టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.
Tirumala: తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. పది రోజుల్లో కోట్ల రూపాయల విరాళాలు..
ఏడుకొండలపై కొలువైన వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి.. తమ మొక్కులు చెల్లించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమల తిరుపతి క్షేత్రానికి చేరుకుంటారు. వడ్డీకాసుల వాడికి భక్తులు భారీ కానుకలను సమర్పించుకుంటున్నారు. వివిధ రూపాయల్లో భక్తులు ఇచ్చే కానుకలతో శ్రీ వెంకటేశ్వర స్వామి తన ఆస్తుల విలువను పెంచుకుంటున్నాడు. వెంకన్న ఆదాయం పెరిగిపోతోంది. గత 10 రోజులుగా వెంకన్నకు రూ.30 కోట్ల మేర విరాళం అందింది. వివరాల్లోకి వెళ్తే..
- Raju M P R
- Updated on: Mar 29, 2025
- 9:36 am
TTD: వెలుగులోకి మరో మోసం.. బయటపడిన సేంద్రియ ఉత్పత్తుల బండారం!
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు.. ఆపద మొక్కుల స్వామి. అందుకే క్షణం పాటు వెంకన్న దర్శనం దొరికితే చాలు అన్నది భక్తుల ఆశ. అందుకే ఎన్నో వ్యయ ప్రయాసలు లెక్క చేయక శ్రీవారి దర్శనం కోసం పరితపిస్తారు. శ్రీవారి నిత్య నైవేద్యాలు, ప్రసాదాల పరమ పవిత్రంగా భావిస్తుంటారు. అలాంటి ప్రసాదాల కోసం సరఫరా చేసిన సేంద్రియ ఉత్పత్తుల బండారం బయట పడింది.
- Raju M P R
- Updated on: Mar 27, 2025
- 9:29 pm
Tirumala: కలియుగంలో అపర కుభేరుడు ఆయనే.. అంతకంతకూ పెరుగుతున్న వెంకన్న ఆదాయం
కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతుండటమే అందుకు నిదర్శనం. తిరుమలేశుడు.... వెల కట్టలేని ఆస్తులున్న సంపన్నుడు. ఏటేటా పెరుగుతున్న శ్రీవారి ఆదాయం.. టీటీడీ వార్షిక బడ్జెట్ను పెంచేస్తోంది. ఇటు హుండీ, అటు డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూపంలో ఏడుకొండవారి ఆస్తుల విలువ కొండంత అవుతోంది.
- Raju M P R
- Updated on: Mar 26, 2025
- 7:21 pm
Tirumala: వారికి గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ.. పాలకమండలి భేటీలో కీలక నిర్ణయాలు
ఈ ఆర్ధిక సంవత్సరానికి 5 వేల 58 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది..టీటీడీ పాలకమండలి. ఇటీవల తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు సూచించిన పలు కీలక నిర్ణయాలకు కూడా ఆమోద ముద్ర వేసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...
- Raju M P R
- Updated on: Mar 24, 2025
- 7:30 pm
Andhra News: జాతరలో అశ్లీల నృత్యాలు.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితార్..!
అన్నమయ్య జిల్లాలో జరిగిన ఒక జాతరలో అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి. భక్తితో జరుపుకునే జాతరలో అశ్లీల డ్యాన్స్లు ఏంటి..? అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కురబలకోట మండలం ముదివేడులో జరిగిన గ్రామదేవత జాతరలో ఏర్పాటు చేసిన అశ్లీల నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
- Raju M P R
- Updated on: Mar 24, 2025
- 9:25 am
TTD: దేశంలోని ప్రతీ రాష్ట్ర రాజధానిలో తిరుపతి వెంకన్న ఆలయం! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఈ మేరకు దిశానిర్దేశం చేస్తామన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహకరించినట్లయితే ఈ ప్రాజెక్టు అమలు చేయబడుతుందని ఆయన తెలిపారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించాలని, శ్రీవారి ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని ఆదేశించారు.
