సంపత్ కుమార్ గాండ్ల , టీవీ9 తెలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫర్ గా 17ఏళ్లుగా పనిచేస్తున్నాను. మొదట ఆంధ్రజ్యోతి లో పని చేశాను.గత 17 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నాను .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. బాల్య వివాహాలు పై చేసిన స్టోరీ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది.. అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి.. సత్కరించింది..
ఎండలో ఎలా తాగేది..? వైన్షాపులో సౌకర్యాలు లేక మందుబాబుల ఆందోళన.. ఏం చేశారంటే..
షాపు షట్టర్ మూసివేసిన మద్యంప్రియులు తమ నిరసన వ్యక్తం చేశారు. వైన్ షాప్ ఓనర్ రావాలని తను వచ్చేవరకు షట్టర్ ఓపెన్ చేసేది లేదని సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు. వైన్ షాప్ పర్మిట్ రూమ్ లో ఫ్యాన్లు లేక, పక్కనే ఉన్న టాయిలెట్స్ తో దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అంటూ మందుబాబులు ఆందోళన వ్యక్తం చేశారు.
- G Sampath Kumar
- Updated on: Apr 13, 2025
- 10:35 am
మామిడి చెట్లకు కల్యాణం.. ఇదో వింత ఆచారం.. ఆసక్తిగా తిలకించిన స్థానికులు..
ఇందులో భాగంగా గ్రామస్థులను, బంధువులను తోటకు ఆహ్వానించి సహపంక్తి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు రైతు దంపతులు. బీర్ పూర్ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ అర్చకుడు వొద్దివర్తి మధు కుమారా చార్యులు వేద మంత్రోఛ్చారణల నడుమ మామిడి చెట్లకు వివాహం కొనసాగింది. మొదటి కాత సమయం లో..ఈ విధంగా పెళ్లి ని నిర్వహిస్తారు.. ఇలా మామిడి చెట్ల కు పెళ్లి నిర్వహిస్తే..
- G Sampath Kumar
- Updated on: Apr 13, 2025
- 9:36 am
Watch: ఆర్టీసీ బస్సులో తాగుబోతు వీరంగం.. ఈడ్చి ఈడ్చి తన్నిన ఆడవాళ్లు
తాగుబోతు చేష్టలకు విసిగిపోయిన ఆ యువతులు ఎదురుతిరిగారు. అతడ్ని కాలితో తన్నుతూ బస్సులోంచి కిందకు దింపేశారు..చేతికి దొరికిన కర్రలతో కొట్టి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఇదంతా తమ సెల్ఫోన్లలో రికార్డ్ చేసిన తోటి ప్రయాణికులు వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది..
- G Sampath Kumar
- Updated on: Apr 13, 2025
- 9:12 am
Telangana: ఆ ఒక్కరోజు వెళ్లకుంటే.. పరిస్థితి మరోలా ఉండేది!..కన్నీళ్లు పెట్టిస్తున్న ఆ కుటుంబ పరిస్థితి!
ఓ వ్యక్తి 5 ఏళ్లుగా కోమా లోనే ఉన్నాడు. మెరుగైన వైద్యం అందిస్తే.. అతను కోమా నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబసభ్యులు అతన్ని చిన్న పిల్లాడిలా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఐదేళ్ల క్రితం ఓ శుభకార్యానికని బయల్దేరాడు ఆ యువకుడు. కానీ, విధి వక్రించింది. ఆరోజు జరిగిన ప్రమాదంలో ఆ యువకుడు కోమాలోకి వెళ్లాడు.
- G Sampath Kumar
- Updated on: Apr 15, 2025
- 4:16 pm
హనుమాన్ భక్తులకు భిక్ష.. పూజ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. ట్రోల్స్తో బీజేపీ రియాక్షన్..!
వ్యక్తిగత నమ్మకాలు వేరు.. ప్రజా సమూహంలో.. అందులోనూ, రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల విశ్వాసాలను గుర్తించడం వేరు. దేవుడిని నమ్మడం నమ్మకపోవడం.. విపరీతంగా పూజించడం.. దాన్నే చర్చకు పెట్టడం ఇవన్నీ ఇవాళ రాజకీయాల్లో భాగమైపోయాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరయ్యారు. హనుమాన్ దీక్షాపరులతో కలిసి భిక్షలో పాల్గొని వారితో సహపంక్తి భోజనం చేశారు.
- G Sampath Kumar
- Updated on: Apr 12, 2025
- 12:30 pm
Telangana: ఎందుకమ్మా ఇలా చేశావ్..! భర్త శుభకార్యానికి వెళ్లి వచ్చేసరికి..
