AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G Sampath Kumar

G Sampath Kumar

Staff Reporter - TV9 Telugu

sampath.gandla@tv9.com

సంపత్ కుమార్ గాండ్ల , టీవీ9 తెలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫర్ గా 17ఏళ్లుగా పనిచేస్తున్నాను. మొదట ఆంధ్రజ్యోతి లో పని చేశాను.గత 17 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నాను .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. బాల్య వివాహాలు పై చేసిన స్టోరీ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది.. అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి.. సత్కరించింది..

Read More
కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కలకలం.. ఎన్ని లక్షలో తెలుసా?

కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కలకలం.. ఎన్ని లక్షలో తెలుసా?

జగిత్యాల కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో 2.5 లక్షల విలువైన డమ్మీ 500 నోట్లు లభించడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ నకిలీ నోట్లను వేశారు. ఆలయ అధికారులు విచారణ చేపట్టారు, సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. హుండీ భద్రతపై భక్తులు ఆందోళన చెందుతూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Telangana: ఇదేం మాయ బాబోయ్.. బ్రతికుండగానే చనిపోయినట్లు రికార్డులు.. పింఛన్ పాయే..

Telangana: ఇదేం మాయ బాబోయ్.. బ్రతికుండగానే చనిపోయినట్లు రికార్డులు.. పింఛన్ పాయే..

ఒక వ్యక్తి బ్రతికుంగానే చనిపోయినట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో ఇతడికి రావాల్సిన పింఛన్ ఆగిపోయింది. ఎందుకు నిలిపివేశారంటూ అధికారులను ప్రశ్నించగా.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

Jagtial News: ఉపాధి కోసం మాల్టా వెళ్లిన జగిత్యాలకు చెందిన 27 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పెళ్లైన కేవలం మూడు నెలలకే ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి త్వరగా తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాలను కోరుతున్నారు.

త్రిబుల్ ధమాకా.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. ఆ ఇంట అంబరాన్ని అంటిన సంబరాలు..

త్రిబుల్ ధమాకా.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. ఆ ఇంట అంబరాన్ని అంటిన సంబరాలు..

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేటలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జంగిటి రాజలక్ష్మి–నరేందర్ దంపతులకు తొలి సంతానంగానే ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. ఒక బాబు, ఇద్దరు పాపలు జన్మించగా.. ప్రస్తుతం తల్లి, ముగ్గురు చిన్నారులు క్షేమంగా ఉన్నారు. తక్కువ బరువుతో జన్మించిన శిశువులను పెడియాట్రిషియన్‌ ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు.

చూశారా ఈ అద్భుతం.. శివయ్యపైకి ఎక్కి కంఠాభరణంగా నాగుపాము.. అరగంటపాటు..

చూశారా ఈ అద్భుతం.. శివయ్యపైకి ఎక్కి కంఠాభరణంగా నాగుపాము.. అరగంటపాటు..

నిర్మాణ దశలో ఉన్న శివుడి విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షమైంది. జగిత్యాల జిల్లా మోరేపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో పాము సుమారు అరగంట పాటు విగ్రహం చుట్టూ తిరుగుతూ శివుడి మెడ వరకు వెళ్లింది. రెండుసార్లు పడగ విప్పినట్లు స్థానికులు తెలిపారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిన పామును చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

అర్థరాత్రి నడిరోడ్డుపై మంటలు.. దగ్గరికెళ్లి చూసి జనం పరుగో పరుగు.. వీడియో

అర్థరాత్రి నడిరోడ్డుపై మంటలు.. దగ్గరికెళ్లి చూసి జనం పరుగో పరుగు.. వీడియో

పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిద్దపల్లి గ్రామంలో అర్ధరాత్రి అనుమానాస్పద పూజల ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది. నిర్మానుష్యంగా ఉన్న ప్రధాన రహదారి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఏదో పూజ నిర్వహించినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఓ బొమ్మను ఏర్పాటు చేసి చుట్టూ పసుపు, కుంకుమ చల్లి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గొర్రెల మంద చుట్టూ వల పెట్టిన యజమాని.. తెల్లారి వెళ్లి చూసేసరికి…

గొర్రెల మంద చుట్టూ వల పెట్టిన యజమాని.. తెల్లారి వెళ్లి చూసేసరికి…

గొర్రెల మందపై దాడికి వచ్చిన భారీ కొండచిలువ.. కాపరులు ఏర్పాటు చేసిన వలలో చిక్కుకుంది. రాత్రంతా వలలోనే ఉండిపోయిన కొండచిలువను స్నేక్ క్యాచర్ సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. పూర్తి వివరాలు ఇలా ..

