సంపత్ కుమార్ గాండ్ల , టీవీ9 తెలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫర్ గా 17ఏళ్లుగా పనిచేస్తున్నాను. మొదట ఆంధ్రజ్యోతి లో పని చేశాను.గత 17 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నాను .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. బాల్య వివాహాలు పై చేసిన స్టోరీ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది.. అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి.. సత్కరించింది..
Watch: ఇది కదా కావాల్సింది.. ఎన్నికల ముందే ప్రజల సమస్యలు తీరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి.. ఎక్కడంటే
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఇంకా కేవలం వారం రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీనంగర్ జిల్లాలోని సర్పంచ్ అభ్యర్థులు ప్రజల డిమాండ్లు పోలింగ్ కంటే ముందే తీర్చేస్తున్నారు. ఎందుకంటే.. అక్కడి గ్రామస్తులు తమకున్న ప్రధాన సమస్యను ఎవరు తీరుస్తే వారికే ఓటేస్తామని తేల్చి చెప్పడంతో.. అభ్యర్థులు ఆ పనుల్లో మునిగిపోయారు. ఇంతకు జనాలకొచ్చిన అంత పెద్ద సమస్య ఏంటో తెలుసుకుందాం పదండి.
- G Sampath Kumar
- Updated on: Dec 4, 2025
- 4:07 pm
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం.. సినీ ఫక్కీలో సొంత అన్నను చంపిన తమ్ముడు!
ఆర్థిక ఇబ్బందుల ఊబిలో కూరుకుపోయిన ఓ వ్యక్తి, ఏకంగా తన అన్ననే అత్యంత కిరాతకంగా హత్య చేసి, దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని పన్నిన కుట్రను కరీంనగర్ జిల్లా పోలీసులు ఛేదించారు. రామడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసులో, ప్రధాన నిందితుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు..
- G Sampath Kumar
- Updated on: Dec 3, 2025
- 12:26 pm
Telangana: చూశారా ఈ చిత్రం.. తల్లిపై పోటీకి దిగిన కూతురు.. ఇద్దరికీ ప్రధాన పార్టీల మద్దతు
తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా తిమ్మయ్య పల్లెలో సర్పంచ్ పదవికి తల్లీ–కూతురు ఎదురెదురుగా బరిలో దిగడంతో పోరు రసవత్తరంగా మారింది. బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో తల్లి గంగవ్వ, ఆమె కూతురు సుమలత ఇద్దరూ పోటీకి సై అన్నారు .
- G Sampath Kumar
- Updated on: Dec 2, 2025
- 5:23 pm
Viral News: సర్పంచ్ పోస్ట్ కావాలా?.. నోట్లు వద్దు.. కోతులను తరిమితే చాలు.. అభ్యర్థులకు సరికొత్త డిమాండ్!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిల మేనియా కొనసాగుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఇలా ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులకు చాలా గ్రామాల్లో ఒకే డిమాండ్ వినిపిస్తుంది.. మాకు ఓటుకు నోటు అక్కర్లే.. ఒక సమస్యను తీర్చుతే చాలంటున్నారు. గ్రామస్తులు.. మా సమస్యను ఎవరు తీరుస్తే వాళ్లకే ఓటేస్తామని చెబుతున్నారు. ఇంతకూ వాళ్ల సమస్య ఏంటో తెలుసుకుందాం పదండి.
- G Sampath Kumar
- Updated on: Dec 2, 2025
- 1:43 pm
Telangana: రోజూ సమాధి దగ్గర తిరుగుతున్న ఓ మహిళ.. అనుమానమొచ్చి ఆరా తీయగా
తల్లి సమాధి వద్దే కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. కనీసం 24 గంటల పాటు అక్కడే ఉంది. రాత్రి అక్కడే ఉంటోంది. కుటుంబ సభ్యులు ఎంత వెనక్కి తీసుకొచ్చినా మళ్ళీ అక్కడికే వెళ్తుంది. రాత్రి పూట ఉండటంతో స్థానికులు భయపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆఫ్రిన్ తండ్రి.
- G Sampath Kumar
- Updated on: Dec 2, 2025
- 12:07 pm
PM Modi: మన్ కీ బాత్లో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్పై మోదీ ప్రశంసలు..!
Karimnagar Silver Filigree: కళల కాణాచిగా పేరుపడిన కరీంనగర్ వాసులు మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు తమలోని కళాత్మకతను ప్రదర్శించిన విషయాన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మన్ కీ బాత్ లో పీఎం ఫిలిగ్రీ కళ గురించి ప్రస్తావించారు. కరీంనగర్లో తయారు చేసిన..
