
బడ్జెట్ 2025-26 హైలెట్స్
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రెండోసారి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ యూనియన్ బడ్జెట్ 2025ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలున్న నేపథ్యంలో సామాన్య ప్రజలను తన బడ్జెట్తో నిర్మలా సీతారామన్ ఎలా మెప్పిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కేంద్ర బడ్జెట్ మీద వేతనజీవులు, పన్ను చెల్లింపుదారులు భారీ అంచనాలతో ఉన్నారు. భారతదేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. సమీప భవిష్యత్తులో భారత్ మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంది. అందుకే ఈ ఏడాది దేశాభివృద్ధికి ఊతం ఇవ్వడంతో పాటు అన్ని వర్గాలకు ఊరట కలిగించేలా బడ్జెట్ ఉంటుందన్న అంచనాలున్నాయి.
ఈ ఏడాది బడ్జెట్లో కార్మిక వర్గంతోపాటు వ్యవసాయం, మహిళలు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఎక్కువ కేటాయింపులు చేసే అవకాశముంది. అలాగే మిడిల్ క్లాస్, సామాన్య ప్రజానీకం, కార్పొరేట్, రైతు, సేవా రంగం, వ్యవసాయం, రైల్వే సేవలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి. ఈ అన్ని రంగాలకు బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు? బడ్జెట్లో ఎవరికి ఎలాంటి లాభం చేకూరుతుంది? కొత్తగా ఎలాంటి ప్రకటనలు చేశారు? వేటి ధరలు తగ్గుతాయి? ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి? తదితర అంశాలపై పూర్తి వివరాలు అందిస్తున్నాము.
-
కేంద్ర బడ్జెట్పై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ గడువు పెంచాలన్న రాష్ట్ర ప్రతిపాదనను అంగీకరించినందుకు థ్యాంక్స్ చెప్పారు. AP ప్రజల తరఫున నిర్మలకు ధన్యవాదాలు తెలిపారు కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు. 2028 వరకు జల్ జీవన్ పొడిగింపుతో ఏపీకి మేలు జరుగుతుందన్నారు. ఎంత వీలైతే అంత మొత్తంలో ఏపీకి నిధులు తెస్తామని చెప్పారు రామ్మోహన్ నాయుడు.
-
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిరుద్యోగం గురించి ప్రస్తావించలేదు ఒకే దేశం ఒకే ఎన్నికను కోరుకునే పార్టీ ప్రతి ఏడాది ఎన్నికలు ఉన్న రాష్ట్రాలపై వరాల జల్లు కురిపిస్తోంది ఎక్కువ సార్లు ఎన్నికలు జరిగితేనే ఆ పార్టీకి మిత్ర పక్షాల నుంచి ప్రశంసలు వస్తాయని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
-
-- కేంద్ర బడ్జెట్పై అమిత్ షా స్పందన -- ప్రధాని మోదీ హృదయంలో.. -- మధ్యతరగతి ప్రజలకు ఎప్పుడూ చోటు ఉంటుంది- అమిత్ షా -- మధ్యతరగతికి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేలా.. -- ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి- అమిత్ షా
-
సవరించిన పోలవరం నిర్మాణ వ్యయం రూ. 30,436.95 కోట్లకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం.
-
-- ఏ శ్రేణి వారికైనా రూ.4 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు
-
-- రూ.16 లక్షల నుంచి 20 లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్ను
-
-- రూ.24 లక్షల ఆదాయం దాటిన వారికి 30% శాతం పన్ను
-
-- రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25% పన్ను
-
-- రూ.12 లక్షలకు మించిన ఆదాయం ఉన్న వారికి శ్లాబులవారీగా పన్ను
-
-- రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపు
Telangana Budget 2025: ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత: భట్టి విక్రమార్క
Telangana Budget 2025: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.3 లక్షల కోట్లు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి..
- Subhash Goud
- Updated on: Mar 19, 2025
- 1:19 pm
Telangana Budget 2025: అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రైతు భరోసాకు ఎన్ని వేల కోట్లు కేటాయించారో తెలుసా?
Telangana Budget 2025: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. అన్ని సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకు సాగింది. రాష్ట్రంలో రైతులకే కాకుండా ఇతర రంగాల వారికి కూడా అధిక బడ్జెట్ను కేటాయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తన ప్రసంగంలో వెల్లడించారు. మరి ఈ బడ్జెట్లో ఏ రంగానికి ఎంత బడ్జెట్ కేటాయించారో చూద్దాం..
- Subhash Goud
- Updated on: Mar 19, 2025
- 1:12 pm
Telangana Budget 2025: అభివృద్ధి, సంక్షేమంపైనే ఫోకస్.. రూ.3.30లక్షల కోట్లతో తెలంగాణ భారీ బడ్జెట్!
తెలంగాణ ప్రభుత్వం బుధవారం భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 3.30 లక్షల కోట్లతో బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఓవైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. మరీ బడ్జెట్తో రాష్ట్ర ప్రజలను రేవంత్ సర్కార్ మెప్పిస్తుందా..?
- Shaik Madar Saheb
- Updated on: Mar 19, 2025
- 9:49 am
Parliament Budget Session: ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఈ అంశాలపైనే కీలక చర్చ..
కీలక బిల్లులను ఆమోదించుకునే దిశగా కేంద్రం రెడీ అవుతుంటే.. పలు అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ్లి నుంచి ప్రారంభం కానున్న రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కేంద్రం .. విపక్షాల మధ్య కీలక అంశాలపై చర్చ జరగనుంది.
- Shaik Madar Saheb
- Updated on: Mar 10, 2025
- 8:12 am
AP Budget 2025: ఇదే అభివృద్ధి బడ్జెట్ అంటోన్న కూటమి ప్రభుత్వం.. వైసీపీ రియాక్షన్ ఏంటంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్కు బాటలు వేస్తూ 3.22లక్షల కోట్లతో అద్భుత బడ్జెట్ ప్రవేశపెట్టామంది కూటమి ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశామంది. అయితే బడ్జెట్పై వైసీపీ విమర్శలు గుప్పించింది. ఆత్మస్తుతి, పరనింద తప్ప బడ్జెట్ అంతగొప్పగా లేదంటూ సెటైర్లు వేసింది. దీంతో ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి..
- Shaik Madar Saheb
- Updated on: Feb 28, 2025
- 9:53 pm