నేను గత రెండు సంవత్సరాల కాలంగా టీవీ9 తెలుగు డిజిటల్లో పనిచేస్తున్నాను. టెక్నాలజీ, పర్సనల్ ఫినాన్స్కి సంబంధించిన ఆర్టికల్స్ రాయడంలో అనుభవం ఉంది. అలాగే కొత్త గాడ్జెట్స్, లైఫ్ స్టైల్కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా రాస్తుంటాను.
Smart Phones: రూ.15 వేలకే పసందైన ఫోన్లు.. అమెజాన్లో బంపర్ ఆఫర్లు
ఇటీవల కాలంలో యువత స్మార్ట్ ఫోన్స్ ఈ-కామర్స్ వెబ్సైట్స్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో అధికంగా మధ్యతరగతి ప్రజలు ఉండడంతో వారిని ఆకట్టుకునేందుకు బడ్జెట్ ధరల్లో సూపర్ స్మార్ట్ఫోన్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ముఖ్యంగా రూ.15 వేల ధరకే అమెజాన్లో సూపర్ స్మార్ట్ ఫీచర్స్తో వివిధ కంపెనీల స్మార్ట్ ఫోన్లు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్లో అందుబాటులో ఉన్న టాప్-5 స్మార్ట్ ఫోన్స్పై ఓ లుక్కేద్దాం.
- Srinu
- Updated on: Mar 28, 2025
- 10:19 pm
Gold Monetisation Scheme: పెట్టుబడిదారులకు అలెర్ట్.. ఆ స్కీమ్ నిలిపేస్తున్నట్లు కేంద్రం ప్రకటన..!
మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎంఎస్)ను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే బ్యాంకులు తమ స్వల్పకాలిక బంగారు డిపాజిట్ పథకాలను (1-3 సంవత్సరాలు) కొనసాగించవచ్చని పేర్కొంది. నవంబర్ 2024 వరకు జీఎంఎస్ కింద దాదాపు 31,164 కిలోగ్రాముల బంగారాన్ని సమీకరించారు.
- Srinu
- Updated on: Mar 28, 2025
- 9:33 pm
Cash In Hand: నగదు విషయంలో ఆ తప్పు చేస్తే అంతే.. మన దగ్గర ఎంత డబ్బు ఉండాలో తెలుసా?
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున చోట్ల కట్టలు బయటపడ్డాయనే ఆరోపణలు వచ్చాయి. అగ్నిప్రమాదం తర్వాత వర్మ ఇంటి నుండి అధికారులు కాలిపోయిన కరెన్సీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఈ కేసును దర్యాప్తు చేయడానికి ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఘటన తర్వాత చాలా మంది ఇంట్లో చట్టబద్ధంగా ఎంత నగదు ఉంచుకోవచ్చు? అనే అనుమానం ప్రతి ఒక్కరికీ వస్తుంది.
- Srinu
- Updated on: Mar 28, 2025
- 7:30 pm
Vivo T4x vs Realme P3: రూ. 15వేలలోపు బెస్ట్ ఫోన్ ఏది? తెలియాలంటే ఇది చదవాల్సిందే..!
మీరు రూ. 15వేలలోపు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. దీనిలో మీకు రెండు ఆప్షన్లు అందిస్తున్నాం. అవి వివో టీ4ఎక్స్, రియల్ మీ పీ3. ఈ రెండూ 5జీ ఫోన్లే. అయితే వాటి స్పెక్స్, ఫీచర్లను బట్టి మీకు ఏది అవసరమో, ఏది మీకు బెస్టో సులువగా అర్థమవుతుంది. రెండూ ఫోన్లు కూడా ఫీచర్ ప్యాక్డ్ గా ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం కథనం పూర్తిగా చదివేయండి.
- Srinu
- Updated on: Mar 28, 2025
- 7:00 pm
Best 40Inch Tvs: తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ టీవీలు.. కేవలం రూ. 15వేలలోపే బెస్ట్ బ్రాండ్లు..!
