తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 26 ఏళ్ల అనుభవం ఉంది.. 2000 సంవత్సరంలో తిరుపతి నుంచి ఈనాడులో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2002 నుంచి ఈటీవీ, ఈనాడు జర్నలిజం స్కూల్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని 2003 నుంచి ఈటీవీ 2 లో , 2006 నుంచి జీ తెలుగు, 2009 లో మహా న్యూస్, 2012 నుంచి టివి9 లో అడుగుపెట్టాను.. చెన్నై కేంద్రంగా టివి9 ప్రతినిధిగా తమిళనాడు వ్యాప్తంగా అనేక అంశాలపై ప్రత్యేక కథనాలను అందించడం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి చీఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. తిరుపతితో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ లో సంచలన ఘటనలకు సంబంధించి రిపోర్టింగ్ చేసిన అనుభవం వుంది. డిజిటల్ ఫ్లాట్ ఫాంలో ఆరేళ్ల అనుభవం వుంది.
ISRO: ఒక్క ప్రయోగం.. అది కూడా ఫెయిల్యూర్..! ఈ ఏడాది ఇస్రో ప్రయోగాలు తగ్గడానికి కారణమేంటి..?
2026లో ఇస్రో ప్రయోగాల సంఖ్యపై ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది ఇప్పటివరకు PSLV-C62 ప్రయోగం మాత్రమే జరగగా.. అది విఫలమైంది. సెప్టెంబర్ తొలి వారంలో GSLV-F17 ద్వారా EOS-M5 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఏడాది చివరి నాటికి మిగిలిన ప్రయోగాలు, గగన్యాన్కు సంబంధించిన కీలక పరీక్షలను ఇస్రో పూర్తి చేయగలదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
- Ch Murali
- Updated on: Aug 25, 2026
- 6:41 pm
విజయ్ దెబ్బకు ద్రవిడ పార్టీల్లో కదలిక.. ‘జెన్ జెడ్’ మంత్రం జపిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే!
దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రంతో తమిళనాట జెన్ జెడ్ ఓటర్ల ప్రాధాన్యత పెరిగింది. ఆయన పార్టీ యువతకు పెద్దపీట వేయడంతో, ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే సైతం యువతను ఆకర్షించే వ్యూహాలను అవలంబిస్తున్నాయి. డీఎంకే సంస్థాగత మార్పులు చేపట్టి, జిల్లా స్థాయి పదవుల్లో వయోపరిమితులు విధించి, యువతకు అవకాశాలు కల్పిస్తోంది. ఈ పరిణామాలు తమిళ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికాయి.
- Ch Murali
- Updated on: Aug 22, 2026
- 6:13 pm
Watch: ‘మా నాన్న బైక్ అక్కడ దాచాడు’.. పోలీసుల కార్డన్ సెర్చ్లో తండ్రిని పట్టించిన బుడ్డోడు
నాన్న చేసిన పని తప్పని భావించిన ఓ ఆరేళ్ల బాలుడు.. ఏ మాత్రం భయపడకుండా పోలీసుల వద్దకు వెళ్లి అసలు విషయం చెప్పాడు. అంతేకాదు, తన తండ్రి బైక్ను ఎక్కడ దాచాడో పోలీసులకు స్వయంగా చూపించాడు. నెల్లూరు జిల్లా అనంతసాగరంలో జరిగిన ఈ ఘటన పోలీసులతో పాటు స్థానికులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతసాగరంలో పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని తనిఖీ చేయడంతో పాటు ఇళ్లలో ఉన్న వాహనాలను కూడా పరిశీలించారు..
- Ch Murali
- Updated on: Aug 21, 2026
- 10:08 am
Andhra Pradesh: ప్రాణదాతలకు అండగా ఏపీ సర్కార్.. అవయవదాన బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం..
తీరని శోకంలోనూ మరో ఎనిమిది మంది ప్రాణాలను నిలబెట్టే మహోన్నత సంకల్పం అవయవదానం. ఆ సమయంలో దాతల కుటుంబాలు చూపే త్యాగానికి సెల్యూట్ చేస్తూ.. వారికి అన్ని విధాలా అండగా నిలిచేందుకు ఏపీ సర్కార్ చారిత్రక ముందడుగు వేసింది. అవయవదానాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తూనే, అక్రమ వ్యాపారాల నడ్డివిరిచేలా రూపొందించిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
- Ch Murali
- Updated on: Aug 19, 2026
- 7:10 pm
వారెవ్వా.. ఒకేసారి మెడికల్ సీట్లు సాధించిన ముగ్గురు అన్నదమ్ములు..
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు రామ్ కుమార్ కుటుంబానికి ఈ ఏడాది NEET ఫలితాలు జీవితంలో మరిచిపోలేని ఆనందాన్ని ఇచ్చాయి. ఆయన ముగ్గురు కుమారులు వెంకట్ శ్రీ, ధరణ్, అరుణ్ ఒకే ఏడాది NEETలో అర్హత సాధించి MBBS సీట్లు దక్కించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఈ ముగ్గురూ తమిళనాడులోని 7.5 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కోటా ద్వారా మెడికల్ సీట్లు సాధించారు.
- Ch Murali
- Updated on: Aug 18, 2026
- 2:54 pm
తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సర్కార్ గుడ్న్యూస్.. ముఖ్యమంత్రి కీలక నిర్ణయం?
