AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raju M P R

Raju M P R

Staff Reporter - TV9 Telugu

raju.meesaraganda@tv9.com

టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.

Read More
Follow On:
భార్యాభర్తలు బాధ్యతగల ఉద్యోగులే.. అయితేనేం వరుసలు మరిచి బరితెగించారు.. కట్‌చేస్తే

భార్యాభర్తలు బాధ్యతగల ఉద్యోగులే.. అయితేనేం వరుసలు మరిచి బరితెగించారు.. కట్‌చేస్తే

ఆ భార్య భర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు.. నలుగురికి న్యాయం చేయాల్సిన పోస్ట్‌లలో ఉండి.. మతితప్పి ప్రవర్తించారు. వరుసకు కూతురు అవుతుందని కూడా చూడకుండా ఆ ప్రభుత్వ ఉద్యోగి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అది తెలిసి భర్తకు బుద్ది చెప్పాల్సిన భార్య సైతం అతనికి సహకరిస్తూ వత్తాసు పలికింది. కానీ చివరకు ఆ తప్పే వారి పాలిట శాపమై ఇద్దరూ కటకటాల పాలయ్యేందుకు కారణమైంది.

Tirupati: అమ్మా.. తల్లి.. పరాశక్తి.. JCBతో పొలం చదును చేస్తుండగా..

Tirupati: అమ్మా.. తల్లి.. పరాశక్తి.. JCBతో పొలం చదును చేస్తుండగా..

తిరుపతి జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లిలో రైతు పొలంలో తవ్వకాలు చేపట్టగా పురాతన అమ్మవారి విగ్రహం వెలుగులోకి వచ్చింది. జేసీబీకి బండరాయిలా తగిలిన విగ్రహాన్ని జాగ్రత్తగా మట్టి తొలగించగా, సింహావాహనంపై ఆసీనులై ఉన్న అమ్మవారిగా గుర్తించారు. స్థానికులు దుర్గాదేవి విగ్రహంగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

కొండంత జనం.. 30 గంటల దర్శనం! తిరుమలలో రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ

కొండంత జనం.. 30 గంటల దర్శనం! తిరుమలలో రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ

కలియుగ వైకుంఠం తిరుమల కొండపై వేసవి తాకిడికి తోడు భక్తజన సందోహం పోటెత్తింది. గత వారం రోజులుగా పెరిగిన భక్తుల రద్దీతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. "గోవిందా.. గోవిందా.." స్మరణలతో తిరుగిరులు మారుమోగుతున్నాయి. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 30 గంటలకు పైగా సమయం పడుతోంది.

Tirumala: వామ్మో ఇంతుందేంటి భయ్యా.. స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్

Tirumala: వామ్మో ఇంతుందేంటి భయ్యా.. స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్

ఈ మధ్య కాలంలో టెంపుల్‌ సిటీ తిరుమలలో పాముల హల్చల్‌ చేస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వచ్చి భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొసారి వెలుగు చూసింది. ఓ 12 అడుగుల భారీ కొండ చిలువ భక్తులను హలడలెత్తించింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

TTD: భక్తులకు అద్భుత అవకాశం.. వేలంలో శ్రీవారికి సమర్పించిన వస్త్రాలు.. ఎలా కొనాలంటే?

TTD: భక్తులకు అద్భుత అవకాశం.. వేలంలో శ్రీవారికి సమర్పించిన వస్త్రాలు.. ఎలా కొనాలంటే?

భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను టీటీడీ వేలం వేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ వేలం మే 21 నుండి జూన్ 2వ తేదీ వరకు జరగనుందని ఆసక్తి గత భక్తులు వేలంపాటలో పాల్గొని వస్తాలను కొనుగోలు చేయవచ్చనటి టీటీడీ ప్రకటనలో పేర్కొంది.

Andhra: ఎంతకు తెగించార్రా.. జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి.. ఏం చేశారో తెలుసా..?

Andhra: ఎంతకు తెగించార్రా.. జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి.. ఏం చేశారో తెలుసా..?

చిత్తూరులో భారీ భూ మోసం వెలుగుచూసింది. 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి భూమిని తొలగించినట్లు చూపించేందుకు కేటుగాళ్లు ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు. నకిలీ ప్రొసీడింగ్ ఆర్డర్‌తో రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నించగా సబ్ రిజిస్ట్రార్‌కు అనుమానం రావడంతో అసలు బండారం బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Andra News: పోలీసులే దొంగలై.. ఫేక్ రైడ్‌తో రూ.10 లక్షలు కొట్టేశారు.. సీన్‌కట్‌చేస్తే.. చివరకు

Andra News: పోలీసులే దొంగలై.. ఫేక్ రైడ్‌తో రూ.10 లక్షలు కొట్టేశారు.. సీన్‌కట్‌చేస్తే.. చివరకు

చిత్తూరు జిల్లాలో పోలీసుల స్టైల్ మారింది. నేరాలను కట్టడి చేయాల్సిన పోలీసులే దొంగలతో చేతులు కలుపుతున్న పరిస్థితి నెలకొంది. గంగాధర నెల్లూరు పోలీసుల అదుపులో ఉన్న దొంగనోట్ల చలామణి ముఠా ఈ విషయాన్ని బయట పెట్టింది. దొంగ నోట్ల మార్పిడి పేరుతో రూ.10 లక్షలు కొట్టేసిన ముఠా బండారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఠాలో కీలక నిందితులు పోలీసులే కావడంతో ఇది హాట్ టాపిక్ అయ్యింది.