ప్రస్తుత స్మార్ట్ యుగంలో హోమ్ ఎంటర్టైన్మెంట్కు డిమాండ్ పెరిగింది. ఇంట్లోనే మంచి పెద్ద స్మార్ట్ టీవీ, హోమ్ థియేటర్ వంటివి ఏర్పాటు చేసుకునేందుకు చాలా కుటుంబాలు మొగ్గుచూపుతున్నాయి. ఇటీవల పెరిగిన ఓటీటీల ప్రభావం కూడా ఇందుకు ఓ కారణం. అయితే అందరూ పెద్ద టీవీలు కొనలేరు. ఇంటి పరిస్థితి కూడా అందుకు సహకరించకపోవచ్చు. అంటే ఇంటి పరిమాణం చిన్నగా ఉంటే పెద్ద టీవీలు అక్కడ సెట్ అవ్వవు. అయితే 40 అంగుళాల టీవీలు మిడ్ సైజ్ లో ఉంటాయి. మరీ పెద్దగా కనిపించవు. బెడ్ రూం అయినా, హాల్ అయినా మీకు 40 అంగుళాలు బెస్ట్ చాయిస్. ఒకవేళ మీరు అలాంటి టీవీ కొనుగోలు చేయాలని చూస్తుంటే ఈ కథనం మీకు బాగా ఉపకరిస్తుంది. ప్రస్తుత మార్కెట్లోని బెస్ట్ 40 అంగుళాల స్మార్ట్ టీవీలను మీకు పరిచచయం చేస్తున్నాం. వీటిల్లో 4కే రిజల్యూషన్, మంచి రిఫ్రెష్ రేట్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
- Srinu
- Updated on: Mar 28, 2025
- 6:37 pm
Income Tax: పెట్టుబడి మంత్రంతో నోటీసుల కుతంత్రం చిత్తు.. ఆదాయపు పన్ను నోటీసులకు చెక్ పెట్టండిలా..!
భారతదేశంలో నిర్ణీత ఆదాయం దాటాక ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పౌరులు తమ ఆదాయానికి అనుగుణంగా వివిధ శ్లాబ్స్ ఆధారంగా పన్ను చెల్లిస్తారు. అయితే పన్ను చెల్లింపుల్లో చేసే చిన్న తప్పుల వల్ల ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేస్తూ ఉంటుంది. ఆదాయపుపన్ను నోటీసులకు పెట్టుబడి చిట్కాలతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను రాకుండా తీసుకోవాల్సిన పెట్టుబడి చిట్కాలను తెలుసుకుందాం.
- Srinu
- Updated on: Mar 28, 2025
- 12:30 pm
FD Schemes: ఎఫ్డీ ఖాతాదారులకు అలెర్ట్.. ఆ స్కీమ్స్లో పెట్టుబడికి మూడు రోజులే గడువు
భారతదేశంలోని ప్రజలకు ఏళ్లుగా ఫిక్స్డ్ డిపాజిట్లు నమ్మకమైన పెట్టుబడి ఎంపికగా నిలుస్తున్నాయి. పెట్టుబడికి భరోసాతో రాబడికి మంచి హామీ ఉండడంతో ప్రజలు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్స్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే బ్యాంకులు ఇటీవల కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేక స్కీమ్స్ ప్రవేశపెట్టి అదిరిపోయే వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే బ్యాంకుల్లో ఏయే ఏయే ప్రత్యేక స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయో? ఓసారి చూద్దాం.
- Srinu
- Updated on: Mar 28, 2025
- 12:13 pm
Post Office Schemes: ఆ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడితో రాబడి వరదే.. రూ.2 లక్షల డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీ ఎంతంటే?
భారతదేశంలోని ప్రజలు ఏళ్లు పోస్టాఫీసుల ద్వారా వివిధ సేవలు పొందుతున్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రత్యుత్తరాలకే కాకుండా వివిధ పొదుపు పథకాల ద్వారా పోస్టల్ శాఖ తన సేవలను అందిస్తుంది. పోస్టాఫీసుల్లో చాలా పొదుపు పథకాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం అభివృద్ధి చెందడంతో వాటికి తగ్గట్టు పోటీలో ఉండేందుకు పోస్టాఫీసు కూడా వివిధ పొదుపు పథకాలను అందిస్తుంది. ఈ నేపథ్యంలో పోస్టాఫీసు పథకాల్లో అధిక వడ్డీనిచ్చే పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
- Srinu
- Updated on: Mar 26, 2025
- 8:11 pm
Best Smartphones: ఈ స్మార్ట్ఫోన్స్తో మరింత స్మార్ట్.. రూ. 20వేల లోపు బెస్ట్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు
స్మార్ట్ ఫోన్ కొనాలనే ఆలోచనలో ఉన్నారా? బడ్జెట్ లెవెల్లో బెస్ట్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. మార్కెట్లో వందల రకాల బ్రాండ్లు, లక్షల రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిల్లో ది బెస్ట్ ఏంటి అంటే చెప్పడం కష్టమే. ఎవరి అవసరాలకు అనుగుణంగా, బడ్జెట్ పరిధుల మేరకు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తారు. ఈ కథనంలో రూ. 20వేల లోపు ఉన్న బెస్ట్ ఫోన్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాబితాలో వన్ ప్లస్, పోకో, ఐకూ, మోటోరోలా, ఇన్ఫినిక్స్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. వీటిల్లో హై ఎండ్ ఫీచర్లు ఉన్నాయి.
