తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 26 ఏళ్ల అనుభవం ఉంది.. 2000 సంవత్సరంలో తిరుపతి నుంచి ఈనాడులో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2002 నుంచి ఈటీవీ, ఈనాడు జర్నలిజం స్కూల్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని 2003 నుంచి ఈటీవీ 2 లో , 2006 నుంచి జీ తెలుగు, 2009 లో మహా న్యూస్, 2012 నుంచి టివి9 లో అడుగుపెట్టాను.. చెన్నై కేంద్రంగా టివి9 ప్రతినిధిగా తమిళనాడు వ్యాప్తంగా అనేక అంశాలపై ప్రత్యేక కథనాలను అందించడం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి చీఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. తిరుపతితో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ లో సంచలన ఘటనలకు సంబంధించి రిపోర్టింగ్ చేసిన అనుభవం వుంది. డిజిటల్ ఫ్లాట్ ఫాంలో ఆరేళ్ల అనుభవం వుంది.
భారత్లో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
ఇస్రో గగన్యాన్, స్పేస్ స్టేషన్ వంటి కీలక ప్రయోగాలతో నిమగ్నమై ఉంది. వాణిజ్య, చిన్న ఉపగ్రహ ప్రయోగాలకు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తన విక్రమ్-1 రాకెట్ను శ్రీహరికోట నుండి ప్రయోగించనుంది. ఇది భారత అంతరిక్ష చరిత్రలో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం కావడం విశేషం.
- Ch Murali
- Updated on: Jul 1, 2026
- 6:11 pm
కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన ఎందుకు?
కడప స్టీల్ ప్లాంట్ కు మరోసారి శంకుస్థాపన చేయడంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్లాంట్ కు శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. కొత్తగా శంకుస్థాపనల కంటే ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
- Ch Murali
- Updated on: Jun 30, 2026
- 10:04 pm
Rottela Panduga: రొట్టెల పండుగలో ఆసక్తికర సంఘటన ఎమ్మెల్యే రొట్టెలు పంచుకున్న సోదరులు
ప్రపంచ ప్రసిద్ధి చెందిన నెల్లూరు రొట్టెల పండుగలో ఈసారి ‘ఎమ్మెల్యే రొట్టె’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు తమ సోదరుడు గిరిధర్ రెడ్డికి ఎమ్మెల్యే కావాలనే కోరికతో రొట్టె అందించారు. ఈ ఘటనతో వచ్చే ఎన్నికల్లో రాజకీయ వారసత్వంపై నెలకొన్న ఊహాగానాలకు మరింత ఊతం లభించింది.
- Ch Murali
- Updated on: Jun 30, 2026
- 9:24 pm
తమిళనాడులో మైండ్ గేమ్ పాలిటిక్స్.. స్టాలిన్ స్ట్రాటజీకి సీఎం విజయ్ ‘మాస్టర్ స్ట్రోక్!
తమిళనాడు రాజకీయాలు ఎన్నడూ లేనంత రసవత్తరంగా మారాయి. దశాబ్దాల ద్రవిడ రాజకీయాల కోటను బద్దలు కొడుతూ.. తొలి ప్రయత్నంలోనే 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అయితే, స్పష్టమైన మెజారిటీకి పది స్థానాల దూరంలో ఆగిపోవడంతో, డీఎంకే కూటమిలోని కొన్ని పార్టీల వెలుపలి మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే విజయ్ సర్కార్ను పడగొట్టేందుకు డీఎంకే శతవిధాలా ప్రయత్నిస్తోంది.
- Ch Murali
- Updated on: Jun 30, 2026
- 5:19 pm
Andhra Pradesh: నెల్లూరు రొట్టెల పండుగ మహిమ.. ఈ కొత్త జంట రియల్ స్టోరీ వింటే నిజమేనని నమ్మాల్సిందే..
నాడు పెళ్లి కావాలని వేర్వేరుగా వచ్చి రొట్టెలు మార్చుకున్నారు... కట్ చేస్తే, నేడు అదే దర్గా సాక్షిగా భార్యాభర్తలుగా మారి నవదంపతులుగా చేతులు పట్టుకుని తిరిగి వచ్చారు.. వినడానికి ఏదో సినిమా కథలా ఉందా? కానీ ఇది అక్షరాలా నిజం. నెల్లూరు రొట్టెల పండుగలో జరిగిన ఈ అద్భుతమైన సంఘటన ఇప్పుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
- Ch Murali
- Updated on: Jun 29, 2026
- 10:59 am
Sridhar Reddy: రొట్టెల పండుగ సాక్షిగా.. నెల్లూరు రూరల్ పొలిటికల్ సస్పెన్స్కు తెరదించిన కోటంరెడ్డి!
