సంపత్ కుమార్ గాండ్ల , టీవీ9 తెలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫర్ గా 17ఏళ్లుగా పనిచేస్తున్నాను. మొదట ఆంధ్రజ్యోతి లో పని చేశాను.గత 17 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నాను .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. బాల్య వివాహాలు పై చేసిన స్టోరీ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది.. అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి.. సత్కరించింది..
Watch: అర్థరాత్రి వైన్ షాపును టార్గెట్ చేసిన దొంగలు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్..!
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో అర్ధరాత్రి వేళ ఓ వైన్ షాపులో దొంగలు హల్చల్ చేశారు. మండల పరిధిలోని కనుకుల గ్రామంలో ఉన్న ‘నాగ వైన్ షాప్’ లక్ష్యంగా చేసుకుని ఈ చోరీకి పాల్పడ్డారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు..
- G Sampath Kumar
- Updated on: Jun 27, 2026
- 5:25 pm
Telangana: పొద్దున్నే షాప్ తెరిచేందుకు వెళ్లిన వ్యాపారి.. బాక్స్ ఓపెన్ చేయగా.. వామ్మో..
రోజులాగే ఉదయం షాప్ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓ వ్యాపారికి ఊహించని పరిణామం ఎదురైంది. తన తోపుడు బండిపై పండ్లు పేరుస్తుండా బండి కింద నుంచి ఏవో శబ్ధాలు రావడంతో ఏంటని చూడగా ఓ భారీ పాము అతనికి దర్శనమిచ్చింది. అది చూసిన ఆ వ్యాపారి భయంతో వెనక్కి జరిగి స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పాములు పట్టేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
- G Sampath Kumar
- Updated on: Jun 25, 2026
- 2:50 pm
దేవుడా కరుణించు.. వర్షాలు కురవాలని శివుడికి జల దిగ్బంధం.. వీడియో చూశారా..?
ఎల్నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శివాలయంలో రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగం చుట్టూ నీటిని నింపి జలదిగ్బంధం చేస్తూ సకాలంలో వర్షాలు కురవాలని పరమేశ్వరుడిని వేడుకున్నారు. గ్రామ వీధుల్లో సంప్రదాయ ‘కప్పతల్లి ఆట’ నిర్వహిస్తూ వరుణ దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు రైతులు, గ్రామస్థులు కలిసి ప్రార్థనలు చేశారు.
- G Sampath Kumar
- Updated on: Jun 22, 2026
- 6:08 pm
వరుస మరణాలతో వణికిపోతున్న గ్రామం.. కీడు పోవాలంటూ ఊరంతా ఏం చేశారో తెలుసా!
పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లి గ్రామంలో వరుస మరణాలు గ్రామస్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. గత రెండు నెలల వ్యవధిలో వివిధ కారణాలతో దాదాపు 15 మంది మృతి చెందడంతో గ్రామంలో ఏదో అపశకునం జరుగుతోందనే భావన ప్రజల్లో బలపడింది. ఒకరి దశదిన కర్మ పూర్తికాకముందే మరో మరణం చోటుచేసుకోవడం, అదే సమయంలో వర్షాలు కూడా కురవకపోవడంతో గ్రామస్తులు మరింత ఆందోళన చెందుతున్నారు.
- G Sampath Kumar
- Updated on: Jun 20, 2026
- 1:51 pm
Watch Video: అడవి దాటి గ్రామంలోకి ఎలుగుబంటి.. భయంతో పరుగులు తీసిన ప్రజలు!
కరీంనగర్ జిల్లా గట్టుబూత్కూర్ గ్రామంలో అర్ధరాత్రి ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోకి ఎలుగుబంటి ప్రవేశించి కొంతసేపు సంచరించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాత్రి వేళలో ఇళ్ల సమీపంలో ఎలుగుబంటి కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా అప్రమత్తమై ఇళ్లలోనే ఉండిపోయారు.
- G Sampath Kumar
- Updated on: Jun 19, 2026
- 1:36 pm
Viral Video: జాతి వైరాన్ని మరిచిన కోతి–కుక్క.. గోదావరిఖనిలో అరుదైన దృశ్యం
కుక్క, కోతి పూర్తిగా జాతి విరుద్ధమైన జంతువులు. ఒకదాన్ని చూస్తే మరొకటి పరుగు తీస్తుంది. కానీ, ఇందుకు పూర్తి విరుద్ధంగా పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. జాతి వైరాన్ని మరిచి ఓ కుక్క, కోతి ప్రాణ స్నేహితులుగా మారాయి. దోస్త్ మేరా దోస్త్ అన్నట్లుగా సరదాగా ఆడుకున్నాయి. నిత్యం భక్తులతో కిటకిటలాడే గోదావరిఖని..
