టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.
వెంకన్న హుండీ బంగారంపై టీటీడీ సంచలన నిర్ణయం.. బంగారం సరే.. మరి రత్నాల సంగతేంటి?
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించే హుండీ కానుకల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక మార్పులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ముఖ్యంగా హుండీలో లభించే బంగారు కానుకలను నేరుగా విక్రయించకూడదని నిర్ణయించింది. వాటిని బంగారు బిస్కెట్లుగా మార్చి బ్యాంకుల్లో గోల్డ్ డిపాజిట్గా ఉంచే విధానాన్ని అనుసరించాలని భావిస్తోంది. మరోవైపు బంగారు ఆభరణాల్లో ఉన్న రత్నాలు, విలువైన రాళ్లను మాత్రం వేరు చేసి వేలం వేయాలని ప్రతిపాదించింది.
- Raju M P R
- Updated on: Aug 13, 2026
- 5:30 pm
Andhra: ఉమాదేవి చూడ్డానికి ఎంత ఇన్నోసెంట్ ఉంది.. కానీ ఎవ్వరూ ఊహించని వయిలెంట్ పని చేసింది..
అన్నమయ్య జిల్లా పీలేరులో భర్త హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ఉమాదేవి.. ప్రియుడు చారాల సుబ్రహ్మణ్యంతో కలిసి హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తేల్చారు. నిద్రమాత్రలు ఇచ్చి గాఢ నిద్రలోకి వెళ్లిన భర్తపై ఇనుప రాడ్, రాయితో దాడి చేసి హత్య చేసిన అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
- Raju M P R
- Updated on: Aug 13, 2026
- 10:30 am
Srikalahasti: పోలీస్ కాలర్ పట్టుకున్నాడు.. కత్తితో బెదిరించాడు.. కట్ చేస్తే..
శ్రీకాళహస్తిలో ఇద్దరు యువకులు విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్పై దౌర్జన్యానికి పాల్పడ్డారు. కాలర్ పట్టుకుని దాడికి ప్రయత్నించడంతో పాటు కత్తితో బెదిరించారు. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఆన్లైన్లో కత్తి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
- Raju M P R
- Updated on: Aug 13, 2026
- 10:16 am
Andhra News: ఫేస్ చూసి అమాయకుడు అనుకోకండి..! ఏం చేశాడో తెలిస్తే అస్సలు క్షమించరు!
తిరుమలలో దళారీలు రెచ్చిపోతున్నారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకునే భక్తుల టార్గెట్గా కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా అలాంటి భాగోతమే కొండపై వెలుగు చూసింది. గతంలో టీటీడీలో ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తి.. ఇప్పుడు అదే పోస్ట్ వాడుకొని భక్తులను మోసం చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.
- Raju M P R
- Updated on: Aug 12, 2026
- 11:07 am
ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు.. అసలేం జరిగిందో తెలుసా..?
తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని భాకరాపేట ఘాట్లో కోళ్ల లారీ బోల్తా పడింది. ప్రమాదంలో వందలాది కోళ్లు రోడ్డుపై పడిపోగా.. సమాచారం అందుకున్న స్థానికులు, వాహనదారులు అక్కడికి చేరుకున్నారు. చనిపోయిన, కొన ఊపిరితో ఉన్న కోళ్లను ఎత్తుకెళ్లేందుకు జనం పోటీపడ్డారు. బైకులు, ఆటోలు, బస్తాలతో వచ్చి కోళ్లను తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
- Raju M P R
- Updated on: Aug 11, 2026
- 6:18 pm
Tirumala: ఫొటోలో చూసి అమాయకులు అనుకునేరు.. తిరుమలలో వీళ్లు చేసే పనులు తెలిస్తే ఛీ అంటారు..
తిరుమలకు వచ్చే భక్తులారా జాగ్రత్త.. గదులు ఇప్పిస్తామంటూ వచ్చే దళారులను నమ్మి మోసపోకండి. నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ రూమ్లను బుక్ చేసి, భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల కేటుగాళ్ల ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. దీనికి సంబంధించి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Raju M P R
- Updated on: Aug 9, 2026
- 9:26 pm
Andhra News: మార్నింగ్ షాప్ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓనర్.. సెటర్ తీసి చూడగా..