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఆర్థికంగా వెనుకబడిన వారికి రవాణా సౌకర్యం కల్పించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. సొంత వాహనం కొనుగోలు చేసే స్థోమత లేని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తరఫున కారు, వ్యక్తిగత సహాయకుడిని అందించే ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
- Ch Murali
- Updated on: Aug 17, 2026
- 9:42 pm
చంద్రుడిపై శాశ్వత ఇళ్లు.. విద్యుత్.. నీరు! మనిషి కొత్త ప్రపంచానికి ఇస్రోతో కలిసి నాసా బిగ్ ప్లాన్!
నాసా చంద్రుడి దక్షిణ ధ్రువంపై 2032 నాటికి శాశ్వత మూన్ బేస్ ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇది దీర్ఘకాలిక మానవ ఉనికికి, పరిశోధనలకు పునాది వేస్తుంది. నీటి మంచు లభ్యత కోసం దక్షిణ ధ్రువం కీలకం. తీవ్ర ఉష్ణోగ్రతలు, రేడియేషన్ సవాళ్లను ఎదుర్కొంటూ రోవర్లు, నివాస సదుపాయాలు పంపనున్నారు. ఇస్రో చంద్రయాన్ డేటా నీటి మంచు పరిశోధనలకు దోహదపడుతుంది, భవిష్యత్ మిషన్లకు భారత్ పాత్రను పెంచుతుంది.
- Ch Murali
- Updated on: Aug 17, 2026
- 9:29 pm
భారత అంతరిక్షంలో సరికొత్త విప్లవం.. కులశేఖరపట్నం వేదికగా ఇస్రో ప్రైవేట్ దండయాత్ర!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సరికొత్త వాణిజ్య శకానికి నాంది పలికింది. దేశీయ అంతరిక్ష రంగాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో ప్రైవేటీకరణ వైపు తొలిసారిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడులోని కులశేఖరపట్నం వద్ద సుమారు రూ. 950 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇస్రో రెండవ రాకెట్ ప్రయోగ కేంద్రం నిర్వహణను ప్రభుత్వ సంస్థ 'ఇన్-స్పేస్' ద్వారా ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది.
- Ch Murali
- Updated on: Aug 16, 2026
- 1:51 pm
200 ఏళ్లగా ఆ గ్రామాన్ని గబ్బిలాలు ఎలా కాపాడుతున్నాయి? ఇన్నాళ్లు మనం అనుకున్నది తప్పా?
చాలా మంది గబ్బిలాలను చూస్తేనే భయపడిపోతుంటారు. వాటి రూపం, రంగు చూసి అసయ్యించుకుంటారు. కొందరైతే ఏకంగా వాటిని ఆశుభ పక్షులుగా భావిస్తారు. కానీ ఇక్కడో గ్రామంలో మాత్రం ఈ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలంతా తమ గ్రామంలోని గబ్చిలాలను దైవంగా భావిస్తారు. ఇంతకూ దీని వెనక ఉన్న అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- Ch Murali
- Updated on: Aug 7, 2026
- 6:47 pm
వృద్ధాప్య పింఛన్ కోసం వెళ్లిన 36 ఏళ్ల మహిళ.. ఆధార్ కార్డు చూసిన అధికారులు షాక్..!
ఆధార్ నమోదులో చిన్న పొరపాటు పెద్ద సమస్యగా మారిపోయింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినేనిపల్లికి చెందిన నారాయణమ్మ పరిస్థితి ఇప్పుఅగమ్యగోచరంగా తయారైంది. ఆమె అసలు వయసు 36 సంవత్సరాలు. కానీ ఆధార్ కార్డులో మాత్రం పుట్టిన తేదీ తప్పుగా నమోదైంది. దీంతో అధికారిక రికార్డుల్లో ఆమె వయసు ఏకంగా 102 సంవత్సరాలుగా కనిపిస్తోంది.
- Ch Murali
- Updated on: Aug 7, 2026
- 1:37 pm
Andhra Pradesh: ‘దండుపాళ్యం’ తరహా ముఠా..? పట్టపగలే రెక్కీ… క్షణాల్లో చోరీ..!
నెల్లూరు జిల్లాలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. దండుపాళ్యం సినిమాను తలపించే విధంగా ఇవి ఉన్నాయి. పట్టపగలే గ్రామాల్లోకి ప్రవేశించి అందినకాడికి దొచుకుంటున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. చిత్తు కాగితాలు, గోనె సంచులు ఏరుకునే వారి వేషంలో తిరుగుతూ బురిడీ కొట్టిస్తున్నారు.
- Ch Murali
- Updated on: Aug 5, 2026
- 3:57 pm
ఎంత దారుణం.. మేకపిల్లల పంచాయతీ యువకుడి ప్రాణం తీసింది! ఏం జరిగిందంటే..
సాధారణంగా ఆస్తి తగాదాలు, పాత కక్షలు లేదా కోట్లాది రూపాయల లావాదేవీల వల్ల హత్యలు జరగడం చూస్తుంటాం. కానీ, కేవలం ఐదు మేక పిల్లల వివాదం ఒక అమాయక యువకుడి ప్రాణాలను బలిగొన్న దారుణ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది..? గొడవకు కారణం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..
- Ch Murali
- Updated on: Jul 22, 2026
- 5:22 pm