సంపత్ కుమార్ గాండ్ల , టీవీ9 తెలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫర్ గా 17ఏళ్లుగా పనిచేస్తున్నాను. మొదట ఆంధ్రజ్యోతి లో పని చేశాను.గత 17 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నాను .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. బాల్య వివాహాలు పై చేసిన స్టోరీ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది.. అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి.. సత్కరించింది..
ఉపాధిహామీ పనుల వద్ద అసలైన పెళ్లి వేడుక.. తోటి కూలీ దంపతులకు 41వ మ్యారేజ్ డే గిఫ్ట్.. మటన్ విందుతో రచ్చ!
ఉపాధిహామీ పనులు అనగానే ఎండలో కష్టపడటం, చెమటలు చిందించడం గుర్తుకొస్తాయి. కూలీలు ఆ అలసటను మరిచిపోవడానికి అప్పుడప్పుడు పాటలు పాడటం, డ్యాన్స్లు చేయడం, ఉత్తుత్తి నాటకాలు వేయడం వంటివి చేస్తుంటారు. కానీ, జగిత్యాల జిల్లాలో ఉపాధిహామీ కూలీలు ఒక నిజమైన దంపతులకు, పనుల వద్దే అసలైన పెళ్లిని తలపించేలా వేడుకను నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించడమే కాకుండా, వచ్చిన వారందరికీ మటన్ విందు ఇచ్చి ఈ వేడుకను చిరస్మరణీయంగా మార్చారు.
- G Sampath Kumar
- Updated on: Jun 7, 2026
- 12:52 pm
Viral Video: తుప్పల్లో ఏదో తెలియని అలజడి.. ఏంటా అని దగ్గరికి వెళితే.. వామ్మో
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని శ్రీరామ కాలనీలో రెండు పాములు ఒకదానితో ఒకటి పెనవేసుకుని విన్యాసాలు చేసిన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. గృహ సముదాయాల మధ్య దాదాపు 20 నిమిషాల పాటు కనిపించిన ఈ దృశ్యాన్ని స్థానికులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొందరు ఆసక్తిగా వీక్షించగా, మరికొందరు భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు.
- G Sampath Kumar
- Updated on: Jun 3, 2026
- 5:06 pm
ఉపాది హామీ కూలీలకు కొత్త టెన్షన్.. గుండు చేసుకుంటే గుర్తుపట్టిని యాప్.. చివరకు ఏం చేశారంటే?
సాంకేతికత ఎంత పెరిగినా కొన్నిసార్లు అది తెచ్చే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ వెలుగు చూసింది. ఉపాధి హామీ పథకంలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఫేస్రికగ్నైజేషన్ ఇప్పుడు కూలీలకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొక్కుబడి కోసం గుండు చేయించుకున్న కూలీలను యాప్ గుర్తించకపోవడంతో, వారు హాజరు కోసం విగ్గులు పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
- G Sampath Kumar
- Updated on: Jun 3, 2026
- 3:27 pm
కన్నతల్లి కాదన్నా.. మమకారం అక్కున చేర్చుకుంది! మరుగుదొడ్డిలో దొరికిన పసికందుకు పునర్జన్మ!
కన్నతల్లి కాదనుకుని వదిలేసినా.. మానవత్వం ఆ పసిప్రాణాన్ని అక్కున చేర్చుకుంది. పుట్టిన కొద్ది గంటల్లోనే బస్టాండ్ మరుగుదొడ్డిలో అనాధగా పడివున్న ఓ పసికందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పునర్జన్మను ప్రసాదించారు. 37 రోజుల పాటు కంటికి రెప్పలా చూసుకుని, ప్రాణాలు నిలబెట్టడమే కాకుండా.. ఆ చిన్నారికి ఒక పేరు, ఒక గుర్తింపును ఇచ్చి కొత్త జీవితానికి బాటలు వేశారు.
- G Sampath Kumar
- Updated on: Jun 2, 2026
- 5:52 pm
భార్య విడాకులు ఇచ్చిందని వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడి హైడ్రామా.. ప్రాణాలకు తెగించిన కానిస్టేబుల్!
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం (జూన్ 02) ఓ యువకుడు మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి, ట్యాంక్ పైనుంచి దూకేస్తానంటూ సదరు యువకుడు చేసిన హంగామాతో ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. అయితే, పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, చాకచక్యంగా అతడిని రక్షించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
- G Sampath Kumar
- Updated on: Jun 2, 2026
- 4:01 pm
ఖాకీల కళ్లు గప్పి దశాబ్దకాలం ‘దూమ్’.. భార్యను చంపే స్కెచ్తో సెల్ఫ్ గోల్.. ఎలా చిక్కాడంటే?
