బడ్జెట్ 2026-27 హైలెట్స్
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మూడోసారి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ యూనియన్ బడ్జెట్ 2026ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026న లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇది తొమ్మిదోసారి కావడం విశేషం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలున్న నేపథ్యంలో సామాన్య ప్రజలను తన బడ్జెట్తో నిర్మలా సీతారామన్ ఎలా మెప్పిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కేంద్ర బడ్జెట్ మీద వేతనజీవులు, పన్ను చెల్లింపుదారులు భారీ అంచనాలతో ఉన్నారు. భారతదేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. సమీప భవిష్యత్తులో భారత్ మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంది. అందుకే ఈ ఏడాది దేశాభివృద్ధికి ఊతం ఇవ్వడంతో పాటు అన్ని వర్గాలకు ఊరట కలిగించేలా బడ్జెట్ ఉంటుందన్న అంచనాలున్నాయి.
ఈ ఏడాది బడ్జెట్లో కార్మిక వర్గంతోపాటు వ్యవసాయం, మహిళలు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఎక్కువ కేటాయింపులు చేసే అవకాశముంది. అలాగే మిడిల్ క్లాస్, సామాన్య ప్రజానీకం, కార్పొరేట్, రైతు, సేవా రంగం, వ్యవసాయం, రైల్వే సేవలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి. ఈ అన్ని రంగాలకు బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు? బడ్జెట్లో ఎవరికి ఎలాంటి లాభం చేకూరుతుంది? కొత్తగా ఎలాంటి ప్రకటనలు చేశారు? వేటి ధరలు తగ్గుతాయి? ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి? తదితర అంశాలపై పూర్తి వివరాలు అందిస్తున్నాము.
ముగిసిన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం
2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. దాదాపు 80 నిమిషాలకు పైగా ఆమె ప్రసంగం సాగింది.
17 క్యాన్సర్ ఔషధలపై పన్ను తగ్గింపు
కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ రోగులు ఉపయోగించే 17 ఔషధాలపై పన్ను తగ్గించింది. సెంట్రల్ ఎక్సైజ్ నుంచి బయో గ్యాస్ ద్వారా ఉత్పత్తయ్యే సీఎన్జీకి మినహాయింపు ఇచ్చింది. అలాగే మైక్రో అవెన్స్పై పన్ను తగ్గింపు, పౌర విమానాల విడిభాగాలపై పన్ను తగ్గిస్తూ ప్రకటించారు కేంద్ర మంత్రి.
బడ్జెట్ ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయి. 1600 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ కొనసాగుతుండగా, 700 పాయింట్లతో నిఫ్టి కొనసాగుతోంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్పై ఎస్టీటీని పెంచడంతో నష్టాల్లోకి జారుకున్నాయి.
7 రైలు కారిడార్లు ప్రకటన
- ముంబై నుండి పూణే
- పూణే నుండి హైదరాబాద్
- హైదరాబాద్ నుండి బెంగళూరు
- బెంగళూరు నుండి చెన్నై
- హైదరాబాద్ నుండి చెన్నై
- ఢిల్లీ నుండి వారణాసి
- వారణాసి నుండి సిలిగురి
ప్రతి జిల్లాల్లో బాలిక హస్టల్
ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. మూడు కొత్త ఎయిమ్స్లను కూడా ప్రకటించారు. బడ్జెట్లో ప్రభుత్వం యువతపై ప్రత్యేక దృష్టి సారిస్తుట్లు మంత్రి తెలిపారు.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలమ్మ తెలిపారు. సరళతరం చేసిన ఫారాలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. సామాన్యులు సైతం ఫైల్ చేసేలా మార్పులు ఉంటాయన్నారు.
సామాన్యులకు అనుకూలంగా ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు
సామాన్యులు సైతం ఆదాయపు పన్నును ఫైల్ చేసేలా పన్ను చట్టంలో మార్పులు తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఫైల్ చేసే ఫారాలను త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు.
