AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G Sampath Kumar

G Sampath Kumar

Staff Reporter - TV9 Telugu

sampath.gandla@tv9.com

సంపత్ కుమార్ గాండ్ల , టీవీ9 తెలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫర్ గా 17ఏళ్లుగా పనిచేస్తున్నాను. మొదట ఆంధ్రజ్యోతి లో పని చేశాను.గత 17 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నాను .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. బాల్య వివాహాలు పై చేసిన స్టోరీ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది.. అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి.. సత్కరించింది..

Read More
అదిగో పులి…ఇదిగో టెన్షన్‌.. జనావాసాల్లోకి వన్యమృగాలు.. గుంపులు గుంపులుగా దాడి..!

అదిగో పులి…ఇదిగో టెన్షన్‌.. జనావాసాల్లోకి వన్యమృగాలు.. గుంపులు గుంపులుగా దాడి..!

జంగిల్ రాజ్..! ఇది తెరపై కనిపించే సినిమా కాదు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న రియల్ వైల్డ్ అలర్ట్ స్టోరీ..! తెలుగు రాష్ట్రాల నలుమూలలా పులుల గాండ్రింపులు వినిపిస్తున్నాయి! అరణ్యంలో గర్జించాల్సిన క్రూర మృగాలు.. జనారణ్యంలో గాండ్రిస్తున్నాయి. అడవి హద్దులు దాటి.. ఊరి గుమ్మం ముందుకు వచ్చి నిలబడ్డ ఈ క్రూర మృగాలతో జనం వణికిపోతున్నారు.

Telangana: బియ్యబస్తాల మాటున ఏదో అలికిడి.. భయంతో దగ్గరకు వెళ్లి టార్చ్ ఆన్ చేయగా

Telangana: బియ్యబస్తాల మాటున ఏదో అలికిడి.. భయంతో దగ్గరకు వెళ్లి టార్చ్ ఆన్ చేయగా

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మరోసారి పాముల భయం భక్తులను కలవరపెట్టింది. నిత్యం వేలాది మంది భక్తులు దర్శనానికి వచ్చే ఈ ఆలయ పరిసరాల్లో నాగుపాము ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Viral: చేతిలో కర్ర.. చింపాంజీ వేషం వేసి పరుగులు పెట్టిన సర్పంచ్.. ఎందుకో తెలుసా..?

Viral: చేతిలో కర్ర.. చింపాంజీ వేషం వేసి పరుగులు పెట్టిన సర్పంచ్.. ఎందుకో తెలుసా..?

అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ సర్పంచ్ ఎన్నికలకు ముందు నేతలు ఎన్నో విషయాలను చెబుతారు.. అయితే.. కొందరు వాటిని నేరవేర్చేందుకు అహర్నిషలు కృషి చేస్తుంటారు.. అలా.. గ్రామ సమస్యలకు మాటలతో కాదు. చర్యలతో పరిష్కారం చూపించిన సర్పంచ్ ఒకరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు.

మానేరువాగు ఒడ్డున గాయంతో తల్లడిల్లిన వలస పక్షి.. ప్రాణదాతగా నిలిచిన పక్షి ప్రేమికుడు..!

మానేరువాగు ఒడ్డున గాయంతో తల్లడిల్లిన వలస పక్షి.. ప్రాణదాతగా నిలిచిన పక్షి ప్రేమికుడు..!

చలికాలం వచ్చిందంటే చాలు.. రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామ సమీపంలోని మానేరువాగు తీర ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు, పక్షి పరిశీలకులకు స్వర్గధామంగా మారుతుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే అరుదైన పల్లాస్ గల్ పక్షులు ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని ఆశ్రయంగా చేసుకుంటాయి. నీలాకాశం, వాగు ఒడ్డు, వాటి విహారం కలిసి అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి.

అబ్రకదబ్ర.. నల్లకోడా మజాకా.. ఈ మాంసం తిన్నారంటే రోగాలన్నీ మాటాష్..

అబ్రకదబ్ర.. నల్లకోడా మజాకా.. ఈ మాంసం తిన్నారంటే రోగాలన్నీ మాటాష్..

ఒకప్పుడు మధ్యప్రదేశ్ అడవీ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కడక్‌నాథ్ కోడి.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భలే గిరాకీ తెచ్చుకుంటోంది. నల్లని రంగు చూసి ఆశ్చర్యపోయినా.. దాని మాంసం రుచి వెరి స్పెషల్.. తింటే మాత్రం మంత్రముగ్ధులవ్వాల్సిందే అంటున్నారు వ్యాపారులు.. ఈ మాంసాన్ని చాలా మంది ఇష్టంగా కొని వండుకుంటారు.. దీని స్పెషాలిటీ ఎంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

సమ్మక్క జన్మించింది మేడారంలో కాదా? ఆ గ్రామ ప్రజల మాటేమిటంటే?

సమ్మక్క జన్మించింది మేడారంలో కాదా? ఆ గ్రామ ప్రజల మాటేమిటంటే?

