AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ch Murali

Ch Murali

Chief Reporter (Nellore) - TV9 Telugu

murali.chennuri@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 26 ఏళ్ల అనుభవం ఉంది.. 2000 సంవత్సరంలో తిరుపతి నుంచి ఈనాడులో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2002 నుంచి ఈటీవీ, ఈనాడు జర్నలిజం స్కూల్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని 2003 నుంచి ఈటీవీ 2 లో , 2006 నుంచి జీ తెలుగు, 2009 లో మహా న్యూస్, 2012 నుంచి టివి9 లో అడుగుపెట్టాను.. చెన్నై కేంద్రంగా టివి9 ప్రతినిధిగా తమిళనాడు వ్యాప్తంగా అనేక అంశాలపై ప్రత్యేక కథనాలను అందించడం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి చీఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. తిరుపతితో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ లో సంచలన ఘటనలకు సంబంధించి రిపోర్టింగ్ చేసిన అనుభవం వుంది. డిజిటల్ ఫ్లాట్ ఫాంలో ఆరేళ్ల అనుభవం వుంది.

Read More
Follow On:
Tamil Nadu: అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ అదే రచ్చ.. గవర్నర్ మైక్ కట్ చేసిన స్పీకర్..!

Tamil Nadu: అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ అదే రచ్చ.. గవర్నర్ మైక్ కట్ చేసిన స్పీకర్..!

గవర్నర్‌గా తమిళనాడుకు ఆర్.ఎన్. రవి వచ్చిన తొలినాళ్ల నుంచి ఇదే జరుగుతోంది. అనేక అంశాల్లో తలెత్తిన సమస్యలతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమైంది. ఇదే అంశంపై గతంలో బహిరంగంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, డీఎంకే ముఖ్య నేతలు గవర్నర్ రవి టార్గెట్‌గా విమర్శలు చేశారు. గతంలో గవర్నర్ రవి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.

ISRO Samudrayaan Project: మేరా భారత్ మహాన్.. సముద్ర లోతుల్లో ఇస్రో సాహస ప్రయోగం.. మామూలు ప్లాన్ కాదుగా..!

ISRO Samudrayaan Project: మేరా భారత్ మహాన్.. సముద్ర లోతుల్లో ఇస్రో సాహస ప్రయోగం.. మామూలు ప్లాన్ కాదుగా..!

భారత్ అంతరిక్ష ప్రయోగాల్లో మాత్రమే కాదు.. సముద్ర లోతుల్లో ఉన్న రహస్యాలను తెలుసుకునేందుకు కీలక ప్రయోగాలు చేపడుతోంది. ఇప్పటికే గగన్ యాన్ కోసం సిద్ధమవుతున్న ఇస్రో రెండేళ్ల క్రితమే సముద్రంలో పరిశోధన కోసం సముద్రయాన్ ప్రాజెక్టును ప్రకటించి పరిశోధనలు ప్రారంభించింది. సముద్రం లోపల వేల మీటర్ల లోతున శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.. భారత్ చేపట్టిన సముద్ర యాన్ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం..

APSRTC: ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే రికార్డు.. ఒక్కరోజే ఎన్ని కోట్లంటే..?

APSRTC: ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే రికార్డు.. ఒక్కరోజే ఎన్ని కోట్లంటే..?

సంక్రాంతితో ఏపీఎస్ఆర్టీసీ రికార్డుల పండుగ చేసుకుంది. పండగ వెళ్లిపోతూ ఆర్టీసీ ఖజానాకు కాసుల వర్షాన్ని మిగిల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, సంస్థ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో జనవరి 19న ఒక్కరోజే భారీ దాయాన్ని ఆర్జించి సరికొత్త మైలురాయిని అధిగమించింది. ఆదాయంలోనే కాదు ఏకంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి సేవలోనూ సాటిలేదని నిరూపించుకుంది.

సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత బాటలోనే విజయ్..

సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత బాటలోనే విజయ్..

తమిళనాడులో ఉచితాల జాతర మరో లెవల్‌కి చేరింది. ఇప్పటికే డీఎంకే ఫ్రీ స్కీమ్‌లను అమలు చేస్తుండగా.. అన్నాడీఎంకే అంతకుమించి హామీలను ప్రకటించింది. కొత్తగా బరిలోకి దిగుతున్న టీవీకే చీఫ్ విజయ్ కూడా తాను ఉచిత పథకాలకు వ్యతిరేకం కాదని ప్రకటించారు. గతంలో ఉచితాలను ప్రకటించిన విజయ్ ఇప్పుడు అదే బాట ఎందుకు పట్టారు..? తమిళ రాజకీయం ఎలా నడుస్తుంది..? అనేది తెలుసుకుందాం..

పవిత్ర సోమవారం అక్కడ నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు..!

పవిత్ర సోమవారం అక్కడ నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు..!

నెల్లూరు చెర్లోపల్లి విశ్వనాథ స్వామి ఆలయంలో సోమవారం, కార్తీక మాసంలో నాగుపాము భక్తులకు దర్శనమివ్వడం దైవ మహిమగా భావిస్తున్నారు. శివునికి ప్రీతిపాత్రమైన రోజున నాగేంద్రుడు కనిపించడంతో భక్తులు భక్తిపారవశ్యంతో పూజలు, శివనామస్మరణలు చేశారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఇది శుభసూచకమని అక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు.

అమాంత పెరిగిన ధరలు.. అయినా రైతుకు తప్పని కష్టాలు..! ఏం జరుగుతోందంటే..

