టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.
Andhra Crime: 3 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
జిల్లాలో ఒంటరి మహిళలే టార్గెట్గా వరుస హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను తిరుపతి జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుడు కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన అజీజ్ అలియాస్ అబ్దుల్ అజీజ్ అనే అంతర్రాష్ట్ర నేరస్తుడిగా గుర్తించారు. అతనితో పాటు తన అనుచరుడిని కూడా పట్టుకున్న పోలీసులు ఇద్దరిని రిమాండ్కు తరలించారు.
- Raju M P R
- Updated on: Apr 12, 2026
- 10:37 pm
Actress Nayanthara: వెంకన్న సన్నిధిలో నాయనతార దంపతులు.
నయనతార దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సొంత బ్యానర్ పై నిర్మించిన లైక్ మూవీ విడుదల సందర్బంగా తిరుమల వచ్చి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు నయనతార ఆమె భర్త విగ్నేష్ శివన్. బయటకు వచ్చిన నయనతార, విగ్నేష్ లు భక్తులతో ముచ్చటించారు
- Raju M P R
- Updated on: Apr 11, 2026
- 4:59 pm
Sreeleela: తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
శ్రీలీల తిరుపతిలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చి, తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవాణి దర్శనంలో వెంకన్నకు మొక్కులు చెల్లించి, భక్తులతో సరదాగా ముచ్చటించారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలనపై తిరుపతి జిల్లా పోలీసులు చేపట్టిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
- Raju M P R
- Updated on: Apr 10, 2026
- 4:44 pm
Tirumala: అరగంటలో శ్రీవారి దర్శనం.. అది కూడా 5 అడుగుల దూరంలోనే.. కట్చేస్తే..
తిరుమలకు వెళ్తున్నారా?.. త్వరగా శ్రీవారి దర్శనం కావాలా? కేవలం 5 అడుగుల దూరం నుంచే స్వామివారిని దర్శించుకోవచ్చంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తూ భక్తులను బురిడీ కొట్టిస్తున్న ఓ కేటుగాడికి ఎట్టకేలకు చెక్ పెట్టారు పోలీసులు. నిందితుడు తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన సెంథిల్ కుమార్గా గుర్తించారు.
- Raju M P R
- Updated on: Apr 10, 2026
- 1:23 pm
Andhra Pradesh: ఎమ్మెల్యే పదవితో పాటు అవి బోనస్గా వచ్చాయి.. రోజా కామెంట్స్ వైరల్..
మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయాల్లో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడూ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగే రోజా.. తాజాగా తన వ్యక్తిగత ఆరోగ్యంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే పదవితో పాటు నాకు కొన్ని బంపర్ ఆఫర్లు కూడా వచ్చాయంటూ ఆమె చేసిన కామెంట్స్ అటు నవ్వులు పూయిస్తూనే, రాజకీయాల్లో ఉండే ఒత్తిడిని కళ్లకు కట్టాయి.
- Raju M P R
- Updated on: Apr 10, 2026
- 8:38 am
Andhra Pradesh: సీఎం సొంత జిల్లా సీన్ మారుతుందా.. 14 సీట్లు ఏకంగా 21 అవుతాయా..?
ఏపీ రాజకీయాలకు గుండెకాయ లాంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరోసారి ఎన్నికల నగారా కంటే ముందే పునర్విభజన హడావుడి మొదలైంది. అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయన్న కేంద్రం సంకేతాలతో జిల్లా రాజకీయ స్వరూపం పూర్తిగా మారిపోబోతోంది. తిరుపతి రూరల్ నుంచి నాయుడుపేట వరకు.. కలికిరి నుంచి బంగారుపాళ్యం వరకు కొత్త నియోజకవర్గాల ఏర్పాటుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..
- Raju M P R
- Updated on: Apr 9, 2026
- 12:06 pm
Viral Video: ఓర్నాయనో.. నీళ్ల కోసం ఇంటికొచ్చిన నాగుపాము.. వీడియో చూశారా..?
ఎండలు మండిపోతున్నాయి.. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు.. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇక మూగ జీవాల పరిస్థితి అయితే.. దారుణంగా ఉంది.. తీవ్రమైన ఎండలతో విలవిలలాడుతున్నాయి.. దాహం తీర్చుకునేందుకు జనావాసాల్లోకి వస్తున్నాయి. పాములు కూడా దాహంతో బుసలు కొడుతున్నాయి.
- Raju M P R
- Updated on: Apr 9, 2026
- 12:58 pm
72 ఏళ్ల వృద్ధురాలికి వాట్సాప్ వీడియో కాల్ చేసిన యువకుడు.. ఈ తర్వాతే అసలు ట్విస్ట్..!
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో డిజిటల్ అరెస్ట్ ముఠా గుట్టు రట్టు అయ్యింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో నమోదైన కేసును ఛేదించిన పోలీసులు, డిజిటల్ ముఠా యవ్వారాన్ని బయటపెట్టారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరుగుప్పకు చెందిన విరుపాక్షి అనే యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు, డిజిటల్ ముఠా అసలు బాగోతాన్ని ఛేదించారు.
- Raju M P R
- Updated on: Apr 7, 2026
- 4:01 pm
Helmet Awareness: హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. వాహనదారులకు పోలీసుల బంపర్ ఆఫర్..
చిత్తూరు పోలీసులు రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి 'హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు' అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు లక్కీడ్రా ద్వారా నగదు, బహుమతులు అందజేస్తారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచుతూ, ట్రాఫిక్ నియమాలను పాటించేలా ప్రోత్సహించడం లక్ష్యంగా పోలీసులు సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు.
- Raju M P R
- Updated on: Apr 6, 2026
- 8:12 pm
రీల్స్ తెచ్చిన తంటా.. అన్యాయంగా 13 ఏళ్ళ బాలిక బలి.. అసలేమైందంటే?
'సోషల్ మీడియా రీల్స్' వ్యామోహం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. యువతలో రీల్స్ పిచ్చి రోజురోజుకు ముదిరిపోతోంది. రీల్స్ మోజులో పడి ప్రాణాల మీదకు వస్తుందని తెలిసినా.. ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. తిరుపతి జిల్లాలో రీల్స్ కోసం ప్రయత్నించి ఓ బాలిక మృతి చెందింది.. దీంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
- Raju M P R
- Updated on: Mar 31, 2026
- 10:28 am
టీటీడీ సంచలన నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు..
శ్రీవారి ప్రాశస్త్యం దేశవ్యాప్తం చేయాలని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) నిర్ణయించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణం చేపట్టాలని భావించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల రాజధానుల్లో వెంకన్న ఆలయాల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో వడివడిగా అడుగులేస్తోంది.
- Raju M P R
- Updated on: Mar 30, 2026
- 12:36 pm
Andhra: తులసితో కలిసి ఎంతకు తెగించావ్ భాను.. ఒంటరిగా ఉన్న ప్రియుడు భార్య దగ్గరకు వెళ్లి..
చిత్తూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి భార్యపై ప్రియురాలు దాడికి పాల్పడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన యువతి.. ఏకంగా ప్రియుడి భార్యపై దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం బోయపల్లి గ్రామంలో జరిగింది.
- Raju M P R
- Updated on: Mar 28, 2026
- 3:44 pm