సంపత్ కుమార్ గాండ్ల , టీవీ9 తెలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫర్ గా 17ఏళ్లుగా పనిచేస్తున్నాను. మొదట ఆంధ్రజ్యోతి లో పని చేశాను.గత 17 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నాను .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. బాల్య వివాహాలు పై చేసిన స్టోరీ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది.. అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి.. సత్కరించింది..
ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష.. పుట్టెడు దుఃఖంలోనే హాజరైన విద్యార్థి
అప్పుల బాధతో తల్లి మరణించగా, అదే రోజు ఇంటర్ పరీక్షలకు హాజరైన కూతురి విషాద గాథ ఇది. మల్యాల మండలంలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటన అందరి మనసులను కలిచివేసింది. తల్లి శవం ఇంట్లో ఉండగానే, తన భవిష్యత్తు కోసం మనోధైర్యంతో పరీక్ష రాసిన ఆ కూతురి ధైర్యం, బాధ వర్ణనాతీతం.
- G Sampath Kumar
- Updated on: Feb 25, 2026
- 4:04 pm
ప్రేమ పెళ్లి చేసుకున్నారని దారుణం.. అధికారులకు మొర పెట్టుకున్నా..
Caste Discrimination: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన పసుల సంగీత అనే ఎస్సీ మహిళ, బీర్పూర్ మండలం కోమనపల్లి గ్రామం ఎస్టీ కులానికి చెందిన బద్దీ పవన్ను డిసెంబర్ 2023లో ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో అబ్బాయి తరపున కులం వారు ఆగ్రహానికి గురై తమను కుల బహిష్కరణ చేయడంతో పాటు శుభ అశుభ కార్యాలకు వెళ్లకుండా చేశారంటూ తెలిపారు.
- G Sampath Kumar
- Updated on: Feb 24, 2026
- 2:32 pm
వేల కిలోమీటర్ల ప్రయాణం.. విదేశీ అతిథుల రాకతో సొబగులు విరజిమ్ముతోన్న మానేరు తీరం!
ప్రపంచంలోని పలు దేశాల నుంచి అరుదైన వలస పక్షులు మానేరు వాగు తీర ప్రాంతానికి రావడంతో మంచి సొబగులు విరజిమ్ముతోంది. అరుదైన పక్షులు మానేరు నీటి మీద తేలియాడుతూ కనిపించే దృశ్యాలు పక్షి ప్రేమికులకు పర్యాటకులకు స్వర్గధామంగా మారుతుంది. విదేశీ పక్షుల కిలకిల రాగాలతో మానేరు వాగు పరిసరాలు ప్రకృతి సంగీతంతో మార్మోగుతున్నాయి.
- G Sampath Kumar
- Updated on: Feb 23, 2026
- 11:12 am
అమెరికాలో మంథని కళాకారుడి అద్భుతం.. ఆకట్టుకున్న త్రీడీ మాయసభ చిత్రం..!
పెద్దపల్లి జిల్లా మంథని కి చెందిన సింగాపు శివరామకృష్ణ అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో అబ్బురపరిచారు. ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే లేక్ వర్క్ బీచ్ స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్లో ఆకట్టుకున్నారు. శివరామకృష్ణ గీచిన మహాభారతంలోని మాయసభ కథా చిత్రం కళ్లకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు.
- G Sampath Kumar
- Updated on: Feb 23, 2026
- 9:55 am
Telangana: కన్నబిడ్డలా సాకారు.. కన్నీటితో వీడ్కోలు చెప్పారు
మానవత్వ విలువలు మంటకలిసి పోతున్న ఆధునిక సమాజంలో పెంపుడు కుక్క పట్ల అసాధారణమైన ఆప్యాయతను చాటుకుంది ఓ కుటుంబo. ముడున్నరేండ్లుగా అపురూపంగా పెంచుకున్న కుక్క (రిమో) ఇటీవల వీధి కుక్కల దాడిలో మృతిచెందింది, ఈ విషాదాన్ని జీర్ణించుకోలేక ఆ కుటుంబం కన్నీటి పర్యాంతం అయింది. మానవ సాంప్రదాయం ప్రకారం దానికి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది
- G Sampath Kumar
- Updated on: Feb 22, 2026
- 3:23 pm
కలెక్టర్ గారే టీచర్.. ఆ పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెబుతూ..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సాధారణంగా పర్యవేక్షణ, సమీక్షలతో బిజీగా ఉండే జిల్లా కలెక్టర్..ఈసారి తరగతి గదిలో టీచర్గా మారారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలోని కేజీబీవీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించగా, అది కేవలం పరిపాలనా సందర్శనగా కాకుండా ఒక ప్రేరణాత్మక తరగతిగా మారింది.
