సంపత్ కుమార్ గాండ్ల , టీవీ9 తెలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫర్ గా 17ఏళ్లుగా పనిచేస్తున్నాను. మొదట ఆంధ్రజ్యోతి లో పని చేశాను.గత 17 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నాను .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. బాల్య వివాహాలు పై చేసిన స్టోరీ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది.. అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి.. సత్కరించింది..
World Sparrows Day: మీకు ఇది తెలుసా.. పిచ్చుకల కోసం ప్రత్యేక దినోత్సవం.. అది ఎప్పుడంటే..?
పిచ్చుకల కిలకిల రాగాలు కానరావడంలేదు.. పర్యావరణ పరిరక్షణ, వైవిద్య జీవనానికి దోహదపడే పిచ్చుకలు, పిట్టలు కనిపించడం లేదు. కారణం సెల్ ఫోన్ టవర్స్ ఎఫెక్ట్.. రేడియేషన్ ప్రభావంతో పక్షుల సంతతి అంతరించి పోతుంది. అయితే కనుమరుగవుతున్న పిచ్చుకల కోసం ఓ యువకుడు సంకల్ప దీక్షకు పూనుకున్నాడు. దీంతో కరీంనగర్ నగరంలో అనంతుల రమేష్ నిలయం పిట్టలకు అవాసంగా మారింది.
- G Sampath Kumar
- Updated on: Mar 17, 2026
- 2:44 pm
అయ్యో మణితేజ్.. చిన్న కాటే ప్రాణాలు తీసింది.. రూ.70 లక్షలు ఖర్చుపెట్టినా..
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుక్క కాటు కారణంగా మణితేజ్ అనే చిన్నారి ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో విషాదాన్ని నింపింది. సుమారు 15 నెలల పాటు ఆస్పత్రుల్లో చికిత్స అందించినప్పటికీ.. బాలుడి ప్రాణం దక్కకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..
- G Sampath Kumar
- Updated on: Mar 17, 2026
- 2:38 pm
విరిగిన చేయి.. సిమెంటు పట్టితో కాలు.. సంకల్పంతో పరీక్ష రాసిన పదవ తరగతి విద్యార్ధి..!
పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సంకల్పం గట్టిగా ఉంటే లక్ష్యం సాధ్యమే అని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పదవ తరగతి విద్యార్థి అమన్ రహమాన్ నిరూపించాడు. రోడ్డు ప్రమాదంలో కాలు, చేయి విరిగినా.. తన చదువు పట్ల ఉన్న పట్టుదలతో స్క్రైబ్ (లేఖరి) సహాయంతో పరీక్ష రాసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
- G Sampath Kumar
- Updated on: Mar 17, 2026
- 2:19 pm
Telangana: వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి చూడగా..
ప్రేమించి పెళ్లి చేసుకుంటే నూరేళ్లు తోడుంటాడనుకుంది.. కానీ ఆ ఎనిమిది నెలల బంధమే ఆమె పాలిట శాపమైంది. పుట్టబోయే బిడ్డతో కలిసి కొత్త లోకాన్ని చూడాలనుకున్న ఆ ఇల్లాలు.. భర్త చేతిలోనే బలయ్యింది. ఒకేసారి రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఈ హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. అసలేం జరిగిందంటే..?
- G Sampath Kumar
- Updated on: Mar 17, 2026
- 11:45 am
ఏకంగా పోలీస్ అధికారికే ఉచ్చు బిగించిన సైబర్ కేటుగాళ్లు.. ఆలస్యంగా వెలుగులోకి..
ఇప్పటిదాకా ఎన్నో సైబర్ నేరాలు చూశాం. సామాన్యులతో పాటు ప్రముఖు మోసం చేసిన ఎన్నో కేసుల గురించి విన్నాం. ఇందుకు సంబంధించి కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి కేటుగాళ్ల తాట తీస్తారు పోలీసులు. అలాంటిది.. సామాన్యులునే కాదు, చివరికి పోలీసు శాఖ అధికారులనూ వదలడం లేదు సైబర్ కేటుగాళ్లు. ఇటీవల ఓ ASIని టార్గెట్ చేసిన మాయాగాళ్లు ఉచ్చు బిగించారు.
- G Sampath Kumar
- Updated on: Mar 15, 2026
- 12:02 pm
Watch: జాతి వైరం మరిచిన మూగ జీవి.. కుక్క పిల్లను అక్కున చేర్చుకుని అమ్మ ప్రేమను పంచిన వానరం..!
బంధాలు - అనుబంధాలను మరిచి అయినవారి పట్లనే కర్కషంగా వ్యవహరించే వారు ఉన్న ఆధునిక సమాజంలో మూగజీవాలు జాతి వైరాన్ని మరచి ఆప్యాయతలను ప్రదర్శిస్తున్నాయి. మానవత్వం మంటగలుస్తున్న ప్రస్తుత సమాజానికి స్ఫూర్తిదాయక సందేశాన్ని అందిస్తున్నాయి. కన్నవారు, కట్టుకున్న వారు, తోబుట్టువులు, రక్తసంబంధికులు.. ఇలా సొంతవారి పట్లనే స్వార్థం, ఈర్ష ద్వేషాలతో కర్కశంగా వ్యవహరిస్తున్న వారు ప్రస్తుత సమాజంలో అనేకమంది ఉన్నారు.
