సంపత్ కుమార్ గాండ్ల , టీవీ9 తెలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫర్ గా 17ఏళ్లుగా పనిచేస్తున్నాను. మొదట ఆంధ్రజ్యోతి లో పని చేశాను.గత 17 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నాను .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. బాల్య వివాహాలు పై చేసిన స్టోరీ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది.. అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి.. సత్కరించింది..
కన్న కొడుకి కర్కశం.. వృద్ధ దంపతులను ఇంటి నుంచి గెంటేసిన కొడుకు..!
కరీంనగర్లో వృద్ధ దంపతులకు వారి కన్న కొడుకు నుంచి తీవ్ర అన్యాయం జరిగింది. ఆస్తి కోసం కుమారుడు వారిని ఇంటి నుంచి గెంటేయడంతో నిరాశ్రయులయ్యారు. తమకు ఆధారంగా ఉన్న ఇంటిపై చేసిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి, న్యాయం చేయాలని అధికారులు, ప్రజలను వేడుకుంటున్నారు. ఈ ఘటన సమాజంలో తల్లిదండ్రుల పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
- G Sampath Kumar
- Updated on: Sep 16, 2026
- 8:33 pm
కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. ధర చూస్తే గుండె గుభేల్లే
ఉల్లి గడ్డ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యుల వంటింటి బడ్జెట్ కుదేలవుతోంది. నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు భారీగా పెరగడంతో మార్కెట్కు వెళ్లిన గృహిణులు ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు.పది రోజుల క్రితం కిలో ఉల్లి 50 నుంచి 60 రూపాయలు పలకగా.. ప్రస్తుతం మంచి నాణ్యత కలిగిన ఉల్లి 70 నుంచి 80 రూపాయల వరకు చేరింది.
- G Sampath Kumar
- Updated on: Sep 16, 2026
- 12:01 pm
కడుపున పుట్టిన కొడుకే ఇంటి నుంచి గెంటేస్తున్నాడు.. తల్లిదండ్రుల నిరసన..
కరీంనగర్ కోతిరాంపూర్లో ఆస్తి వివాదం నేపథ్యంలో ఓ వృద్ధ దంపతులు ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. 2002లో నిర్మించుకున్న ఇంటిని 2010లో కుమారుడి పేరున గిఫ్ట్ డీడ్ చేసినట్లు లక్ష్మణ్ తెలిపారు. 2023 నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని కుమారుడు ఒత్తిడి చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. భార్య గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో తమకు న్యాయం చేసి, గిఫ్ట్ డీడ్ రద్దు చేయాలని అధికారులను కోరారు. ఈ ఘటనపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
- G Sampath Kumar
- Updated on: Sep 14, 2026
- 8:10 pm
ఫ్రీ కూల్డ్రింక్స్ కోసం ఎగబడిన జనం.. అసలు విషయం తెలిసి షాక్!
ఫ్రీ.. అనే మాట వింటే చాలు, జనం ఎలా ఎగబడతారో చూపే ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో కూల్డ్రింక్స్ సీసాలతో నిండిన ఒక వాహనం వచ్చి ఆగింది. వాహనంలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కూల్డ్రింక్ బాటిల్ చూపిస్తూ.. ఫ్రీగా ఇస్తున్నాం.. తీసుకోండి.. అని ప్రకటించడంతో అక్కడి దృశ్యం ఒక్కసారిగా మారిపోయింది.
- G Sampath Kumar
- Updated on: Sep 13, 2026
- 7:39 pm
చేనేత మగ్గంపై వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర.. 45 రోజులు శ్రమించి అద్భుత పట్టుచీరగా ఆవిష్కరించిన హరి ప్రసాద్!
చేనేత మగ్గంపై అక్షరాలు, చరిత్రను అద్భుతంగా ఆవిష్కరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు హరి ప్రసాద్ మరో అరుదైన కళాఖండాన్ని రూపొందించారు. భక్తి, చరిత్ర, ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతిని మేళవిస్తూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య చరిత్రను పట్టుచీరపై సజీవంగా ఆవిష్కరించారు
- G Sampath Kumar
- Updated on: Sep 11, 2026
- 12:38 pm
పోలీస్ స్టేషన్కు వచ్చి మరీ పెట్రోలింగ్ వైహికల్ ఎత్తుకెళ్లిన మందుబాబు.. అసలేంజరిగిందంటే?
