Budget 2025: ఏఐలో ప్రభుత్వం పెట్టుబడి..? ఆ రంగం అభివృద్ధే లక్ష్యం
మరో వారం రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో పలు బడ్జెట్ నిర్ణయాలపై నిపుణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర బడ్జెట్ 2025లో భారతదేశం అంతటా రోగనిర్ధారణను మెరుగుపరచడం, వ్యాధులను నివారించడం, ఆరోగ్య సంరక్షణ సౌలభ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలకు ప్రాధాన్యతనిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2025లో ఆరోగ్య రంగం ఎలాంటి అంచనాలు వేస్తుందో? ఓసారి తెలుసుకుందాం.

ప్రస్తుత రోజుల్లో చాలా రంగాలను ఏఐ శాసిస్తుంది. ముఖ్యంగా మెడికల్ డయాగ్నస్టిక్స్, చికిత్సకు సంబంధించిన ల్యాండ్స్కేప్ను పునర్నిర్మిస్తోంది. భారతదేశం ఇప్పటికీ వివిధ ప్రజారోగ్య సవాళ్లతో పోరాడుతూనే ఉంది. 2025 యూనియన్ బడ్జెట్లో ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడుల ద్వారా ఆరోగ్య సమస్యల పరిష్కారాలను స్వీకరించడానికి, ముఖ్యంగా ఈ రంగంలో క్లిష్టమైన అంతరాలను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక అవకాశం ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఇప్పటికే సక్సెస్ అయినందున, ప్రస్తుతం వ్యాధులను నివారించడానికి ఏఐ సాంకేతికతలను ఏకీకృతం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొంటున్నారు. నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల భారం పెరుగుతున్న నేపథ్యంలో క్రిటికల్ కేర్ను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చే ఏఐ ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రాధాన్యత భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి కృషి చేస్తోంది. అలాగే ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రజారోగ్యాన్ని మరింత సమగ్రంగా పరిశీలించడానికి, కృత్రిమ మేధస్సును ఏకీకృతం చేయాలని నిపుణులు కోరుతున్నారు.
దేశంలో 275 మిలియన్ల మంది ప్రజలు దృష్టి లోపం, అంధత్వంతో బాధపడుతున్నారు. ఇందులో 9.2 మిలియన్లు డయాబెటిక్ రెటినోపతి, 11 మిలియన్లు గ్లాకోమా మరియు 36 మిలియన్లు ఏఎండీతో ఉన్నారని పేర్కొంటున్నారు. దేశంలో 60 శాతం మరణాలకు నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు కారణమవుతున్నాయి. ఏఐ, రెటీనా స్క్రీనింగ్ను ఉపయోగించడం వల్ల గుండెపోటులు, స్ట్రోకులు, మూత్రపిండాల వ్యాధులు, మధుమేహం, రక్తపోటు వల్ల వచ్చే సమస్యల నుంచి ప్రాణాపాయం నివారించవచ్చు. ఆరోగ్య సంరక్షణ విషయానికి వస్తే భారతదేశం గ్లోబల్ సూపర్ పవర్, మెడికల్ టూరిజంలో అగ్రగామిగా ఉంది. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, తక్కువ ఖర్చుతో కూడిన చికిత్సలతో ప్రపంచవ్యాప్తంగా రోగులను ఆకర్షిస్తోంది.
ఆరోగ్య చికిత్సా విధానాలను ముందస్తుగా గుర్తించే సాంకేతికతలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రభుత్వం మన దేశ ఆరోగ్య సంరక్షణ సౌలభ్యాన్ని, ఫలితాలను స్థాయిలో బలోపేతం చేస్తుందని వివరించారు. రెటీనా స్క్రీనింగ్, ప్రిడిక్టివ్ డయాగ్నస్టిక్ టూల్స్ వంటి ఏఐ-ఆధారిత పరిష్కారాలు, నివారించేలా మరణాలను గణనీయంగా తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాలను మెరుగుపరుస్తాయి. 2025-26 యూనియన్ బడ్జెట్లో ఇలాంటి కార్యక్రమాలను చేర్చడం ద్వారా ప్రభుత్వం మరింత సమర్థవంతమైన, సాంకేతికతతో కూడిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ వైపు పరివర్తనను వేగవంతం చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి