సంపత్ కుమార్ గాండ్ల , టీవీ9 తెలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫర్ గా 17ఏళ్లుగా పనిచేస్తున్నాను. మొదట ఆంధ్రజ్యోతి లో పని చేశాను.గత 17 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నాను .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. బాల్య వివాహాలు పై చేసిన స్టోరీ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది.. అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి.. సత్కరించింది..
అగ్గిపెట్టెలో పట్టు చీర.. ఐదున్నర మీటర్లు.. ప్రపంచ వేదికపై సిరిసిల్ల ఖ్యాతిని చాటుతున్న చేనేత కళ
చేనేతకు చిరునామాగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా మరోసారి తన విశిష్ట కళా వైభవాన్ని ప్రపంచానికి చాటుతోంది. ఒక చిన్న అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత పలుచగా, కేవలం 200 గ్రాముల బరువుతో ఐదున్నర మీటర్ల పొడవు గల పట్టుచీరను తయారు చేస్తూ సిరిసిల్ల చేనేత కళాకారులు తమ అసాధారణ ప్రతిభను చాటుతున్నారు. సంప్రదాయ చేనేతకు సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి రూపొందిస్తున్న ఈ చీర దేశ, విదేశాల్లో విశేష గుర్తింపు పొందింది.
- G Sampath Kumar
- Updated on: Aug 7, 2026
- 10:59 am
ఈ పెళ్లి పత్రిక మొక్కగా మారుతుంది.. ఐడియా అదుర్స్ కదూ!
పెళ్లి ఆహ్వాన పత్రికను చదివి పారేయకుండా, కుండీలో నాటితే తులసి మొక్కగా మారితే ఎలా ఉంటుంది? రాజన్న సిరిసిల్లకు చెందిన జ్ఞానేందర్ గుప్తా తన కుమార్తె వివాహానికి విత్తనాలతో కూడిన ఎకో-ఫ్రెండ్లీ వెడ్డింగ్ కార్డులు ముద్రించి పర్యావరణ పరిరక్షణకు వినూత్న సందేశాన్ని అందించారు. ఈ ఆలోచన ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.
- G Sampath Kumar
- Updated on: Aug 6, 2026
- 5:39 pm
Watch: పిల్లను కాపాడుకోవడానికి నాగుపాముతో పోరాడిన తల్లి కోడి.. కానీ చివరకు ఇలా..
పామును చూస్తేనే మనుషుల గుండెలు గుబెలుమంటాయి. అలాంటిది ఒక మూగజీవి తన బిడ్డను కాపాడుకోవడానికి సాక్షాత్తూ కాలనాగుతోనే పోరాటానికి దిగింది. పిల్లను కాపాడుకోవడానికి ఒక తల్లి కోడి చేసిన వీరోచిత పోరాటం స్థానికులను కంటతడి పెట్టించడమే కాకుండా, భయాందోళనకు గురిచేసింది. ఈ కన్నీటి సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో వెలుగు చూసింది. తన పిల్లను కాపాడుకోవటానికి పాముతో పారాడిన తల్లి కోడి చివరకు ఓడిపోయింది. అసలు ఏం జరిగిందంటే..
- G Sampath Kumar
- Updated on: Aug 5, 2026
- 11:40 am
చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్!
గత రెండు నెలల నుంచి భారీ వర్షాలు కురవలేదు. చాలా ప్రాంతాల్లో దుక్కులు దున్ని సాగు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన రైతులు మాత్రం డ్రిప్ ద్వారానే సాగు చేస్తున్నారు. పదేళ్ల నుంచే డ్రిప్ ఆధారంగా సాగు చేస్తూ ఉత్పత్తిని పెంచుతున్నారు. అయితే వరి కాకుండా ఆరుతడి పంటలపైనే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కూరగాయల సాగులో ఈ గ్రామమే మొదటి స్థానంలో ఉంటుంది. కరువును జయిస్తున్న తిమ్మాపూర్ గ్రామం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
- G Sampath Kumar
- Updated on: Aug 5, 2026
- 10:25 am
Bochha Fish: చిక్కిందండోయ్ సరైన బొచ్చ చేప.. ఇంతకీ దీని ప్రత్యేకతలు తెలుసా..?
రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు జలాశయంలో మత్స్యకారుడి వలకు సుమారు 30 కిలోల బరువున్న భారీ బొచ్చ చేప చిక్కింది. చేపను ఒడ్డుకు చేర్చేందుకు ముగ్గురు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా వచ్చే నీటితో భారీ చేపలు మిడ్ మానేరుకు చేరుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.
