తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 26 ఏళ్ల అనుభవం ఉంది.. 2000 సంవత్సరంలో తిరుపతి నుంచి ఈనాడులో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2002 నుంచి ఈటీవీ, ఈనాడు జర్నలిజం స్కూల్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని 2003 నుంచి ఈటీవీ 2 లో , 2006 నుంచి జీ తెలుగు, 2009 లో మహా న్యూస్, 2012 నుంచి టివి9 లో అడుగుపెట్టాను.. చెన్నై కేంద్రంగా టివి9 ప్రతినిధిగా తమిళనాడు వ్యాప్తంగా అనేక అంశాలపై ప్రత్యేక కథనాలను అందించడం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి చీఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. తిరుపతితో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ లో సంచలన ఘటనలకు సంబంధించి రిపోర్టింగ్ చేసిన అనుభవం వుంది. డిజిటల్ ఫ్లాట్ ఫాంలో ఆరేళ్ల అనుభవం వుంది.
ఇంటి ముందు ముగ్గు వేస్తున్నారా.? ఈ తప్పు చేస్తే లక్ష్మీదేవికి బదులు దరిద్రానికి వెల్కమ్ చెప్పినట్లే.!
Muggu affect wealth: రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారా.. మీరు ముగ్గు పేరుతో పిలుస్తుంది లక్ష్మీదేవిని కాదు.. ప్రతికూల శక్తులను. ముగ్గు అంటేనే ఒక వెల్కం బోర్డు లాంటిది. కానీ, శాస్త్రం ప్రకారం సూర్యుడు అస్తమించాక దేవతలందరూ విశ్రాంతి తీసుకుంటారు. మరి ఆ టైంలో మీరు ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారు. మీరు పిలుస్తున్నది చీకట్లో తిరిగే క్షుద్ర శక్తులని, సాక్షాత్తు దరిద్ర దేవతని అని తెలుసుకోండి.
- Ch Murali
- Updated on: Feb 6, 2026
- 11:15 am
చేతులెట్లా వచ్చాయిరా..! సహజీవనం చేస్తూనే.. నిండు గర్భిణీని 14 సార్లు పొడిచిన వ్యక్తి!
అతను రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలెట్గా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం వివాహమైంది. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. భర్త నుంచి దూరంగా వెళ్లి భార్యా పిల్లలు విశాఖపట్నంలో ప్రస్తుతం నివాసం ఉన్నారు. భర్త నుంచి న్యాయం కోసం భార్య ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగానే భర్త మరో మహిళతో సహజీవనం మెుదలుపెట్టాడు.
- Ch Murali
- Updated on: Feb 5, 2026
- 8:22 pm
Andhra: ‘కల్కి’ సినిమాలో మ్యాజిక్ చేసిన ఆలయం ఇదే.. ఇప్పుడెలా ఉందో చూశారా?
వందల ఏళ్ల చరిత్రను తనలో దాచుకున్న ఒక ఆలయం.. ఊరంతా పూజలు అందుకున్న దేవుడు కాలగర్భంలో కలిసిపోవడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయిన గ్రామస్తులు.. ఇక ఆ ఆలయాన్ని చూడలేమని అనుకున్న సమయంలో, మళ్లీ వెలుగులోకి వచ్చిన అరుదైన దేవాలయం ఇది.
- Ch Murali
- Updated on: Feb 3, 2026
- 6:46 pm
Andhra News: ఏడాది తర్వాత కలిసిన భార్య.. కాసేపటికే ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భర్త.. ఏం చేశాడంటే?
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటున్నారు.. భార్య బెంగళూరు, భర్త నెల్లూరులో ఉంటున్నారు. వీరిద్దరి మధ్య కొంత కాలంగా గొడవలు ఉన్నాయి. మనస్పర్థలు ఉన్నా అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. చాలా రోజుల తర్వాత బెంగళూరు నుంచి బార్య నెల్లూరు వచ్చింది. నెల్లూరు వచ్చిన భార్యను భర్త బస్ స్టేషన్కు వెళ్లి రిసీవ్ చేసుకున్నాడు. సీన్కట్చేస్తే ఇంటికి మాత్రం ఇద్దరిలో ఒక్కరే వెళ్లారు.. అసలు మార్గ మధ్యలో జరిగిందేంటో తెలిస్తే.. మీరు షాక్ అవ్వాల్సిందే.
- Ch Murali
- Updated on: Jan 31, 2026
- 6:18 pm
Andhra Pradesh: ఎత్తైన కొండపై లోతైన గొయ్యి.. అనుమానంగా ఇద్దరు వ్యక్తులు.. దగ్గరకు వెళ్లి చూస్తే షాక్..!
ఎత్తైన కొండ ప్రాంతం.. ఒంటరిగా వెళ్ళాలన్నా దైర్యం చెయ్యలేని ప్రాంతం.. పశువుల కాపరులైనా ఒకరికి ఒకరు తోడుగా వెళ్లాల్సిందే..! అలాంటి చోట ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో మేకలు తోలుకుని వెళ్లిన కాపరులు, ఆ వ్యక్తులను వెంబడించే ప్రయత్నం చేసినా కణాల్లో అక్కడి నుంచి మాయమయ్యారు. వారు చేసిన పనిని చూసిన మేకల కాపరులు షాక్ అయ్యారు.
- Ch Murali
- Updated on: Jan 30, 2026
- 11:44 am
తమిళనాడులో వేగంగా మారతున్న పాలిటిక్స్.. సినిమాల్లో హీరోనే, రాజకీయాల్లో కూడా హీరో అవుతాడా?
