AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC CSE 2025 Result Date: ఈ వారంలోనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌లింక్‌ ఇదే

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2025 తుది ఫలితాలు మరో 2, 3 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరి చివరి వారంలో పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) కూడా పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభ్యర్థులు తుది ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు..

UPSC CSE 2025 Result Date: ఈ వారంలోనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌లింక్‌ ఇదే
UPSC CSE 2025 Final result date
Srilakshmi C
|

Updated on: Mar 03, 2026 | 4:30 PM

Share

హైదరాబాద్‌, మార్చి 3: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2025 తుది ఫలితాలు మరో 2, 3 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరి చివరి వారంలో పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) కూడా పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభ్యర్థులు తుది ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అందిన సమాచారం మేరకు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ తుది మార్చి తొలి వారంలో విడుదల కానున్నాయి. సివిల్స్‌ ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.

అభ్యర్థుల ఇంటర్వ్యూలు జనవరి 2026లో ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీలోని షాజహాన్ రోడ్‌లోని ధోల్‌పూర్ హౌస్‌లోని UPSC ప్రధాన కార్యాలయంలో వీటిని నిర్వహించారు. ఇంటర్వ్యూ 275 పాయింట్లకు ఉంటుంది. ఫిబ్రవరి చివరి వారంతో వ్యక్తిత్వ పరీక్షలు పూర్తయినందున UPSC CSE 2025 తుది ఫలితాలు మార్చి 2026 మొదటి లేదా రెండవ వారంలో ప్రకటించబడే అవకాశం ఉన్నట్లు సమాచారం. వ్యక్తిత్వ పరీక్షలు నిర్వహించిన తర్వాత మెరిట్ జాబితాను సిద్ధం చేయడానికి UPSCకి సాధారణంగా కొన్ని రోజుల సమయం పడుతుంది. తుది మెరిట్ జాబితాలో అర్హులైన అభ్యర్థులందరూ ఉంటారు. ఎంపికైన అభ్యర్థులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్, ఇతర గ్రూప్ A&B సెంట్రల్ సర్వీసు కేడర్లలో ఒకదానిలో చేరతారు.

కాగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో అంటే ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ మూడు దశల్లో అభ్యర్థులు కనబరిచిన ప్రతిభ ఆధారంగా తుది మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారు ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి కీలక విభాగాల్లో కేంద్ర సర్వీసులకు ఎంపికవుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us