Raju M P R

Raju M P R

Staff Reporter - TV9 Telugu

raju.meesaraganda@tv9.com

టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.

Read More
Follow On:
Nagari Politics: ఎన్నికల ముందు మంత్రి రోజాకు బిగ్ షాక్.. పార్టీని వీడుతున్న అసమ్మతి వర్గం..!

Nagari Politics: ఎన్నికల ముందు మంత్రి రోజాకు బిగ్ షాక్.. పార్టీని వీడుతున్న అసమ్మతి వర్గం..!

మంత్రి రోజాకు ఆమె సొంత నియోజకవర్గం నగరిలోనే అసమ్మతి సెగ తగులుతోంది. ఆమెకు వ్యతిరేకంగా వర్గపోరు తీవ్రమవుతోంది. అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. విపక్షం నుంచే కాకుండా అధికారపక్షంలోని అసమ్మతి వర్గం నుంచే రోజాకు తలనొప్పి ఎక్కువైంది. ఎన్నికల వేళ అసమ్మతి నేతల రాజీనామాల పర్వం కీలక సమయంలో రోజాను కలవరపాటుకు గురిచేస్తోంది.

న్యూఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. గరుడ వాహనసేవ ఎప్పుడంటే..

న్యూఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. గరుడ వాహనసేవ ఎప్పుడంటే..

న్యూఢిల్లీలో శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహించబోతుంది. ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో మే 21 నుంచి 29 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జరుగనున్నాయి. మే 20న‌ సాయంత్రం అంకురార్పణ జ‌రుగ‌ నుండగా బ్రహ్మోత్సవాల ముందు మే 14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంతో అర్చకులు ఆలయ శుద్ధి నిర్వహిస్తారు. మే 21 ఉదయం 10.45 నుండి 11.30 గంటల మ‌ధ్య క‌ర్కాట‌క‌ ల‌గ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి.

Tirumala: జూన్‌ 1 నుంచి 5 వరకు తిరుమ‌ల‌లో హనుమత్‌ జయంతి ఉత్సవాలు.. విస్తృత ఏర్పాట్లు చేస్తోన్న టీటీడీ

Tirumala: జూన్‌ 1 నుంచి 5 వరకు తిరుమ‌ల‌లో హనుమత్‌ జయంతి ఉత్సవాలు.. విస్తృత ఏర్పాట్లు చేస్తోన్న టీటీడీ

హనుమత్‌ జయంతి సందర్భంగా ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామివారికి విశేష అభిషేక, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామాన్నారు. హనుమంతుని జన్మ విశేషాలు, ఇతర అంశాలను ఆధ్యాత్మికపరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో కూడా ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.  భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తిరుమలలోని అంజనాద్రి, ఆకాశగంగ, నాదనీరాజనం వేదికలపై అన్నమాచార్య, దాససాహిత్య, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కళాకారులతో ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా మన్నారు.

TTD: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలోని రూ.2 వేల నోట్లకు మోక్షం.. నోట్ల మార్పిడికి ఆర్బీఐ ఒకే!

TTD: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలోని రూ.2 వేల నోట్లకు మోక్షం.. నోట్ల మార్పిడికి ఆర్బీఐ ఒకే!

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు రద్దీ భారీగా పెరుగుతోంది. కానుకల రూపంలో భారీ స్థాయిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆదాయం కూడా సమకూరుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలో వచ్చిన రూ.2 వేల నోట్లకు మోక్షం లభించింది.

ముక్కంటి సాక్షిగా ఆ ఇద్దరి మధ్య పోటీ.. సంక్షేమం, అభివృద్దిపై చర్చకు సిద్దం అంటూ సవాల్ చేస్తున్న ఎమ్మెల్యే..

ముక్కంటి సాక్షిగా ఆ ఇద్దరి మధ్య పోటీ.. సంక్షేమం, అభివృద్దిపై చర్చకు సిద్దం అంటూ సవాల్ చేస్తున్న ఎమ్మెల్యే..

రాహు కేతు క్షేత్రం శ్రీకాళహస్తి వైసీపీ టిడిపిలకు హాట్ సీట్‎గా మారింది. ఎన్నికలకు ముందు నుంచే ఒకరిపై ఒకరు చాలెంజ్ లు, ఆరోపణలు, సవాళ్ళతో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు వార్ పీక్స్‎కి చేరుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ వర్సెస్ బొజ్జల సుధీర్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. అభివృద్ధి, అవినీతిపై బహిరంగ చర్చకు సాక్షాలతో సిద్ధమంటున్న ఇద్దరు నేతలు సార్వత్రిక ఎన్నికల్లో అమీ తుమీ తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు.

తిరుమల వెళ్లేవారికి ముఖ్య అలెర్ట్.. ఈ విషయం మీకు తెలుసా.? ఈ వార్త చదివేయండి..

తిరుమల వెళ్లేవారికి ముఖ్య అలెర్ట్.. ఈ విషయం మీకు తెలుసా.? ఈ వార్త చదివేయండి..

