
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల ఆలయంలో ప్రతియేటా వైభవోపేతంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అత్యంత విశిష్టత ఉంది. శ్రీవారికి తొలిసారిగా బ్రహ్మోత్సవాలను సృష్టికర్త బ్రహ్మదేవుడే జరిపించినట్లు హిందూ పురాణాల్లో పేర్కొనబడింది. బ్రహ్మదేవుడు స్వయంగా ప్రారంభించిన ఉత్సవాలు కావడంతో దీనికి ‘బ్రహ్మోత్సవాలు’గా పేరు వచ్చిందని చెబుతారు. అయితే పరబ్రహ్మస్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు అయినందున దీన్ని ‘బ్రహ్మోత్సవాలు’ అంటున్నారని మరికొందరి భావన. శ్రీవారి బ్రహ్మోత్సవాలను 9 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి పులకించిపోతారు.
అంకురార్పరణతో మొదలయ్యే బ్రహ్మోత్సవాల్లో.. మలయప్ప స్వామికి వాహన సేవలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ధ్వజారోహణం, రెండోరోజు చిన్న శేష వాహనం, పెద్ద శేష వాహనం, హంస వాహన సేవలు నిర్వహిస్తారు. మూడో రోజు సింహ వాహనం, అదే రోజు రాత్రి ముత్యాలపందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు ఊరేగుతారు. నాలుగో రోజు కల్పవృక్ష వాహనం, అదే రోజు సాయంత్రం సర్వభూపాల సేవ, ఐదో రోజు మోహినీ అవతారం, హనుమ వాహనం, గరుడ వాహన సేవ, ఆరో రోజు గజ వాహనం, ఏడో రోజు సూర్య ప్రభ, అదే రోజు సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ, ఎనిమిదో రోజు రథోత్సవం, తొమ్మిదో రోజు చక్రస్నానం, అదే రోజు ధ్వజావరోహణ నిర్వహిస్తారు.
Andhra Pradesh:శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేటి నుంచి మూడ్రోజులపాటు పలు సేవలకు బ్రేక్..!
ఇదిలా ఉంటే, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ఇవాళ స్వామివారి దర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం శ్రీవారిని 62,076 మంది భక్తులు దర్శించుకోగా, 23,699 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ
- Jyothi Gadda
- Updated on: Apr 10, 2025
- 11:18 am
TTD Rath Saptami: ఇక అలాంటి ఘటనకు నో ఛాన్స్.. రథసప్తమి వేడుకలపై టీటీడీ హై అలెర్ట్..!
తిరుమలలో రథసప్తమి వేడుకలకు మాడవీధులు ముస్తాబవుతున్నాయి. రథసప్తమి సందర్భంగా ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసినట్టు ప్రకటించింది టీటీడీ. సుమారు రెండు లక్షల మంది భక్తులు హాజరుకానుండటంతో గత అనుభవాల దృష్ట్యా గ్యాలరీల్లో ఉండే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది పాలకమండలి.
- Raju M P R
- Updated on: Jan 30, 2025
- 9:05 pm
శ్రీవారి భక్తులకు అలెర్ట్..ఆ సేవలు బంద్! వీడియో
వచ్చే నెల 4న తిరుమలలో జరగనున్న శ్రీవారి రథసప్తమి వేడుకలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని రథసప్తమి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. కొద్దిరోజుల క్రితం వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో అపశృతి చోటుచేసుకోవడంతో రథసప్తమికి టీటీడీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే.. రథసప్తమి ఏర్పాట్ల పై మాడవీధుల్లో జిల్లా యంత్రాంగంతో కలిసి పరిశీలించారు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి.
- Samatha J
- Updated on: Jan 25, 2025
- 1:11 pm
Tirumala: శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా.! చివరికి ఆటో డ్రైవర్స్ కూడానా.?
తిరుమలలో దళారులకు చెక్ పెట్టేందుకు TTD విజిలెన్స్ ఎంత పకడ్బందీగా చర్యలు చేపడుతున్నా.. భక్తులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. కొందరి దందా కంటిన్యూ అవుతూనే ఉంది. తిరుపతి శ్రీవారిమెట్టు దగ్గర ఆటో డ్రైవర్లతో రింగైన కొందరు TTD సిబ్బంది.. టైమ్స్లాట్ టోకెన్ల జారీలో ఇష్టాతీరిన వ్యవహరిస్తున్నారని భక్తులు భగ్గుమంటున్నారు.
- Anil kumar poka
- Updated on: Jan 1, 2025
- 5:21 pm
Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.! ఇకపై ఆ ఇబ్బంది లేదు..
తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఎంత ఫేమస్సో.. స్వామివారి ప్రసాదం లడ్డూ కూడా అంతే ఫేమస్. స్వామివారి ఆలయం నుంచి ఇంటికి తీసుకుని వచ్చిన లడ్డూకి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజ చేస్తారు. అనంతరమే తాము ఆరగిస్తారు, స్నేహితులకు బంధువులకు పంచుతారు. అందుకనే తిరుమలకు వెళ్ళినవారు స్వామివారి దర్శనం కోసం ఎంత సేపు ఎదురు చూస్తారో.. అదే విధంగా లడ్డు కొనుగోలు కోసం క్యూలో నిల్చుకుంటారు.
- Anil kumar poka
- Updated on: Dec 9, 2024
- 10:32 am
Pushpa 2: ‘నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా’.. పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్లో అద్దిరిపోయిన అల్లు అర్జున్ స్పీచ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2 దిరూల్. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం (నవంబర్ 24) చెన్నైలో పష్ఫ 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ నిర్వహించారు.
- Basha Shek
- Updated on: Nov 24, 2024
- 10:35 pm
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.. పూర్తి వివరాలివే..
అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.
- Jyothi Gadda
- Updated on: Nov 20, 2024
- 10:23 am
TTD: వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం క్షణం పాటు కలిగితే చాలన్నది కోట్లాది మంది భక్తుల ఆశ.ఇందులో భాగంగానే దేశంలోని నలు మూలలా ఉన్న శ్రీవారి భక్తులు తిరుమల కోస్తారు. సంపన్నుడి నుంచి సామాన్యుడి దాకా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నిత్యం లక్షల్లో ఉంటుంది. అయితే తిరుమల శ్రీవారిని రోజు దర్శించుకునే భక్తుల సంఖ్య 80 నుంచి 85 వేలకు మించడం కష్టంగా మారింది.
- Anil kumar poka
- Updated on: Nov 8, 2024
- 9:30 pm
వ్యాపారాల కోసమే తెలంగాణకు రావద్దు..! ఏపీ పొలిటీషియన్స్ కు తెలంగాణ లీడర్స్ స్మూత్ వార్నింగ్
తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ నేతలు ఇచ్చిన సిఫార్సు లేఖల్ని టీటీడీ అనుమతించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమలలో తెలంగాణ నాయకులపై ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించారు. ఏపీ నేతలు తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవడం లేదా...? అని కొశ్చన్ చేశారు.
- Raju M P R
- Updated on: Oct 22, 2024
- 1:45 pm
Tirumala: అక్టోబరు 17న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ..
ఇక, దసరా పండగ సెలవులు ముగిసినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లనీ నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు. దీంతో టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు శ్రీవారి దర్శనానికి..
- Jyothi Gadda
- Updated on: Oct 16, 2024
- 11:31 am