AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ch Murali

Ch Murali

Special Correspondent (Nellore) - TV9 Telugu

murali.chennuri@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 25 ఏళ్ల అనుభవం ఉంది.. 2000 సంవత్సరంలో తిరుపతి నుంచి ఈనాడులో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2002 నుంచి ఈటీవీ, ఈనాడు జర్నలిజం స్కూల్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని 2003 నుంచి ఈటీవీ 2 లో , 2006 నుంచి జీ తెలుగు, 2009 లో మహా న్యూస్, 2012 నుంచి టివి9 లో అడుగుపెట్టాను.. చెన్నై కేంద్రంగా టివి9 ప్రతినిధిగా తమిళనాడు వ్యాప్తంగా అనేక అంశాలపై ప్రత్యేక కథనాలను అందించడం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి స్పెషల్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. తిరుపతితో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ లో సంచలన ఘటనలకు సంబంధించి రిపోర్టింగ్ చేసిన అనుభవం వుంది. డిజిటల్ ఫ్లాట్ ఫాం లో ఐదేళ్ళ అనుభవం వుంది.

Read More
Follow On:
Supreme Court: దేవుళ్ల సొమ్ము దేవుళ్లకే.. మీరెలా తీసుకుంటారు: సుప్రీంకోర్టు ఆగ్రహం..

Supreme Court: దేవుళ్ల సొమ్ము దేవుళ్లకే.. మీరెలా తీసుకుంటారు: సుప్రీంకోర్టు ఆగ్రహం..

దేవుళ్ల సొమ్ము దేవుళ్లకే. ఆలయాల డబ్బుల్ని ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న కో-ఆపరేటివ్‌ బ్యాంకుల ఉద్దరణకు వాడొద్దని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయ నిధులను ఆలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. కేరళకు చెందిన కొన్ని సహకార బ్యాంకుల దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, సహకార బ్యాంకుల మనుగడ కోసం ఆలయ నిధులను మళ్లించవద్దని ఆదేశించింది.

Nellore: సామన్య CPM కార్యకర్తకు విగ్రహం ఏర్పాటు చేస్తున్న TDP ఎమ్మెల్యే.. ఆయన గురించి తెలిస్తే..

Nellore: సామన్య CPM కార్యకర్తకు విగ్రహం ఏర్పాటు చేస్తున్న TDP ఎమ్మెల్యే.. ఆయన గురించి తెలిస్తే..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన పెంచలయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. మత్తు దందాకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పెంచలయ్య గంజాయి గ్యాంగ్ చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. పార్టీలకు అతీతంగా అందరూ మద్దతుగా రావడం.. పెంచలయ్య చేసిన మంచికి అందరి నుంచి మన్ననలు వస్తుండగా ఇపుడు ఆయన విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా దక్కని గుర్తింపు పెంచలయ్యకు వస్తోంది.. ఇంతకీ ఆయనకు ఎందుకంత క్రేజ్..

Nellore: పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇదేం పని.. పొలీసులకు అనుకోకుండా చిక్కిన భార్యభర్తలు

Nellore: పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇదేం పని.. పొలీసులకు అనుకోకుండా చిక్కిన భార్యభర్తలు

కలిసి కాపురం చేసుకోవాల్సిన ఆ జంట గలీజు దందా మొదలు పెట్టింది.. ఉన్న ఊర్లో వ్యాపారం చేస్తే అందరికీ తెలిసి పరువు పోతుందని అనుకున్నారో ఏమో.. రాష్ట్రం వదిలి ఏపికి వచ్చి అక్కడ స్థిరపడి అక్రమ దందా మొదలు పెట్టారు.. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు చుట్టుపక్కల ఉండే వారికి కలరింగ్ ఇచ్చేవారు.. చివరకు ఊహించని విధంగా పోలీసులకు దొరికిపోయారు.. అసలు స్వరూపం బయటపడింది.. విషయం తెలిసిన ఇరుగూ పొరుగూ షాక్ అయ్యారు.

మర్డర్ కేసులో కూపీ లాగితే.. వెలుగులోకి నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!

మర్డర్ కేసులో కూపీ లాగితే.. వెలుగులోకి నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!

నెల్లూరులో సంచలనం సృష్టించిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీలో సీపీఎం నాయకుడు పెంచలయ్య అనే వ్యక్తిని దాదాపు పదిమంది కత్తులతో నరికి చంపారు. ఆ సమయంలో ఇది రెండు వర్గాల మధ్య జరిగిన వివాదాల కారణంగా పాత కక్షలతో జరిగిన హత్య అని అందరూ అనుకున్నారు.

అరవ కామాక్షి మామూల్ది కాదు.. అడ్డు చెబితే ఖతమే.. ప్రజలు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారంటే..

అరవ కామాక్షి మామూల్ది కాదు.. అడ్డు చెబితే ఖతమే.. ప్రజలు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారంటే..

నెల్లూరులో జరిగిన సీపీఎం నేత, సామాజిక ఉద్యమ కారుడు పెంచలయ్య హత్య ఉదంతంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికంగా ఉంటున్న కామాక్షి ఈ హత్య చేయించినట్లు బయట పడడం.. హత్యకు గల కారణాలు తెలుసుకున్న స్ధానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. కామాక్షి కి గట్టి పనిష్మెంట్ ఇచ్చారు.

నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే

నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే

నెల్లూరు నగరంలో ఇటీవల వరుస హత్యలు, దాడులు, గంజాయి విక్రయాలతో రౌడీలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే నేరాలు జరుగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి కఠిన చర్యలు చేపట్టారు. నిందితులను అరెస్టు చేయడంతో పాటు, రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి, నగరంలో ప్రదర్శనలు నిర్వహించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసుల ఈ వినూత్న చర్యలు వైరల్‌గా మారాయి.

