AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కీలక నిర్ణయం తీసుకున్న EPFO.. వాటిలో ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) NHAI యొక్క కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (RIIT)లో ప్రధాన పెట్టుబడిదారుగా చేరింది. రూ.1,000 కోట్లతో సుమారు 16.6 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. ఈ పెట్టుబడి సంఘటిత రంగ ఉద్యోగుల పదవీ విరమణ నిధులకు స్థిరమైన, తక్కువ ప్రమాదం ఉన్న మార్గాన్ని అందిస్తుంది.

కీలక నిర్ణయం తీసుకున్న EPFO.. వాటిలో ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి!
Epfo 1
SN Pasha
|

Updated on: Mar 05, 2026 | 6:30 AM

Share

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన పెట్టుబడి వ్యూహంలో మరో కీలక అడుగు వేసింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రోత్సహిస్తున్న కొత్త మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్, వే ఇన్ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (RIIT)లో EPFO ప్రధాన పెట్టుబడిదారుగా ప్రవేశిస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూలో మొత్తం యూనిట్లలో సుమారు 16.6 శాతం వాటాను EPFO కొనుగోలు చేయనుంది. సమాచారం ప్రకారం.. RIIT ఈ ఇష్యూ ద్వారా మొత్తం రూ.6,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, EPFO సుమారు రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే స్పాన్సర్ అయిన NHAI కంటే ఎక్కువ యూనిట్లను EPFO కొనుగోలు చేసే అవకాశం ఉంది. NHAI మాత్రం 15 శాతం యూనిట్లను కొనుగోలు చేయనుంది.

ఇక SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఈ ఇన్విట్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. సంస్థ రూ.260 కోట్లు పెట్టుబడి పెట్టి సుమారు 4.3 శాతం వాటాను పొందనుంది. మార్చి 10 నుంచి యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్లను ఆహ్వానించనున్నట్లు సమాచారం. RIIT ద్వారా NHAI నుంచి ఐదు హైవే ప్రాజెక్టులను మొత్తం 260 కిలోమీటర్ల మేర కొనుగోలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.9,500 కోట్లు వినియోగించబడతాయి. ఇందులో రూ.6,000 కోట్లు ఈక్విటీగా, రూ.3,500 కోట్లు రుణంగా సమీకరించబడతాయి.

సంఘటిత రంగ ఉద్యోగుల పదవీ విరమణ నిధులకు స్థిరమైన, తక్కువ ప్రమాదం ఉన్న పెట్టుబడి మార్గంగా ఇన్విట్‌లను EPFO పరిశీలిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా NHAIకి చెందిన మరో ఇన్విట్ NHITలో EPFO రూ.2,035 కోట్లు పెట్టుబడి పెట్టింది. RIIT యూనిట్ల ధర బ్యాండ్ రూ.99–రూ.100గా నిర్ణయించగా, రిటైల్ పెట్టుబడిదారులకు దాదాపు 10 శాతం యూనిట్లు రిజర్వ్ చేసే అవకాశం ఉంది. జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని రహదారి ప్రాజెక్టులు మొదటి దశలో ఇందులో చేరనున్నాయి. భవిష్యత్తులో మరో 1,500 కి.మీ రోడ్ ఆస్తులను కూడా RIITకు బదిలీ చేయాలని NHAI ప్రణాళిక రూపొందించింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us