సంపత్ కుమార్ గాండ్ల , టీవీ9 తెలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫర్ గా 17ఏళ్లుగా పనిచేస్తున్నాను. మొదట ఆంధ్రజ్యోతి లో పని చేశాను.గత 17 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నాను .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. బాల్య వివాహాలు పై చేసిన స్టోరీ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది.. అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి.. సత్కరించింది..
Telangana: అడుక్కుని అయినా తినొచ్చు కదరా.. అందమైన పెళ్లాన్ని అడ్డు పెట్టుకుని ఇదేం పాడు పని..
సోషల్ మీడియా వేదికగా బ్లాక్ మెయిల్ చేస్తున్న దంపతుల బాగోతాన్ని కరీంనగర్ రూరల్ పోలీసులు బట్టబయలు చేసారు.. భార్యభర్తలు ఇద్దరూ కలిసి వలపు వల వేసి అమాయకులను టార్గెట్ చేసేవారు. ఆ తర్వాత.. నగ్న వీడియోలు బయట పెడుతామంటూ బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయలు దండుకున్నారు..
- G Sampath Kumar
- Updated on: Jan 14, 2026
- 4:40 pm
Telangana: మంచోడని రూ.15 లక్షల కట్నం.. 10 తులాల బంగారం ఇచ్చి పెళ్లి చేశారు.. చివరకు..
వివాహ సమయంలో 15 లక్షల వరకట్నంతో పది తులాల బంగారం తో పాటు తదితర లాంఛనాలను పుట్టింటి వారు శ్రావణ్ కు అప్పగించారు. అయినా సంతృప్తి చెందని శ్రావణ్ కావ్యను పలుమార్లు కట్నం కోసం వేధించారు.. శ్రావణ్, అత్తమామల వేధింపులు ఎక్కువ కావడంతో కావ్య.. తన కుటుంబ సభ్యులకు ఈ విషయం గురించి చెప్పింది.
- G Sampath Kumar
- Updated on: Jan 13, 2026
- 2:50 pm
చదువుకోకుండానే కంపెనీ పెట్టాడు.. చనిపోతానని తెలిసి 15 ఏళ్ల క్రితమే సమాధి కట్టుకున్నాడు.. ఎక్కడంటే..
ఆరడుగుల నేల కోసం ఆఖరి నిమిషంలో.. ఎవరికీ భారం కాకూడదనుకున్నాడు.. చావును కూడా ఒక పండుగలా, ముందే రాసిపెట్టుకుని.. దాన్ని వీలునామాలా మార్చుకున్నాడు. తానొక రోజు వెళ్లిపోతానని తెలుసు.. అందుకే తాను నిద్రపోయే 'శాశ్వత గృహాన్ని' పదిహేనేళ్ల ముందే నిర్మించుకున్నాడు. ఈ రియల్ స్టోరీ ఎక్కడో ఈ కథనంలో తెలుసుకోండి..
- G Sampath Kumar
- Updated on: Jan 11, 2026
- 3:58 pm
Vemulawada: వేములవాడ ఆలయలో బుసలు కొడుతున్న నాగులు..
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో భక్తుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఆలయ వసతి గృహాలు, ధర్మశాలలు, పరిసరాల్లో తరచూ పాములు దర్శనమిస్తుండటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా పార్వతిపురం ధర్మశాలలో నాగుపాము కనిపించడం కలకలం రేపింది. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత, ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
- G Sampath Kumar
- Updated on: Jan 11, 2026
- 12:51 pm
Jagtial District: పొలం బాట పట్టిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్
జగిత్యాల జిల్లాలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి చేసిన క్షేత్ర స్థాయి పర్యటనకు విశేష స్పందన లభించింది. ధర్మపురి మండలంలోని గ్రామాల్లో ఆమె పొలాల్లోకి వెళ్లి మహిళా కూలీలతో కలిసి వరి నాట్లు వేస్తూ, గ్రామీణ జీవన కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అధికారిణిగా మాత్రమే కాకుండా ప్రజలతో కలిసిపోయిన ఆమె పర్యటన అందరి ప్రశంసలు పొందింది.
- G Sampath Kumar
- Updated on: Jan 11, 2026
- 11:10 am
Telangana: రోడ్డుపై పిండం చెల్లాచెదురుగా పడి ఉందనుకునేరు.. తీరా దగ్గరకు వెళ్లి చూడగా
ఉదయాన్నే రైతులు తమ పనులు చేసుకునేందుకు పొలాలకు పయనమయ్యారు. కానీ వారంతా ఓ కూడలి దగ్గరకు చేరుకున్నాక.. కనిపించింది చూసి దెబ్బకు షాక్ అయ్యారు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.
