AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srilakshmi C

Srilakshmi C

Sr Sub Editor, Career, Lifestyle, Hyper local, National, Human Interested - TV9 Telugu

choppara.lakshmi@tv9.com

శ్రీలక్ష్మి.. టీవీ9 డిజిటల్‌ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. సాక్షి స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజంలో 2017లో శిక్షణ పొందారు. సాక్షిలోనే ఐదేళ్లు (2017 నుంచి 2022) సబ్ ఎడిటర్‌గా పని చేశారు. ఆ తర్వాత జనవరి 2022లో TV9 డిజిటల్‌లో చేరారు. అప్పట్నుంచి టీవీ 9 డిజిటల్‌లో కొనసాగుతున్నారు. ఎడ్యుకేషన్‌, ఏపీ, తెలంగాణ, నేషనల్, ఇంటర్నేషనల్‌, ట్రెండింగ్‌, క్రైమ్‌, లైఫ్‌స్టైల్‌, హ్యూమన్ ఇంటెరెస్టెడ్ వార్తలు అందిస్తున్నారు.

Read More
రాష్ట్రపతికి తొలి మహిళా ఆర్మీ ADCగా మేజర్ నవ్య శేఖావత్..!

రాష్ట్రపతికి తొలి మహిళా ఆర్మీ ADCగా మేజర్ నవ్య శేఖావత్..!

మేజర్ నవ్య శేఖావత్ భారత సైన్యంలో అరుదైన ఘనత సాధించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ADCగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా ఆర్మీ అధికారిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. CDS పరీక్ష, OTA చెన్నై శిక్షణ, ఆర్మీ సర్వీస్ కార్ప్స్‌లో సేవల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది..

ఎగ్జాంలో ChatGPT ఆన్సర్లు రాసిన విద్యార్ధి సూసైడ్.. IIT ముంబై క్యాంపస్‌లో నిరసనల సెగ

ఎగ్జాంలో ChatGPT ఆన్సర్లు రాసిన విద్యార్ధి సూసైడ్.. IIT ముంబై క్యాంపస్‌లో నిరసనల సెగ

ముంబైలోని ప్రతిష్ఠాత్మక IIT బాంబేలో విషాద ఘటన చోటుచేసుకుంది. రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరీక్ష సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించినట్లు గుర్తించిన కొన్ని గంటలకే ఈ ఘటన చోటుచేసుకోవడంతో క్యాంపస్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఘటన అనంతరం వందలాది మంది విద్యార్థులు సంస్థ యాజమాన్యంపై నిరసన వ్యక్తం చేశారు. IIT బాంబే అధికారిక ప్రకటన ప్రకారం..

పచ్చిమిర్చి తింటే మీ శరీరంలో నిజంగా ఏం జరుగుతుందో తెలుసా..?

పచ్చిమిర్చి తింటే మీ శరీరంలో నిజంగా ఏం జరుగుతుందో తెలుసా..?

పచ్చిమిర్చి అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది దాని కారం. కారం ఎక్కువగా తింటే ఎసిడిటీ, కడుపులో మంట, అల్సర్లు వస్తాయని చాలామంది భావిస్తారు. దీంతో కొందరు పచ్చిమిర్చిని పూర్తిగా దూరం పెడుతుంటారు. అయితే పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సైసిన్ అనే సమ్మేళనంపై జరిగిన పరిశోధనలు, మితంగా తీసుకున్నప్పుడు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండవచ్చని సూచిస్తున్నాయి. అయితే పచ్చిమిర్చి ఏదైనా వ్యాధికి మందు కాదు. అలాగే రోజూ రెండు పచ్చిమిర్చిలు తింటే తప్పకుండా బరువు తగ్గడం, గుండె జబ్బులు రాకపోవడం వంటి హామీలు ఇవ్వలేం. వ్యక్తి ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, తీసుకునే మోతాదు వంటి అంశాలు కూడా ముఖ్యమే..

విద్యార్థులకు అలర్ట్.. ఇక ఇంటర్ పరీక్షల్లో 32 పేజీల ఆన్సర్ షీట్లు!