ఇక పన్ను ఎగవేతదారులకు జైలు శిక్ష లేదు
ఆదాయపు పన్ను రిటర్న్లను వెల్లడించినందుకు ఇకపై ఎటువంటి జైలు శిక్ష ఉండదని, 30 శాతం పెనాల్టీ ఉంటుందని కేంద్ర మంత్రి నిర్మలమ్మ తెలిపారు. అంటే తమ ఆదాయాన్ని దాచిపెట్టే వారికి ఇకపై 30 శాతం వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
మెడికల్ హబ్స్ ఏర్పాటు
- మెడికల్ టూరిజం కోసం 5 రీజినల్ మెడికల్ హబ్స్ ఏర్పాటు
- ప్రతి జిల్లాలో ఒక గర్ల్స్ హాస్టల్ నిర్మాణం
- ఫిజిక్స్, ఆస్ట్రానమీ కోసం – భారీ టెలీస్కోపుల ఏర్పాటు
- వాల్ నట్స్, ఆల్మండ్స్ (బాదాం) పంటల సాగు కోసం ప్రోత్సాహకం
- భారత్ విస్తార్ – AI టూల్ (అగ్రిస్టాక్ పోర్టల్) ఏర్పాటు
- పంట ఉత్పత్తుల కోసం ప్రత్యేక AI టూల్ తో అగ్రిస్టాక్ పోర్టల్ ఏర్పాటు
ఆత్మనిర్భర్ భారత్కు రూ.2 వేల కోట్లు
- ఆత్మనిర్భర్ భారత్కు రూ.2 వేల కోట్లు
- SME రంగానికి రూ.10 వేల కోట్లు
- మైక్రో సెక్టార్కు రూ.2 వేల కోట్లు
- ఆత్మనిర్భర్ భారత్కు రూ.2 వేల కోట్లు
దేశంలో కొత్త మెగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు
- దేశంలో కొత్త మెగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు
- ఖాదీ, హ్యాండ్లూమ్, హస్తకళల ప్రోత్సాహానికి పథకం
- అత్యంత నాణ్యత కలిగిన క్రీడా వస్తువుల తయారీకి పథకం
- 200 పారిశ్రామిక క్లస్టర్స్ ఆధునీకరణకు చేయూత
జౌళి రంగానికి కేంద్ర బడ్జెట్లో చేయూత
- జౌళి రంగానికి కేంద్ర బడ్జెట్లో చేయూత
- మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం
- సెమీ కండక్టర్ మిషన్ 2.O ప్రారంభం
- త్వరలో నేషనల్ ఫైబర్ స్కీమ్ ప్రారంభం
- టెక్స్టైల్ రంగం అభివృద్ధికి కొత్త పథకం
సెమీకండక్టర్ మిషన్ కోసం రూ.40 వేల కోట్లు
- ప్రస్తుతమున్న NIPERs ఆధునీకరణ
- దేశంలో 2 హైటెక్ టెక్నాలజీ రూమ్స్ ఏర్పాటు
- కంటైనర్ నిర్మాణ రంగానికి రూ.10 వేల కోట్లు
- దేశంలో కొత్తగా మూడు కెమికల్ రీసెర్చ్ పార్కులు
- సెమీకండక్టర్ మిషన్ కోసం రూ.40 వేల కోట్లు
బయో ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు
- బయో ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు
- ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళలో గనుల కారిడార్
- మూడు డెడికేటెడ్ కెమికల్ పార్క్ల నిర్మాణం
ఉపాధి, వృద్ధిని ప్రోత్సహించడానికి బడ్జెట్
ఉపాధి, వృద్ధిని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం ఎంతో చేసిందని ఆర్థిక మంత్రి అన్నారు. 2025 లో 350కి పైగా సంస్కరణలు ప్రారంభించినట్లు చెప్పారు.
సెమీకండక్టర్ మిషన్ కోసం రూ. 40 వేల కోట్లు
- సెమీకండక్టర్ మిషన్ కోసం రూ. 40 వేల కోట్లు
- ప్రపంచస్థాయి జౌళి ఉత్పత్తుల తయారీపై ఫోకస్
- మెగా టెక్స్టైల్స్ పార్కుల ఏర్పాటు
- మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్ ఇనీషియేటివ్ – (ఖాదీ, చేనేత ఉత్పత్తుల ప్రోత్సాహం కోసం)
బడ్జెట్ ముఖ్యాంశాలు
- రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయో ఫార్మా శక్తి పథకం
- ఛాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ
- రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయో ఫార్మా శక్తి స్కీమ్
- ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో 3 మూడు కొత్త విద్యా సంస్థల స్థాపన
- మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు
- గతేడాది రూ.11.2 లక్షల కోట్లు కేటాయింపు
- రియల్ ఎస్టేట్ ఆస్తుల రీసైకిలింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు
వార్షిక బడ్జెట్కు పలు ప్రత్యేకతలు
-- ఇవాళ్టి వార్షిక బడ్జెట్కు పలు ప్రత్యేకతలు
-- కేంద్ర బడ్జెట్ ఆదివారం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి
-- నిర్మలా సీతారామన్కు ఇది తొమ్మిదో బడ్జెట్
-- 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్
-- తొమ్మిదిసార్లు బడ్జెట్ సమర్పించిన చిదంబరం
-- 75 ఏళ్ల సంప్రదాయానికి భిన్నంగా ఈసారి నిర్మల స్పీచ్
-- బడ్జెట్ ప్రసంగంలోని పార్ట్-Bపై నిర్మల ఫోకస్
-- దేశ ఆర్థిక భవిష్యత్తు కోసం సంపూర్ణమైన విజన్ను..
