AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల ఆలయంలో ప్రతియేటా వైభవోపేతంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అత్యంత విశిష్టత ఉంది. శ్రీవారికి తొలిసారిగా బ్రహ్మోత్సవాలను సృష్టికర్త బ్రహ్మదేవుడే జరిపించినట్లు హిందూ పురాణాల్లో పేర్కొనబడింది. బ్రహ్మదేవుడు స్వయంగా ప్రారంభించిన ఉత్సవాలు కావడంతో దీనికి ‘బ్రహ్మోత్సవాలు’గా పేరు వచ్చిందని చెబుతారు. అయితే పరబ్రహ్మస్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు అయినందున దీన్ని ‘బ్రహ్మోత్సవాలు’ అంటున్నారని మరికొందరి భావన. శ్రీవారి బ్రహ్మోత్సవాలను 9 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి పులకించిపోతారు.

అంకురార్పరణతో మొదలయ్యే బ్రహ్మోత్సవాల్లో.. మలయప్ప స్వామికి వాహన సేవలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ధ్వజారోహణం, రెండోరోజు చిన్న శేష వాహనం, పెద్ద శేష వాహనం, హంస వాహన సేవలు నిర్వహిస్తారు. మూడో రోజు సింహ వాహనం, అదే రోజు రాత్రి ముత్యాలపందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు ఊరేగుతారు. నాలుగో రోజు కల్పవృక్ష వాహనం, అదే రోజు సాయంత్రం సర్వభూపాల సేవ, ఐదో రోజు మోహినీ అవతారం, హనుమ వాహనం, గరుడ వాహన సేవ, ఆరో రోజు గజ వాహనం, ఏడో రోజు సూర్య ప్రభ, అదే రోజు సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ, ఎనిమిదో రోజు రథోత్సవం, తొమ్మిదో రోజు చక్రస్నానం, అదే రోజు ధ్వజావరోహణ నిర్వహిస్తారు.

ఇంకా చదవండి

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. కిక్కిరిసిన భక్తులతో ఆలయ వీధులు

దసరా సెలవుల తర్వాత కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. టోకెన్లు లేని సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమల వీధులు, కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నిన్న 74,861 మంది శ్రీవారిని దర్శించుకోగా, రూ. 3.93 కోట్ల ఆదాయం లభించింది.

  • Phani CH
  • Updated on: Oct 9, 2025
  • 4:55 pm

Tirumala: ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు.. రికార్డ్ స్థాయిలో శ్రీవారి హిందూ ఆదాయం..

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ముగిసాయి. శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి. బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం ధ్వజావరోహణంతో ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాలను చూసేందుకు ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి ల‌క్ష‌లాది మంది భక్తులు విచ్చేశారు. ఈ ఉత్సవాల్లో మొత్తం ఎనిమిది రోజులకు స్వామివారికి కానుకల ద్వారా రూ.25.12 కోట్ల హుండీ ఆదాయం లభించింది.

ముగింపు దశకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు పోటెత్తారు. వైభవంగా సాగుతున్న ఈ ఉత్సవాలలో శ్రీవారి ఆశీస్సులు పొందడానికి భక్తులు చివరి రోజుల్లో అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక సంరంభం త్వరలో పూర్తవుతుంది.

  • Phani CH
  • Updated on: Oct 2, 2025
  • 6:58 pm

Tirumala: శ్రీవారి పుష్కరిణిలో కొనసాగుతున్న చక్రస్నానం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చక్రస్నాన ఘట్టంతో ముగిశాయి. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవ మూర్తులకు, చక్రతాళ్వార్‌కు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు. పవిత్ర పుష్కరిణిలో జరిగిన ఈ వేడుకను వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులు ఈ కీలక క్రతువును వీక్షించి తరించారు.

  • Phani CH
  • Updated on: Oct 2, 2025
  • 5:58 pm

Tirumala: నేటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు.. శాస్రోక్తంగా చక్రస్నానం..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. గత నెల 23న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగా 24న బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం జరిగింది. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.గత నెల 24 రాత్రి పెద్దశేష వాహన సేవ అందుకున్న మలయప్ప స్వామి వాహన సేవలు బుధవారం రాత్రి జరిగిన అశ్వ వాహన సేవతో వాహన సేవలు ముగిసాయి.

అంగరంగ వైభవంగా సాగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజున శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి మహారథంపై ఊరేగారు. రథోత్సవాన్ని తిలకిస్తే జన్మరాహిత్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. నేడు అశ్వవాహన సేవ, రేపు చక్రస్నానం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.

  • Phani CH
  • Updated on: Oct 1, 2025
  • 5:44 pm

Tirumala: వైభవంగా శ్రీవారి రథోత్సవం.. గోవిందనామస్మరణతో మారుమోగిన మాడవీధులు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు శ్రీనివాసుడికి రథోత్సవం నిర్వహించారు. ఉభయదేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు రథంలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. మనుషులకు తత్వ జ్ఞానాన్ని భోదించేదే రథోత్సవం సమయంలో మాడవీధులు గోవిందనామస్మరణతో మారుమోగాయి.

Tirumala: హనుమంతుడి వాహనంపై రామయ్యగా మలయప్ప స్వామి దర్శనం..

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు నేడు ఆరో రోజుకి చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున శ్రీ మలయప్ప స్వామి కోదండ రాముని అలంకారంలో తన భక్తుడైన హనుమంతుడి వాహనంపై కొలువుదీరాడు. వాహనం ముందు వివిధ రాష్ట్రాలకు చెందినకళాకారులు స్వామివారిని కీరిస్తుండగా.. భక్తులకు దర్శనం ఇచ్చాడు.

తిరుమల బ్రహ్మోత్సవాలు.. కాసేపట్లో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న స్వామివారు

Tirumala Srivari Bahmotsavam 2025: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు.. ఉభయదేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో క‌ల్ప‌వృక్ష వాహనంపై క‌టాక్షించారు. ఈ వేడుకలో భక్తులు భారీగా పాల్గొన్నారు. కాగా మరికాసేపట్లో ఏడు గంటలకు స‌ర్వ‌భూపాల వాహనంపై స్వామివారు భక్తులకు అభ‌య‌మివ్వనున్నారు.

  • Anand T
  • Updated on: Sep 27, 2025
  • 6:12 pm

Tirumala: వాయమ్మో.. ఆ భక్తుడి మెడ నిండా బంగారమే.. వీడియో చూశారా..

శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చిన ఒక భక్తుడు మెడ నిండా బంగారు నగలు ధరించి కనిపించాడు.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. హైదరాబాద్ కు చెందిన హోప్ ఫౌండేషన్ చైర్మన్ విజయ్ కుమార్ దాదాపు 6 కిలోల బంగారు ఆభరణాలను ధరించి ఆలయం ముందు తళుక్కుమన్నాడు.