Andhra Pradesh: ఏపీలో తెరమీదకు మరో కొత్త జిల్లా డిమాండ్.. లేకపోతే రాజీనామా అంటున్న..

Andhra Pradesh: ఏపీలో తెరమీదకు మరో కొత్త జిల్లా డిమాండ్.. లేకపోతే రాజీనామా అంటున్న..

ఏపీలో జిల్లాల పునర్విభజన మళ్లీ వివాదాస్పదమైంది. మంత్రివర్గ ఉప సంఘం గూడూరును తిరుపతి జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయించడంతో.. గూడురు ప్రజలు కొత్త డిమాండ్‌‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఎన్నికల హామీ నిలబెట్టుకోకపోతే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

Andhra Pradesh: పెన్షన్ డబ్బుల విషయంలో తండ్రీకొడుకుల ఘర్షణ.. చివరకు ఓ ప్రాణమే పోయింది..

Andhra Pradesh: పెన్షన్ డబ్బుల విషయంలో తండ్రీకొడుకుల ఘర్షణ.. చివరకు ఓ ప్రాణమే పోయింది..

తండ్రికి పెన్షన్ డబ్బులు వచ్చాయి.. కొడుకు తన అవసరాలకు రెండు వేలు కావాలని అడిగాడు.. కుదరదని తండ్రి చెప్పడంతో కొడుకు ఒప్పుకోలేదు.. వేరే చోట అప్పు తీసుకునే సమయం లేదు.. కావాలంటే మళ్లీ ఇస్తానని చెప్పాడు. అయినా తండ్రి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు.. ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.. అది కాస్త ఘర్షణకు దారితీసింది.. చివరకు ఊహించని విషాదానికి కారణమైంది.

Andhra: పెదాలకు లిప్‌స్టిక్.. బొట్టు, పసందైన చీరకట్టు.. వల వేసే చూపులు అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే

Andhra: పెదాలకు లిప్‌స్టిక్.. బొట్టు, పసందైన చీరకట్టు.. వల వేసే చూపులు అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే

అరవ కామాక్షి.. చూడడానికి పద్ధతిగా కనిపించే ఈ మహిళ అసలు బాగోతం తెలిస్తే ఎంతటి వారికైనా చెమటలు పట్టాల్సిందే. ఈమె గురించి తెలిసిన వారైనా.. తెలియని వారైనా ఆమెతో పెట్టుకుంటే ఇక శాల్తీ గల్లంతే. అంతటి డేంజరస్ లేడీ వ్యవహారం తాజాగా నెల్లూరు లో వెలుగు చూసింది. ఈమె మరింత ప్రమాదకరమైన మహిళగా తాజా ఉదంతాలు చెబుతున్నాయి.

Andhra: నెల్లూరునే గజగజ వణికించేసిందిగా..! పద్దతికి చీర కట్టినట్టుగా ఉందనుకుంటే పప్పులో కాలేస్తారు

Andhra: నెల్లూరునే గజగజ వణికించేసిందిగా..! పద్దతికి చీర కట్టినట్టుగా ఉందనుకుంటే పప్పులో కాలేస్తారు

ఆ నగరానికి ఏమైంది.. వరుస హత్యలు.. జైళ్ళ నుంచే సెటిల్మెంట్ల దందా.. నిన్నటికి నిన్న లేడీ డాన్ వ్యవహారం.. తాజాగా గంజాయి దందా.. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై కాల్పులు.. ప్రశాంత వాతావరణం కలిగిన ఆ జిల్లాలో నిత్యం హత్యలు.. గంజాయి దందాలతో అశాంతి నెలకొంది. ఆ వివరాలు ఇలా..

చంద్రుడిపై టార్గెట్ మామూలుగా లేదుగా.. భారత్-జపాన్ సంయుక్తంగా మెగా ప్రాజెక్ట్‌..

చంద్రుడిపై టార్గెట్ మామూలుగా లేదుగా.. భారత్-జపాన్ సంయుక్తంగా మెగా ప్రాజెక్ట్‌..

భారత్-జపాన్ దేశాలు కలిసి ఈసారి చంద్రుడిని టార్గెట్ చేశారు. అవును, ఇప్పటి వరకు భారత్ వేరుగా జపాన్ వేరుగా ఎన్నో ప్రయోగాలు చేశారు. అయితే 2027లో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో, జపాన్ కలిసి సంయుక్తంగా 2027-2028వ సంవత్సరం మధ్యలో చంద్రునిపై అన్వేషణకు మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్ధం అవుతున్నారు.

Andhra News: ఉలిక్కి పడ్డ నెల్లూరు.. అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసుల పైనే దాడికి యత్నం.. సీన్‌కట్‌ చేస్తే..

Andhra News: ఉలిక్కి పడ్డ నెల్లూరు.. అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసుల పైనే దాడికి యత్నం.. సీన్‌కట్‌ చేస్తే..

నెల్లూరు జిల్లాలో ఇటీవల శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయా.. అన్నట్లు ఉంది తాజా పరిస్థితి. తప్పు చేసిన వారిని పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులపై దాడికి దిగుతున్న సందర్భాలు ఇటీవల చాలానే జరిగాయి.. తాజాగా ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన హంతకులను పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంతకు నెల్లూరులో ఉం జరుగుతుందో తెలుసుకుందాం పదండి.