రోజురోజుకూ దొంగతనాలు, దోపిడీలు పెరుగుతూనే ఉన్నాయి. రోజూ ఎక్కడో ఒకక్కడ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా టెంపుల్ సిటీ తిరుపతిలోనూ ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అర్ధరాత్రి స్థానికంగా ఉన్న ఓ సోనోవిజన్ మొబైల్ షాపులోకి దూరిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అందినకాడికి దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
- Raju M P R
- Updated on: Aug 8, 2026
- 8:39 pm
తెల్లారేసరికి ఇంటి ముందు హైవేపై డెడ్ బాడీ.. అంతా ప్రమాదమే అనుకున్నారు.. కట్ చేస్తే.
చిత్తూరు జిల్లా పీలేరులో సుబ్రహ్మణ్యం (47) అనుమానాస్పద మృతి కలకలం రేపింది. తిరుపతి హైవేపై రక్తగాయాలతో ఆయన మృతదేహం లభించడంతో తొలుత రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే మృతుడి తండ్రి కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు మలుపుతిరిగింది. కోడలు ఉమాదేవికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, అదే తన కుమారుడి హత్యకు కారణమై ఉండొచ్చని ఆయన ఆరోపించారు. పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు చేస్తూ సీసీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.
- Raju M P R
- Updated on: Aug 8, 2026
- 6:36 pm
ఇంట్లో ఉన్న ఫ్రిజ్ నుంచి దుర్వాసన.. ఓపెన్ చేస్తే ఒక్కసారిగా..
ఏపీ అన్నమయ్య జిల్లాలోని గోపిదిన్నెలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో రాత్రి నుంచి దుర్వాసన రావడంతో పరిశీలించిన కుటుంబ సభ్యులు ఫ్రిజ్ తలుపు తెరవగానే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కా, తమ్ముడితో పాటు నలుగురు గాయపడగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఫ్రిజ్ పేలుడుకు గల అసలు కారణాలపై పోలీసులు, అధికారులు దర్యాప్తు చేపట్టారు.
- Raju M P R
- Updated on: Aug 6, 2026
- 1:27 pm
కలియుగ అపర కుభేరుడు.. శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. అందుకే ఆయన ఆదాయం ఇప్పుడు అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇందుకు నిదర్శనంగానే శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులను బ్రేక్ చేస్తోంది. జూలై నెలలో హుండీ ఆదాయం టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు ను నెల కొల్పింది. తిరుమలేశుడి ఆదాయంలో హుండీ ఆదాయం కీలకంగా మారి పోయింది. వెంకన్న ఆస్తుల విలువ కొండంత అవుతోంది. ఇప్పటికే వెల కట్టలేని ఆస్తులున్న సంపన్నుడైన శ్రీ వెంకటేశ్వరుడి ఆలయం ఏటేటా పెరుగు తూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది వేసవిలో భక్తులతో కొండ కిటకిటి లాడింది. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం కూడా పెరిగింది. రోజుకు సగటున 80 వేల మందికి పైగా భక్తులకు తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం లభించింది. దీంతో హుండీలో సమర్పించిన కానుకల విలువ కూడా గణనీయంగా పెరిగింది..
- Raju M P R
- Updated on: Aug 5, 2026
- 4:36 pm
750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్.. కట్చేస్తే.. ఇప్పుడిలా.. అసలేంజరిగింది?
అదో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. రూ.6 వేల కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పించే కర్మాగారం. 16 ఏళ్ల క్రితం నాటి ప్రధాని చేతుల మీదుగా హట్టహాసంగా ప్రారంభానికి సిద్ధమైన ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్కు ముందే మూతపడి దోపిడి దొంగలకు ఆదాయ వణరుగా మారింది. ఇంతకూ ఆ ప్రాజెక్ట్ ఏది.. ఎందుకు మూతపడిందనేగా మీ డౌట్! అది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!
- Raju M P R
- Updated on: Aug 5, 2026
- 4:25 pm
వర్షం కోసం పూజ చేస్తుండగానే ఉరుములు మెరుపులతో భారీ వర్షం! కుప్పంలో అద్భుతం
చిత్తూరు జిల్లా కుప్పం మండలం అడవి బూదుగూరులో వర్షాల కోసం గ్రామస్తులు సంప్రదాయ 'వలస దేవర' పూజలు నిర్వహించారు. వరుణ దేవుడిని ప్రార్థిస్తున్న సమయంలోనే ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
- Raju M P R
- Updated on: Aug 2, 2026
- 7:11 pm