మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామం వద్ద ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు, బాటసారులు డీసీఎంలోని ఆపిల్ పండ్లను సంచుల్లో నింపుకుని తీసుకెళ్లారు. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.