ఎందుకు ఆదిలక్ష్మి ఇలా చేశావ్.. అకస్మాత్తుగా ఫ్లైఓవర్ పై నుంచి దూకింది.. చివరకు..

ఎందుకు ఆదిలక్ష్మి ఇలా చేశావ్.. అకస్మాత్తుగా ఫ్లైఓవర్ పై నుంచి దూకింది.. చివరకు..

తిరుపతిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గరుడ వారధి ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఆదిలక్ష్మి అనే యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర గాయాలతో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రేమ వ్యవహారమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో వీక్లీ, ప్రత్యేక రైళ్లు.. ఇదిగో పూర్తి వివరాలు

రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో వీక్లీ, ప్రత్యేక రైళ్లు.. ఇదిగో పూర్తి వివరాలు

Summer special trains: రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వేశాఖ తీపి కబురు అందించింది. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. తిరుపతికి రాకపోకలు సాగించేందుకు వీలుగా పలు రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ నెలలోనే ప్రారంభమయ్యాయి. అలాగే వేసవి ప్రత్యేక రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

తిరుమలలో మోసం గుట్టురట్టు: మహిళా జర్నలిస్టు ఫిర్యాదుతో దళారీ చిక్కాడు

తిరుమలలో మోసం గుట్టురట్టు: మహిళా జర్నలిస్టు ఫిర్యాదుతో దళారీ చిక్కాడు

Tirupati news: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యేక దర్శనం, గదులు ఇప్పిస్తానని చెప్పి భక్తులను మోసం చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం లింగంగుంటకు చెందిన బోడపాటి నవీన్ చౌదరి టీటీడీ ఉద్యోగినని చెప్పుకుని సోషల్ మీడియా ద్వారా భక్తులతో పరిచయం పెంచుకుని మోసాలు చేసినట్లు గుర్తించారు. గత కొన్నేళ్లుగా ఈ దందా కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు.

మున్సిపల్ టాక్స్ కట్టలేదని.. చెత్తతో భలే ట్రీట్మెంట్ ఇచ్చిన మున్సిపల్ సిబ్బంది!

మున్సిపల్ టాక్స్ కట్టలేదని.. చెత్తతో భలే ట్రీట్మెంట్ ఇచ్చిన మున్సిపల్ సిబ్బంది!

పన్నుల వసూలు కోసం మున్సిపల్ అధికారులు వినూత్న, దూకుడు వ్యూహాలను అమలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలో పన్నులు చెల్లించని ఒక ఫంక్షన్ హాల్ యజమానికి మున్సిపల్ సిబ్బంది గట్టి షాక్ ఇచ్చారు. బల్క్ వేస్టేజ్ (భారీ వ్యర్థాల) తొలగింపు పన్నులను దీర్ఘకాలంగా చెల్లించకుండా మొండికేస్తున్న విబిఎస్ ఫంక్షన్ హాల్ ప్రధాన గేటు ముందే మున్సిపల్ సిబ్బంది ఏకంగా చెత్తను తెచ్చి డంప్ చేశారు.

TTD: ఒకే ఫోన్ నంబర్‌తో బల్క్ బుకింగ్స్.. శ్రీవాణి టికెట్ల పేరిట భారీ దందా! విజిలెన్స్‌ ధర్యాప్తులో..

TTD: ఒకే ఫోన్ నంబర్‌తో బల్క్ బుకింగ్స్.. శ్రీవాణి టికెట్ల పేరిట భారీ దందా! విజిలెన్స్‌ ధర్యాప్తులో..

తిరుమల శ్రీవారిని దగ్గరుండి దర్శించుకోవాలని ఆశపడే భక్తులను ఆసరాగా చేసుకుని కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఎలాంటి సిఫారసు లేఖలు లేకుండా నేరుగా బ్రేక్ దర్శనం పొందేందుకు టీటీడీ ప్రవేశపెట్టిన శ్రీవాణి టికెట్లను అడ్డుపెట్టుకుని భక్తులను బురిడీ కొట్టిస్తున్నాయి. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు ట్రావెల్ ఏజెన్సీలపై నిఘా పెట్టారు.