విద్యార్థులకు అలర్ట్.. ఇక ఇంటర్ పరీక్షల్లో 32 పేజీల ఆన్సర్ షీట్లు!

రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యకలాపాలను ఆధునీకరించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడంతో పాటు, 1978 నుంచి జారీ చేసిన సర్టిఫికెట్లను డిజిటలైజ్ చేసి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో అనుసంధానం చేయనున్నారు. పరీక్షలు, మూల్యాంకన సిబ్బంది భత్యాలను 25 శాతం వరకు పెంచాలని నిర్ణయించగా.. థియరీ పరీక్షలకు 32 పేజీల జవాబు పత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు..

సైంధవ లవణం వాడితే గుండె వేగం తగ్గుతుందా?

సైంధవ లవణం వాడితే గుండె వేగం తగ్గుతుందా?

ఇటీవల ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలామంది సాధారణ తెల్ల ఉప్పుకు బదులుగా సైంధవ లవణం (సెందా నమక్) వాడుతున్నారు..| Sendha Namak

ఒకేఒక్క విద్యార్థి కోసం 13 ఏళ్లుగా రోజూ 5 కి.మీ. అడవిలో ట్రెక్కింగ్.. 55 ఏళ్ల టీచర్ అంకితభావం

ఒకేఒక్క విద్యార్థి కోసం 13 ఏళ్లుగా రోజూ 5 కి.మీ. అడవిలో ట్రెక్కింగ్.. 55 ఏళ్ల టీచర్ అంకితభావం

సాధారణంగా ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లేందుకు బస్సు, ఆటో, బైక్ లేదా ఇతర వాహనాలను ఉపయోగిస్తారు. కానీ మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాకు చెందిన 55 ఏళ్ల జీవన్ మిథారి మాత్రం ప్రతిరోజూ ఓ ప్రత్యేకమైన ప్రయాణం చేస్తారు. దట్టమైన అడవి గుండా దాదాపు 5 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు చేరుకుంటారు. కారణం.. అక్కడ చదువుకునే విద్యార్థుల సంఖ్య కేవలం ఒక్కరే..

‘ఇంగ్లిష్ అంటే భయం.. ఇప్పుడేమో ఏకంగా Googleలో రూ.3 కోట్ల ప్యాకేజీతో కొలువు’ రాయలసీమ బిడ్డ సక్సెస్ స్టోరీ

‘ఇంగ్లిష్ అంటే భయం.. ఇప్పుడేమో ఏకంగా Googleలో రూ.3 కోట్ల ప్యాకేజీతో కొలువు’ రాయలసీమ బిడ్డ సక్సెస్ స్టోరీ

రాయలసీమలోని ఓ చిన్న పల్లెటూరు.. చుట్టూ పొలాలు.. సాధారణ రైతు కుటుంబం. అక్కడి నుంచి బయలుదేరిన ఓ యువకుడు ఇప్పుడు అమెరికాలోని గూగుల్‌లో ఏకంగా రూ.3 కోట్లకు పైగా వార్షిక ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్ కొట్టాడు. ఇంగ్లిష్ అంటే ఒకప్పుడు భయపడిన అతడు.. సాధారణ టైర్ 2 కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత స్వయంకృషితో టెక్నాలజీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. అతడే కడప జిల్లా రాజంపేటకు చెందిన శ్రావణ్ కుమార్..

‘తల్లి బీడీలు చుట్టి చదివిస్తే.. కొడుకు IAS అయ్యాడు’ UPSC టాపర్‌ నందల సాయికిరణ్ స్ఫూర్తిదాయక జర్నీ

‘తల్లి బీడీలు చుట్టి చదివిస్తే.. కొడుకు IAS అయ్యాడు’ UPSC టాపర్‌ నందల సాయికిరణ్ స్ఫూర్తిదాయక జర్నీ

రాష్ట్రానికి చెందిన నందల సాయికిరణ్ పేదరికం, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా 27వ ర్యాంక్ సాధించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఆయనకు తల్లి బీడీలు తయారు చేస్తూ చదువు చెప్పించారు. తల్లి కష్టాన్ని స్ఫూర్తిగా తీసుకున్న సాయికిరణ్ NIT వరంగల్‌లో బీటెక్ పూర్తి చేసి, పట్టుదలతో UPSCకి సిద్ధమై ఐఏఎస్ లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆయన విజయగాథ కష్టాలను ఎదుర్కొంటున్న ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది..