- Raju M P R
- Updated on: Mar 21, 2025
- 3:05 pm
దొంగల నుంచి బంగారం కొట్టేసి అడ్డంగా బుక్కైన పోలీసులు! ఇది మామూలు ట్విస్ట్ కాదు..
చిత్తూరు జిల్లాలోని కట్టమంచిలో జరిగిన రూ.12 లక్షల బంగారం దొంగతనం కేసులో పోలీసులు రూ.6 లక్షలు మాత్రమే రికవరీ చేసినట్లు చూపించారు. అసలు దొంగతనం చేసిన వ్యక్తి రాయచోటిలో మరో దొంగతనం చేసినట్లు తెలియడంతో, రాయచోటి పోలీసులు చిత్తూరు పోలీసులపై కేసు నమోదు చేయాలని హెచ్చరించారు. పోలీసుల అవినీతిపై విచారణ జరుగుతోంది.
- Raju M P R
- Updated on: Mar 20, 2025
- 1:18 pm
పాములు పగ పడతాయా..? 103 సార్లు ఒకే వ్యక్తిని కాటేసిన పాములు.. ఇదో మిస్టరీ కథ..
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఒక వ్యక్తిని పాముకాటు సమస్య వేధిస్తోంది. పగబట్టి కాటేస్తుందా లేదంటే ప్రమాదవశాత్తు పాముకాటుకు గురి అవుతున్నాడా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. బైరెడ్డిపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామానికి చెందిన 47 ఏళ్ల సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నాడు.
- Raju M P R
- Updated on: Mar 18, 2025
- 12:25 pm
Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇవాళే ఆర్జిత సేవా టికెట్ల జూన్ కోటా విడుదల.. ఇలా బుక్ చేస్కోండి..
తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ నెల దర్శనం టికెట్ల కోటాను మరికాసేపట్లో విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను మంగళవారం (మార్చి 18న) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
- Raju M P R
- Updated on: Mar 18, 2025
- 7:11 am
ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల లేఖలతో శ్రీవారి దర్శనం ఎప్పుడంటే…? గుడ్ న్యూస్ చెప్పిన టిటిడి
తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం అనుమతిపై టిటిడి క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన అంశంపై స్పష్టత ఇచ్చింది. ఈ నెల 14 న తెలంగాణ బిజెపి ఎంపీ రఘునందన్ రావు తిరుమలలో చేసిన కామెంట్స్ తో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోవడంతో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఈ మేరకు మార్చి 24 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టిటిడి కల్పించనుంది. ఈ విధానం
- Raju M P R
- Updated on: Mar 17, 2025
- 4:22 pm
Watch: తిరుమల కొండలను కమ్మేసిన పొగమంచు.. పాల సముద్రాన్ని తలపించే ఆ అద్భుత దృశ్యాలు ఇవిగో..
తిరుమల కొండలను పొగమంచు కమ్మేసింది. అప్పుడే మొదలైన ఎండాకాలంతో రాష్ట్రవ్యాప్తంగా అప్పుడే ఎండలు దంచికొడుతుంటే.. తిరుమలలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. తెల్లవారు జామున మంచు కమ్మేసి.. చల్లటి వాతావరణం భక్తులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఫోటోలు, సెల్పీలు దిగుతూ సందడి చేశారు.
- Raju M P R
- Updated on: Mar 14, 2025
- 12:13 pm
Tirumala: తిరుమల వెళ్లే భక్తులు జాగ్రత్త.. తొలుత మాయమాటలు.. ఆపై మత్తు మందు.. కట్ చేస్తే..
తిరుమల వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలి.. తిరుమలలో భక్తులకు మాయమాటలు చెప్పి మత్తుమందు ఇచ్చి దోచుకుంటున్న దొంగల గ్యాంగ్ వ్యవహారం బయటపడింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. అయితే కొండపై దర్శనం కోసం వచ్చిన భక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు ఇద్దరు. ఒంటరిగా ఉండేవాళ్లు, వృద్ధ భక్తులకు మత్తుమందు ఇచ్చి దోచేస్తున్నారు.. ఈ క్రమంలో ఇద్దర్ని తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు.
- Raju M P R
- Updated on: Mar 14, 2025
- 8:26 am