టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.
తిరుమల మొదటి ఘాట్లో విగ్రహం చోరీ.. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు
తిరుమల మొదటి ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ చిన్న విగ్రహం చోరీకి గురైంది. వేకువ జామున జరిగిన ఈ ఘటన సీసీ కెమెరా ల్లో నమోదైంది. అనుమానితుడి కోసం పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
- Raju M P R
- Updated on: Jul 22, 2026
- 2:58 pm
శివయ్యా.. ఇదేం మహత్యమయ్యా.. నూనెపోస్తే పాలాభిషేకమా?.. ఆలయంలో అద్భుతం
ఈ విశ్వంలో జరిగే కొన్ని సంఘటనలు జనాలను ఎప్పటికప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. పాము పాలుతాగడం, విగ్రహం నీరు తాగడం ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు మనం చాలానే చూశాం. అయితే తాజాగా ఆంధ్రుప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఓ ఘటనే ప్రస్తుతం జనాలను మైమరిపిస్తోంది. అందేంలో చూద్దాం పదండి.
- Raju M P R
- Updated on: Jul 22, 2026
- 7:14 am
TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. క్యూలైన్ ప్రసాదం పింపిణీలో సరికొత్త టెక్నాలజీ!
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ సరికొత్త టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో ఉండే భక్తులకు అన్న పానీయాలు అందజేసేందుకు ఫుడ్ సర్వింగ్ కన్వేయర్ అనే కొత్త పద్దతిని తీసుకొచ్చింది. ఇంతకు ఈ పద్దతి ఎలా పనిచేస్తుంది. దీని ద్వారా భక్తులకు ఎలా ప్రసాదాలు అందిస్తారో చూద్దాం.
- Raju M P R
- Updated on: Jul 21, 2026
- 9:45 am
టీటీడీ గోశాలలో కలకలం.. శ్రీవారి సేవ చేయక ముందే గుర్రం మృతి.. విరాళం ఇచ్చిన వారానికే..
టీటీడీ ఎస్వీ గోశాలకు ఇటీవల విరాళంగా వచ్చిన మార్వాడి జాతికి చెందిన తొమ్మిదేళ్ల మగ గుర్రం, శ్రీవారి సేవలో పాల్గొనకముందే మృతి చెందింది. మధురైకు చెందిన భక్తుడు వడివేలు ముగంధన్ జూలై 13న ఈ గుర్రాన్ని విరాళంగా అందజేశారు. గోశాలకు చేరిన వెంటనే క్వారంటైన్లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించగా, దీర్ఘకాలిక కాలేయం, మూత్రపిండాలు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
- Raju M P R
- Updated on: Jul 19, 2026
- 8:58 am
ప్రియుడిపై మోజు.. కన్న కొడుకుపై కర్కశత్వం.. ఓ తల్లి నిర్వాకం! చిన్నారి మర్మాంగంపై బ్లేడ్తో..
చిత్తూరు జిల్లా వీ.కోటలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన తల్లి, తన ప్రియుడితో కలిసి ఏడేళ్ల కుమారుడిని బ్లేడ్తో దాడి చేసి తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలుడిని ఆసుపత్రికి తరలించగా, నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
- Raju M P R
- Updated on: Jul 18, 2026
- 4:05 pm
పద్దతిగా భర్తను గుడికి తీసుకెళ్లింది.. బాయ్ ఫ్రెండ్తో కలిపి లేపేసింది.. ఏపీలో సంచలనం
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కడతేర్చేందుకు భార్య తన ప్రియుడితో కలిసి పక్కా ప్రణాళిక రచించింది. మల్లప్పకొండ దర్శనం పేరుతో భర్తను తీసుకెళ్లి హత్య చేయించిన అనంతరం, ఏమీ తెలియనట్లు అతని బైక్పైనే ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పరారైంది. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
- Raju M P R
- Updated on: Jul 16, 2026
- 9:39 am
Tirumala: టీటీడీ సరికొత్త రికార్డు.. ఒకే ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు! 10 గంటల్లోనే
కలియుగ వైకుంఠం తిరుమల గిరులపై భక్తి ప్రవాహం ఉప్పొంగింది. శ్రీవారి ఆలయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కేవలం 10 గంటల వ్యవధిలో రూ. 96.98 కోట్ల రికార్డు స్థాయి విరాళాలు వచ్చి చేరాయి. సామాన్య భక్తుల దర్శన వేళలను మెరుగుపరిచేందుకు టీటీడీ బోర్డు తీసుకొచ్చిన కొత్త డోనర్ పాలసీ అమల్లోకి రావడానికి ముందే.. పాత పద్ధతిలోనే స్వామివారి సేవలో భాగస్వాములు కావాలని దాతలు పోటెత్తారు. ఆన్లైన్, ఆఫ్లైన్ వేదికల ద్వారా కోట్ల రూపాయలు సమర్పిస్తూ సరికొత్త రికార్డు సృష్టించారు.
