సంపత్ కుమార్ గాండ్ల , టీవీ9 తెలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫర్ గా 17ఏళ్లుగా పనిచేస్తున్నాను. మొదట ఆంధ్రజ్యోతి లో పని చేశాను.గత 17 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నాను .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. బాల్య వివాహాలు పై చేసిన స్టోరీ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది.. అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి.. సత్కరించింది..
96 ఏళ్లకు పుస్తకం పట్టింది.. వందకు 98 మార్కులు సాధించింది! ఎవరీ బామ్మ..?
వయస్సు 96.. ఆ వయస్సులో ఎగ్జామ్ రాస్తే వందకు 98 మార్కులు వచ్చాయి. సాక్షారతా విద్యలో ఈ బామ్మ ఓ రికార్డ్ క్రియేటర్గా మారింది. ఇది కేరళకు చెందిన కార్త్యాయని అమ్మ కథ. 2018లో కేరళలో పరీక్షా ఫలితాలు ప్రకటించినప్పుడు ఫస్ట్ క్లాస్ లో పాసైన వాళ్లల్లో ఆనందం. సెకండ్ గ్రేడ్ లో పాసైనవారిలో ఇంకొంచెం మార్కులు తెచ్చుకుంటే బాగుండునేమోనన్న ఒకింత అసంతృప్తి. ఇక పాస్ అయినవారిలో హమ్మయ్య బతికి బట్ట కట్టామనే భావన.. ఫెయిల్ అయినవాళ్లల్లో నిరుత్సాహం ఇవన్నీ సర్వసాధారణంగానే కనిపించాయి. కానీ, అంతమందిలో ఒక బామ్మ స్టోరీ మాత్రం ప్రత్యేకంగా నిల్చింది. ఆమె మనం చెప్పుకుంటున్న కార్త్యాయని అమ్మ..
- G Sampath Kumar
- Updated on: May 16, 2026
- 4:58 pm
మార్కులు బాగా తెచ్చుకొండి.. విమానం ఎక్కిస్తా.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉపాధ్యాయుడు
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు మల్క రామకిషన్రావు తన మాట నిలబెట్టుకుని విద్యార్థికి విమాన ప్రయాణం కల్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పదో తరగతిలో 550కుపైగా మార్కులు సాధిస్తే విమానం ఎక్కిస్తానని హామి ఇచ్చారు.
- G Sampath Kumar
- Updated on: May 16, 2026
- 12:08 pm
జ్వరం వచ్చిందనుకున్న కుటుంబానికి రేబిస్ షాక్.. 11 ఏళ్ల బాలుడి ప్రాణం బలి!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గుండెల్ని పిండేసే విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక సామాన్య పేద కుటుంబంలో వెలుగులు నింపాల్సిన 11 ఏళ్ల చిరునవ్వు, పిచ్చికుక్క రూపంలో వచ్చిన మృత్యువు వాతపడింది. కేవలం జ్వరం అనుకుని సాధారణ చికిత్స చేయించిన ఆ కుటుంబానికి, తమ బిడ్డకు 'రేబిస్' సోకిందనే నిజం తెలిసి కోలుకోలేని షాక్కు గురయ్యారు.
- G Sampath Kumar
- Updated on: May 15, 2026
- 6:33 pm
40 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంటర్ పరీక్ష.. విద్యార్థిగా మారిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ!
Dev Ji, former Maoist leader: కాలం ఎంత పెద్ద మార్పునైనా తీసుకురాగలదనే విషయాన్ని మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ మరోసారి నిరూపించారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత మధ్యలో ఆగిపోయిన తన చదువును కొనసాగిస్తూ, జగిత్యాల జిల్లా కోరుట్లలోని మాస్టర్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు లాంగ్వేజ్ పరీక్ష రాశారు.
- G Sampath Kumar
- Updated on: May 13, 2026
- 4:47 pm
ఆమెకు పెళ్లైంది.. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాత ప్రియుడితో మళ్లీ స్నేహం.. ఆ తర్వాత
పెద్దపల్లి జిల్లాలో టెన్త్ క్లాస్ ప్రేమకథ చివరకు దారుణ హత్యకు దారి తీసింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో మళ్లీ దగ్గరైన మాజీ ప్రేమికుడిని.. మహిళ తన భర్త, స్నేహితుడితో కలిసి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. మిస్సింగ్ కేసు దర్యాప్తులో గాడుదుల గండి లోయలో మృతదేహం బయటపడగా.. సెల్ఫోన్ ఆధారాలతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
- G Sampath Kumar
- Updated on: May 12, 2026
- 11:54 am
మండపంలో మరో అమ్మాయితో ప్రియుడు.. ప్రియురాలు చేసిన పనికి దిమ్మతిరిగిపోయింది..