దశాబ్ద కాలంగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు... ఎవరిని అడిగినా అతడు ఎప్పుడో చనిపోయాడు అనే సమాధానమే వస్తోంది. కానీ, చనిపోయాడనుకున్న ఆ కరుడుగట్టిన నేరస్థుడు క్షేమంగా బ్రతికే ఉండటమే కాకుండా, తెరవెనుక మరో ఘోరానికి స్కెచ్ వేస్తూ కరీంనగర్ రూరల్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
- G Sampath Kumar
- Updated on: Jun 2, 2026
- 3:38 pm
ఒకే రోజు గంటల వ్యవధిలో శవాలుగా మరిన వృద్ధ దంపతులు.. మిన్నంటిన రోధనలు
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా నిలిచిన వృద్ధ దంపతుల.. చివరకు మరణంలోనూ విడిపోకుండా ఒకేరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం గ్రామస్థులను తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది..
- G Sampath Kumar
- Updated on: Jun 1, 2026
- 6:10 pm
ప్రాణం ఇస్తానన్నాడు… ప్రాణం తీసేసుకున్నాడు.. మిడ్ మానేరులో గుండెల్ని పిండేసే విషాదం!
వేసవి కాలం వస్తే చాలు.. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కోసం, కాసేపు సరదాగా గడిపేందుకు యువత చెరువులు, నదులు, జలాశయాల వైపు అడుగులు వేస్తుంటారు. కానీ, ఆ సరదా ఒక్కోసారి జీవితాంతం తీరని శోకాన్ని మిగులుస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఒక ఘోర దుర్ఘటన నిరూపించింది. స్నేహితులతో కలిసి నవ్వుతూ వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
- G Sampath Kumar
- Updated on: May 22, 2026
- 1:49 pm
వార్నీ శునకం.. అక్కడికి ఎలా వెళ్లిందో? రక్షించేందుకు రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది..ఆ సీన్ చూశారంటే..
ప్రాణం విలువ మనుషులకే కాదు.. భూమిపై ఉన్న ప్రతి మూగజీవానికి సమానమేనని నిరూపించే ఘటనలు అప్పుడప్పుడు మనకు కనిపిస్తుంటాయి. తాజాగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇలాంటి మానవత్వంతో కూడిన ఒక అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. ప్రమాదకర స్థితిలో భవనంపై చిక్కుకుని, ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న ఒక కుక్కను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడి రియల్ హీరోలుగా నిలిచారు. అసలేం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
- G Sampath Kumar
- Updated on: May 21, 2026
- 5:28 pm
ఆటపాటల వేళ.. అనంత లోకాలకు: ముగ్గురు చిన్నారుల ప్రాణం తీసిన కోనేరు!
జగిత్యాల జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదాగా ఆడుకోవడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన మేడిపల్లి మండలంలోని కొండపూర్ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- G Sampath Kumar
- Updated on: May 21, 2026
- 12:03 pm
వేములవాడలో అద్భుతం.. ఆలయ సమీపంలో అరుదైన శ్వేత నాగు.. అకస్మాత్తుగా తిరగబడి..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వరాలయం సమీపంలో అరుదైన శ్వేత నాగు ప్రత్యక్షమై భక్తులను భయాందోళనకు గురిచేసింది. భారీ పరిమాణంలో ఉన్న ఈ నాగు ఆలయ పరిసరాల్లో సంచరిస్తుండటంతో స్థానికులు, భక్తులు భయంతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ జగదీశ్ చాకచక్యంగా పామును పట్టుకునే సమయంలో నాగుపాము తిరగబడినా, చివరకు సురక్షితంగా రక్షించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
- G Sampath Kumar
- Updated on: May 19, 2026
- 4:21 pm
Telangana: సిరిసిల్ల కోర్టు సంచలన తీర్పు.. ఆ కేసులో 10 మందికి జీవిత ఖైదు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలన సృష్టించిన హత్య కేసుపై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో పది మంది నిందితులకు సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ జీవిత ఖైదు విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించారు. అదేవిధంగా ప్రతి నిందితుడికి రూ.6500 జరిమానా కూడా విధించారు.
- G Sampath Kumar
- Updated on: May 19, 2026
- 3:57 pm