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక నెల్లూరు రొట్టెల పండుగలో ఒక ఆసక్తికర రాజకీయ ఘట్టం చోటుచేసుకుంది. ఏటా ఐదు రోజుల పాటు రాష్ట్ర పండుగగా ఎంతో వైభవంగా జరిగే ఈ వేడుకల్లో.. ఈసారి రాజకీయ ఊహాగానాలకు తెరదించేలా ఒక పరిణామం కనిపించింది అందేలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- Ch Murali
- Updated on: Jun 28, 2026
- 10:59 pm
రొట్టెల పండుగ కథ తెలిస్తే ఆశ్చర్య పోతారు.. ఇది ఎలా మొదలైందంటే?
మత సామరస్యానికి ప్రతీకగా జరిగే రొట్టెల పండుగ గురించి ఎప్పుడైనా విన్నారా ?. అయితే దీని గురించి తెలుసుకోవాల్సిందే. ఈ పండగ కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అక్కడకు భక్తులు క్యూ కడుతుంటారు. అలా అని నిత్యం ఈ పండుగ జరగదు. ఏడాదిలో ఐదు రోజులు మాత్రమే ఈ వేడుకలు జరుగుతుంటాయి.
- Ch Murali
- Updated on: Jun 27, 2026
- 1:15 pm
ప్రపంచంలో ఎక్కడా లేని వింత సంప్రదాయం.. పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల పండుగకు సర్వం సిద్ధం..!
మత సామరస్యానికి ప్రపంచవ్యాప్త ప్రతీకగా నిలిచిన నెల్లూరు బారా షాహిద్ దర్గా 'రొట్టెల పండుగ'కు సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని వైభవంగా జరిగే ఈ చారిత్రాత్మక పండుగ జూన్ 26 నుంచే ఐదు రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు రాష్ట్ర పండుగగా గుర్తింపు ఉండటంతో, ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేసింది. ఒకరోజు ముందు నుంచే భక్తుల సందడి మొదలవడంతో దర్గా పరిసరాలు కోలాహలంగా మారాయి.
- Ch Murali
- Updated on: Jun 25, 2026
- 8:12 pm
Murali Naik: నెల్లూరులో వీర జవాన్ మురళీ నాయక్కు అరుదైన గౌరవం!
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన వీర జవాన్ మురళి నాయక్ కు నెల్లూరు జిల్లాలో ఆరుదైన గౌరవం దక్కింది. వేదాయపాలెం నుంచి పొదలకూరు రోడ్డు వరకు గాంధీనగర్ మార్గంలో రూ.3 కోట్లతో ఏర్పాటు చేసిన రోడ్డుకు అమరజవాన్ మురళి నాయక్ పెరుతో నామకరణం చేశారు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. త్వరలోనే బోర్డును కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
- Ch Murali
- Updated on: Jun 25, 2026
- 10:46 am
Andhra: ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
నెల్లూరు జిల్లాలోని సంగం మండలం దువ్వూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు మధుసూదన్రావు, ఆయన భార్య రత్నవేణి, దత్తపుత్రుడు సాయి సుకృత్ మృతదేహాలు ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో లభించాయి. గదిలో లభించిన నోట్లో ఆస్తుల పంపకం, అంత్యక్రియల ఖర్చుల కోసం నగదు బదిలీ వివరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే మృతుల చేతులు కట్టేసి ఉండటం, ఘటనాస్థలంలోని పరిస్థితులు పలు అనుమానాలకు తావిస్తోంది.
- Ch Murali
- Updated on: Jun 15, 2026
- 12:40 pm
దొంగను పట్టించిన చెప్పులు.. రెండు నెలల తర్వాత దొరికిన అసలైన క్లూ!
తిరుపతి జిల్లాలో జరిగిన ఓ చోరీ కేసులో దొంగలు చేసిన చిన్న పొరపాటు చివరకు వారినే పోలీసులకు చిక్కేలా చేసింది. రెండు నెలల క్రితం జరిగిన ఈ దొంగతనం కేసును పోలీసులు ఛేదించడంలో దొంగ వదిలి వెళ్లిన చెప్పులే కీలక ఆధారంగా మారాయి. దీంతో దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు, చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
- Ch Murali
- Updated on: Jun 13, 2026
- 1:15 pm
ఏం కాదులే అని ఇంటి తాళాలు ఎక్కడపడితే అక్కడ దాస్తున్నారా..? ఇది తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్..
నెల్లూరులో ఓ కుటుంబం వాకింగ్కు వెళ్లిన సమయంలో ఇంట్లో జరిగిన 145 గ్రాముల బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి ముందు వాషింగ్ మెషీన్పై తాళం ఉంచే అలవాటును గమనించిన నిందితులు, అదే తాళంతో ఇంట్లోకి ప్రవేశించి లాకర్లోని బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఇద్దరు బాల నేరస్తులతో పాటు మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి, చోరీకి గురైన మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
- Ch Murali
- Updated on: Jun 11, 2026
- 3:26 pm