నిర్మలమ్మ బడ్జెట్ చీరలు వెరీ స్పెషల్.. ప్రత్యేకత ఏంటంటే

TV9 Telugu

23 July 2024

బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ధరించిన చీర ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది.

23 జులై 2024న బడ్జెట్ రోజున వయొలెట్ బోర్డర్ తో కూడిన తెలుపు చీరను ధరించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.

ఈ ఏడాది ఫిబ్రవరిలో అంటే ఎన్నికలకు ముందు జరిగిన ఇన్ టెర్మ్ బడ్జెట్ సమయంలో ఆమె నీలి రంగు చీరలో కనిపించారు.

గత ఏడాది బడ్జెట్ లో టెంపుల్ బోర్డర్‌తో ఉన్న ఎరుపు రంగు చీరలో మెరిశారు. ఇది కర్ణటకకు చెందిన సంప్రదాయ కసూటి వర్క్ చీర.

2022 బడ్జెట్ ప్రెవేశపెట్టినప్పుడు డిశాకు చెందిన చేనేతవస్త్రకారులు నేసిన బ్రౌన్ రంగు చీర ఆమె ధరించారు.

తెలంగాణా రాష్ట్రంలోని భూదాన్ పోచంపల్లి కి చెందిన ఎరుపు, తెలుపు కలిసిన చీర 2021 బడ్జెట్‌కు ఆమె ధరించారు.

2020లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సన్నని నీలిరంగు అంచును కలిగిన పసుపు రంగు చీరను ఆమె ఎంచుకున్నారు.

2019లో ఆమె తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేపెట్టినప్పుడు గులాబీ రంగు బంగారు అంచు ఉన్న చీరను ఎంపికచేసుకున్నారు.