- G Sampath Kumar
- Updated on: Jan 9, 2026
- 10:17 am
ఉబికి వస్తున్న పాతాళ గంగమ్మ.. ఈ నీరు సర్వరోగ నివారిణి.. ఎక్కడుందంటే..?
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి శివారులోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం. ప్రకృతి సోయగానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ ఆలయం.. నాలుగు శతాబ్దాల చరిత్రను తన గర్భగుడిలో దాచుకుని, భక్తుల మనసుల్లో భక్తి జ్యోతిని వెలిగిస్తోంది. బండరాళ్ల మధ్య నుంచి ఉబికే జలధార.. అబ్బురపరిచే దృశ్యంతో భక్తులు పులకించిపోతున్నారు.
- G Sampath Kumar
- Updated on: Jan 7, 2026
- 4:34 pm
Telangana: ఆడపిల్ల పుడితే రూ.5000.. ఆదర్శంగా సర్పంచ్ భరోసా.. ఎక్కడంటే..?
కొదురుపాక సర్పంచ్ మంజుల సుధాకర్ ఆడపిల్లల భవిష్యత్తుకు సరికొత్త ఒరవడిని సృష్టించారు. తన ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామంలో పుట్టే ప్రతి ఆడబిడ్డ పేరున రూ.5,000 సుకన్య సమృద్ధి యోజన కింద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. ఆడపిల్ల భారమనే భావనను తొలగించి, వారి విద్య, వివాహాలకు అండగా నిలిచే ఈ కార్యక్రమం సామాజిక మార్పుకు నాంది పలుకుతోంది.
- G Sampath Kumar
- Updated on: Jan 5, 2026
- 7:15 am
ఆటగదరా శివ.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి..
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. సకాలంలో చికిత్స అందితే ప్రాణాలతో బటయపడుతున్నారు.. చాలా సందర్భాల్లో స్పాట్లోనే చనిపోతున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లాలో కొడుకు గుండెపోటుతో మరణించగా.. అతని మరణాన్ని తట్టుకోలేకపోయిన తండ్రి కూడా.. గంట వ్యవధిలోనే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
- G Sampath Kumar
- Updated on: Jan 4, 2026
- 7:10 pm
Telangana: చట్నీలో బల్లి.. తిన్న 8 మందికి వాంతులు, విరేచనాలు..
హోటళ్లలో తిండి తినాలంటేనే వినియోగదారులు భయపడే పరిస్థితి నెలకొంది. జగిత్యాలలోని ఓ టిఫిన్ సెంటర్లో చట్నీలో బల్లి అవశేషాలు కనిపించడంతో, అది గమనించకుండా తిన్న ఎనిమిది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనతో ఆహార భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
- G Sampath Kumar
- Updated on: Jan 4, 2026
- 10:49 am
ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..!
ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా నడుస్తున్న చిట్టీల వ్యాపారాలపై నియంత్రణ కరువైంది. ఆ ప్రభావం ఇప్పుడు కొందరి ప్రాణాలపైకే తెస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో చిట్టి డబ్బులు అడిగిన పాపానికి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి మట్టుబెట్టడం సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- G Sampath Kumar
- Updated on: Jan 2, 2026
- 12:01 pm
Vegetable Prices: మార్కెట్లో ఆకాశానంటుతున్న కూరగాయల ధరలు..! రీజన్ ఏంటో తెలుసా?
గత కొన్ని రోజులుగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మార్కెట్లోకి వెళ్లి కూరగాయాలు కొందామంటే జనాలు భయపడుతున్నారు. ఎందుకంటే రూ.500 వందలు తీసుకెళ్తే సరిగ్గా ఐదు కేజీల కూరగాయలు కూడా రావట్లేదు. అయితే కూరగాయల రేట్లు ఈ మధ్య కాలంలోనే భారీగా పెరిగాయి. ఇందుకు ప్రధానం కారణం ఏంటని మీరెప్పుడైనా ఆలోచించారా? వీటి రేట్లు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం తగ్గిన ఉష్ణోగ్రతలేనట. అవుతను ఉష్ణోగ్రతలు కూరగాయల రేట్లను ఎలా ప్రభావితం చేస్తాయి అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం పదండి.
- G Sampath Kumar
- Updated on: Jan 1, 2026
- 4:33 pm