- G Sampath Kumar
- Updated on: Jun 18, 2026
- 12:57 pm
ఏంటి నాగన్న.. అలా ఎలా దూరావ్.. కాళ్ల దగ్గర తోక చూసి గుండె ఆగినంత పనైంది.. ఇదిగో వీడియో
పెద్దపెల్లి జిల్లాలోని రామగుండంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ కింద పాము కనిపించడం కలకలం రేపింది. వంట చేస్తున్న మహిళకు సిలిండర్ కింద తోక కనిపించడంతో పరిశీలించగా పాము చుట్టుకొని ఉండటాన్ని చూసి భయంతో బయటకు పరుగులు పెట్టింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ నవీన్ అక్కడికి చేరుకుని దాదాపు ఐదు అడుగుల పొడవున్న పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టాడు.
- G Sampath Kumar
- Updated on: Jun 18, 2026
- 12:54 pm
కోతుల వీరంగంతో మరో మహిళ మృతి.. డాబాపై ఇటుకలు ఉంటే వెంటనే తీసేయండి..
జగిత్యాల జిల్లా ధర్మపురిలో కోతుల వీరంగం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ఇందిరమ్మ కాలనికి చెందిన కొనపర్తి పద్మ (50) ఇంటి వద్ద ఉండగా, డాబాపై ఆడుకుంటున్న కోతులు కదిలించిన సిమెంట్ ఇటుక కింద పడింది. అది పద్మ తలపై బలంగా తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇటీవల ధర్మపురిలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. డాబాలపై ఉంచిన ఇటుకలు, నిర్మాణ సామగ్రిని వెంటనే తొలగించాలని అధికారులు సూచిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- G Sampath Kumar
- Updated on: Jun 18, 2026
- 7:31 am
‘బడిబాట’కు బంపర్ ఆఫర్.. ప్రభుత్వ పాఠశాలకు పంపితే ఇంటి పన్ను, నల్లా బిల్లు రద్దు!
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, విద్యార్థుల సంఖ్యను పెంచడం లక్ష్యంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామపంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే వారికి ఇంటి పన్ను, నల్లా పన్నుల నుంచి పూర్తి మినహాయింపు కల్పించాలని గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది.
- G Sampath Kumar
- Updated on: Jun 17, 2026
- 12:34 pm
కప్పతల్లికి నీళ్లు పోస్తే నిజంగానే వర్షాలు కురుస్తాయా? తెలంగాణలో ఇంకా కొనసాగుతున్న అరుదైన ఆచారం!
Kappathalli Ritual: రాజన్న సిరిసిల్ల జిల్లా కందికట్కూరు గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ చిన్నారులు సంప్రదాయ కప్పతల్లి ఆట నిర్వహించారు. కప్పకు నీళ్లు పోస్తూ జానపద గీతాలు ఆలపించిన పిల్లలు గ్రామస్థులను ఆకట్టుకోగా, వరుణదేవుడిని ప్రసన్నం చేసుకునే ఈ పురాతన ఆచారం మరోసారి గ్రామీణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పింది.
- G Sampath Kumar
- Updated on: Jun 17, 2026
- 10:21 am
Telangana: ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికెళ్లిన 18 మంది చిన్నారులు.. కాసేపటికే ఇది పరిస్థితి!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో పానీపూరి తిన్న సుమారు 18 మంది చిన్నారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పానీపూరి తిన్నాక చిన్నారులకు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అవ్వడంతో హాస్పిటల్లో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం వీరంతా హాస్పిట్లో చికిత్స పొందుతున్నారు.
- G Sampath Kumar
- Updated on: Jun 17, 2026
- 8:23 am
గుర్రంపై స్వారీ.. ‘దేశ గురువు’గా ఎంట్రీ.. గ్రామస్థుల అనుమానాలతో పరార్..!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తనను తాను "దేశ గురువు"గా పరిచయం చేసుకుంటూ గ్రామాల్లో సంచరించిన ఓ వ్యక్తి వ్యవహారం కలకలం రేపింది. గ్రామస్థుల నుంచి అనుమానాలు వ్యక్తం కావడంతో అతడు తన అనుచరులతో కలిసి పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్థుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.
- G Sampath Kumar
- Updated on: Jun 16, 2026
- 11:16 am