తిరుమల శ్రీవారి ఆర్థిక సేవ టికెట్లను టీటీడీ గురువారం ఆన్‌లైన్‌లోకి రానున్నాయి. జూలై నెలకు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు టీటీడీ నిర్ణయించింది. ఆ రోజు ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు రిలీజ్ చేయనుంది.

TDP: చంద్రబాబు సొంత జిల్లాలో సైకిల్ పంచాయితీ..  ఆ అభ్యర్థి వద్దే వద్దు అంటున్న లోకల్ కేడర్

TDP: చంద్రబాబు సొంత జిల్లాలో సైకిల్ పంచాయితీ.. ఆ అభ్యర్థి వద్దే వద్దు అంటున్న లోకల్ కేడర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలో సత్యవేడు సైకిల్ పంచాయతీకి బ్రేకులు పడేలా కనిపించడం లేదు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వడంతో అసమ్మతి వ్యవహారం టీడీపీ హైకమాండ్‌కు చుక్కలు చూపిస్తోంది. అభ్యర్థి కోనేటి ఆదిమూలం విషయంలో వెనక్కి తగ్గేది లేదని తెలుగు తమ్ముళ్ళు స్పష్టం చేస్తున్నారు

Tirupati Election: కలవని నేతలు, కనిపించని జెండాలు.. తిరుపతిలో కొత్త కూటమి కష్టాలు..

Tirupati Election: కలవని నేతలు, కనిపించని జెండాలు.. తిరుపతిలో కొత్త కూటమి కష్టాలు..

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తిరుపతిలో మూడు పార్టీల్లో మనుషులు కలిసినా మనసులు కలవని పరిస్థితి నెలకొంది. అధినేతలు ఆదేశించినా నేతల మధ్య దూరం తగ్గకపోవడంతో ప్రచారం ప్రారంభం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ఆత్మీయ సమావేశాలకే కూటమి పరిమితం అయ్యింది.

నల్లారి సోదరుల ఓటమే తండ్రి కొడుకుల టార్గెట్.. చిత్తూరులో కాకరేపుతున్న రాజకీయం..

నల్లారి సోదరుల ఓటమే తండ్రి కొడుకుల టార్గెట్.. చిత్తూరులో కాకరేపుతున్న రాజకీయం..

చిత్తూరు జిల్లా పాలిటిక్స్‎లో ఆ రెండు కుటుంబాల మధ్య ఇప్పటిదాకా డైరెక్ట్ ఫైట్ లేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయ వైరం కొనసాగుతున్నా ప్రత్యర్థులుగా ఎన్నికల్లో తలపడిందిలేదు. చాలా కాలం ఒకే పార్టీలో ఉండడంతో ఇది సాధ్యం కాలేదేమో కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ రెండు కుటుంబాలు ప్రత్యక్షంగా తలపడేందుకు అవకాశం దక్కింది.

Tirumala Ugadi: తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉగాధి ఆస్థానం.. భక్తి పారశ్యంతో పులకించిన భక్త కోటి

Tirumala Ugadi: తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉగాధి ఆస్థానం.. భక్తి పారశ్యంతో పులకించిన భక్త కోటి

తిరుమల శ్రీవారి ఆలయం ఉగాది శోభతో ఆకట్టుకుంది. 10 టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని అలంకరించిన తిరుమల తిరుపతి దేవస్థానం శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించింది. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం శుద్ధి అనంతరం పంచాంగ శ్రవణం చేపట్టింది. శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వద్ద ఉగాది ఆస్థానాన్ని నిర్వహించారు ఆగమ పండితులు, అర్చకులు.

Watch Video: పెద్దిరెడ్డి కుటుంబంపై మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి..

Watch Video: పెద్దిరెడ్డి కుటుంబంపై మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి..

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ బద్ధ శత్రువుల మధ్య ఘాటైన విమర్శలు పొలిటికల్ హీట్‎ను పెంచుతున్నాయి. పెద్దిరెడ్డి వర్సెస్ నల్లారి మధ్య పొలిటికల్ ఫైట్ కాక రేపుతోంది. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిత్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన రాజంపేట పార్లమెంటు కూటమి అభ్యర్థి మాజీ సీఎం కిరణ్ ఘాటైన విమర్శలే చేస్తున్నారు.

Annamayya Vardhanti: తిరుమలలో వైభవంగా అన్నమయ్య వర్ధంతి వేడుకలు

Annamayya Vardhanti: తిరుమలలో వైభవంగా అన్నమయ్య వర్ధంతి వేడుకలు

తాళ్ళ‌పాక ధ్యాన‌మందిరం వ‌ద్ద ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్యామ్‌కుమార్ బృందం సంగీత సభ, రాత్రి 8 నుండి 9.30 గంటల వ‌ర‌కు తిరుపతికి చెందిన ర‌మేష్ బాబు బృందం హరికథ గానం చేసారు. రాజంపేట-కడప హైవేలో ఉన్న 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, మ‌ణి బృందం అన్నమయ్య కీర్తనలను ఆలపించారు.