AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G Sampath Kumar

G Sampath Kumar

Staff Reporter - TV9 Telugu

sampath.gandla@tv9.com

సంపత్ కుమార్ గాండ్ల , టీవీ9 తెలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫర్ గా 17ఏళ్లుగా పనిచేస్తున్నాను. మొదట ఆంధ్రజ్యోతి లో పని చేశాను.గత 17 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నాను .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. బాల్య వివాహాలు పై చేసిన స్టోరీ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది.. అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి.. సత్కరించింది..

Read More
గుండె పగిలే విషాదం.. గుడిలో అన్నదానం చేస్తుండగా ఊహించని ఘటన..

గుండె పగిలే విషాదం.. గుడిలో అన్నదానం చేస్తుండగా ఊహించని ఘటన..

జగిత్యాల రూరల్ మండలం పోరండ్లలో అన్నదానం చేస్తుండగా 3వ తరగతి చదువుతున్న నిశాంత్ గుండెపోటుతో మృతి చెందాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Telangana: మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే నోరెళ్లబెడతారు..

Telangana: మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే నోరెళ్లబెడతారు..

మందు కొట్టడం ఒక ఎత్తు అయితే.. పోలీసులకు దొరక్కుండా ఇంటికి చేరడం మరో ఎత్తు.. దీని కోసం గోదావరిఖని మందుబాబులు ఏకంగా ఒక వాట్సాప్ ఆర్మీనే తయారు చేశారు. పోలీసు మామల స్క్వాడ్ పేరుతో గ్రూప్ కట్టి పోలీసులకే చెక్ పెట్టాలనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే.. స్వయంగా ఎస్ఐ ఆ గ్రూప్‌లోకి ఎంట్రీ ఇచ్చి వీడియో కాల్ చేయడంతో అంతా నివ్వెరపోయారు..

60 ఏళ్ల వయస్సులో స్కూల్ బ్యాగ్ పట్టుకున్న అమ్మమ్మలు.. మహారాష్ట్రలో అద్భుత పాఠశాల!

60 ఏళ్ల వయస్సులో స్కూల్ బ్యాగ్ పట్టుకున్న అమ్మమ్మలు.. మహారాష్ట్రలో అద్భుత పాఠశాల!

శివాజీని అమితంగా ఆరాధించే మహారాష్ట్రలో ఓరోజు ఆయన జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కొందరు ఉపన్యాసాలివ్వడం చూసి తామా అఇలా మాట్లాడగల్గితే, చూసి చదవగల్గితే బాగుండు కదా అన్న ప్రస్తావన తెచ్చారు ఫంగానే గ్రామీణ మహిళలు. ఆ మాట యోగేంద్ర బంగార్ అనే వ్యక్తి మనసులో నాటుకుంది.

ఆ పసిపాపల నవ్వులు ఒక్కసారిగా మాయం.. చీకటిగా మారిన ఓ తల్లి జీవితం..!

ఆ పసిపాపల నవ్వులు ఒక్కసారిగా మాయం.. చీకటిగా మారిన ఓ తల్లి జీవితం..!

ఈ ఘటన కేవలం ఒక కుటుంబ విషాదం మాత్రమే కాదు.. సమాజానికి అద్దం పట్టే సంఘటన. ఆడపిల్ల పుట్టడాన్ని ఇంకా కొందరు భారంగా భావించే మనస్తత్వం ఎంత ప్రమాదకరమో ఇది స్పష్టం చేస్తోంది. విద్య పెరిగినా, కాలం మారినా.. ఆలోచనలో మార్పు రాకపోతే ఇలాంటి దారుణాలు ఆగవు. పసిపాపల నవ్వులు ఒక్కసారిగా మాయమవ్వడం.. ఒక తల్లి జీవితమే చీకటిలో మునిగిపోవడం.. ఈ సంఘటన మనలో ప్రతి ఒక్కరినీ బాధ కలిగిస్తుంది.

