తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 26 ఏళ్ల అనుభవం ఉంది.. 2000 సంవత్సరంలో తిరుపతి నుంచి ఈనాడులో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2002 నుంచి ఈటీవీ, ఈనాడు జర్నలిజం స్కూల్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని 2003 నుంచి ఈటీవీ 2 లో , 2006 నుంచి జీ తెలుగు, 2009 లో మహా న్యూస్, 2012 నుంచి టివి9 లో అడుగుపెట్టాను.. చెన్నై కేంద్రంగా టివి9 ప్రతినిధిగా తమిళనాడు వ్యాప్తంగా అనేక అంశాలపై ప్రత్యేక కథనాలను అందించడం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి చీఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. తిరుపతితో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ లో సంచలన ఘటనలకు సంబంధించి రిపోర్టింగ్ చేసిన అనుభవం వుంది. డిజిటల్ ఫ్లాట్ ఫాంలో ఆరేళ్ల అనుభవం వుంది.
ఏం కాదులే అని ఇంటి తాళాలు ఎక్కడపడితే అక్కడ దాస్తున్నారా..? ఇది తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్..
నెల్లూరులో ఓ కుటుంబం వాకింగ్కు వెళ్లిన సమయంలో ఇంట్లో జరిగిన 145 గ్రాముల బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి ముందు వాషింగ్ మెషీన్పై తాళం ఉంచే అలవాటును గమనించిన నిందితులు, అదే తాళంతో ఇంట్లోకి ప్రవేశించి లాకర్లోని బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఇద్దరు బాల నేరస్తులతో పాటు మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి, చోరీకి గురైన మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
- Ch Murali
- Updated on: Jun 11, 2026
- 3:26 pm
Andhra News: వేసిన తాళం వేసినట్టే ఉంచి.. డబ్బు, బంగారం కాజేస్తున్న కేటుగాళ్లు
నెల్లూరు జిల్లాలో వరుస దొంగతనాలు స్థానికులను కలవరపెడుతున్నాయి. తాళాలు పగలగొట్టకుండా, ఎలాంటి అలికిడి లేకుండా విలువైన వస్తువులను మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. వెంకటాచలం పరిధిలో కేవలం రెండు వారాల్లోనే నాలుగు చోరీలు పాల్పడ్డారు. ఈ వరుస చోరీలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దొంగలను త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు.
- Ch Murali
- Updated on: Jun 10, 2026
- 10:33 pm
అన్నామలై ఎంట్రీతో మారుతున్న సమీకరణాలు.. ద్రావిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయమా?
తమిళసింగం అన్నామలై రాజకీయ భవిష్యత్తుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ఆయన కొత్త రాజకీయ వేదిక వైపు అడుగులు వేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, "అన్నామలై ఇక అరవమలై" అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Ch Murali
- Updated on: Jun 10, 2026
- 6:51 pm
మాట్లాడదామని ప్రియురాలిని నమ్మించి తీసుకెళ్లిన ప్రియుడు.. చెరువు కట్టపైనే కత్తిపోట్లు..!
అనుమానం అనే పెనుభూతం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే కాలయముడిగా మారి ఆరేళ్ల అనుబంధాన్ని కత్తితో కోసేసాడు. నెల్లూరు నగరంలోని పడారుపల్లి చెరువు సాక్షిగా జరిగిన ఈ కిరాతక ఉదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Ch Murali
- Updated on: Jun 10, 2026
- 3:13 pm
ఆంధ్రా వాసులకు గుడ్న్యూస్.. మరో కొత్త ఎయిర్పోర్ట్ వచ్చేస్తోందోచ్.. నెరవేరనున్న దశాబ్దాల కల!
ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రజా రవాణాతో పాటు స్థానిక వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులకు రవాణా వ్యవస్థే కీలకం. ఈ నేపథ్యంలోనే, నెల్లూరు జిల్లా వాసుల దశాబ్దాల నాటి కల అయిన 'దగదర్తి విమానాశ్రయం' నిర్మాణానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరో పది రోజుల్లోనే టెండర్ల ప్రక్రియను ముగించి, కాంట్రాక్టు సంస్థకు పనులను అప్పగించేందుకు సిద్ధమైంది.
- Ch Murali
- Updated on: Jun 10, 2026
- 3:15 pm
Annamalai: ద్రవిడ గడ్డపై అన్నామలై సరికొత్త పొలిటికల్ గేమ్.. దళపతి విజయ్ ఫార్ములాతో..
దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న తమిళనాట విజయ్ గెలుపుతో ఒక కొత్త శకం మొదలైందా..? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. సరిగ్గా ఇదే ట్రెండ్ను క్యాచ్ చేస్తూ, యువతలో తనకు ఉన్న క్రేజ్ను వాడుకోవడానికి అన్నామలై రంగంలోకి దిగారు. దళపతి విజయ్ తరహాలోనే గ్రౌండ్ వర్క్ లాంటి పక్కా వ్యూహంతో కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు.