- Raju M P R
- Updated on: Jul 16, 2026
- 8:37 am
తిరుమలకు వెళ్తున్నారా..? భక్తులూ జర భద్రం.. టీటీడీ మాజీ ఉద్యోగి ఏం చేశాడంటే..
తిరుమల శ్రీవారి దర్శనం, వసతి, సేవా టికెట్లు ఇప్పిస్తామని నమ్మించి భక్తుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతికి చెందిన మాజీ టీటీడీ ఉద్యోగి టి. అరుణ్కుమార్ ఇప్పటికే ఇదే తరహా కేసులో అరెస్టై ఉద్యోగాన్ని కోల్పోయినప్పటికీ, మళ్లీ భక్తులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
- Raju M P R
- Updated on: Jul 15, 2026
- 11:29 am
ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇదేం దారుణం..? నగల కోసం 65 ఏళ్ల మహిళ గొంతుకోసి హత్య
టెంపుల్ సిటీలో నేర సంస్కృతి ఉలిక్కిపడేలా చేస్తుంది. ఆధ్యాత్మిక నగరంలో జరుగుతున్న హత్యల సంస్కృతి ఆందోళన కలిగిస్తుంది. వరుస హత్యలతో నేరాల క్రూరత్వం పెరుగుతోంది. ఆధ్యాత్మిక నగరంలో అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితికి కారణం అవుతోంది. ఇందులో భాగం గానే వారం రోజుల క్రితం ఒక పెళ్లి మండపం వద్ద జంట హత్యల ఘటన జరిగింది. ఇప్పుడు నగల కోసం 65 ఏళ్ల మహిళ హతకు గురైంది. అలజడి సృష్టించిన దుండగులు నిన్న రాత్రి ఈ దారుణానికి పాల్పడ్డారు..
- Raju M P R
- Updated on: Jul 15, 2026
- 11:06 am
టీటీడీ కీలక నిర్ణయాలు.. దాతలకు కొత్త నిబంధనలు, తిరుమలలో భారీ అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్!
టీటీడీలోని వివిధ ట్రస్టులు, స్కీమ్లకు విరాళాలు ఇచ్చే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్లో టిటిడి పలు మార్పులు చేసింది.తిరుమలలోని అన్నమయ్య భవనం లో చైర్మన్ బి ఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. బోర్డు తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ ఈవోతో కలిసి మీడియా కు వివరించారు. టీటీడీకి చెందిన అన్ని ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రివిలేజెస్లో పలు మార్పులు చేపట్టింది. కొత్త నిబంధనలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని టిటిడి ప్రకటించింది. అయితే, ఇప్పటికే వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రివిలేజెస్ యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
- Raju M P R
- Updated on: Jul 14, 2026
- 7:15 pm
Video: అర్ధరాత్రి ఇంటిపక్కన పొదల్లోంచి అదోరకం శబ్ధాలు.. ఏంటని టార్స్ వేసి చూడగా..
టెంపుల్ సిటీ తిరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శేషాచలం అటవీ ప్రాంతం నుండి తరచూ జనావాసాల్లోకి వస్తున్న చిరుతలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గ్రాండ్ వరల్డ్, ఉపాధ్యాయ నగర్ వంటి కాలనీల్లో చిరుతల ఆనవాళ్లను గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన అధికారులు జనాలకు కీలక సూచనలు చేశారు.
- Raju M P R
- Updated on: Jul 14, 2026
- 7:58 am
Tirupati: తిరుపతిలో డ్రగ్స్ కలకలం.. మత్తు ముఠాలో టీటీడీ ఉద్యోగి.. బెంగళూరు లింకులు..
తిరుపతి జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న భారీ డ్రగ్స్ నెట్వర్క్ను రేణిగుంట పోలీసులు ఛేదించారు. ఈ నెల 10న జరిగిన ఈ దాడిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 3 లక్షల విలువైన 63 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో టీటీడీ ఉద్యోగి ఉండటంతో పోలీసులు కేసును మరింత సీరియస్గా విచారిస్తున్నారు.
- Raju M P R
- Updated on: Jul 13, 2026
- 10:06 pm