గ్యాస్ అవసరం లేదు.. డీజిల్‌తో పనిచేసే స్టవ్.. మీ క్రియేటివిటీకి దండం పెట్టాల్సిందే సామీ..

గ్యాస్ అవసరం లేదు.. డీజిల్‌తో పనిచేసే స్టవ్.. మీ క్రియేటివిటీకి దండం పెట్టాల్సిందే సామీ..

గ్యాస్ కొరతతో హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ పూర్తిగా మూతపడ్డాయి. ఇక మరికొన్ని హోటళ్లు మెనూను తగ్గించడంతో పాటు ధరలను పెంచాయి. అయితే గ్యాస్ కొరత వేళ ఓ హోటల్ యజమాని వినూత్న ప్రయోగం చేశాడు. డీజిల్‌తో నడిచే స్టవ్ తయారుచేశాడు.

Telangana: అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో ముస్లిం వ్యక్తి..

Telangana: అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో ముస్లిం వ్యక్తి..

మతం ఏదైతేనేం.. మనసు పవిత్రంగా ఉంటే భక్తి ఒక్కటే అని నిరూపించాడు ఆ వ్యక్తి.. కులమతాల మధ్య గోడలు పెరుగుతున్న నేటి కాలంలో, మానవత్వమే నా మతం అంటూ హనుమాన్ దీక్ష చేపట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రాణాపాయం నుంచి కాపాడిన ఆ అంజన్నపై నమ్మకంతో, కాషాయ వస్త్రాలు ధరించి కఠిన దీక్షతో కొండగట్టు స్వామి మొక్కు తీర్చుకున్నాడు.

Telangana: ఆ ఊళ్లోకి ఐస్ క్రీమ్ బండి వస్తే అంతే సంగతులు.. రూ.5000 కట్టాల్సిందే..

Telangana: ఆ ఊళ్లోకి ఐస్ క్రీమ్ బండి వస్తే అంతే సంగతులు.. రూ.5000 కట్టాల్సిందే..

అక్కడ ఐస్‌క్రీమ్ బండి కనిపిస్తే చాలు అమ్మే వ్యక్తి జేబుకు ఐదు వేల రూపాయల చిల్లు పడాల్సిందే.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, జగిత్యాల జిల్లాలోని మెట్ల చిట్టాపూర్ గ్రామం ఇప్పుడు కల్తీ ఐస్‌క్రీమ్‌ల మీద యుద్ధం ప్రకటించింది. రంగురంగుల రసాయనాలతో పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లకు చెక్ పెట్టేందుకు గ్రామస్థుల నిర్ణయం చర్చనీయాంశమైంది.

గండ్రపల్లిని వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచనతో ఊరంతా ఖాళీ!

గండ్రపల్లిని వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచనతో ఊరంతా ఖాళీ!

ఈ గ్రామంలో వరుసగా చోటుచేసుకున్న మరణాలు గ్రామస్తుల్లో భయాందోళనలకు దారి తీశాయి. గత మూడు నెలల కాలంలో గ్రామంలో మొత్తం 28 మంది వివిధ కారణాలతో మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ గ్రామం లో ఎదో సోకిందని భయపడుతున్నారు.. ఈ చావుల కు ఫుల్ స్టాప్ పెట్టాలంటే కీడు వంటలకు వెళ్లాలని ఓ..పురోహితుడు సూచించారు..దీంతో. గ్రామస్తులు. కీడు వంటలకు వెళ్లారు..

ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. వెంటనే స్పందించిన కలెక్టర్‌.. అధికారులకు ఆదేశాలు?

ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. వెంటనే స్పందించిన కలెక్టర్‌.. అధికారులకు ఆదేశాలు?

