నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్.. మాస్టర్ స్ట్రోక్ మామూలుగా లేదుగా..?
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పరిపాలనపై దృష్టి సారిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న వేళ, మేకేదాటు ప్రాజెక్టు వివాదం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. కర్ణాటక పర్యటన నేపథ్యంలో డీఎంకే నిరసనలకు సిద్ధమవుతుండగా, కావేరి జలాల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి విజయ్ లేఖ రాశారు. ఇదే సమయంలో పరిపాలన శైలిపై ప్రతిపక్షాల విమర్శలు, ప్రభుత్వ చర్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

తమిళనాడు ప్రభుత్వానికి షాక్, విజయ్ సర్కార్కి తలవొంపులు అంటూ రిసెంట్డేస్లో ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. గమనించారా? మేటరేంటి అని దేశమంతా అటువైపు ఆసక్తిగా చూసింది కూడా. కరూర్ తొక్కిసలాటలో బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని మద్రాస్ హైకోర్టు తప్పుబట్టిందన్నది ఆ వార్త సారాంశం. గవర్నమెంట్ కొలువులు పప్పుబెల్లాలు కాదు ఇష్టమొచ్చినట్టు పంచిపెట్టడానికి అని అక్షింతలు కూడా పడ్టాయి. ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ ఏంటంటే, హైకోర్టు ఆదేశాల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకెక్కిన విజయ్ సర్కార్. ఇదీ తమిళనాట మాస్టర్ స్టయిలాఫ్ గవర్నెన్స్. మనసావాచా నమ్మి తీసుకున్న పాలసీ డెసిషన్ ఏదైనా దానికోసం చివరికంటా పోరాడుతానంటున్నారు సీఎం విజయ్. పార్టీకీ, ప్రభుత్వానికీ ప్రతిష్ట పెంచడానికి ఎందాకైనా అంటున్నారు. పాపులర్ సీఎంగా దూసుకెళ్తున్నారు.. ట్రెండీ సీఎంగా అపోజిషన్ గుండెల్లో నిద్రపోతానంటున్నారు మిస్టర్ జననాయగన్. ఒకప్పుడు ఇది జస్ట్.. ఊహ మాత్రమే. బాగా చదువుకుని సొసైటీమీద మాంచి కమిట్మెంటున్న చాకులాంటి కుర్రాడు సీఎం ఐతే రాష్ట్రం ఎలా ఉంటుంది? ఈ ఫాంటసీ ఐడియానే సినిమా మీడియంతో సూపర్గా పాపులర్ చేశారు డైరెక్టర్ శంకర్. పాతికేళ్ల తర్వాత తమిళనాట అదే ఇప్పుడు రియాలిటీలోకొచ్చొందా? పార్టీ ఫండ్ పేరుతో భారీగా పైసావసూల్ జరుగుతోంది, జనం సొమ్మును టచ్ చేస్తే ఎంతటివాడైనా వదిలేదే లే, ఇట్స్మై ఛాలెంజ్ అన్నారు ముఖ్యమంత్రి విజయ్. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన నాటి సవాల్ను తూచా తప్పకుండా పాటిస్తున్నట్టుంది టీవీకే సర్కార్. ముఖ్యంగా కరప్షన్పై ఫుల్లుగా ఫోకస్ పెట్టింది....
