సంపత్ కుమార్ గాండ్ల , టీవీ9 తెలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫర్ గా 17ఏళ్లుగా పనిచేస్తున్నాను. మొదట ఆంధ్రజ్యోతి లో పని చేశాను.గత 17 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నాను .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. బాల్య వివాహాలు పై చేసిన స్టోరీ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది.. అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి.. సత్కరించింది..
Telangana: ఇసుక నుంచి ఏం బయటపడిందో తెలుసా..? ఆశ్చర్యపడిన జాలర్లు..
గోదావరి నది ఇసుకలో నుంచి వెలుగుచూసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పురాతన విగ్రహం ధర్మపురిలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దైవ మహిమగా భావిస్తున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా, ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. .. ..
- G Sampath Kumar
- Updated on: Jul 17, 2026
- 1:48 pm
Watch: వర్షాల కోసం దరిద్ర దేవతను ఊరి నుంచి సాగనంపిన జనం.. ఎలానో మీరే చూడండి
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించే జెట్టక్క ఉత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గ్రామంలో దరిద్రం, అశుభాలు తొలగిపోయి ఐశ్వర్యం, సిరిసంపదలు వెల్లివిరియాలనే ఆకాంక్షతో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత చీపుర్లు, పనికిరాని వస్తువులను ఊరేగింపుగా గ్రామ శివారు వరకు తీసుకెళ్లి సంప్రదాయ ఆచారాలను పాటించారు. మంచి వర్షాలు కురిసి రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని సామూహికంగా ప్రార్థనలు చేశారు. గ్రామ యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో రుద్రంగిలో పండుగ వాతావరణం నెలకొంది..
- G Sampath Kumar
- Updated on: Jul 13, 2026
- 12:59 pm
అంతా శివుడి మహత్యం.. సోమవారం నాడు ప్రత్యక్షమైన అరుదైన శ్వేతనాగు.. ఇదిగో వీడియో
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని పురాతన సాంబమూర్తి ఆలయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆలయ గర్భగుడిలో నాగదేవత విగ్రహాల ఎదురుగా తెల్లటి శ్వేతనాగు ప్రత్యక్షమవడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆరుద్ర నక్షత్రం వచ్చిన సోమవారం రోజున ఈ ఘటన జరగడంతో చాలామంది దీనిని శివుడి మహిమగా, శుభసూచకంగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- G Sampath Kumar
- Updated on: Jul 13, 2026
- 11:27 am
Watch Video: భూమిపూజకు వచ్చి పరుగులు తీసిన ప్రజాప్రతినిధులు.. ఏం జరిగిందంటే?
కేంద్రీయ విద్యాలయ భూమిపూజ కార్యక్రమంలో అనూహ్యంగా పాముల కలకలం చోటుచేసుకుంది. కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో వేదిక సమీపంలో వరుసగా నాలుగు పాము పిల్లలు కనిపించడంతో ప్రజలు, అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లాఠీల సహాయంతో పాములను అక్కడి నుంచి సురక్షితంగా తరిమివేశారు..
- G Sampath Kumar
- Updated on: Jul 13, 2026
- 8:21 am
గ్రామంలో వరుస మరణాలు.. భయంతో ఇళ్లు వదిలి అడవి బాట పట్టిన జనాలు.. అసలక్కడేం జరుగుతుంది!
అది మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ ప్రాంతమే అయినా.. అక్కడ పల్లె పోకడలు, పాత నమ్మకాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో వరుసగా చోటుచేసుకున్న మరణాలు ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి. ఏదో కీడు సోకిందనే భయంతో, పురోహితుడి సూచన మేరకు శతాబ్దాల నాటి ఆచారాన్ని పాటిస్తూ కాలనీవాసులంతా ఊరు విడిచి అడవి బాట పట్టారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది.
- G Sampath Kumar
- Updated on: Jul 12, 2026
- 9:33 pm
షాకింగ్: మిల్ మేకర్ తింటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే.. కరీంనగర్లో బయటపడ్డ ఘోర కల్తీ!
ఆహార కల్తీ నిరోధక చర్యల్లో భాగంగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ మరియు పోలీస్ టాస్క్ఫోర్స్ అధికారులు కరీంనగర్ జిల్లాలో ఒక భారీ కల్తీ నెట్వర్క్ను ఛేదించారు. మానవ వినియోగానికి ఉద్దేశించిన సోయాచంక్స్ (మిల్మేకర్) తయారీలో పశువుల దాణాగా ఉపయోగించే రఫ్ బ్రాన్ (Rough Bran) కలుపుతున్న ఒక ఫ్యాక్టరీపై అధికారులు ఉమ్మడిగా దాడి చేసి, పెద్ద మొత్తంలో నిల్వలను సీజ్ చేశారు.
