AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raju M P R

Raju M P R

Staff Reporter - TV9 Telugu

raju.meesaraganda@tv9.com

టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.

Read More
Follow On:
Tirumala: శ్రీవారి మొక్కు తీర్చుకోవాలని బయలుదేరారు… కానీ విధి మరోలా

Tirumala: శ్రీవారి మొక్కు తీర్చుకోవాలని బయలుదేరారు… కానీ విధి మరోలా

తిరుమల శ్రీవారి సేవలో పాల్గొనేందుకు బెంగళూరులోని రాజాజీనగర్ నుంచి బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వైయస్సార్ సర్కిల్ సమీపంలో హైవేపై వేగంగా వెళ్తున్న కారు ముందున్న కంటైనర్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

సాఫ్ట్‌వేర్ కాదు యమ కంత్రీనే.. చివరకు వృద్ధురాలి చేతికి చిక్కి..!

సాఫ్ట్‌వేర్ కాదు యమ కంత్రీనే.. చివరకు వృద్ధురాలి చేతికి చిక్కి..!

Software Engineer Crime: మదనపల్లిలోని ఈశ్వరమ్మ కాలనీకి చెందిన రాజేష్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాడు. కోవిడ్ సమయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి స్వస్తి పలికి సొంతూరు మదనపల్లికి వచ్చాడు. ఐటీ ఉద్యోగిగా పనిచేసిన సమయంలో సంపాదించిన సొమ్ముతో జల్సాలు చేశాడు. ఆ తరువాత ఏ పని చేయకుండానే కాలం గడిపిన రాజేష్.. ఆ తర్వాత డబ్బు అవసరం చైన్ స్నాచర్‌గా మార్చింది.

టెంపుల్ సిటీలో NSG యాంటీ టెర్రరిస్ట్ డ్రిల్.. సెక్యూరిటీపై కఠిన హెచ్చరికలు..! తప్పక తెలుసుకోండి..

టెంపుల్ సిటీలో NSG యాంటీ టెర్రరిస్ట్ డ్రిల్.. సెక్యూరిటీపై కఠిన హెచ్చరికలు..! తప్పక తెలుసుకోండి..

తిరుమల, తిరుపతి భద్రత పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG) ఆధ్వర్యంలో మార్చి 3-5 తేదీలలో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. ఈ ఎక్సర్సైజ్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సమన్వయం, ఆలయ భద్రత పెంపు, వ్యవస్థల సామర్థ్యాన్ని పరీక్షించడం లక్ష్యం. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇది కేవలం భద్రతా సాధన కార్యక్రమం.

Andhra Pradesh: గ్రహణానికే సవాల్.. అన్నీ గుళ్లు మూసినా తెరిచే ఉండే ఈ ఆలయం గురించి తెలుసా..?

Andhra Pradesh: గ్రహణానికే సవాల్.. అన్నీ గుళ్లు మూసినా తెరిచే ఉండే ఈ ఆలయం గురించి తెలుసా..?

గ్రహణం ఉందంటే చాలు, కాశీ నుంచి రామేశ్వరం దాకా దేవాలయాలన్నీ మూతపడతాయి. కానీ ఆ ఒక్క క్షేత్రం మాత్రం గ్రహణానికే సవాల్ విసురుతోంది. గ్రహణ కాలంలోనూ ముక్కంటి దర్శనం ఇచ్చే అద్భుత క్షేత్రం.. రాహు కేతువుల నిలయం శ్రీకాళహస్తి. అసలు గ్రహణ సమయంలోనూ ఈ ఆలయం ఎందుకు తెరిచి ఉంటుంది? అనేది తెలుసుకుందాం..

పోలీసులు కనిపించేసరికి అందరూ పరారవుతున్నారు.. డెన్ లోపలికి వెళ్లి చూడగా..

పోలీసులు కనిపించేసరికి అందరూ పరారవుతున్నారు.. డెన్ లోపలికి వెళ్లి చూడగా..

శేషాచలం రిజర్వు ఫారెస్ట్‌లో ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దళం కర్ణాటకలో భారీ ఆపరేషన్ నిర్వహించింది. కర్ణాటకలోని హస్సన్ జిల్లాలో దాడులు చేపట్టి 195 ఎర్రచందనం దుంగలు, మూడు వాహనాలు స్వాధీనం చేసుకుని 8 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. సుమారు రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టుబడిన ఈ ఆపరేషన్ మాఫియాకు గట్టి హెచ్చరికగా మారింది.

Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రెండు రోజులు SED టోకెన్ల జారీ, VIP దర్శనాలు రద్దు!

Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రెండు రోజులు SED టోకెన్ల జారీ, VIP దర్శనాలు రద్దు!

చంద్రగ్రహణం నేపథ్యంలో టిటిడీ కీలక ప్రకటన చేసింది. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న తిరుమల ఆలయం ఉదయం 9 నుండి రాత్రి 7:30 వరకు మూసి వేస్తున్నట్టు పేర్కొంది. ఈ సందర్భంగా మార్చి 2, 3వ తేదీలలో SSD టోకెన్లు, మార్చి 3న VIP దర్శనాలు, ఆర్జిత సేవలు, అన్నప్రసాద వితరణ కేంద్రాలు కూడా నిలిపి వేస్తున్నట్టు తెలిపింది. భక్తులు మార్చి 1 నుండి 4 వరకు TTD సేవలు, దర్శనాల్లో మార్పులను గమనించి తదనుగుణంగా ప్రణాళికలు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్.. ఇదిగో వీడియో

తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్.. ఇదిగో వీడియో

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అతి సామాన్యుడిలా రాఘవ లారెన్స్ స్వామివారిని దర్శించుకున్నారు. ఫ్యాన్స్‌ రాఘవ లారెన్స్‌తో కలిసి సెల్ఫీ తీసుకున్నారు.

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ అలెర్ట్.. జాగ్రత్త సుమీ..

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ అలెర్ట్.. జాగ్రత్త సుమీ..

తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదుల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి భక్తులను మోసం చేస్తున్న దళారులపై టీటీడీ అప్రమత్తమైంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్స్ చేయాలని భక్తులకు స్పష్టమైన సూచనలు జారీ చేసింది. కేరళకు చెందిన సికె సురేష్ బాబు అనే భక్తుడు గదులు ఇప్పిస్తామన్న పేరుతో మోసపోయిన ఘటన వెలుగులోకి రావడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది.

Tirumala: శ్రీవారికి ముడుపుల చెల్లింపు ఇకపై డిజిటల్ పేమెంటే.. త్వరలోనే అందుబాటులోకి..!

Tirumala: శ్రీవారికి ముడుపుల చెల్లింపు ఇకపై డిజిటల్ పేమెంటే.. త్వరలోనే అందుబాటులోకి..!

ఇప్పుడు అంతటా డిజిటల్ పేమెంటే.. రూ.5 వస్తువైనా సరే డిజిటల్ మోడ్‌లోనే చాలా మంది పేమెంట్ చేస్తున్నారు.. అందుకే ఇప్పుడు టిటిడి (తిరుమల తిరుపతి దేవస్థానం) కూడా వెంకన్నకు భక్తులు ముడుపులు సమర్పించేందుకు వీలుగా నగదు రహిత కానుకలను ప్రోత్సహించాలని భావిస్తుంది. హుండీలో నగదు రహిత కానుకలను సమర్పించేందుకు వీలుగా కసరత్తు చేస్తోంది.

అయ్యో దారుణం.. చికిత్స కోసం వెళ్తే కన్ను కోల్పోయిన ఐటీ ఉద్యోగి.. చివరకు

అయ్యో దారుణం.. చికిత్స కోసం వెళ్తే కన్ను కోల్పోయిన ఐటీ ఉద్యోగి.. చివరకు

తిరుపతిలో కంటి చూపు సమస్యతో ఆసుపత్రికి వెళితే.. ఏకంగా కంటి చూపుకే ప్రమాదం ఏర్పడింది. సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన గిరీష్ అనే ఐటీ ఉద్యోగికి ఈ అనుభవం ఎదురయింది. అగర్వాల్ ఐ హాస్పిటల్ నిర్వాకంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. ఐటీ ఉద్యోగి గిరీష్ కొంతకాలంగా కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు.

Raveena Tandon: నాగార్జునతో ఫస్ట్ సినిమా.. తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్..

Raveena Tandon: నాగార్జునతో ఫస్ట్ సినిమా.. తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్..

తెలుగు, హిందీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో అగ్ర కథానాయికగా చక్రం తిప్పింది. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంది. తిరుమల శ్రీవారిని మంగళవారంఉదయం దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆ 5 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు!

Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆ 5 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు!

తిరుమలలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 2 వరకు జరిగే సాలకట్ల తెప్పోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణస్వామి, శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి వారు తెప్పలపై భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల కారణంగా కొన్ని సేవలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ పేర్కొంది. వివరాల కోసం పూర్తి కథనం చదవండి.