12 ఏళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకుంటానని.. చివరకు మరో యువతితో పెళ్లికి సిద్ధమైన ప్రియుడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు మహిళా సంఘాల నేతలతో కలిసి నేరుగా పెళ్లి మండపానికి చేరుకుని వివాహాన్ని అడ్డుకుంది. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. యువతి చూపించిన ఫోటోలు, ఆధారాలతో పెళ్లికూతురు కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- G Sampath Kumar
- Updated on: May 11, 2026
- 11:02 am
తెలంగాణలోనే ప్రత్యేక గ్రామం.. 70 ఆలయాలు.. అందులో 54 హనుమాన్ దేవాలయాలే!
ఏ గ్రామంలో నైనా.. రెండు, మూడు ఆలయాలు ఉంటాయి.. కానీ.. ఈ గ్రామంలో మాత్రం 70కు పైగా ఆలయాలు ఉన్నాయి. అందులో... 54 హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. గల్లీ.. గల్లీనా దేవాలయాలు దర్శనస్తున్నాయి. అయితే.. ప్రతి ఆలయంలో నిత్యం పూజలు జరుగుతున్నాయి ఈ గ్రామాన్ని ఆధ్యాత్మిక గ్రామంగా పిలుస్తారు.
- G Sampath Kumar
- Updated on: May 8, 2026
- 6:11 pm
పెళ్లి పీటలు ఎక్కాల్సిన ప్రేమ జంట.. మరణంలో ఒక్కటయ్యారు ! ఏం జరిగిందో తెలిస్తే..
ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ జంటను విధి వంచించింది. ఒకరు ఉపాధి కోసం వెళ్ళిన సుదూర తీరంలో ప్రాణాలు వదిలితే, ఆ వియోగాన్ని భరించలేక మరొకరు స్వగ్రామంలోనే తనువు చాలించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేస్తోంది. గల్ఫ్లో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త తట్టుకోలేక ఇక్కడ ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
- G Sampath Kumar
- Updated on: May 5, 2026
- 10:47 am
కరీంనగర్లో పట్టపగలే దుండగుల దాడి.. కాల్పులతో బంగారం దోచుకెళ్లిన గ్యాంగ్
కరీంనగర్ నగర నడిబొడ్డున ఆదివారం ఉదయం జరిగిన సాయుధ దోపిడీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ పీఎంజే జ్యువెలరీ షోరూమ్ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు, కస్టమర్ల ముసుగులో లోపలికి ప్రవేశించి కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.
- G Sampath Kumar
- Updated on: May 3, 2026
- 9:48 pm
ఆటగదరా శివ..! అద్దె ఇంట్లోకి శవాన్ని రానివ్వని యజమాని..పుట్టెడు శోకంతో ఇంటిల్లిపాది
ఆధునిక సమాజంలో ఇంకా వేళ్లూనుకుపోయిన మూఢనమ్మకాలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో కరీంనగర్ ఘటన నిరూపిస్తోంది. ఓ వైపు ఇంటి యజమాని కఠినత్వం, మరోవైపు సమాజంలోని మూఢాచారాల మధ్య ఒక నిరుపేద కుటుంబం స్మశానవాటికలో రోడ్డున పడింది. కరీంనగర్ చింతకుంట గాంధీనగర్ లో విషాదం నిండిన వేళ ఇంటి యజమాని అమానుషంగా వ్యవహరించారు. అసలేం జరిగిందంటే..
- G Sampath Kumar
- Updated on: May 1, 2026
- 7:57 pm
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ప్రకృతి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఓ ఇంటి వద్ద ఏడాదికి ఒక్కసారి మాత్రమే వికసించే అరుదైన మే పుష్పాలు ఈసారి కూడా తమ అందాలను విరబూసి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మే నెల రాగానే ప్రకృతి ప్రేమికులకు పండుగలా మారిన ఈ పూలు రంగురంగుల చీర కట్టుకున్నట్లుగా పరిసరాలను అలంకరిస్తున్నాయి.
- G Sampath Kumar
- Updated on: May 1, 2026
- 6:09 pm
Newborn girl: కన్నది కాదు కసాయిది.. బస్టాండ్ పబ్లిక్ టాయిలెట్లో నవజాత శిశువు.. ఆ దృశ్యం చూస్తే
తల్లి ప్రేమకు మచ్చ తెచ్చేలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పుట్టిన కొన్ని నిమిషాలకే ఆ పసిపాపను కన్నతల్లే చెత్తకుప్పలా బస్టాండ్ మరుగుదొడ్డిలో వదిలివెళ్లిపోయింది. మానవత్వం మంటగలిసిన ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. బస్టాండ్ టాయిలెట్లో పసిపాప ఏడుపు వినిపించడంతో గమనించిన ఓ మహిళ పోలీసులకు సమాచారం అందించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
- G Sampath Kumar
- Updated on: May 1, 2026
- 4:55 pm