- G Sampath Kumar
- Updated on: Mar 15, 2026
- 11:11 am
Viral Video: బిడ్డ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన తల్లి.. చిటారు కొమ్మలో చిక్కుకున్న పిల్ల కోసం..!
అమ్మ ప్రేమకు హద్దులు ఉండవు అంటారు. అది మనుషులకే కాదు.. మూగజీవాలు.. జంతువుల్లో కూడా కనిపిస్తుంది. తాజాగా జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన చూస్తే నిజంగా అమ్మతనం ఎంత గొప్పదో అర్థమవుతుంది. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ శివారులో ఓ ఎండిపోయిన చెట్టుపై ఉడత తల్లి తన బిడ్డతో కలిసి ఉంది. ఆడుకుంటూ ఉండగా చిన్న ఉడత అనుకోకుండా సన్నని కొమ్మపైకి వెళ్లింది.
- G Sampath Kumar
- Updated on: Mar 13, 2026
- 10:30 am
రుత్విక్ ఇలా చేస్తడనుకోలేదు.. బైక్ కొనివ్వలేదని.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న కోరిక తీరలేదని మనస్తాపానికి గురైన ఓ బాలుడు .. నిండు ప్రాణాలను తీసుకున్నాడు.. ఈ షాకింగ్ కరీంనగర్ రూరల్ మండలం గోపాలపూర్ గ్రామంలో జరిగింది. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
- G Sampath Kumar
- Updated on: Mar 10, 2026
- 7:11 pm
వేములవాడ ఆలయంలో నిజాయితీకి నిదర్శనం.. రూ.8 లక్షల బంగారు బ్రాస్లెట్ను భక్తుడికి తిరిగి ఇచ్చిన ఆలయ సిబ్బంది..!
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుడు రేసు సతీష్ పోగొట్టుకున్న సుమారు రూ.8 లక్షల విలువైన బంగారు బ్రాస్లెట్ను ఔట్సోర్సింగ్ సిబ్బంది డప్పు నాగమణి నిజాయితీగా తిరిగి అప్పగించారు. ఆలయ అధికారులకు అందించగా, వారు విచారణ అనంతరం భక్తుడికి అందజేశారు. ఈ నిజాయితీకి నాగమణిని ఆలయ ఈవో ప్రశంసించి, సత్కరించారు. ఈ ఘటన మానవత్వం, నిజాయితీ విలువలను చాటింది.
- G Sampath Kumar
- Updated on: Mar 10, 2026
- 6:51 pm
Watch: వావ్ మిరాకిల్.. అమ్మవారి సన్నిధిలో అద్భుత దృశ్యం.. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తాబేలు!
ఆధ్యాత్మిక చింతన మనుషులతో పాటు ఇతర జీవరాశులలో కూడా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అరుదుగా మనకు దర్శనమిచ్చే చిత్ర విచిత్ర ఘటనల మాదిరిగానే పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. మనుషుల వలే ఒక తాబేలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కనిపించింది. అది గమనించిన భక్తులు ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- G Sampath Kumar
- Updated on: Mar 10, 2026
- 2:48 pm
భక్తజన సంద్రంగా జగిత్యాల పెద్దపూర్.. 50వేల బోనాలతో మల్లన్న జాతర
జగిత్యాల జిల్లా పెద్దపూర్ లో కాముడి పౌర్ణమి అనంతరం జరిగిన మల్లికార్జున స్వామి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ, పక్క రాష్ట్రాల నుండి వేలాది భక్తులు తరలివచ్చి బోనాలతో స్వామివారిని దర్శించుకున్నారు. 29 ఏళ్లుగా ఆదివారం నియమాలు పాటించే గ్రామస్థులు, భక్తులు పట్నాలు వేసి, బెల్లం తులాభారం, గొర్రెపిల్లల సమర్పణ వంటి మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవం, పోతురాజుల విన్యాసాలు జాతరకు మరింత శోభనిచ్చాయి.
- G Sampath Kumar
- Updated on: Mar 9, 2026
- 7:12 pm
ఇదేం పిచ్చి ప్రేమ.. ఇన్స్టాలో అది అడిగాడని.. లవర్ ఏం చేసిందో తెలుసా..?
సోషల్ మీడియా యుగం.. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. అంతా డిజిటల్ కనికట్టు మాదిరిగా మారిపోయింది.. సోషల్ మీడియా.. ప్రేమలు.. ఆ తర్వాత పారిపోవడాలు.. పెళ్లిళ్లు.. చివరకు ఎన్నో క్రైమ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో.. తాజాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోషల్ మీడియా పరిచయం వివిధ పరిణామాలకు ఎలా దారి తీస్తుందో చూపించే ఘటన వెలుగులోకి వచ్చింది.
- G Sampath Kumar
- Updated on: Mar 7, 2026
- 1:19 pm