దళపతి విజయ్
దళపతి విజయ్ ఇన్నాళ్లు హీరోగా రాణించిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి షేక్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన విజయ్ ఆతర్వాత హీరోగా మారాడు. 1992లో వచ్చిన నాలయ తీర్పు అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమాకు విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు. టీవీకే పేరుతో పార్టీ పెట్టి పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇన్నాళ్లు తమిళ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా రాణించాడు విజయ్.. అలాగే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఇప్పుడు తమిళనాట ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తున్నాడు విజయ్. మొదటి ప్రయత్నంలోనే ఏకంగా 108 సీట్లు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 సీట్లకు కేవలం 10 అడుగుల దూరంలో విజయ్ ఆగిపోవడంతో ఇప్పుడు పొత్తుల పర్వం మొదలైంది. తమిళ రాజకీయాల్లో గత ఐదు దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే ద్వైపాక్షిక ఆధిపత్యానికి దళపతి విజయ్ తెరదించారు.
ఇంకా చదవండితొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సర్కార్ గుడ్న్యూస్.. ముఖ్యమంత్రి కీలక నిర్ణయం?
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఆర్థికంగా వెనుకబడిన వారికి రవాణా సౌకర్యం కల్పించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. సొంత వాహనం కొనుగోలు చేసే స్థోమత లేని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తరఫున కారు, వ్యక్తిగత సహాయకుడిని అందించే ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
- Ch Murali
- Updated on: Aug 17, 2026
- 9:42 pm
Jana Nayagan OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి విజయ్ చివరి సినిమా.. ‘జన నాయగన్’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన ఆఖరి సినిమా 'జన నాయగన్'. తెలుగులో 'జన నాయకుడు' గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జులై 23న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వస్తోంది.
- Basha Shek
- Updated on: Aug 17, 2026
- 6:53 pm
Trisha: తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. ఇది చాలా స్పెషల్ అంటూ ఫొటోస్ షేర్ చేసిన బ్యూటీ క్వీన్
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పాల్గొన్న తొలి ఇండిపెండెన్స్ డే వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది త్రిష. ఈ వేడుకకు ఆమె ఒక ప్రత్యేకమైన చీరలో హాజరైంది. అయితే తాజాగా ఇది తన తల్లి చీర అని చెప్పిన త్రిష అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Basha Shek
- Updated on: Aug 16, 2026
- 5:52 pm
అట్రాక్షన్ అంతా ఆమెదే.. సీఎం విజయ్కు సెల్యూట్ చేసిన త్రిష.. ఇదిగో వీడియో
చెన్నై మెరీనా బీచ్ వేదికగా జరిగిన తమిళనాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రుల పక్కనే మినిస్టర్స్ గ్యాలరీలో ఆమెకు ప్రత్యేక వీఐపీ సీటు కేటాయించడం ఆసక్తికరంగా మారింది. బంగారు రంగు చీరలో వేడుకలకు హాజరైన త్రిష.. అతిథులను పలకరిస్తూ సందడి చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో త్రిషకు వరుసగా లభిస్తున్న ప్రాధాన్యతపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
- Shaik Madar Saheb
- Updated on: Aug 15, 2026
- 10:49 am
Tamil Nadu: మరోసారి హాట్ టాపిక్గా మారిన త్రిష.. ఏఐఏడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు!
తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిష పేరు మరోసారి తీవ్ర రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత జోసఫ్ విజయ్ను లక్ష్యంగా చేసుకుని ఏఐఏడీఎంకే సీనియర్ నేత ఆర్.బి. ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయ్తో త్రిషకు ఉన్నట్లు ప్రచారంలో ఉన్న వ్యక్తిగత సంబంధాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై త్రిష అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
- Balaraju Goud
- Updated on: Aug 11, 2026
- 4:10 pm
Vishal: విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే.. విశాల్ ఆసక్తికర కామెంట్స్..
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సినిమాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగులోకి డబ్ చేసి విడుదల చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న విశాల్ తన లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అలాగే తమిళనాడు రాజకీయాల్లో సొంత పార్టీ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రిగా ఎన్నికైన విజయ్ ప్రస్థానం గురించి పంచుకున్నారు.
- Rajitha Chanti
- Updated on: Aug 11, 2026
- 9:13 am
షాకులు, ట్విస్ట్లు.. విజయ్ సంగీత పెళ్లి ఎలా జరిగిందో తెలుసా.? సినిమాకు మించిన స్టోరీ..!
తమిళగ వెట్రి కళగం అధినేత, సీఎం విజయ్, అతని భార్య సంగీతల కుటుంబ జీవితం గురించి ఇంటర్నెట్లో అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో, సంగీత చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ న్యాయస్థానంలో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు.
- Rajeev Rayala
- Updated on: Aug 8, 2026
- 9:22 am
Jana Nayagan OTT: మిక్స్డ్ టాక్తోనే 300 కోట్లు.. అప్పుడే ఓటీటీలోకి విజయ్ ‘జన నాయగన్’! స్ట్రీమింగ్ డేట్ ఇదే
తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన ఆఖరి సినిమా 'జన నాయగన్'. తెలుగులో 'జన నాయకుడు' గా రిలీజైంది. జులై 23న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితేనేం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చుకుంది.
- Basha Shek
- Updated on: Aug 6, 2026
- 4:24 pm
Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..
కోలీవుడ్ హీరో విజయ్ దళపతి తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా సినీరంగంలోకి తెరంగేట్రం చేస్తు్న్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా సిగ్మా సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత జీవితం, మూవీస్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
- Rajitha Chanti
- Updated on: Aug 6, 2026
- 8:44 am
CM Vijay: త్రిషపై ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ డైలాగ్.. అరెస్ట్ చేసిన పోలీసులు
నటి త్రిష కేంద్రంగా గత కొద్ది రోజులుగా తమిళనాట అనేక వివాదాలు తలెత్తాయి.. త్రిష పొలిటికల్ ఎంట్రీ పై తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి సోషల్ మీడియా వేదికగా అలాగే ప్రజల్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది.. చర్చి నుంచి పోటీ చేస్తారని కొందరు.. రాజ్యసభ ఎంపీగా ఎంపిక చేస్తారని మరికొందరు.
- Rajeev Rayala
- Updated on: Aug 4, 2026
- 11:11 am
Jason Sanjay: మా నాన్న ఇచ్చిన సలహా అదే.. ఆ మాట నాకు ఎంతో ఇష్టం.. విజయ్ దళపతి గురించి కొడుకు కామెంట్స్..
దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో నటుడిగా తనదైన ముద్ర వేసిన విజయ్ దళపతి.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రజాసేవ చేస్తున్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీ సీట్లు గెలుచుకున సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇదిలా ఉంటే.. విజయ్ దళపతి తనయుడు జాసన్ సంజయ్ ఇప్పుడు దర్శకుడిగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
- Rajitha Chanti
- Updated on: Aug 3, 2026
- 9:24 am
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్.. మాస్టర్ స్ట్రోక్ మామూలుగా లేదుగా..?
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పరిపాలనపై దృష్టి సారిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న వేళ, మేకేదాటు ప్రాజెక్టు వివాదం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. కర్ణాటక పర్యటన నేపథ్యంలో డీఎంకే నిరసనలకు సిద్ధమవుతుండగా, కావేరి జలాల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి విజయ్ లేఖ రాశారు. ఇదే సమయంలో పరిపాలన శైలిపై ప్రతిపక్షాల విమర్శలు, ప్రభుత్వ చర్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
- Anand T
- Updated on: Jul 30, 2026
- 9:52 pm