- Srinu
- Updated on: Mar 26, 2025
- 5:00 pm
Best LED TVs: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? అతి తక్కువ ధరలో బెస్ట్ టీవీలు ఇవే..!
ఇటీవల కాలంలో స్మార్ట్ టీవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఓటీటీలకు జనాలు అలవాటు పడటం.. ఏది కావాలన్నా అన్నీ స్మార్ట్ టీవీలో అందుబాటులో ఉండటంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా స్మార్ట్ టీవీ అంటే చాలా ఎక్కువ ధరమే అని అందరూ అనుకుంటారు. అయితే అనువైన బడ్జెట్లో కూడా బెస్ట్ స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకవేళ మంచి స్మార్ట్ టీవీ, తక్కువ బడ్జెట్లో కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే ఈ కథనం మీకు ఉపయోగపడుతుంది. దీనిలో రూ. 20,000లోపు ధరలో అందుబాటులో ఉన్న స్మార్ట్ టీవీలను మీకు పరిచయం చేస్తాం. వీటిల్లో పాపులర్ బ్రాండ్లు అయిన శామ్సంగ్, షావోమీ, ఎల్జీ, టీసీఎల్ వంటివి ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- Srinu
- Updated on: Mar 26, 2025
- 4:30 pm
SIP Investment: రూ.1.80 లక్షల పెట్టుబడితో రెండు కోట్ల రాబడి.. ఆ స్కీమ్లో పెట్టుబడితో సాధ్యమే..!
భారతదేశంలో ఏళ్లుగా పెట్టుబడి పెట్టే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తును అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా పిల్లల భవిష్యత్ సురక్షితంగా ఉండాలనే కోరికతో చాలా మంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇల్లు అమ్మినప్పుడో? రిటైర్ అయిన తర్వాత మనవళ్ల భవిష్యత్ కోసం ఎక్కువగా సొమ్ము వచ్చినప్పుడు చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ పథకాలు కాకుండా రూ.1.80 లక్షల పెట్టుబడి పెడితే రిటైర్ అయ్యాక కోట్లల్లో రాబడి వచ్చే స్కీమ్ గురించి తెలుసుకుందాం.
- Srinu
- Updated on: Mar 26, 2025
- 4:04 pm
Ola EV Scooters: లేట్ అయినా లేటెస్ట్గా.. ఆ ఓలా స్కూటర్ల డెలివరీలు షురూ..!
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈవీ స్కూటర్ల డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలోని ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ స్కూటర్లను ఆశ్రయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని వారు ఈవీ స్కూటర్లన ఎక్కువగా ఇష్టపడడంతో వీటి డిమాండ్ అమాంతం పెరిగింది. భారతదేశంలో ఈవీ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ ప్లేస్లో ఉన్న ఓలా కంపెనీ భారత మార్కెట్లో ఎస్1 జెన్-3 ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ప్రారంభించినట్లు ప్రకటించింది. స్కూటర్ల లాంచ్ ఈవెంట్లో ఫిబ్రవరిలో డెలివరీలు ప్రారంభమవుతాయని బ్రాండ్ తెలిపింది. కానీ ఆలస్యం అయింది. జనవరి 31న మొత్తం ఎనిమిది స్కూటర్లను లాంచ్ చేశారు. ఎస్1 ప్రో ప్లస్, ఎస్1 ప్రో, ఎస్1 ఎక్స్, ఎస్1ఎక్స్+ స్కూటర్లు వివిధ బ్యాటరీ ప్యాక్ పరిమాణాలతో అందుబాటులో ఉంటాయి.
- Srinu
- Updated on: Mar 26, 2025
- 2:31 pm