AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు అన్నీ బంద్.. ప్రభుత్వం సెలవు ప్రకటించిందా?

కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ఈ నెల 24వ తేదీ (శుక్రవారం) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్‌ తదితర విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను ప్రారంభించాయి..

నేడు రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు అన్నీ బంద్.. ప్రభుత్వం సెలవు ప్రకటించిందా?
Schools, Colleges Bandh Today
Srilakshmi C
|

Updated on: Jul 24, 2026 | 7:18 AM

Share

హైదరాబాద్, జులై 24: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు (జులై 24వ తేదీ)విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఎస్‌ఎఫ్‌ఐ (SFI), ఏఐఎస్‌ఎఫ్‌ (AISF), ఎన్‌ఎస్‌యూఐ (NSUI), పీడీఎస్‌యూ (PDSU), ఏఐఎఫ్‌డీఎస్‌ (AIFDS) సహా పలు విద్యార్థి సంఘాలు ఈ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు బంద్‌కు సహకరించాలని సంఘాలు విజ్ఞప్తి చేశాయి.

బంద్ ఎందుకు?

విద్యార్థి సంఘాలు కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా

  • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్.
  • జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (NTA)ను రద్దు చేయాలని డిమాండ్.
  • పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్.
  • ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగిన లాఠీఛార్జ్‌పై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరడం.
  • నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇటీవల ఢిల్లీలో విద్యార్థులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన సంఘాలు, ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరాయి. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ బంద్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలు మద్దతు ఇవ్వాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక విజ్ఞప్తి చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

విద్యార్థి సంఘాలు జిల్లాల వారీగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించాయి. బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలకు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించలేదు. అయితే విద్యార్థి సంఘాల బంద్ పిలుపు నేపథ్యంలో కొన్ని విద్యాసంస్థలు స్థానిక పరిస్థితులను బట్టి తరగతులను నిలిపివేయడం లేదా ఆన్‌లైన్‌ విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది. విద్యార్థులు తమ స్కూల్ లేదా కాలేజీ యాజమాన్యం నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.

Follow Us