSK vs MI: వామ్మో ఇదేం కొట్టుడు బ్రో.. ముంబైని వణికించిన 17 ఏళ్ల కొత్త కుర్రాడు! సీఎస్కేకు పవర్ హిట్టర్ దొరికేశాడుగా..
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే కొత్త ఆటగాడు ఆయుష్ మాత్రే అద్భుత ప్రదర్శన చేశాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే 15 బంతుల్లో 32 పరుగులు సాధించి, 213 స్ట్రైక్ రేటుతో అందరినీ ఆకట్టుకున్నాడు. వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న సీఎస్కేకు ఇది కొత్త ఆశను నింపింది.
- SN Pasha
- Updated on: Apr 20, 2025
- 8:21 pm
పెళ్లైన 3 నెలలకే బిలియనీర్ ట్రాన్స్జెండర్ దారుణ హత్య! కోట్లాది రూపాయల కోసం..
బెంగళూరులోని బసవేశ్వర్నగర్లో ట్రాన్స్జెండర్ సామాజిక కార్యకర్త తనుశ్రీ దారుణంగా హత్యకు గురయ్యారు. కోట్ల ఆస్తుల యజమాని అయిన ఆమెను ఆమె భర్త జగన్నాథ్ హత్య చేసినట్లు అనుమానం. మూడు నెలల క్రితం వివాహం చేసుకున్న జగన్నాథ్ , ఇంటి పనిమనిషి పరారీలో ఉన్నారు.
- SN Pasha
- Updated on: Apr 20, 2025
- 7:54 pm