కరీంనగర్ జిల్లా కేంద్రంలో విచిత్ర ఘటన వెలుగు చూసింది. మత్తుకు బానిసైన వ్యక్తి తన కుటుంబానికి సంబంధించిన కేసు పరిష్కరించాలని అభ్యర్థించేందుకు పోలీసు స్టేషన్కు వచ్చి.. వెళ్లేటప్పుడు ఏకంగా పీస్లో ఉన్న పెట్రోలింగ్ వాహనాన్నినే ఎత్తుకెళ్లాడు. పోలీసు వర్గాల్లో కలకలం సృష్టించిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
- G Sampath Kumar
- Updated on: Sep 9, 2026
- 10:01 am
Telangana: వామ్మో.. జర్రుంటే ఎంతపనయ్యేది.. ఏం జరిగిందో వీడియోలో చూడండి..
బైక్ స్టార్ట్ చేద్దామని సీటుపై కూర్చున్నాడు.. అంతలోనే బైక్ హెడ్లైట్ లోంచి ఏదో కదిలినట్టనిపించి చూస్తే గుండె ఆగినంత పనైంది. నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. కరీంనగర్లోని అత్యంత రద్దీగా ఉండే అంబేద్కర్ స్టేడియం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
- G Sampath Kumar
- Updated on: Sep 8, 2026
- 11:10 am
Viral Video: రాజన్న ఆలయంలో కోడెనాడు ప్రత్యక్ష్యం.. భయంతో పరుగులు తీసిన భక్తులు.. ఇదిగో వీడియో!
ఆదివారం రోజులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోకి పాము రావడం భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఆలయంలోని రాజగోపురం దగ్గర పాములను చూసిన భక్తులు భయంతో పరుగులు పెట్టారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ పామును పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
- G Sampath Kumar
- Updated on: Sep 7, 2026
- 10:32 am
తెలుగు అక్షరాలతో అద్భుత పట్టు చీర.. సిరిసిల్ల కళాకారుడి వినూత్న ఆలోచనకు జేజేలు!
తెలుగు భాషపై ఉన్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల జగదీష్. చేనేత మగ్గంపై నూలుతో ఎన్నో రకాల డిజైన్లను ఆవిష్కరించే ఆయన.. ఈసారి తెలుగు భాషలోని అక్షరాలనే చీరకు అందమైన డిజైన్లుగా మలిచారు. ఏకంగా 56 తెలుగు అక్షరమాలను పట్టు చీరపై కళాత్మకంగా డిజైన్ చేసి, తెలుగు భాషకు చేనేత కళ ద్వారా నీరాజనం పలికారు.
- G Sampath Kumar
- Updated on: Sep 6, 2026
- 11:47 am
Telangana: అమ్మో బొమ్మ.. పసుపు, కుంకుమతో భయం భయం.. అసలేం జరిగిందో వీడియోలో చూడండి..
గ్రామ శివారు.. నిర్మానుష్యమైన రోడ్డు పక్కన ఓ చెట్టు.. కొమ్మలకు తలకిందులుగా వేలాడుతున్న భయంకరమైన బొమ్మలు, వాటికి పసుపు కుంకుమల ఆనవాళ్లు.. పెద్దపల్లి జిల్లాలో ఆదివారం వెలుగుచూసిన ఈ దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. క్షుద్రపూజలు జరిగాయన్న అనుమానాలు బలపడుతుండటంతో, అటువైపు వెళ్లాలంటేనే జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు.
- G Sampath Kumar
- Updated on: Sep 6, 2026
- 10:56 am
చొక్కా వేసుకుంటే చిరాకట.. 50 ఏళ్లుగా ఒంటిపై చొక్కా లేకుండానే జీవితం!
కొందరు గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నిస్తారు. మరి కొందరి జీవన విధానమే రికార్డుల్లా ఉంటుంది. చొక్కా అంటే అతనికి మహా చెడ్దా చిరాకు, చొక్కా వేసుకుంటే అదేదో జెర్రీలు పారుతున్నట్టు ఫీలవుతాడు. అందుకే యాభై ఏళ్లుగా అసలు చొక్కానే వేసుకోలేదు.జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన ముక్కెర బక్కయ్య అనే అతనికి ఎన్నో ప్రత్యేకత లున్నాయి. అందుకే ఇతన్నీ అయిలాపూర్ వాసులు అందరు మరో మహాత్మా గాంధీ అని పిలుస్తారు. మరీ గ్రామస్తులకు అతను గాంధీ ఎలా అయ్యాడో తెలుసుకుందాం..
- G Sampath Kumar
- Updated on: Sep 5, 2026
- 2:51 pm
సముద్రం లేని కరీంనగర్ చేపలకు తీరంలోనూ యమ గిరాకీ.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?
సముద్రం లేని కరీంనగర్ జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టుల్లో పెంచుతున్న మంచి నీటి చేపలకు ఇతర రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీకి కరీంనగర్ చేపలను పంపిస్తున్నారు. ముఖ్యంగా భారీ సైజు చేపలతో పాటు రవ్వు, జెల్లెకు మంచి గిరాకీ ఉందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.
- G Sampath Kumar
- Updated on: Sep 4, 2026
- 8:31 pm