-- పార్ట్-బిలో వివరించనున్న నిర్మలా సీతారామన్
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్
-- కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్
-- ఈరోజు ట్రేడింగ్పై కొన్ని నిబంధనలు వర్తింపు
-- నిన్న కొనుగోలు చేసిన షేర్ల అమ్మకాలపై నిషేధం
వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్
-- ఆత్మ నిర్భర్, వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్
-- 2026-27 బడ్జెట్ రూ.58 లక్షల కోట్లు ఉండే అవకాశం
-- గత ఏడాది కంటే 8-12శాతం నిధులు పెరిగే అవకాశం
-- రక్షణ, మౌలిక వసతులు, రైల్వే, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యత
-- రాష్ట్రాల కంటే రంగాలవారీగా ఉండనున్న నిధుల కేటాయింపు
2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్
-- ఇవాళే 2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్
-- పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి నిర్మల
-- 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నిర్మలాసీతారామన్
-- ఉదయం 8:30కి కర్తవ్యభవన్కు నిర్మలాసీతారామన్
-- ఉదయం 9:30కి రాష్ట్రపతి ముర్మును కలవనున్న నిర్మల
-- ఉదయం 10 గంటలకు పార్లమెంట్కు నిర్మలా సీతారామన్
-- ఉదయం 10:15కి మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
-- బడ్జెట్కు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్
-- ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్
-- సుమారు 2గంటలపాటు బడ్జెట్ ప్రసంగం ఉండే అవకాశం
-- మధ్యాహ్నం 2:30కి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం
Tax Calculator
Cheaper & Expensive
- స్మార్ట్ ఫోన్లు
- చెప్పులు
- విదేశీ విద్య
- సోలార్, లెదర్ ఉత్పత్తుల ధరలు
- విమాన పరికరాలు
- విదేశాల పర్యటనలు
- బీడీలు, బ్యాటరీ
- మైక్రోవేవ్-ఓవెన్
- క్యాన్సర్ ఔషధం
- సీఎన్జీ, బయోగ్యాస్
- లగ్జరీ వాచ్లు
- విదేశీ మద్యం
- స్క్రాప్
- ఖనిజం
- ఫ్యూచర్స్ ట్రేడింగ్
Pralhad Joshi: హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 హైదరాబాద్కే.. తెలంగాణకు ఎంతో చేశాం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
ప్రపంచంలోనే భారత్ మూడోవ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని.. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల అభ్యున్నతికి.. దోహదపడుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్.. 2047వరకు వికసిత్ భారత్ నిర్మాణ లక్ష్యంగా ఉందని.. ఇది ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేస్తుందని ప్రహ్లాద్ జోషి వివరించారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 6, 2026
- 5:39 pm
భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోంది: ప్రధాని మోదీ
ప్రపంచం కొత్త ఆధునిక యుగం వైపు పయనిస్తోందని ప్రధానమంత్ర నరేంద్ర మోదీ అన్నారు. కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న మార్గంలో మనం చాలా ముఖ్యమైన దశకు చేరుకున్నాము. ప్రపంచం మన ప్రతిభ, ప్రాముఖ్యతను గుర్తిస్తోంది. భారతదేశం తొమ్మిది ప్రధాన దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసింది. భారత్ అనేక దేశాలకు విశ్వసనీయ భాగస్వామి. మనం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉన్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
- Balaraju Goud
- Updated on: Feb 5, 2026
- 6:30 pm
22 ఏళ్ళలో ఇదే తొలిసారి.. ప్రధానమంత్రి సమాధానం లేకుండానే ధన్యవాద తీర్మానాన్ని ఆమోదం!
గురువారం (ఫిబ్రవరి 05) పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఏడవ రోజు. బడ్జెట్ సమావేశాల్లో ఏడవ రోజున, రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని లోక్సభలో గగ్గోలు మధ్య వాయిస్ ఓటు ద్వారా ఆమోదించారు. దాదాపు 22 సంవత్సరాలలో ప్రధానమంత్రి ప్రసంగం లేకుండా ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించడం ఇదే మొదటిసారి.
- Balaraju Goud
- Updated on: Feb 5, 2026
- 3:10 pm
Budget 2026: బడ్జెట్లో సీనియర్ సీటిజన్స్కు ఏవైనా ప్రయోజనాలు ఉన్నాయా?
Budget 2026: బడ్జెట్ 2026 సీనియర్ సిటిజన్లకు కొత్త పన్ను మినహాయింపులు, అదనపు ఆరోగ్య తగ్గింపులు లేదా ద్రవ్యోల్బణ సంబంధిత ఉపశమనం అందించలేదు. వైద్య ఖర్చుల కోసం సెక్షన్ 80DDB మారలేదు. లేదా పెన్షనర్లకు లేదా స్థిర ఆదాయం ఉన్నవారికి ఎటువంటి కొత్త..
- Subhash Goud
- Updated on: Feb 3, 2026
- 6:03 pm
Nirmala Sitharaman: ఇక జిల్లాకో బాలికల హాస్టల్..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. ప్రజా వైద్యం, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, బాలికల ఉన్నత విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లు, మూడు కొత్త ఎయిమ్స్ల నిర్మాణం, పశువైద్య కళాశాలలకు ఆర్థిక సహాయం, లక్ష మంది అనుబంధ ఆరోగ్య నిపుణుల సృష్టి వంటి కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఈ బడ్జెట్ విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారతకు ఊతమిస్తుంది.
- Phani CH
- Updated on: Feb 2, 2026
- 6:29 pm