టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.
Cyber Fraud: ఫోన్లోనే సంప్రదింపులు.. ఆన్లైన్లో నియామకాలు.. కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ళు..!
చిత్తూరు జిల్లా పలమనేరులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ మనీ యాప్ పేరుతో రూ. కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ళు DAAI యాప్ పేర కొత్త మోసానికి తెర తీశారు. రూ 12 వేలు డిపాజిట్ చేస్తే రోజుకు రూ. 1000 చొప్పున 25 రోజుల పాటు రూ 25 వేలు తిరిగి ఖాతాలకు జమ చేస్తామంటూ జనానికి ఆశ చూపారు. తీర డబ్బులు చెల్లించే సమయానికి చేతులెత్తేశారు.
- Raju M P R
- Updated on: Jul 26, 2024
- 2:03 pm
Andhra Pradesh: ముగ్గురిని చంపి, ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్.. కారణం అదేనా..?
తిరుపతిలో మూడు హత్యలు, ఒక ఆత్మహత్య సంచలనం రేకెత్తించింది. బుధవారం(జూలై24) రాత్రి 7:30 గంటల సమయంలో ఈ దారుణం పద్మావతి నగర్ లో వెలుగు చూసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్న మోహన్.. కొన్ని రోజులుగా గొడవలుపుడతూ ఇంట్లో గందరగోళం సృష్టిస్తున్నాడు.
- Raju M P R
- Updated on: Jul 25, 2024
- 10:28 am
Tirumala: శ్రీవారి లడ్డూ రుచిలో లోపం.. అసలు కారణం గుర్తించిన టీటీడీ..
తిరుమల శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డు నాణ్యతపై టీటీడీ దృష్టి పెట్టింది. టిటిడికి సరఫరా అయ్యే నెయ్యి నాణ్యత లేదని గుర్తించిన టిటిడి ఈ మేరకు చర్యలు చేపట్టింది. నెయ్యిలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై చర్యలకు టిటిడి సిద్దం అయ్యింది. తిరుమల శ్రీవారి లడ్డు నాణ్యత అధ్వాన్నంగా ఉందని భక్తుల ఫిర్యాదులతో చర్యలు తీసుకుంటోంది. సమూల మార్పులు చేయాలన్న సీఎం ఆదేశాలతో ఈవో శ్యామలరావు లడ్డు తయారీకి వినియోగించే ముడిసరుకులు నాణ్యతపై దృష్టి పెట్టారు. సరుకుల్లో నాణ్యత లేదని పోటు సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు.
- Raju M P R
- Updated on: Jul 23, 2024
- 6:15 pm
తిరుపతిలో ఆ స్థానంపై కన్నేసిన టీడీపీ.. ఆయోమయంలో లోకల్ లీడర్లు..
తిరుపతి కార్పొరేషన్. ఎన్నికల ముందు దాకా ఒకే పార్టీది ఆధిపత్యం. తిరుగులేని నాయకత్వం. ఇప్పుడు సీన్ మారింది. 50 డివిజన్లు ఉన్న తిరుపతి కార్పొరేషన్కు 3 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో పూర్తి మెజారిటీని వైసీపీ సొంతం చేసుకుంది. 49 డివిజన్లకు ఎన్నికలు జరిగితే 48 స్థానాలను వైసీపీ, ఒక్క డివిజన్ లోనే టిడిపి జెండా ఎగుర వేసింది. మేయర్గా శిరీష, డిప్యూటీ మేయర్లుగా భూమన అభినయ్, ముద్దుల నారాయణ ఎన్నిక అయ్యారు.
- Raju M P R
- Updated on: Jul 22, 2024
- 7:34 am
Chandragiri: తగ్గేది లేదన్నట్టుగా చంద్రగిరి రాజకీయం.. సై అంటే సై అంటున్న ఇద్దరు నేతలు..!
చంద్రగిరిలో వైసీపీ, టీడీపీ పంచాయితీ మరింత ముదురుతోంది. అంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్ల నుంచి ఈ వార్ కంటిన్యూ అవుతోంది. తాజాగా మరోసారి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పులివర్తి నాని మధ్య మాటల యుద్ధం ఫీక్ స్టేజీకి చేరింది.
- Raju M P R
- Updated on: Jul 20, 2024
- 11:52 am
Andhra Pradesh: తిరుపతిలో ఒకే కుటుంబంపై కత్తులతో దాడి.. వృద్ధురాలు మృతి, బాలిక సీరియస్..!
తిరుపతి రాయల్ నగర్ లో దారుణం జరిగింది. ఇంటిలో చొరబడ్డ అగంతకుడు 67 ఏళ్ల జయలక్ష్మి అనే వృద్ధురాలిని హత్య చేశాడు. ఆమె మనవరాలు 14 ఏళ్ల మైనర్ బాలికపై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
- Raju M P R
- Updated on: Jul 19, 2024
- 12:45 pm
Watch Video: శ్రీవారి దర్శనానికి వెళ్లి.. ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన భక్తుడు..
