నేను గత రెండు సంవత్సరాల కాలంగా టీవీ9 తెలుగు డిజిటల్లో పనిచేస్తున్నాను. టెక్నాలజీ, పర్సనల్ ఫినాన్స్కి సంబంధించిన ఆర్టికల్స్ రాయడంలో అనుభవం ఉంది. అలాగే కొత్త గాడ్జెట్స్, లైఫ్ స్టైల్కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా రాస్తుంటాను.
Indian Railways: టిక్కెట్ లేకపోతే తిక్క తీరేలా రైల్వే చర్యలు.. జరిమానాతో పాటు జైలు శిక్ష
భారతదేశంలో దూర ప్రాంతాలకు ప్రయాణం అంటే అందరికీ టక్కున గుర్తుచ్చేది రైలు. రైల్వే ప్రయాణం అనేది భారతదేశంలో చౌకైన ప్రయాణ సాధనంగా మారింది. రోజూ లక్షల సంఖ్యలో ప్రయాణికులు రైల్వే ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఈ స్థాయిలో ప్రయాణికుల్లో మనం ఏ పాటి అనే చందాన చాలా మంది టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తూ ఉంటారు. ఏటా వీరి వల్ల రైల్వేకు కోట్లల్లో నష్టం వస్తుంది. అంతేకాకుండా రైళ్లల్లో జరిగే దొంగతనాలకు చాలా వరకు టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారే కారణం అవుతున్నారు.
- Srinu
- Updated on: Jul 26, 2024
- 3:30 pm
Fatty Liver: మీ శరీరంలో ఆ మార్పులు కనిపిస్తున్నాయా? తస్మాత్ జాగ్రత్త.. ప్రమాదానికి చాలా దగ్గర్లో ఉన్నట్లే..!
ఫ్యాటీ లివర్ సమస్య అనేది సర్వసాధారణంగా మారింది. ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది కాలేయంలో కొవ్వు పేరుకుపోయి తీవ్రమైన సమస్యలకు దారితీసే పరిస్థితి. కొవ్వు కాలేయ వ్యాధి సాధారణంగా లక్షణరహితంగా ఉన్నప్పటికీ కొన్ని శరీర భాగాలు పరిస్థితి ఫలితంగా ఉబ్బుతాయి.
- Srinu
- Updated on: Jul 25, 2024
- 7:09 pm
Time Deposit Scheme: ఆ పోస్టాఫీస్ పథకంతో ఎఫ్డీ కంటే అధిక రాబడి.. పూర్తి వివరాలివే..!
భారతదేశంలో ఇండియన్ పోస్టాపోస్ట్స్ తరతరాలుగా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై అధిక రాబడినిస్తూ ప్రజాదరణ పొందింది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పెట్టుబడిదారులు ఇటీవల కాలంలో ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి పథకాల్లో పెట్టుబడిని ఇష్టపడుతున్నారు. సాధారణంగా పోస్టాఫీసులతో పోలిస్తే బ్యాంకు ఎఫ్డీలు అధిక రాబడినిస్తాయని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే బ్యాంకుల్లో ఎఫ్డీల విషయంలో పెట్టుబడికి భద్రత పోస్టాఫీసులో ఉన్నంత ఉండవు. పోస్టాఫీసుల్లో మన పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం హామీగా ఉంటుంది. అయితే పోస్టాఫీసు పథకాల్లో ఎఫ్డీ కంటే అధిక రాబడినిచ్చేలా టైమ్ డిపాజిట్ స్కీమ్ ముందు వరుసలో ఉంటుంది.
- Srinu
- Updated on: Jul 25, 2024
- 5:15 pm
Sovereign Gold Bonds: గోల్డ్ బాండ్స్ కొనుగోలుతో బోలెడన్నీ లాభాలు.. ధర తగ్గినా చింతించాల్సిన అవసరం లేదంతే..!
