AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raju M P R

Raju M P R

Staff Reporter - TV9 Telugu

raju.meesaraganda@tv9.com

టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.

Read More
Follow On:
Tirumala: రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

Tirumala: రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వ దర్శన టోకెన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సర్వదర్శనం టోకెన్ల ఎప్పటి నుంచి రద్దు చేస్తున్నారు..? రథసప్తమి వాహనసేవల వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి .. .. .. ..

Tirupati: పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు.. ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

Tirupati: పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు.. ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

భోగి సంక్రాంతి ఆ తర్వాత రోజు కనుమ హుషారుగా జరుపుకునే యువత ఐరాల మండలం కలికిరి పల్లిలో అందరినీ ఆకట్టుకునేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. స్నేహితులు బంధువులకు కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఏర్పాటు చేయడంతో పాటు పెళ్లి కాని యువకులంతా తమకు వధువు కావాలంటూ ఫ్లెక్సీలో ఫోటోలు వేసి ఏర్పాటు చేశారు.

Andhra News: ఫ్రెండ్స్‌తో ఫుల్‌గా డిచ్‌ అయ్యారు.. ఇంటికెళ్దామని బయల్దేరారు.. అంతలోనే

Andhra News: ఫ్రెండ్స్‌తో ఫుల్‌గా డిచ్‌ అయ్యారు.. ఇంటికెళ్దామని బయల్దేరారు.. అంతలోనే

అన్నమయ్య జిల్లా బండ వడ్డిపల్లిలో సంక్రాంతి సంబరం విషాదంగా మారింది. బెంగళూరు నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మణికుమార్, పుష్పరాజ్‌లు స్నేహితులతో కలిసి గుట్టపై మద్యం సేవించారు. అతి మత్తులో గుట్టపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి, మద్యం సేవించిన స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. అతి మద్యాపానమే మృతికి కారణమని డీఎస్పీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటన స్థానికంతా తీవ్ర విషాదాన్ని నింపింది.

Ratha Saptami: ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి

Ratha Saptami: ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి

పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జ‌న్మించాడ‌ని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడ‌ని వేదాల ద్వారా తెలుస్తోంది. జనవరి 25న తిరుమ‌లలో రథసప్తమి జరుగనుంది. ఈ పర్వదినం రోజు ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

Andhra: ఫ్రెండ్‌ను చంపి రక్త చరిత్ర సాంగ్ స్టేటస్ పెట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Andhra: ఫ్రెండ్‌ను చంపి రక్త చరిత్ర సాంగ్ స్టేటస్ పెట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో జరిగిన యువకుడి హత్య కలకలం రేపింది. తులసినాయనపల్లి సమీపంలో యువకుడు అనుమానాస్పద మృతి గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. హత్యకు గురైన వ్యక్తి తిమ్మరాజుపల్లికి చెందిన చంద్రగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించి వివరాలు సేకరించారు.

క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు.. ఆస్పత్రికి తరలించే లోపుగానే..

క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు.. ఆస్పత్రికి తరలించే లోపుగానే..

అన్నమయ్య జిల్లా చౌడేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. 22 ఏళ్ల తేజ క్రికెట్ ఆడుతూ మైదానంలోనే గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన తేజ స్నేహితులతో సరదాగా ఆడుకుంటున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. గతంలో ఫిట్స్ వచ్చినట్లు తెలిసిన తేజకు వైద్యులు గుండెపోటు నిర్ధారించారు. తేజ మృతితో పెద్దూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

TTD April Tickets: శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల! ఎప్పుడంటే..