- G Sampath Kumar
- Updated on: Nov 30, 2025
- 8:09 pm
పోయినసారి ఒక్క ఓటుతో ఓడిపోయాడు.. కట్ చేస్తే.. ఈసారి డబ్బాలతో నామినేషన్కు..
గత ఎన్నికల్లో ఒక్క ఓటుతో ఓటమి ఆ అభ్యర్థిని వెంటాడింది.. అందుకే మళ్లీ ఎలాగైనా గెలవాలని డిపాజిట్ కోసం ఒక్కో రూపాయి జమ చేసుకున్నాడు. అలా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా మొత్తం ఒక్క రూపాయి బిళ్లలతోనే నామినేషన్ వేశాడు. ఇలా వార్డ్ మెంబర్గా ఓడిపోయిన ఆ యువకుడి పొలిటికల్ స్టోరీ తెలియాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..
- G Sampath Kumar
- Updated on: Nov 30, 2025
- 11:06 am
Telangana: ఇన్ఫార్మర్ నెపంతో 30 ఏళ్ల క్రితం అతని తండ్రిని చంపిన అన్నలు.. కట్ చేస్తే.. ఇప్పుడు
సినిమాల్లో చూసే ప్రతీకార కథలా ఉంది ఈ ఘటన. రాజన్న సిరిసిల్లకు చెందిన జక్కుల అంజయ్యను “ఇన్ఫార్మర్” అని భావించిన నక్సలైట్లు ముప్పై ఏళ్ల క్రితం హత్య చేశారు. ఆ సమయంలో చిన్నవయసున్న అతని కుమారుడు సంతోష్, తండ్రి హత్య చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆ తర్వాత...
- G Sampath Kumar
- Updated on: Nov 28, 2025
- 4:29 pm
Telangana: ఎంత ఘోరం.. ఫుట్బాల్ ఆడుతూ కిందపడ్డ విద్యార్థి.. ఇంతలోనే..!
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆటల సమయంలో విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడుతూ.. 10వ తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆటలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని వెంటనే ఇంటికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే అస్వస్థతకు గురైన విద్యార్థిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- G Sampath Kumar
- Updated on: Nov 27, 2025
- 3:20 pm
అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. చెదరిన సర్పంచ్ కావాలన్న యువకుడి కల…!
అతనికి ఇంకా పెళ్లి కాలేదు.. అయితే ఆ గ్రామానికి కేటాయించిన రిజర్వేషన్ వల్ల ఒక మహిళను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమె పేరు ఓటర్ జాబితాలో చేర్చాలని భావించాడు. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం (నవంబర్ 26) రోజునే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో హడావుడిగా ఆలయంలో ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు.
- G Sampath Kumar
- Updated on: Nov 27, 2025
- 5:34 pm
Karimnagar: వావిలాలపల్లిలో హల్చల్ చేసిన అనుకోని అతిథి.. ఆశ్చర్యపోయిన జనం..
కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో అరుదైన అతిథి ప్రత్యక్షమైంది. కథల్లో మాత్రమే విన్న నక్కను నిజంగా చూడటం స్థానికులకు విశేష అనుభూతిని కలిగించింది. రెండు రోజులుగా సోలార్ కార్యాలయం వద్ద తిరుగుతోన్న ఆ జంతువును తొలుత పిల్లి అనుకుని ఆహారం పెట్టారు ...
- G Sampath Kumar
- Updated on: Nov 26, 2025
- 2:55 pm
మానవత్వం ఇంకా మిగిలే ఉంది.. ఇలాంటి తాతయ్యలు నూటికో కోటికో ఒక్కరే
81 ఏళ్ల వయసులో శరీరం కొంత సహకరించకపోయినా సేవ చేయాలన్న మనసు మాత్రం యవ్వనంతో సమానం. తెల్లవారుజామునే లేచి తాజా పాలు తెప్పించుకుంటారు. బిస్కెట్ల ప్యాకెట్లు సిద్ధం చేస్తారు. ఆసుపత్రి సమీపంలోని ఆయన ఇంటి చుట్టూ రోగులు, అటెండెంట్ల ముఖాల్లో చిరునవ్వులు కన్పిస్తాయి. సారూ వచ్చారు.. ఇవాళ కూడా..
- G Sampath Kumar
- Updated on: Nov 26, 2025
- 1:43 pm