- G Sampath Kumar
- Updated on: Feb 22, 2026
- 12:04 pm
Telangana: ఎంతపని చేశావ్ వెంకటేష్.. మాట్లాడుకుందామని ఊరవతలకు తీసుకెళ్లి..
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు తరచూ గొడవలు దిగుతున్నారు. ఈ క్రమంలో భార్యను హతం చేయాలని భర్త భావించాడు. దీంతో గ్రామ శివారుకి తీసుకెళ్లి ఇష్టమొచ్చిన విధంగా కొట్టాడు. ఆ తర్వాత.. ఆమె చనిపోయిందని అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. ఆమె కనబడకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- G Sampath Kumar
- Updated on: Feb 22, 2026
- 9:26 am
Telangana: ప్రతీరోజూ సమాధి దగ్గర తెచ్చాడుతూ కనిపించిన వృద్దుడు.. అసలు విషయం అడగ్గా
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన బాలసాని మల్లయ్య తన భార్య అనారోగ్యంతో చనిపోయింది. అయితే వీరికి సంతానం లేకపోవడంతో మల్లయ్య తన మరణానంతరం తన భార్య రాజవ్వ సమాధి పక్కనే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో బతికుండగానే.. ఆ వివరాలు ఇలా ..
- G Sampath Kumar
- Updated on: Feb 20, 2026
- 1:56 pm
ఊరుబాట పట్టిన విద్యార్థులు.. ఏకంగా వాటి కోసం ఉద్యమాన్నే ఎత్తుకున్నారు.. ఎందుకంటే..?
ఊర పిచ్చుకలు ఇప్పుడు కనిపించడం లేదుగానీ.. ఊళ్లల్లో చిన్నప్పుడు ఇళ్లల్లోనూ కీచ్ కీచుమంటూ సందడి చేసేవి. కానీ, ఇప్పుడా పిచ్చుకలు ఎక్కడో గానీ కనిపించడం లేదు. అసలు పిచ్చుకలు కట్టే గూళ్లు చూసినప్పుడు వాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికీ అబ్బురపడేవాళ్లం. అలాంటి గూళ్ల జాడే లేకుండా పోయింది. అదిగో ఇదే అస్సాంలో గోలాఘాట్ విద్యార్థులను బాధించింది. అందుకోసం మరి వాళ్లేం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
- G Sampath Kumar
- Updated on: Feb 19, 2026
- 8:41 pm
ప్రేమ పెళ్లి.. అయినా తప్పని వరకట్నం వేధింపులు.. సూటి పోటీ మాటలు తట్టుకోలేక..
కట్నం కోసం నన్ను వేదిస్తున్నారు.. నేను చనిపోతున్నా.. అన్నకు చివరి ఫోన్ కాల్ తర్వాత వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. నెన్నెల మండలానికి చెందిన ఓ వివాహిత వరకట్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది.
- G Sampath Kumar
- Updated on: Feb 19, 2026
- 6:32 pm
Telangana: బస్టాండ్లో మగాళ్ల మధ్య కూర్చోని తేడాగా ప్రవర్తించిన యువతి.. ఆరా తీయగా..
అది తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్. అక్కడికి బుర్ఖా ధరించి వచ్చిన ఓ యువతి మేల్ ప్యాసింజర్స్ మధ్య కూర్చుని కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంది. దీంతో ఆర్టీసీ సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆపై ఆమె అసలు గుట్టు వీడింది..
- G Sampath Kumar
- Updated on: Feb 18, 2026
- 7:58 pm
ఇల్లంతకుంటలో పెద్దపులి దాడి…నాలుగు ఆవులు మృతి… గ్రామంలో భయాందోళనలు…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ సమీపంలో పెద్దపులి దాడి తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి పొలాల్లో మేస్తున్న నాలుగు ఆవులను పులి చంపివేయడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. పశువులను కోల్పోయిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించి పులి సంచారాన్ని ధృవీకరించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, పులిని పట్టుకునేందుకు నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.
- G Sampath Kumar
- Updated on: Feb 17, 2026
- 1:49 pm