సినిమాల్లో హీరోనే, రాజకీయాల్లో కూడా హీరో అవుతాడా? జనం ఆయన్ను చూసి వస్తున్నారా..? సిద్దాంతాలు నచ్చి వస్తున్నారా..? అన్న చర్చ తమిళనాట మొదలైంది. పొత్తులపై ఓక్లారిటీ వచ్చినా ఇంకా డోర్లు తెరిచే ఉన్నాయన్న సంకేతాలు దేనికి సంకేతం. పొత్తు రాజకీయాల్లో హీరో పార్టీ డెసిషన్ మారిందా.? సింహం సింగిలే అయితే పొత్తు పొడుపు కథలు ఎందుకు చెబుతున్నట్టు..? తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
- Ch Murali
- Updated on: Jan 30, 2026
- 10:11 am
తమిళనాట ఒంటరైన విజయ్.. ఎన్డీఏ కూటమిలో చేరిన ఆ పార్టీలు.. దళపతి దారెటు..?
తమిళనాడులో అధికారమే లక్ష్యంగా బీజేపీ అన్నాడీఎంకేతో కలిసి కూటమిగా రంగంలోకి దిగుతోంది. మరి కొన్ని పార్టీలతో కలిసి కూటమిగా ఎన్నికల శంఖారావం పూరించింది. తొలి ప్రచార సభలో ప్రధాని మోదీ సహా మిత్రపక్షాల పార్టీలు పాల్గొన్నాయి. అంతా బాగానే ఉంది కానీ మార్పు పేరుతో కొత్తగా పార్టీ స్థాపించిన నటుడు విజయ్ పరిస్థితి ఏంటి అన్న చర్చ మొదలైంది.
- Ch Murali
- Updated on: Jan 24, 2026
- 8:44 am
Tamil Nadu: అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ అదే రచ్చ.. గవర్నర్ మైక్ కట్ చేసిన స్పీకర్..!
గవర్నర్గా తమిళనాడుకు ఆర్.ఎన్. రవి వచ్చిన తొలినాళ్ల నుంచి ఇదే జరుగుతోంది. అనేక అంశాల్లో తలెత్తిన సమస్యలతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమైంది. ఇదే అంశంపై గతంలో బహిరంగంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, డీఎంకే ముఖ్య నేతలు గవర్నర్ రవి టార్గెట్గా విమర్శలు చేశారు. గతంలో గవర్నర్ రవి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
- Ch Murali
- Updated on: Jan 20, 2026
- 8:13 pm
ISRO Samudrayaan Project: మేరా భారత్ మహాన్.. సముద్ర లోతుల్లో ఇస్రో సాహస ప్రయోగం.. మామూలు ప్లాన్ కాదుగా..!
భారత్ అంతరిక్ష ప్రయోగాల్లో మాత్రమే కాదు.. సముద్ర లోతుల్లో ఉన్న రహస్యాలను తెలుసుకునేందుకు కీలక ప్రయోగాలు చేపడుతోంది. ఇప్పటికే గగన్ యాన్ కోసం సిద్ధమవుతున్న ఇస్రో రెండేళ్ల క్రితమే సముద్రంలో పరిశోధన కోసం సముద్రయాన్ ప్రాజెక్టును ప్రకటించి పరిశోధనలు ప్రారంభించింది. సముద్రం లోపల వేల మీటర్ల లోతున శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.. భారత్ చేపట్టిన సముద్ర యాన్ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం..
- Ch Murali
- Updated on: Jan 20, 2026
- 3:10 pm
APSRTC: ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే రికార్డు.. ఒక్కరోజే ఎన్ని కోట్లంటే..?
సంక్రాంతితో ఏపీఎస్ఆర్టీసీ రికార్డుల పండుగ చేసుకుంది. పండగ వెళ్లిపోతూ ఆర్టీసీ ఖజానాకు కాసుల వర్షాన్ని మిగిల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, సంస్థ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో జనవరి 19న ఒక్కరోజే భారీ దాయాన్ని ఆర్జించి సరికొత్త మైలురాయిని అధిగమించింది. ఆదాయంలోనే కాదు ఏకంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి సేవలోనూ సాటిలేదని నిరూపించుకుంది.
- Ch Murali
- Updated on: Jan 20, 2026
- 1:53 pm
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత బాటలోనే విజయ్..
తమిళనాడులో ఉచితాల జాతర మరో లెవల్కి చేరింది. ఇప్పటికే డీఎంకే ఫ్రీ స్కీమ్లను అమలు చేస్తుండగా.. అన్నాడీఎంకే అంతకుమించి హామీలను ప్రకటించింది. కొత్తగా బరిలోకి దిగుతున్న టీవీకే చీఫ్ విజయ్ కూడా తాను ఉచిత పథకాలకు వ్యతిరేకం కాదని ప్రకటించారు. గతంలో ఉచితాలను ప్రకటించిన విజయ్ ఇప్పుడు అదే బాట ఎందుకు పట్టారు..? తమిళ రాజకీయం ఎలా నడుస్తుంది..? అనేది తెలుసుకుందాం..
- Ch Murali
- Updated on: Jan 20, 2026
- 1:38 pm
పవిత్ర సోమవారం అక్కడ నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు..!
నెల్లూరు చెర్లోపల్లి విశ్వనాథ స్వామి ఆలయంలో సోమవారం, కార్తీక మాసంలో నాగుపాము భక్తులకు దర్శనమివ్వడం దైవ మహిమగా భావిస్తున్నారు. శివునికి ప్రీతిపాత్రమైన రోజున నాగేంద్రుడు కనిపించడంతో భక్తులు భక్తిపారవశ్యంతో పూజలు, శివనామస్మరణలు చేశారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారాయి. ఇది శుభసూచకమని అక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు.
- Ch Murali
- Updated on: Jan 20, 2026
- 11:46 am