- Ch Murali
- Updated on: Jun 9, 2026
- 1:57 pm
స్మశానాల దగ్గర వైన్ షాపులు పెట్టండి.. సీఎంకు సలహా ఇచ్చిన నటుడు
తమిళనాడులో వైన్ షాపుల అంశం ఇపుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ జోసెఫ్ ముందుగా వైన్ షాపులపై దృష్టి పెట్టారు. తమిళనాడులో వైన్ షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.. 700 కు పైగా వైన్ షాపులు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై తమిళనాడు లో మద్యపాన ప్రియులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. ఇదే అంశంపై కోలీవుడ్ సీనియర్ నటుడు సీఎం ను కలిసి ఇచ్చిన సలహా ఇపుడు తమిళనాట ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది..
- Ch Murali
- Updated on: Jun 9, 2026
- 12:28 pm
లీలా మాహల్.. మల్టీప్లెక్స్కే సవాల్ విసురుతున్న సింగల్ స్క్రీన్ థియేటర్.. లోపల మామూలుగా లేదుగా..
మల్టీప్లెక్స్ల హవా కొనసాగుతున్న ఈ రోజుల్లో నెల్లూరులోని ప్రముఖ లీలా మహల్ థియేటర్ కొత్త రూపంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు 400కుపైగా సీట్లు ఉన్న ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్ను అత్యాధునిక సదుపాయాలతో పునర్నిర్మించారు. పూర్తి స్థాయిలో రెక్లైనర్ సీట్లు, అత్యుత్తమ సౌండ్ సిస్టమ్, ఆకర్షణీయమైన ఇంటీరియర్తో మల్టీప్లెక్స్లకు ఏమాత్రం తీసిపోని అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తోంది. సింగిల్ స్క్రీన్లు కనుమరుగవుతున్న సమయంలో లీలా మహల్ కొత్త అవతారం సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
- Ch Murali
- Updated on: Jun 2, 2026
- 11:26 am
రండి.. నన్ను ప్రశ్నించండి.. శివమణి స్టైల్లో ప్రజలకు నెంబర్ ఇచ్చి మరీ ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్!
కమాన్ ఆస్క్ మీ.. సమస్యలపై ప్రశ్నించండి, నన్ను నిగ్గదీసి అడగండి అని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే. అంతే కాదు తనను కాంటాక్ట్ చేసేందుకు శివమణి స్టైల్లో ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేయడంతో పాటు 2029 ఎన్నికల్లో నెల్లూరు రూలర్ ఎవరనే దానిపైన క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే అనేగా మీ డౌట్ అయితే ఈ స్టోరీ చదవాల్సిందే
- Ch Murali
- Updated on: May 30, 2026
- 8:16 pm
Karachi Water Crisis: సిందూ జలాల వివాదం.. చుక్క నీరు లేక చుక్కలు చూస్తున్న పాకిస్తాన్!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సిందూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న కఠినమైన నిర్ణయం పాకిస్తాన్ను నీటి సంక్షోభంలోకి నెట్టేసింది. దీనికి తోడు పీక్ సమ్మర్లో దేశవ్యాప్తంగా బక్రీద్ పండుగ వేడుకలు జరుగుతున్న సమయంలోనే దేశ రాజధాని కరాచీలో నీటి కొరత అధికార పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి తలనొప్పిగా మారింది.
- Ch Murali
- Updated on: May 30, 2026
- 7:40 pm
ISRO: విజన్ 2047.. చంద్రయాన్-4, శుక్రయాన్.. భారత్తో మామూలుగా ఉండదిక..
చంద్రయాన్-3 అనంతరం ఇస్రో మరిన్ని ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2028లో జపాన్తో కలిసి చంద్రయాన్-4 (లూపెక్స్) మిషన్ ద్వారా చంద్రుడి ఉపరితల నమూనాలను సేకరించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 2040 నాటికి భారత వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలనే లక్ష్యంతో పాటు, 2035 నాటికి భారత సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇస్రో ప్రణాళికలు రూపొందిస్తోంది. అలాగే శుక్ర గ్రహ రహస్యాలను ఛేదించేందుకు శుక్రయాన్ మిషన్పై కూడా వేగంగా పనులు కొనసాగిస్తోంది.
- Ch Murali
- Updated on: May 30, 2026
- 8:12 am
CM Vijay: రూట్ మార్చిన సీఎం విజయ్.. బ్లాక్ కోట్ తీసేసి సరికొత్త స్టైల్లో దళపతి.. వీడియో వైరల్..
ఎప్పుడూ నల్లటి బ్లేజర్.. విదేశీ తరహా సూట్.. పక్కా స్టైలిష్ లుక్.. తమిళనాడు సీఎంగా విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక మెయింటైన్ చేసిన ట్రేడ్మార్క్ స్టైల్ ఇది. కానీ ఒక్కసారిగా సీఎం విజయ్ రూట్ మార్చేశారు. తన ట్రేడ్మార్క్ బ్లాక్ కోటుని పక్కనపెట్టి.. ఊహించని సరికొత్త రూపంలో ఎంట్రీ ఇచ్చి అందరికీ మైండ్ బ్లాక్ చేశారు. అసలు విజయ్ అంతగా స్టైల్ మార్చడానికి కారణం ఏంటి? అనేది తెలుసుకుందాం..
- Ch Murali
- Updated on: May 29, 2026
- 8:40 pm