టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.
ఒక్క జూన్లో వెంకన్నకు ఎన్ని కోట్ల ఆదాయమొచ్చిందో తెలుసా? నోరెళ్లబెట్టే లెక్కలు
ఆపద మొక్కుల వాడికి మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది వేసవిలో తిరుమల కొండ కిటికిటలాడింది. భక్తులతోపాటు హుండీ కానుకలు కూడా అంతకంతకు పెరుగుతున్నట్లు టిటిడి లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ నెలలో రోజుకు సగటున 80 వేల మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకోవడంతో హుండీ ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది.
- Raju M P R
- Updated on: Jul 3, 2026
- 8:41 pm
ప్రభుత్వ పాఠశాలలో కలకలం.. వింత పురుగుల కాటుతో 15 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత!
చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలోని డి.యం. పురం ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో క్లాసులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యార్థుల శరీరంపై తీవ్రమైన దురదలు, ఎర్రటి దద్దుర్లు (Rashes) ఏర్పడ్డాయి. దాదాపు 15 మంది విద్యార్థులు ఒకేసారి మంటలు, దురదలతో విలవిలలాడటంతో అసలు ఏం జరిగిందో అర్థం కాక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (HM), ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
- Raju M P R
- Updated on: Jul 1, 2026
- 1:00 pm
తీపి సిండికేట్కు.. దగా రైతులకు.. మామిడి రైతుకు మళ్లీ అదే కష్టం..!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతును దురదృష్టం వెంటాడుతోంది. రోజు రోజుకు ధర పడిపోతున్నా మామిడి రైతు ఘోషను ఎవరూ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. మామిడి గుజ్జు పరిశ్రమలు, వ్యాపారాల దగా కు రైతాంగం గురి అవుతుంది. మరో వైపు మామిడి కొనుగోళ్లు, గిట్టుబాటు ధరలపై టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఆరోపణల పర్వం మాత్రం కొనసాగుతోంది. మూడు జిల్లాల్లో ఇదే పరిస్థితి. పూర్తి వివరాల్లోకి వెళితే..
- Raju M P R
- Updated on: Jun 30, 2026
- 9:38 am
అమ్మబాబోయ్..! నడకమార్గంలో నాగుపాము.. బుసలు కొట్టి ఏం చేసిందంటే..
తిరుమల అలిపిరి నడక మార్గంలోని గాలిగోపురం వద్ద 7 అడుగుల భారీ నాగుపాము కనిపించి భక్తుల్లో భయాందోళన కలిగించింది. సమాచారం అందుకున్న టీటీడీ సెక్యూరిటీ, ఫారెస్ట్ సిబ్బంది వెంటనే స్పందించి నాగుపామును సురక్షితంగా బంధించి శేషాచలం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పాములు కనిపిస్తే వాటికి దూరంగా ఉండి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని టీటీడీ సూచించింది.
- Raju M P R
- Updated on: Jun 28, 2026
- 4:46 pm
Keerthy Suresh: భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కీర్తి సురేష్
సినీ నటి కీర్తి సురేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె తన భర్తతో కలిసి తిరుమల విచ్చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం కీర్తిసురేష్ దంపతులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. కీర్తి సురేష్ ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఆమెను చూడాలని, ఫోటోలు తీయాలని భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు.
- Raju M P R
- Updated on: Jun 27, 2026
- 1:02 pm
శేషాచలం అటవీ ప్రాంతంలో అన్వేషణ.. ఓ బండ రాయిపై ఏం రాసి ఉందో తెలుసా..?
శేషాచలం అభయారణ్యంలో భారత పురావస్తు శాఖ నిర్వహించిన సర్వేలో 16వ శతాబ్దానికి చెందిన విజయనగర సామ్రాజ్య కాలం నాటి అరుదైన శిలాశాసనాలు వెలుగులోకి వచ్చాయి. సదాశివకోన ప్రాంతంలోని రాతి బండలపై తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో చెక్కిన శాసనాలను అధికారులు గుర్తించారు. గుడిమల్లం శ్రీ పరుశరామేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన దానాలు, పూజా విధానాలు, పుష్కరిణి నిర్మాణ వివరాలు ఈ శాసనాల్లో ఉన్నట్లు వెల్లడైంది.
- Raju M P R
- Updated on: Jun 22, 2026
- 3:31 pm
ముక్కంటి హుండీకే కన్నం.. వీడు మామూలోడు కాదు.. పరమ భక్తుడిలా నటిస్తూ!
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో హుండీ చోరీ యత్నం కలకలం రేపింది. భక్తుడి వేషంలో వచ్చిన సత్య లక్ష్మణ్ వెంకటేష్ అనే యువకుడు హుండీ నుంచి రూ.25,170 నగదును తీసుకోగా, ఆలయ సిబ్బంది అప్రమత్తతతో పట్టుకున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
- Raju M P R
- Updated on: Jun 22, 2026
- 5:17 pm
Andhra News: కన్నీరు పెట్టిస్తున్న ఘటన.. ఒకే ఇంట్లో 4 డెడ్ బాడీలు! ఏం జరిగిందంటే..?
భార్య దీర్ఘకాలిక అనారోగ్యంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ దినసరి కూలీ, తన భార్య, ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి అనంతరం తాను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అంత్యక్రియల ఖర్చుల కోసం ఏటీఎంలో డబ్బు ఉంచి, పిన్ నంబర్తో లేఖ రాసి పెట్టడం ఈ ఘటనలో కలచివేసే అంశంగా మారింది..
- Raju M P R
- Updated on: Jun 22, 2026
- 9:08 am
వెంకన్న సేవలో మోక్షజ్ఞ.. తిరుమల, శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు!
ప్రముఖ హీరో, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఒక్కడే తిరుమల కు వచ్చిన మోక్షజ్ఞకు టిటిడి అధికారులు ప్రోటోకాల్ దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం మోక్షజ్ఞకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.
- Raju M P R
- Updated on: Jun 20, 2026
- 9:05 pm
Gold: కిలో బంగారం రూ.6 లక్షలే.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాక్..
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్న ఒక గ్యాంగ్ అడ్డంగా దొరికిపోయింది. ఫేక్ గోల్డ్ ముఠా యవ్వారం బయట పడింది. ఏడు మంది ముఠా గా ఏర్పడి అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతూ వచ్చిన ముఠా ఎట్టకేలకు దొరికిపోయింది.
- Raju M P R
- Updated on: Jun 20, 2026
- 7:44 am
Chittoor: దున్నపోతుకు పోలీసుల కాపలా.. చిత్తూరులో అరుదైన ఘటన
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లిలో గ్రామ జాతర సందర్భంగా దున్నపోతు బలిని అధికారులు అడ్డుకున్నారు. గ్రామస్థులు రూ.50 వేలతో కొనుగోలు చేసిన దున్నపోతును బలి ఇవ్వాలని సిద్ధం కాగా, ముగ్గురు యువకులు కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై, పోలీసులు రాత్రంతా కాపలా ఉండి జంతుబలి జరగకుండా చర్యలు చేపట్టారు.
- Raju M P R
- Updated on: Jun 18, 2026
- 8:20 pm
తిరుమలలో సందడి చేసిన సమంత.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ చాలా రోజు తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో తెలుగు అభిమానులను ఆకట్టుకోనుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తన భర్త , అలాగే మా ఇంటి బంగారం మూవీ టీమ్తో కలిసి తిరుమల శ్రీ వారిని దర్శించుకుంది.
- Raju M P R
- Updated on: Jun 18, 2026
- 1:54 pm