Telangana: ప్రకృతి ఒడిలో వికృత చేష్టలు.. ఖరీదైన 20 కార్లతో విన్యాసాలు.. ఇదిగో వీడియో!

Telangana: ప్రకృతి ఒడిలో వికృత చేష్టలు.. ఖరీదైన 20 కార్లతో విన్యాసాలు.. ఇదిగో వీడియో!

మిడ్‌మానేర్ బ్యాక్ వాటర్ వద్ద పర్యాటకుల అత్యుత్సాహం ఆందోళన కలిగిస్తోంది. తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లె శివారులోని బ్యాక్‌వాటర్‌ పరిసర ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన కొందరు యువకులు.. ఆ ప్రాంతాన్ని రేసింగ్ ట్రాక్‌గా మార్చి సుమారు 20 కార్లతో స్టంట్స్ చేస్తూ.. పర్యాటకులను భయాందోళనకు గురిచేశారు. వీరంతా హైదరాబాద్‌ నుంచి వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు.

వాగు దాటేందుకు ట్రాక్టర్ ఎక్కిన ప్రభుత్వ మహిళా టీచర్లు! మధ్యలోకి వెళ్లగానే..

వాగు దాటేందుకు ట్రాక్టర్ ఎక్కిన ప్రభుత్వ మహిళా టీచర్లు! మధ్యలోకి వెళ్లగానే..

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఉపాధ్యాయులకు వాగు కష్టాలు తప్పడం లేదు. వర్షాలకు తూకమర్రి వాగు ఉధృతంగా ప్రవహించడంతో మహిళా టీచర్లు, ఇద్దరు చిన్నారులు ట్రాక్టర్‌లో వాగు దాటుతుండగా మధ్యలో ఇసుకలో కూరుకుపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

రాజుల కాలం నాటి భారీ సొరంగం.. లోపల నిధి ఉందా? నాంపల్లిలో ఆసక్తికర రహస్యం!

రాజుల కాలం నాటి భారీ సొరంగం.. లోపల నిధి ఉందా? నాంపల్లిలో ఆసక్తికర రహస్యం!

ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది. ఆ భూమి దేవుడు తిరిగిన ప్రాంతం. దీంతో అనువణువునా పురాతన ఆనవాళ్లు బయటకు వస్తున్నాయి. ఎక్కడ లేని విధంగా భారీ సొరంగం ఇప్పటికి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఈ సొరంగ మార్గమే ఒక మహా అద్భుతం అని అందులో నిధి ఉందని ప్రచారం కూడా సాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థాన అనుబంధ ఆలయం నాంపల్లిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొలువై ఉంది. ఈ స్వామివారు స్వయంభు ఎతైన కొండపైన స్వామి వారు దర్శనమిస్తారు.

వాయమ్మో.. నాగుపామును కరకర నమిలి మింగేసిన కప్ప.. నెట్టింట దుమ్ములేపుతున్న వీడియో..

వాయమ్మో.. నాగుపామును కరకర నమిలి మింగేసిన కప్ప.. నెట్టింట దుమ్ములేపుతున్న వీడియో..

సాధారణంగా పాములు కప్పలను మింగడం సహజమే. కానీ, దీనికి పూర్తి భిన్నంగా ఓ కప్ప చిన్న నాగుపాము పిల్లను నోటకరుచుకుని కనిపించిన అరుదైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొమ్మిది సెకన్ల ఈ వీడియోలో కప్ప పాము తోక భాగాన్ని పట్టుకుని మింగే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. అయితే పాము చివరకు తప్పించుకుందా? లేక కప్ప మింగిందా? అన్నది వీడియోలో చూపించలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టత లేకపోయినా, నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అగ్గిపెట్టెలో పట్టు చీర.. ఐదున్నర మీటర్లు.. ప్రపంచ వేదికపై సిరిసిల్ల ఖ్యాతిని చాటుతున్న చేనేత కళ

అగ్గిపెట్టెలో పట్టు చీర.. ఐదున్నర మీటర్లు.. ప్రపంచ వేదికపై సిరిసిల్ల ఖ్యాతిని చాటుతున్న చేనేత కళ

చేనేతకు చిరునామాగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా మరోసారి తన విశిష్ట కళా వైభవాన్ని ప్రపంచానికి చాటుతోంది. ఒక చిన్న అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత పలుచగా, కేవలం 200 గ్రాముల బరువుతో ఐదున్నర మీటర్ల పొడవు గల పట్టుచీరను తయారు చేస్తూ సిరిసిల్ల చేనేత కళాకారులు తమ అసాధారణ ప్రతిభను చాటుతున్నారు. సంప్రదాయ చేనేతకు సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి రూపొందిస్తున్న ఈ చీర దేశ, విదేశాల్లో విశేష గుర్తింపు పొందింది.