తిరుమలలో ఒక భక్తుడి నకిలీ బాగోతం బయట పడింది. నకిలీ ఆధార్ కార్డుపై శ్రీవారి సుప్రభాత సేవకు వెళ్ళిన భక్తుడిని విజిలెన్స్ సిబ్బంది విచారించడంతో ఈ యవ్వారం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఆధార్ కార్డులతో లక్కి డిప్ విధానంలో పాల్గొంటూ వచ్చాడు బెంగళూరుకు చెందిన శ్రీధర్. ఈసారి అడ్డంగా బుక్ అయ్యాడు. శ్రీధర్పై కన్నేసిన విజిలెన్స్ అధికారులు ఫేక్ ఆధార్తో సేవా టిక్కెట్ పొందినట్లు గురించారు.
- Raju M P R
- Updated on: Jul 18, 2024
- 8:11 pm
Tirumala Temple: రికార్డు బద్దలు కొడుతున్న తిరుమల వెంకన్న ఆదాయం.. 6 నెలల్లో ఎన్ని కోట్లో తెలుసా..?
తిరుమల వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఘననీయంగా పెరిగిన భక్తుల రద్దీతో పాటు హుండీ ఆదాయం కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే అదే స్థాయిలో పెరుగుతోంది. ఆపదమొక్కులు తీర్చే స్వామికి కానుకలు సమర్పించే భక్తకోటి తిరుమలేశుడి ఆస్తుల విలువను అమాంతంగా పెంచుతోంది.
- Raju M P R
- Updated on: Jul 17, 2024
- 12:29 pm
ఆ గుడిలో స్వామిని దర్శించుకోవాలంటే.. భక్తులకు లగేజీ భారం తప్పదా.!
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి దర్శనం కోసం వస్తున్న యాత్రికులకు ఆలయం వద్ద ఇబ్బందులు తప్పడం లేదు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో దాదాపు 15 వేల మంది భక్తులు ప్రతిరోజూ శ్రీ గోవిందరాజ స్వామిని కూడా దర్శించుకుంటారు. తిరుపతి రైల్వే స్టేషన్కు పక్కనే ఉన్న శ్రీ గోవిందరాజ స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది.
- Raju M P R
- Updated on: Jul 16, 2024
- 9:50 pm
Andhra Pradesh: రెండు గ్రామలు మొత్తం ఖాళీ.. ఇళ్లకు తాళాలు వేసి.. రెండు ఊర్ల గ్రామస్తులు వలస ఉత్సవం
గ్రామానికి ఏ కీడు జరగకుండా, గ్రామమంతా ఐక్యంగా ఉండాలని ఆనవాయితీగా ఈ సంప్రదాయాన్ని కొనసాగించాయి. గుడిపల్లి మండలం గుడి కొత్తూరు, వేపమాను కొత్తూరు గ్రామాలు ఈ ఆచారాన్ని పాటించాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వలస సంప్రదాయాన్ని పాటిస్తున్న గ్రామస్తులు పొద్దు పొడవక ముందే మూటా ముల్లి సర్దుకొని ఊరిని ఖాళీ చేశారు. దాదాపు 200 కు పైగా ఇళ్ళు ఉన్న ఈ రెండు గ్రామాల్లో వెయ్యి మంది దాకా జనాభా కూడా ఉండగా వింత ఆచారం నేటికీ పాటిస్తుండటం ఆసక్తిగా మారింది.
- Raju M P R
- Updated on: Jul 15, 2024
- 8:00 am
Kuppam: కుప్పంలో పొలిటికల్ సీన్ రివర్స్.. పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్న మునిసిపల్ కౌన్సిలర్స్!
కుప్పం రాజకీయం వేగంగా మారుతోంది. అధికారం దూరమైన వెంటనే వైసీపీ కనబడకుండా పోయింది. వైసీపీ ముఖ్య నేతలంతా కుప్పం రావడానికే ముఖం చాటేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది.
- Raju M P R
- Updated on: Jul 14, 2024
- 9:41 pm
Watch Video: ఇది అమ్మవారి మహిమే.. పానకం తాగిన ‘వారాహి’ విగ్రహం.. వీడియో చూశారా..?
వారాహి అమ్మవారు నీళ్లు తాగుతున్న వీడియో నెట్టింట వైరలైన విషయం తెలిసిందే.. తాజాగా.. మరోచోట వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగింది.. దీనికి సంబంధించిన వీడియో సైతం వైరల్ అవుతోంది. అమ్మవారి విగ్రహం పానకం తాగిన ఘటన అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగింది. బ్రాహ్మణ వీధిలో వారాహి నవరాత్రుల్లో అమ్మవారు పానకం తాగినట్లు వీడియో వైరల్ అయ్యింది.
- Raju M P R
- Updated on: Jul 14, 2024
- 6:22 pm