- G Sampath Kumar
- Updated on: Aug 4, 2026
- 12:02 pm
వరల్డ్ రికార్డ్ సాధించిన సిరిసిల్ల నేతన్న.. 3గంటల్లో అగ్గిపెట్టెలో పట్టే చీర తయారీ
సిరిసిల్ల నేతన్న మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. కేవలం మూడున్నర గంటల్లోనే చీరను తయారుచేసి రికార్డ్ సృష్టించాడు . పూర్తిగా మగ్గం పైనే ఈ చీరను నేసి.. ఆశ్చర్య పరిచాడు. ఐదున్నర మీటర్ల పొడవుతో తయారు చేశాడు. తయారు చేసిన చీరను అగ్గి పెట్ట లో..పెట్టి.. తన కళా నైపుణ్యాన్ని చాటి చెప్పాడు.
- G Sampath Kumar
- Updated on: Aug 3, 2026
- 1:26 pm
మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న భర్త అరాచకం
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం, మద్యం మత్తులో ఉన్న భర్త శ్యామలపై కత్తితో దాడి చేయగా ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
- G Sampath Kumar
- Updated on: Aug 2, 2026
- 6:49 pm
Snake: స్కూటీ స్టార్ట్ చేసేలోపే షాక్.. లోపల దూరిన భారీ పాము.. వీడియో వైరల్..!
Snake: ప్రస్తుత వాతావరణ మార్పుల నేపథ్యంలో పాములు ఆశ్రయం కోసం బైక్లు, స్కూటీల ఇంజిన్ భాగాలు లేదా ముందు వైపు ఖాళీ ప్రదేశాల్లోకి చొరబడే అవకాశం ఉందని స్నేక్ క్యాచర్లు హెచ్చరిస్తున్నారు. వాహనాలను స్టార్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని, ఇలాంటి..
- G Sampath Kumar
- Updated on: Aug 2, 2026
- 12:43 pm
గోరింట కోసి.. అందంగా చేతికి అద్ది.. ఈ సంబరం వెనుక ఉన్న అసలు సీక్రెట్ మీకు తెలుసా
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు గోరింటాకు సంబరాలను గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువతులు ఒకచోట చేరి ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందోత్సాహాల మధ్య ఆడుతూ పాడుతూ వేడుకలను జరుపుకున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ఆకట్టుకుంది
- G Sampath Kumar
- Updated on: Aug 2, 2026
- 10:27 am
పెరుగుతున్న ఫ్యాటీ లివర్ కేసులు.. కారణం ఇదే అంటున్న నిపుణులు
పదిమంది టెస్ట్ చేయించుకుంటే అందులో ఆరుగురు లేదా ఏడుగురికి ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. మందు ఇతర దురవాట్లు లేకున్నా కూడా లివర్ సంబంధించిన వ్యాధులతో చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. ఇటీవల ఈ కేసులు వేగవంతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగించే పరిణామం. మనం తింటున్న ఆహారం కారణంగానే ఈ సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా యువత కూడా ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కొంటుంది. ఈ సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఫ్యాటీ లివర్ ప్రాణాలు తీసే అవకాశం ఉంది. పెరుగుతున్న ఫ్యాటీ లివర్ కేసులపైన స్పెషల్ స్టోరీ.
- G Sampath Kumar
- Updated on: Aug 1, 2026
- 2:52 pm
భారత అంతరిక్ష చరిత్రలో సిరిసిల్ల ముద్ర.. విక్రమ్-1 రాకెట్ విజయంలో ముగ్గురు సోదరులు!
భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం సరికొత్త శిఖరాలను తాకుతోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన విక్రమ్-1 ఆర్బిటల్ ప్రయోగ వాహకం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి రికార్డు సృష్టించింది. అయితే ఈ చారిత్రాత్మక విజయం వెనుక రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువ ఇంజనీర్ల కష్టం, సాంకేతిక నైపుణ్యం ఉండటం తెలంగాణాకే కాకుండా సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఎనలేని గర్వకారణంగా మారింది.
- G Sampath Kumar
- Updated on: Aug 1, 2026
- 12:52 pm
ఆలయం వద్ద 10 అడుగుల పాము..భయంతో భక్తుల పరుగులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయం వద్ద 10 అడుగుల పాము ప్రత్యక్షమై భక్తులను భయాందోళనకు గురిచేసింది. స్నేక్ క్యాచర్ జగదీశ్వర్ సాహసోపేతంగా దానిని పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆలయ పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచించారు.
- G Sampath Kumar
- Updated on: Jul 25, 2026
- 8:53 pm