TTD April Tickets: శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల! ఎప్పుడంటే..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన వివిధ దర్శనం, సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్జిత సేవలు, వర్చువల్ సేవలు, అంగ ప్రదక్షిణ, శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, గదుల బుకింగ్ తేదీలను టీటీడీ ఆన్‌లైన్‌లో వెల్లడించింది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

కోడి పందేలు, జల్లికట్టు వారసత్వంగా వచ్చినవే.. చిన్నప్పుడు అన్నీ చూశాః చంద్రబాబు

కోడి పందేలు, జల్లికట్టు వారసత్వంగా వచ్చినవే.. చిన్నప్పుడు అన్నీ చూశాః చంద్రబాబు

అందరికీ పుట్టిన ఊరు జన్మభూమిపై మమకారం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మధ్యకాలంలో ఆర్థిక అసమానతలు ఎక్కువయ్యాయని అందుకే పీ4 ను తీసుకొచ్చామన్నారు. 10 లక్షల కుటుంబాలను పీ4 ద్వారా దత్తత తీసుకున్నామన్నారు. సంక్రాంతి రైతుల పండుగని, పెద్దల పండుగ గా పూర్వీకులకు పూజలు చేసుకుని నివాళులు అర్పించాలన్నారు.

గంగిరెద్దుల ప్రదర్శనను తిలకించిన తాత.. ఎడ్ల బండిపై ఆకట్టుకున్న మనవడు..!

గంగిరెద్దుల ప్రదర్శనను తిలకించిన తాత.. ఎడ్ల బండిపై ఆకట్టుకున్న మనవడు..!

తిరుపతి జిల్లాలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లి సందడిగా మారింది. సంక్రాంతి పండుగ జోష్ కొనసాగుతోంది. పెద్దపండుగకు నాలుగు రోజులు పాటు నారావారిపల్లిలోనే బసచేసిన నారా-నందమూరి కుటుంబాలు సంక్రాంతిని సందడిగా జరుపుకుంటున్నాయి. ఇందులో భాగంగానే నారావారిపల్లిలో కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.

ట్రంప్ ఫొటోలతో భోగి మంటలు.. తిరుపతిలో సిపిఐ వినూత్న సంబరాలు..

ట్రంప్ ఫొటోలతో భోగి మంటలు.. తిరుపతిలో సిపిఐ వినూత్న సంబరాలు..

టెంపుల్ సిటీ తిరుపతిలో సిపిఐ వినూత్నంగా భోగిమంటలు వేసింది. అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫొటోలు ముద్రించిన పేపర్లను మంటల్లో వేసింది. ప్రపంచ దేశాలు ట్రంప్‌ను బహిష్కరించాలంటూ బైరాగి పట్టెడలో సిపిఐ భోగిమంటలు వేసింది. సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే. నారాయణ ఆధ్వర్యంలో సిపిఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

Naravaripalle Sankranti Celebrations: మనవళ్ల ఆటల పోటీలకు ఫిదా అయిన సీఎం చంద్రబాబు దంపతులు.. ఇదిగో ఫొటోలు..

Naravaripalle Sankranti Celebrations: మనవళ్ల ఆటల పోటీలకు ఫిదా అయిన సీఎం చంద్రబాబు దంపతులు.. ఇదిగో ఫొటోలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లిలో కోలాహలంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. గ్రామస్తులను సీఎం దంపతులు ఆప్యాయంగా పలకరించారు. క్రీడా పోటీలను ఆసక్తిగా తిలకించారు. నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో రంగవల్లులు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు..ఈ క్రీడల్లో లోకేష్‌ కుమారుడు దేవాన్ష్‌ పాల్గొన్నారు. ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం చేయనున్నారు.. సీఎం చంద్రబాబు ఇంటి దగ్గరే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈనెల 15 వరకు నారావారిపల్లిలోనే సీఎం కుటుంబం ఉంటుంది.

కలియుగ వైకుంఠంలో ఆకలి అనే పదానికి చోటు లేదు.. రోజూ ఎంత మందికి అన్నప్రసాదం అందిస్తారో తెలుసా..?

కలియుగ వైకుంఠంలో ఆకలి అనే పదానికి చోటు లేదు.. రోజూ ఎంత మందికి అన్నప్రసాదం అందిస్తారో తెలుసా..?

అది కలియుగ వైకుంఠం.. శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం.. అన్నపూర్ణ నిలయంగా శ్రీవారి క్షేత్రం ఆకలికి చోటే లేని పవిత్ర స్థలంగా మారింది. రోజుకు 3 లక్షల మంది భక్తులకు టీటీడీ తృప్తికర భోజనం అందిస్తోంది. వేంకటాద్రి సమః స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి అన్న దైవ స్తోత్రానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.