అమాంత పెరిగిన ధరలు.. అయినా రైతుకు తప్పని కష్టాలు..! ఏం జరుగుతోందంటే..

పండించిన పంట ధరలు పెరిగితే రైతుకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాలి. కానీ, అక్కడ అలా జరగలేదు.. రైతు కంట కన్నీరు మిగిల్చింది.. ప్రతియేటా పండించిన పంటకు ధరలు లేక తీవ్ర నష్టాలు చవిచూసిన రైతులకు ఇప్పుడు ధరలు పెరిగినా మరింత నష్టాలు మిగిలాయి.. గత ఏడాది కంటే మూడింతలు ధరలు పెరిగినా ఆదాయం రాలేదు కదా, అసలు కూడా గిట్టలేదని రైతులు వాపోతున్నారు.. ఇంతకీ ఎంటా పంట.. ధరలు పెరిగితే సంతోష పడాల్సిన రైతు బాధపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్‌..! విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్‌..! విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..

విశాఖపట్నంలో కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఇమిగ్రేషన్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు కానుంది. దీనితో ఉత్తరాంధ్ర ప్రజలకు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఇమిగ్రేషన్ ప్రక్రియలు విశాఖలోనే అందుబాటులోకి వస్తాయి, హైదరాబాద్, చెన్నైపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ నిర్ణయం విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చి, వ్యాపారం, పర్యాటకం, ఉపాధి అవకాశాలను పెంచుతుంది. ఇది విశాఖను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా కీలక ముందడుగు.

Andhra Pradesh: గురువులా.. రాక్షసులా.. విద్యార్థి ప్రాణం తీసిన టీచర్లకు కోర్టు బిగ్ షాక్..

Andhra Pradesh: గురువులా.. రాక్షసులా.. విద్యార్థి ప్రాణం తీసిన టీచర్లకు కోర్టు బిగ్ షాక్..

గురువులు దైవ సమానం అంటారు.. కానీ అదే గురువులు రాక్షసులుగా మారి పసి ప్రాణాన్ని బలి తీసుకుంటే..? 2014లో నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక దారుణ ఘటనపై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టి అతని మృతికి కారణమైన టీచర్ కౌసల్య, హెచ్ఎం అయ్యన్నలకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది.

NTR Old House: చెన్నైలో ఎన్టీఆర్ నివాసాన్ని ఎప్పుడైనా చూశారా.? లోపలికి వెళ్లి మరీ ఫోటో దిగొచ్చు..!

NTR Old House: చెన్నైలో ఎన్టీఆర్ నివాసాన్ని ఎప్పుడైనా చూశారా.? లోపలికి వెళ్లి మరీ ఫోటో దిగొచ్చు..!

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఒకప్పటి మద్రాస్ నేడు చెన్నైగా పిలుస్తున్న నగరంలోని కొలువు తీరింది. సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలందరూ ఒకప్పుడు చెన్నైలోనే నివాసం ఉండేవారు. దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సినీ పరిశ్రమను మద్రాస్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

Parasakthi Movie: కాంగ్రెస్, డీఎంకే మధ్య చిచ్చు పెట్టిన పరాశక్తి సినిమా..! అసలు నిప్పు రాజేసిందెవరు..

Parasakthi Movie: కాంగ్రెస్, డీఎంకే మధ్య చిచ్చు పెట్టిన పరాశక్తి సినిమా..! అసలు నిప్పు రాజేసిందెవరు..

అయితే ఇటీవల తమిళ తమిళంలో విడుదలైన పరాశక్తి సినిమా అందులోని అంశాలు మరోసారి డిఎంకె కూటమి లోని కాంగ్రెస్ డిఎంకెమధ్య చిచ్చురేపాయి. 1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక పోరాటం.. ఆనాడు దివంగత అన్నా దురై చేసిన పోరాటం ఆధారంగా సినిమా తెరకెక్కింది.. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1966లో ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు..

ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ.. కారణం ఇదేనా?

ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ.. కారణం ఇదేనా?

శ్రీహరికోటలోని సతీష్ దవన్ స్పేస్ సెంటర్ షార్‌ నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన PSLV-C62 రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. అన్వేష సహా 15 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిన PSLV-C62 రాకెట్‌ మూడు దశలను విజయవంతంగా కంప్లీట్ చేసుకొని నాలుగో దశలోకి చేరుకున్న తర్వాత సాంకేతిక సమస్య కారణంగా ఆచూకీ కోల్పోయింది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్‌ వి.నారాయణన్‌ వెల్లడించారు. ఈ వైఫల్యానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని ఆయన తెలిపారు.

ISRO First Launch 2026: అంతరిక్షంలో ఇస్రో ‘అన్వేషణ’.. 2026 తొలి ప్రయోగానికి మొదలైన కౌంట్‌డౌన్!

ISRO First Launch 2026: అంతరిక్షంలో ఇస్రో ‘అన్వేషణ’.. 2026 తొలి ప్రయోగానికి మొదలైన కౌంట్‌డౌన్!

మన దేశానికి అవసరమైన సాంకేతిక అవసరాల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎన్నో కీలక ప్రయోగాలను చేపట్టింది. అలాగే ఇతర దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలను కూడా ఇస్రో భారత్ నుంచి నింగిలోకి పంపుతోంది. అయితే దేశ రక్షణ కోసం కూడా ఇస్రో ప్రత్యేక ఉపగ్రహాలను రూపొందించి అంతరిక్షంలోకి పంపుతోంది. ఇందులో భాగంగానే సోమవారం ఇస్ట్రో 2026లో తొలి ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరి కోట నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగానికి ఇప్పటికే ఇస్రో కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసింది.