టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.
తమిళనాడు ఎన్నికల ఫలితాలు.. టీవికే ఆధిక్యంతో ఏపీలో వైసీపీ సంబరాలు
తమిళనాడు ఎన్నికల ఫలితాలపై ఏపీలో సంబరాలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో TVK అధిక్యం పై నగరిలో విజయ్ అభిమానులు వేడుకలు జరుపు కున్నారు. క్లాక్ టవర్ వద్ద బాణాసంచా కాల్చిన అభిమానులు కేరింతలు కొట్టారు. సత్యవేడు నియోజకవర్గం లోని నాగలాపురం లోనూ విజయ్ అభిమానులు టీవీకే గెలుపుతో సంబరాలు జరుపుకున్నారు.
- Raju M P R
- Updated on: May 4, 2026
- 2:43 pm
Vijay – Trisha: విజయ్ ఇంటికి వెళ్లిన త్రిష.. ఇదిగో వీడియో..
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ దూసుకెళ్తోంది. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతోపాటు.. మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉంది.. ఈ అయితే.. సరిగ్గా తమిళనాడు ఎన్నికల ఫలితాల నాడే.. సినీనటి త్రిష 44వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు నాడు.. తమిళనాడు ఫలితాల ముందు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అయితే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ TVKకు త్రిష మద్దతు తెలిపారు.
- Raju M P R
- Updated on: May 4, 2026
- 1:04 pm
నకిలీ రికమండేషన్ లెటర్స్ కలకలం.. తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు..!
తిరుమల శ్రీవారి దర్శనం చేయిస్తామంటూ భక్తులను మోసగిస్తున్న మరో దళారీని పోలీసులు అరెస్టు చేశారు. టీటీడీ బోర్డు మెంబర్ నకిలీ సిఫార్సు లెటర్లతో మోసానికి పాల్పడ్డ నిందితుడి బండారాన్ని పోలీసులు బయటపెట్టారు. శ్రీవారి బ్రేక్ దర్శనం ఇప్పిస్తామనని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అనిత కుటుంబ సభ్యులను మోసగించాడు చాగంటి నవీన్ కుమార్.
- Raju M P R
- Updated on: Apr 28, 2026
- 9:05 am
Tirupati: తిరుపతి ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. పలు రైళ్లు రద్దు.. మరికొన్ని టైమింగ్స్ ఛేంజ్.. ఇదిగో వివరాలు..
తిరుపతి పట్టణ అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న డ్రైనేజీ ఆధునీకరణ పనులు ఇప్పుడు రైల్వే రాకపోకలపై ప్రభావం చూపుతున్నాయి. పాత పైపుల స్థానంలో బాక్స్ తరహా డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టనుండటంతో, తిరుపతి మీదుగా వెళ్లే పలు కీలక రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించారు. అసలు ఏ ఏ రైళ్లు రద్దయ్యాయి? ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అనేది తెలుసుకుందాం..
- Raju M P R
- Updated on: Apr 25, 2026
- 10:06 pm
తెల్లారేసరికి షాప్ ముందు క్యూ కట్టిన కస్టమర్లు.. ఎంతకూ తీయలేదు.. తలుపు బద్దలుకొట్టి చూడగా
తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. అత్తాకోడళ్ళను హతమార్చిన మోహన్ అనే వ్యక్తి.. అనంతరం తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందడంతో వెంకటకృష్ణపాలెంలో విషాదం నిండిపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- Raju M P R
- Updated on: Apr 23, 2026
- 8:07 am
Tirumala: తిరుమలలో ఏఐ టెక్నాలజీ.. టీటీడీ కీలక నిర్ణయాలు..
ఆధ్యాత్మిక క్షేత్రంలో అంతా సాంకేతికతే. ఏఐ డిజిటలైజేషన్ తో తిరుమలలో సరి కొత్త విధానాలే. అందుబాటులో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్. కొనుగోళ్లలో పారదర్శకతకు డిజిటల్ ప్లాట్ ఫారమ్. ప్రసాదాల్లో కల్తీకి చెప్పేలా ల్యాబ్. అలిపిరి వద్ద ఏఐ పహారతో భద్రత కట్టుదిట్టం. ఇది టీటీడీ లో కొనసాగుతున్న టెక్నాలజీ స్పీడ్.
- Raju M P R
- Updated on: Apr 21, 2026
- 9:14 pm
పదేళ్ల బంధం.. పగబట్టిన అనుమానం.. కన్నతల్లి కాటికి.. తండ్రి జైలుకు.. అనాథలైన బిడ్డలు!
అనుమానం పెనుభూతమై ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పదేళ్ల బంధం, ఇద్దరు పసిపిల్లల భవిష్యత్తు.. అంతా ఒక్క క్షణికావేశంలో బూడిదయ్యాయి. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో జరిగిన ఈ విషాద ఘటన మనుషుల మధ్య నమ్మకం ఎంత బలహీనపడిందో చెప్పకనే చెబుతోంది.తమ కాపురం సజావుగా సాగాలని కలలు కనే ఏ భార్యాభర్తలకైనా అన్యోన్యత పునాది. కానీ, వాల్మీకిపురానికి చెందిన జగదీష్, మౌనికల విషయంలో అది సాధ్యపడలేదు.
- Raju M P R
- Updated on: Apr 21, 2026
- 11:28 am
వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ఎండల నుంచి రిలీఫ్.. టీటీడీ భలే ప్లాన్..!
రాష్ట్రవ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిప్పుల కొలిమిలా మారుతున్న వాతావరణం సామాన్యులను వణికిస్తోంది. ఈ వేడి సెగలు ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులపై పడకుండా ఉండేందుకు టీటీడీ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగింది. భక్తులకు కొండంత అండగా నిలుస్తూ దాదాపు రూ. 3.21 కోట్లతో వేసవి తాపాన్ని తగ్గించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
- Raju M P R
- Updated on: Apr 21, 2026
- 9:10 am
Tirumala: శ్రీవారి భక్తుల జేబుకు చిల్లు.. ఢిల్లీ కంటే తిరుపతికే ఎక్కువ ఛార్జీలు.. ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
శ్రీవారి సన్నిధిలో తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకోవడం భక్తులకు తెలిసిన నిలువు దోపిడీ. కానీ, ఇప్పుడు కలియుగ దైవాన్ని దర్శించుకోవాలన్న తపనతో వచ్చే భక్తులు.. విమాన మెట్లెక్కకముందే ఆర్థికంగా నిలువు దోపిడీకి గురవుతున్నారు. కళ్లలో స్వామివారి రూపం ఉన్నా.. జేబులు గుల్ల చేస్తున్న విమాన చార్జీలు భక్తుల కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి.
- Raju M P R
- Updated on: Apr 20, 2026
- 7:25 pm
ఎండాకాలంలో చల్లటి మంచుతెరతో భక్తులను ఆహ్వానిస్తున్న తిరుమల వెంకటేషుడు..
రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేళ తిరుమలలో మాత్రం పొగమంచు మేఘాల సందడి భక్తులను ఆకట్టుకుంటోంది. శేషాచలం కొండలపై తేలియాడే మేఘాలు, ఘాట్ రోడ్లపై కమ్ముకున్న మంచు తెరలు ప్రకృతి సోయగాలను మరింత అందంగా చూపిస్తున్నాయి. ఆ దృశ్యాలను మేం మీ కోసం తీసుకొచ్చాం ...
- Raju M P R
- Updated on: Apr 18, 2026
- 1:05 pm
వామ్మో.. పే..ద్ద పాము.. నడక మార్గంలో నాగరాజు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. అంతటా ఉక్కపోత.. వడగాల్పులతో జనం విలవిల్లాడుతున్నారు. ఎంత తీవ్రత తాళలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. దాహంతో మూగ జీవాలు అల్లాడుతున్నాయి.. ముఖ్యంగా.. పాములు జనావాసాల్లోకి వస్తుండటంతో.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా, తిరుమలో ఓ నాగుపాము హల్ చల్ చేసింది..
- Raju M P R
- Updated on: Apr 16, 2026
- 2:13 pm
Andhra News: అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..
తిరుపతి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. రెండు కుటుంబాల మధ్య భూవివాదం చిరిగి చిరిగి గాలి వానగా మారింది. చివరికి హత్య చేసే వరకు వెళ్లింది. ఎలాగైన స్థలాన్ని దక్కించుకోవాలనుకున్న వ్యక్తి అవతలి వ్యక్తపై కత్తితో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అక్కిడి నుంచి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Raju M P R
- Updated on: Apr 16, 2026
- 1:21 pm