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది.. ఓ మహిళ మూడేళ్ల చిన్నారికి ఉరివేసి.. ఆపై తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. పెద్దపల్లి పట్టణంలోని టీచర్స్ కాలనీలో వేణుగోపాల్ రెడ్డి, లోక సాహితి రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు సంతానం.. ఏమైందో ఏమో కానీ.. ఇంట్లో ఎవరు లేని సమయంలో..
- G Sampath Kumar
- Updated on: Apr 10, 2025
- 9:30 am
Telangana: మనుషుల మధ్యే కాదు.. మర్కటాల మధ్య లోకల్, నాన్ లోకల్ పంచాయితీ..!
శతమర్కటం...పితలాటకం. కోతుల యుద్ధం మనుషుల చావుకొచ్చింది. మనుషులకే కాదు మర్కటాలకు కూడా గట్టు పంచాయితీలు ఉంటాయి. నేను లోకల్ అంటూ అవి యుద్ధానికి దిగితే ఎట్టా ఉంటాదో తెలుసా? ఓ చిన్న పల్లె సాక్షిగా వేలాది కోతులు సరిహద్దు పంచాయితీపై బస్తీ మే సవాల్ అన్నాయి. ఆ యుద్ధం చూసిన ఊరు గజగజలాడిపోయింది.
- G Sampath Kumar
- Updated on: Apr 8, 2025
- 4:09 pm
GOLDEN SAREE: సిరిసిల్ల నేతన్న అద్భుతం..రూ.2.80లక్షలతో బంగారు చీర
చేనేత వస్ట్రాలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే జిల్లా సిరిసిల్ల. ఇది తెలంగాణ ఎన్నో జానపద కళలకు, హస్తకళలకు నిలయం. జాతీయస్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ ఇక్కడి వస్త్రాలకు ఎంతో గుర్తింపు ఉంది. అగ్గిపెట్టేలో పట్టే చీరను నేసి అబ్బుర పరిచిన నేతన్నలు, తాజాగా మరో అద్భుతాన్ని సృష్టించారు. మగ్గంపై బంగారు చీరను నేసి అందరినీ ఔరా అనిపించారు
- G Sampath Kumar
- Updated on: Apr 8, 2025
- 3:12 pm
భద్రాద్రి సీతమ్మవారికి సిరిసిల్ల నేతన్న కానుక.. బంగారు పట్టు చీర..!
దక్షిణాది అయోధ్య భద్రాచలం రాములవారి కళ్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. పవిత్ర గోదావరి నదీ ఒడ్డున.. మిథిలా స్టేడియంలో జానకీ రాముల పెళ్లికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. భక్తులకు పంచేందుకు 200 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు ఆలయ అధికారులు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటలో సీతమ్మ వారికి బంగారు పట్టు చీర తయారయింది.
- G Sampath Kumar
- Updated on: Apr 4, 2025
- 3:37 pm
Telangana: అర్ధరాత్రి మేకపోతుతో స్కూల్లో ఇద్దరు వ్యక్తులు.. అనుమానంతో ఆరా తీయగా.. పెద్ద కథే
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నిత్యం వందల మంది తిరిగే నడి బొడ్డున ప్రధాన రహదారి ఆనుకోని ఉన్న ఓ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం రేపాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.? ఓ సారి లుక్కేయండి
- G Sampath Kumar
- Updated on: Apr 4, 2025
- 12:39 pm
మండుతున్న ఎండలతో చేపల విలవిల.. గోస వెళ్లబోస్తున్న మత్స్యకారులు..!
నీటి నిల్వ ఎక్కువగా ఉంటే.. చేపలు.. కింది వరకు వెళ్లితాయి. ఆహారం కూడా ఎక్కువగా దొరుకుతుంది. నీరు తక్కువగా ఉండటంతో.. నీళ్లు వెంటనే వేడిగా మారుతున్నాయి. వాటిని తాగడంతో చేపలు అలిసిపోతున్నాయి. అస్వస్థతకు గురై చనిపోతున్నాయి. అన్ని రకాలు చేపలు చనిపోవడంతో.. మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కనీసం గిట్టుబాటు ధర కూడా పలికడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు.
- G Sampath Kumar
- Updated on: Apr 3, 2025
- 5:28 pm
ఆలయాల ఊరు.. ఒకే గ్రామంలో ఏకంగా 70 దేవాలయాలు! ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే..
వెల్లుల్ల గ్రామం, జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలంలో ఉంది. ఈ చిన్న గ్రామంలో 70కి పైగా ఆలయాలు, ముఖ్యంగా 54 హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. భక్తుల కోరికలు తీరిన తర్వాత కొత్త ఆలయాల నిర్మాణం ఒక ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతి ఆలయంలోనూ నిత్య పూజలు జరుగుతాయి.
- G Sampath Kumar
- Updated on: Apr 3, 2025
- 2:14 pm