ప్రజావాణిలో పాల్గొనేందుకు వచ్చిన కలెక్టర్‌ని కదిలించిన విన్నపం ఎదురైంది. అదేదో భూమి పంచాయతీ, గెట్టు వివాదం కాదు.. అనారోగ్యం, ఆర్థిక సమస్య అసలే కాదు..అది ఒక చిన్నారి చేసిన అభ్యర్థన. తన భవిష్యత్తుకు సంబంధించిన మార్గదర్శనం కోసం ఆ చిన్నారి చేసిన విన్నపం. చిన్నారి కోరిక విన్న కలెక్టర్‌ ఉన్నపళంగా స్పందించారు. వెంటనే తన కోరిక తీర్చేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంతకీ ఆ విన్నపం ఏంటి..? ఏకంగా కలెక్టర్‌ కరిగిపోయేలా చేసిన ఆ వినతి ఏంటో ఇక్కడ చూద్దాం..

Telangana: 700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత మీకు తెలుసా?

Telangana: 700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత మీకు తెలుసా?

ఆ గ్రామంలో ఓ పురాతన ఆయలం ఉంది. శీతారాములుకొలువై ఉన్న ఈ ఆలయంలో ఉన్న దీపం నిరంతరం వెలుగుతూనే ఉంది. దాన్ని వెలిగించి దాదాపు 700 ఏళ్లు దాటిన ఇంకా ఆ దీపం కొండెక్కలేదు.. ఆ నాటి నుంచి నేటి వరకు చెక్కుచెదరకుండా ప్రకాశిస్తూనే ఉంది. ఇంతకు ఆ ఆలయం ఎక్కడుందనేగా మీ డౌట్.. అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తవ్వకాలకు వెళ్లగా కనిపించిన ఆరడుగుల గొయ్యి.. ఏంటా అని వెళ్లి చూసి బిత్తరపోయారు..!

తవ్వకాలకు వెళ్లగా కనిపించిన ఆరడుగుల గొయ్యి.. ఏంటా అని వెళ్లి చూసి బిత్తరపోయారు..!

పురాతన ప్రాంతం అని తెలిస్తే చాలు.. గుప్తనిధుల కోసం గ్యాంగులకు గ్యాంగులు దిగిపోతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారో ఎలా వస్తున్నారో తెలియట్లేదు కానీ.. స్థానికులను మాత్రం హడలెత్తిస్తున్నారు. క్షుద్రపూజలతో కూడిన తవ్వకాలు జరుపుతూ... జనాలు బెంబేలెత్తిపోయేలా చేస్తున్నారు. లేటెస్ట్‌గా కరీంనగర్‌ జిల్లాలోని మొలంగూర్‌లో ఓ బ్యాచ్ దిగడం స్థానికంగా కలకలం రేపింది.

ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టు.. గంటలకొద్దీ రోడ్లపై చక్కర్లు కొట్టు.. పల్లెల్లో పెరిగిన కొత్త కల్చర్!

ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టు.. గంటలకొద్దీ రోడ్లపై చక్కర్లు కొట్టు.. పల్లెల్లో పెరిగిన కొత్త కల్చర్!

నగరాల్లోనే కాదు పల్లెల్లోనూ ఈవీ వెహికిల్స్ తెగ తిరిగేస్తున్నాయి..! అఫీషియల్‌గా ఆఫీసులకే కాదు.. పొలం పనులకు వెళ్లే రైతన్నకు నేస్తమయ్యాయి..! తక్కువ ఖర్చు.. ఎక్కువ ప్రయాణం.. అన్నింటికంటే ముఖ్యంగా జీరో పొల్యూషన్ కావడంతో కరీంనగర్‌ జిల్లాలోని పల్లెల్లో ఇప్పుడు ఎక్కువ ఎలక్ట్రికల్‌ స్కూటర్లే రోడ్డెక్కుతున్నాయి. పెట్రోల్ సమస్య అసలే లేదంటున్నారు ఈవీ వెహికల్‌ ఓనర్స్..!