సమ్మక్క సారలమ్మ అనగానే మేడారం గుర్తుకొస్తుంది. అందరూ.. మేడారం వెళ్తుంటారు. చాలా మంది మేడారంలోనే సమ్మక్క తల్లి పుట్టింది అనుకుంటారు. కానీ సమ్మక్క పుట్టింది పొలాసలో అంటున్నారు అక్కడి వాసులు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రెడ్ కార్పెట్‌తో మాజీ మావోయిస్టు నేతకు స్వాగతం.. 45 ఏళ్ల తర్వాత..

రెడ్ కార్పెట్‌తో మాజీ మావోయిస్టు నేతకు స్వాగతం.. 45 ఏళ్ల తర్వాత..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న, జనజీవనంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా తన స్వగ్రామం వడుకాపూర్‌కు వచ్చారు. గ్రామస్థులు ఆయనకు రెడ్ కార్పెట్ వేసి, పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. సుదీర్ఘకాలం తర్వాత స్వగ్రామానికి చేరుకున్న చంద్రన్న, తన గత 45 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, గ్రామస్థులతో ముచ్చటించారు. ఈ పర్యటన విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.

చిరుత దాడిలో లేగదూడ మృతి.. బిడ్డ కళేబరం వద్ద కంటనీరుతో తల్లడిల్లిన గోమాత..!

చిరుత దాడిలో లేగదూడ మృతి.. బిడ్డ కళేబరం వద్ద కంటనీరుతో తల్లడిల్లిన గోమాత..!

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాలో చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందింది. ఈ ఘటనలో తల్లి గోమాత తన బిడ్డను విడిచిపెట్టలేక కంటతడి పెడుతున్న తీరు అక్కడ ఉన్నవారిని కలచివేసింది. అడవిలో చోటుచేసుకున్న ఈ ఘటన మాతృత్వం విలువలను మరోసారి గుర్తుచేసింది.

శుభకార్యాలపై బంగారం బాంబ్..!పెళ్లి చేయాలంటే భయపడుతున్న పేరెంట్స్.. రెట్టింపు ఖర్చులతో..

శుభకార్యాలపై బంగారం బాంబ్..!పెళ్లి చేయాలంటే భయపడుతున్న పేరెంట్స్.. రెట్టింపు ఖర్చులతో..

రోజురోజుకు పెరుగుతున్న బంగారం, వెండి ధరలు శుభకార్యాలను ఆర్థిక భారంగా మారుస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబాలు పెళ్లిళ్లకు వెనకడుగు వేస్తున్నాయి, ఆభరణాల తయారీ ఆర్డర్లు తగ్గిపోయాయి. స్వర్ణకారులు పనిలేక ఖాళీగా ఉంటున్నారు. ఖర్చులు తగ్గించుకోవడమే ప్రధాన ఆలోచనగా మారింది, ఆనందం కరువై ఖర్చుల భయం పెరిగింది.

పెంపుడు కుక్కకు ‘నిలువెత్తు బంగారం’తో తులాభారం.. ఎందుకో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

పెంపుడు కుక్కకు ‘నిలువెత్తు బంగారం’తో తులాభారం.. ఎందుకో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

పెద్దపల్లికి చెందిన కాసర్ల రాజు తన పెంపుడు కుక్క భైరవ తీవ్ర అనారోగ్యం నుండి కోలుకోవడంతో అరుదైన మొక్కు తీర్చుకున్నారు. సమ్మక్క సారక్క దేవతలకు మొక్కుకుని, కుక్క ఆరోగ్యంగా మారితే నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పిస్తానని ప్రమాణం చేశారు. మొక్కు నెరవేరడంతో భైరవ బరువుకు సమానమైన బెల్లాన్ని తులాభారం వేసి సమర్పించారు. జంతువుల పట్ల ఆయనకున్న ప్రేమను స్థానికులు అభినందించారు.

Andhra Pradesh: తెరపైకి కొత్త జిల్లా డిమాండ్.. ఇప్పటికే ఆందోళనలు ఉదృతం

Andhra Pradesh: తెరపైకి కొత్త జిల్లా డిమాండ్.. ఇప్పటికే ఆందోళనలు ఉదృతం

హుజురాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటుకై డిమాండ్ తీవ్రమవుతోంది. అన్ని మౌలిక సదుపాయాలున్నప్పటికీ జిల్లా ఏర్పాటు చేయలేదని పీవీ జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ఏర్పాటు జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

వేటగాళ్ళ ఉచ్చు లో నెమలి.. రంగంలోకి దిగిన రైతు.. కట్ చేస్తే

వేటగాళ్ళ ఉచ్చు లో నెమలి.. రంగంలోకి దిగిన రైతు.. కట్ చేస్తే

పెద్దపల్లి జిల్లాలో జాతీయ పక్షి నెమళ్ళపై వేటగాళ్ల దాడులు తీవ్రమయ్యాయి. ఎలిగేడు మండలం శివపల్లి సమీపంలో ఉచ్చులతో నెమళ్ళను వేటాడుతున్నారు. పచ్చని పొలాల్లో సంచరించే నెమళ్ళు వేటగాళ్ల వలకు చిక్కుకుంటున్నాయి. ఇటీవల ఉచ్చులో పడిన నెమలిని రైతులు రక్షించారు. అటవీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని, వన్యప్రాణులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.