- G Sampath Kumar
- Updated on: Jul 11, 2026
- 1:13 pm
ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు.. తెల్లారేసరికల్లా బూడిద.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు కార్లకు నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- G Sampath Kumar
- Updated on: Jul 10, 2026
- 11:37 am
25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చేందుకు కేరళ నుంచి ధర్మపురికి.. స్నేహానికి నిలువెత్తు నిదర్శనం
25 ఏళ్ల క్రితం సౌదీలో స్నేహితుడి వద్ద తీసుకున్న అప్పును మరచిపోని కేరళకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్.. పూర్తి చిరునామా కూడా లేకపోయినా గూగుల్ సాయంతో జగిత్యాల జిల్లా ధర్మపురికి చేరుకుని రూ.25 వేల అప్పును తీర్చాడు. అతడి నిజాయితీ, స్నేహానికి విలువ ఇచ్చిన తీరు స్థానికులను భావోద్వేగానికి గురిచేస్తోంది.
- G Sampath Kumar
- Updated on: Jul 10, 2026
- 10:17 am
Telangana: మేము ప్రేమించుకున్నాం.. నువ్వు పెళ్లి చేసుకోవద్దు.. లవర్ ఐడియా మామూలుగా లేదుగా
ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే.. దేవదాసు అవ్వడమో లేదా వారిపై పగ తీర్చుకోవడమో చేసిన ఘటనలు ఇప్పటివరకు మనం చాలానే చూశాం. కానీ ఇక్కడో యువకుడు మాత్రం.. కాస్త వినూత్నంగా ఆలోచించాడు. తాను ప్రేమించిన యువతి తనకు దక్కట్లేదనే కోపంతో ఎలాగైనా ఆమె పెళ్లి ఆపాలని.. ఏకంగా వరుడి ఊరికి వెళ్లి, తామిద్దరూ కలిసి దిగిన ఫోటోలకు సంబంధించిన పోస్టర్లను ఊరంతా అంటించి వెళ్లాడు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
- G Sampath Kumar
- Updated on: Jul 8, 2026
- 8:27 pm
Watch Video: ఆరు ఎకరాల ఆస్తి ఉన్నా ఇంటింటికి తిరిగి భిక్షాటన.. వృద్ధ దంపతుల కన్నీటి గాథ
నవమాసాలు మోసి, రెక్కల ముక్కలు చేసుకొని పెంచిన తల్లిదండ్రులను నడిరోడ్డుపై నిలబెట్టాడు. ఆరు ఎకరాల వ్యవసాయ భూమి, సొంత ఊరిలో పెద్ద బంగ్లా ఉన్నా.. ఆ వృద్ధ దంపతులకు మాత్రం భిక్షాటనే శరణ్యమైంది. సమాజం తలదించుకునే ఈ అమానవీయ ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని దమ్మక్కపేటలో వెలుగుచూసింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
- G Sampath Kumar
- Updated on: Jul 8, 2026
- 6:07 pm
ఏడేళ్ల చిన్నారి మహాదానం.. అవయవదానం చేసి ఆరుగురికి కొత్త జీవితం
ఏడేళ్ల చిన్నారి... ఇంకా లోకాన్ని పూర్తిగా చూడలేదు. తల్లిదండ్రుల ఒడిలో ఆడుకోవాల్సిన వయసు. కానీ విధి అతడిని అర్థాంతరంగా దూరం చేసింది. అయితే అతని జీవితం అక్కడితో ముగియలేదు. తన చిన్న గుండె ఆగిపోయినా... మరో ఆరుగురి జీవితాల్లో ఆశగా, వెలుగుగా, కొత్త ఊపిరిగా నిలిచిపోయాడు..
- G Sampath Kumar
- Updated on: Jul 7, 2026
- 7:31 pm
అయ్.. బాబోయ్ అడుగడుగునా పాములే.. జనాల్లో భయం భయం
వర్షాలు కురుస్తున్నాయి. రైతుల్లో ఆశలు నింపుతున్నాయి. కానీ... అదే వర్షం ఇప్పుడు భయాన్ని కూడా తీసుకొచ్చింది. ఇన్నాళ్లు ఎండ వేడికి పుట్టల్లో, బండల కింద దాక్కున్న పాములు... ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులకు... ఇంటి పరిసరాల్లో తిరిగే ప్రజలకు... ఈ పాముల సంచారం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వానాకాలం మొదలైతే పాముల బెడద పెరుగుతుంది. పట్టణం..పల్లె అనే తేడా లేకుండా.. పాములు సంచరిస్తున్నాయి. వారం రోజుల నుంచి వర్షాలు కురియడం తో చల్లబడిన నేల, తేమతో నిండిన వాతావరణం, ఇవన్నీ పాముల సంచారానికి అనుకూల పరిస్థితులను కల్పిస్తున్నాయి.
- G Sampath Kumar
- Updated on: Jul 6, 2026
- 7:32 pm