భారతదేశంలో బంగారం వినియోగం తారాస్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలతో పోటీపడేలా భారత్లో బంగారం వినియోగం ఉంటుంది. ఇతర దేశాల్లో ఆభరణాల కింద తక్కువ మొత్తంలో కొనుగోలు చేసి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి మార్గంగానే వినియోగిస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో తరతరాలు ఆభరణాల బంగారం వినియోగం మాత్రమే అధికంగా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా పెట్టుబడి మార్గంగా ఉపయోగపడేలా సావరిన్ గోల్డ్ బాండ్స్ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.
- Srinu
- Updated on: Jul 25, 2024
- 4:45 pm
Telegram Malware: టెలిగ్రామ్లో వీడియోలు డౌన్లోడ్ చేసే వారికి అలెర్ట్.. మీ ఫోన్ డేంజర్ జోన్లో ఉన్నట్టే..!
భారతదేశంలో వాట్సాప్కు పోటీగా తీసుకొచ్చిన్న టెలిగ్రామ్ యాప్ ఇటీవల కాలంలో ఎక్కువ ప్రజాదరణ పొందుతుంది. ముఖ్యంగా మనం పంపే ఫైల్ సైజ్ ఎంత ఉన్నా టెలిగ్రామ్లో ఈజీగా పంపుకునే సౌలభ్యం ఉండడంతో ఎక్కువ మంది టెలిగ్రామ్ను వాడుతున్నారు. అలాగే క్వాలిటీ మిస్ అవ్వకుండా వీడియోలు సెండ్ చేయాలంటే టెలీగ్రామ్ను యువత అధికంగా వాడుతున్నారు. అయితే టెలీగ్రామ్ ద్వారా వీడియోలు డౌన్లోడ్ చేసే వారికి ఈఎస్ఈటీ పరిశోధకులు షాక్ ఇచ్చారు.
- Srinu
- Updated on: Jul 25, 2024
- 4:30 pm
Bajaj Freedom 125: అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బజాజ్ సీఎన్జీ బైక్.. వాడే సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్
బజాజ్ కంపెనీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఫ్రీడమ్ 125 పేరుతో సీఎన్జీ బైక్ను భారత మార్కెట్లో ఇటీవల విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ మోటార్ సైకిల్ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బజాజ్ ఫ్రీడమ్ 125 పెట్రోల్, సీఎన్జీ రెండింటితో నడుస్తుంది. ముఖ్యంగా పెట్రోల్, సీఎన్జీ ట్యాంకుల ఫుల్ చేయిస్తే 330 కిలోమీటర్ల మైలేజ్ను ఇవ్వడం ఈ బైక్ ప్రత్యేకత.
- Srinu
- Updated on: Jul 25, 2024
- 4:15 pm
Income Tax Refunds: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినా రీ ఫండ్ రాలేదా..? అసలు కారణం ఏంటంటే..?
ప్రస్తుతం భారతదేశంలో ఆదాయపు పన్ను దాఖలు హడావుడి నెలకొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను దాఖలుకు జూలై 31తో గడువు ముగుస్తుంది. అయితే పన్ను చెల్లింపుదారుడు వారు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ పన్నులు చెల్లించినప్పుడు ఆదాయపు పన్ను శాఖ తిరిగి ఇచ్చే డబ్బును ఐటీ రీఫండ్గా పేర్కొంటారు. ఇది అడ్వాన్స్ ట్యాక్స్, మూలాధారం వద్ద మినహాయించిన పన్ను (టీడీఎస్), మూలం వద్ద వసూలు చేసిన పన్ను (టీసీఎస్) లేదా స్వీయ-అంచనా పన్ను వంటి వివిధ మార్గాల ద్వారా మనం చెల్లించిన పన్నుకు లోబడి ఉంటుంది.
- Srinu
- Updated on: Jul 25, 2024
- 4:00 pm
Budget 2024: బడ్జెట్లో వారికే అగ్రతాంబూలం.. పన్ను ఆదా చేసేలా కీలక చర్యలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్ 2024ను పార్లమెంట్లో సమర్పించారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ గురించి భారతదేశంలో అధికంగా ఉండే మధ్య తరగతి ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా కేంద్రం పన్ను విధానాల్లో తీసుకునే చర్యలు ఈ వర్గాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రకటనలో రూ. 3 నుంచి రూ. 7 లక్షల ఆదాయంపై 5 శాతం పన్నుతో సహా కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించడానికి మంత్రి కొన్ని ఉపశమన చర్యలను ప్రవేశపెట్టారు. గతంలో రూ.3 నుంచి 6 లక్షల శ్లాబుపై 5 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈ మార్పులతో కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులు రూ. 17,500 ప్రయోజనాన్ని పొందుతారు.