‘ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ టైప్ చేసేలోపు మంత్రిని అరెస్ట్ చేసి CMకే చుక్కలు చూపించింది’ లేడీ సింగం IPS రూపా సక్సెస్ స్టోరీ

‘ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ టైప్ చేసేలోపు మంత్రిని అరెస్ట్ చేసి CMకే చుక్కలు చూపించింది’ లేడీ సింగం IPS రూపా సక్సెస్ స్టోరీ

నిజాయితీ, ధైర్యం, నిబద్ధతతో విధులు నిర్వర్తించే అధికారుల్లో డీ. రూపా మౌడ్గిల్ ఐపీఎస్ ఒకరు. 2000 బ్యాచ్‌కు చెందిన ఆమె, UPSCలో జాతీయ స్థాయిలో 43వ ర్యాంక్ సాధించి పోలీస్ సర్వీసులోకి అడుగుపెట్టారు. 20 ఏళ్లకు పైగా సర్వీసులో ఎన్నో సవాళ్లు, బదిలీలు ఎదురైనా విధి నిర్వహణలో వెనుకడుగు వేయలేదు. కర్ణాటకలో తన ప్రత్యేకమైన పని తీరుతో గుర్తింపు తెచ్చుకున్న డీ. రూపా.. మహిళా అధికారులకు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు..

45 ఏళ్ల వయసులో పదో తరగతి పరీక్షలు రాసి.. 500కు 410 మార్కులతో సత్తా చాటిన మహిళ!

45 ఏళ్ల వయసులో పదో తరగతి పరీక్షలు రాసి.. 500కు 410 మార్కులతో సత్తా చాటిన మహిళ!

చదువుకోవాలనే పట్టుదలకు వయసు అడ్డంకి కాదని జమ్మూకు చెందిన 45 ఏళ్ల రేణు హన్స్ నిరూపించారు. వినికిడి లోపం ఉన్న ఆమె పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 82 శాతం మార్కులు సాధించి ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారు. కుటుంబ బాధ్యతలతో మధ్యలో ఆగిపోయిన తన చదువును తిరిగి కొనసాగించి ఈ విజయాన్ని అందుకున్నారు..

TOSS టెన్త్‌, ఇంటర్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల.. సబ్జెక్టుల వారీగా పూర్తి షెడ్యూల్ ఇదే

TOSS టెన్త్‌, ఇంటర్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల.. సబ్జెక్టుల వారీగా పూర్తి షెడ్యూల్ ఇదే

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) పదో తరగతి, ఇంటర్మీడియట్ అక్టోబర్ 2026 పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు అక్టోబర్ 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్‌తో పాటు ఇంటర్మీడియట్‌లో పొలిటికల్ సైన్స్, కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్ తదితర సబ్జెక్టులకు తేదీలను ప్రకటించారు..

NTA పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. JEE మెయిన్, UGC-NET, NIFT తేదీలు చూశారా?

NTA పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. JEE మెయిన్, UGC-NET, NIFT తేదీలు చూశారా?

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2026 డిసెంబర్ నుంచి 2027 మార్చి వరకు నిర్వహించనున్న పలు ప్రధాన ప్రవేశ, అర్హత పరీక్షల తాత్కాలిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఇందులో UGC-NET, Joint CSIR-UGC NET, NIFT, JEE Main 2027, AISSEE, CUET-PG వంటి కీలక పరీక్షలు ఉన్నాయి. పరీక్షల తేదీలు, బఫర్ డేస్, ఇతర ముఖ్య వివరాలను NTA తన క్యాలెండర్‌లో వెల్లడించింది..