- Srinu
- Updated on: Jul 25, 2024
- 3:40 pm
3.5 Lakhs Net Worth: రూ.3.5 లక్షలు ఉంటే ప్రపంచంలోని 50 శాతం మంది మీ కిందే.. సంచలన నివేదికలో నివ్వెరపోయే వాస్తవాలు
ధనం మూలం ఇదం జగత్ అనే విషయం అందరికీ తెలిసిందే. మన దగ్గర ఉండే డబ్బుకు అనుగుణంగానే సమాజంలో మన విలువ ఆధారపడి ఉంటుంది. అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ప్రజలు సొమ్మును పొదుపు చేస్తూ ఉంటారు. అయితే ప్రపంచ జనాభాలో టాప్ 10 శాతంలో ఉండాలంటే ఎంత డబ్బు అవసరమో? ఎప్పుడైనా ఆలోచించారా..? తాజాగా క్రెడిట్ సూయిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన 2018 గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోని 90 శాతం మంది ప్రజల కంటే ధనవంతులుగా ఉండటానికి 93,170 డాలర్లు అంటే రూ. 77,98,110 నికర విలువ సరిపోతుంది.
- Srinu
- Updated on: Jul 24, 2024
- 5:15 pm
Credit Card: క్రెడిట్ కార్డుపై అప్పు ఉన్న వ్యక్తి చనిపోతే అప్పు తిరిగి చెల్లించాలా..? నిబంధనలు ఏంటో తెలిస్తే షాకవుతారు
బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా వివిధ సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఉద్యోగాలు చేసే వారి సంఖ్య అధికంగా ఉండడంతో వారికి జీతం ఆధారంగా కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డు చెల్లింపులు అనేవి నిబంధనలకు అనుగుణంగా క్రెడిట్ కార్డుదారులు చెల్లిస్తూ ఉంటారు. కానీ అనుకోకుండా క్రెడిట్ కార్డు ఉన్న వ్యక్తి చనిపోతే ఆ క్రెడిట్ కార్డు బిల్లు ఎవరు చెల్లించాలనే అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా..? అయితే చాలా మంది క్రెడిట్ కార్డు ఉన్న వ్యక్తి చనిపోతే ఆ అప్పుడు అతని వారసులు చెల్లించాలని అనుకుంటూ ఉంటారు.
- Srinu
- Updated on: Jul 24, 2024
- 5:00 pm
Moto G-85: అదరగొడుతున్న మోటోరోలా నయా ఫోన్.. ధర ఎంతంటే..?
భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో ఫోన్లు, మెసేజ్లకు మాత్రమే పరిమితమైన ఫోన్లు ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో తప్పనిసరిగా ఉంటున్నాయి. అమెరికా, చైనా తర్వాత స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు భారతదేశంలో సరికొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా ఇటీవల మోటో జీ-85నులాంచ్ చేసింది.
- Srinu
- Updated on: Jul 24, 2024
- 6:38 pm
Budget 2024: నిరుద్యోగంపై కేంద్రం సమరం.. కొత్త ఉద్యోగులను ప్రోత్సహించేలా కొత్త పథకాలు
భారతదేశంలోని నిరుద్యోగంపై కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యంగా కొత్త ఉద్యోగాలను ప్రోత్సహించేలా బడ్జెట్ 2024-25లో కీలక చర్యలను ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తన ఏడో బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర బడ్జెట్ 2024-25లో మూడు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాలను ప్రకటించారు. ఈ మూడు పథకాలు ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో నమోదు చేసుకోవడంతో పాటు మొదటి సారి ఉద్యోగుల గుర్తింపుపై దృష్టి సారించి ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారు.
- Srinu
- Updated on: Jul 24, 2024
- 4:35 pm