టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.
ఇంట్లోని వంట గదిలో కనిపించినవి చూసి విస్తుపోయిన అధికారులు.. ఇవిగో డీటేల్స్..!
శేషాచలం అడవుల్లో అసలేం జరుగుతోంది.. ఏనుగు దంతాల స్మగ్లింగ్ వ్యవహారం అటవీశాఖను కలవర పెడుతోంది. ఎలిఫెంట్స్ సేఫ్టీ పై అటవీ శాఖకు ఆందోళన నెలకొంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో పట్టుబడ్డ ఏనుగు దంతాల కేసు మూలాలపై జరుగుతున్న విచారణ అటవీ శాఖకు సవాలుగా మారింది.
- Raju M P R
- Updated on: Mar 23, 2026
- 9:20 am
దేవాన్ష్ బర్త్డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
నారా దేవాంష్ పుట్టినరోజు సందర్భంగా నారా కుటుంబం భక్తులకు అల్పాహారం వడ్డించింది. ఈ కార్యక్రమాన్ని TV9 ప్రసారం చేసింది. పుట్టినరోజు వేడుకల సందడిలో, సీఎం ప్రస్తావనలు, విరాట్ వంటి క్రీడా ప్రముఖుల గురించి సంభాషణలు, అప్పుడప్పుడు చికెన్ మసాలా వంటి పదాలు, కొన్ని విదేశీ భాషా పదాలు వినిపించాయి. ఇది నారా కుటుంబం సేవానిరతిని తెలియజేస్తుంది.
- Raju M P R
- Updated on: Mar 21, 2026
- 9:07 pm
ఓరీ దేవుడో.. తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన రెండు భారీ పాములు భక్తులను భయాందోళనలకు గురిచేశాయి. శ్రీవారి దర్శనం కోసం శిలాతోరణం వరకు విస్తరించిన క్యూ లైన్ల సమీపంలో ఈ పాములు కనిపించాయి. సుమారు 8 అడుగులు మరియు 6 అడుగుల పొడవు ఉన్న ఈ రెండు పాములు రోడ్డుపై సంచరిస్తూ భక్తుల కంటపడ్డాయి. గోవింద నామ స్మరణతో భక్తి పారవశ్యంలో ఉన్న భక్తులు, ఒక్కసారిగా పాములను చూసి భయంతో పరుగులు తీశారు.
- Raju M P R
- Updated on: Mar 21, 2026
- 8:53 am
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్..ప్రత్యేకతలు ఇవే!
శ్రీవారి లడ్డూ ప్రసాదం అన్నప్రసాదాల నాణ్యతను అత్యున్నత ప్రమాణాలతో పరీక్షించేందుకు తిరుమలలో టీటీడీ ఏర్పాటు చేసింది. అత్యాధునిక FSSAI ల్యాబ్ సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ల్యాబ్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. నెయ్యి తోపాటు ఇతర దినుసుల్లో కల్తీని అత్యంత సూక్ష్మమైన PPT స్థాయిలో కూడా పసిగట్టగలిగే సామర్థ్యం ల్యాబ్ సొంతం.
- Raju M P R
- Updated on: Mar 21, 2026
- 8:35 am
ప్రాణం తీసిన బైక్ పొగ.. చిన్నపాటి నిర్లక్ష్యంతో నలుగురు దుర్మరణం.. ఇలాంటి మిస్టెక్స్ చేయకండి..
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుంగనూరులోని త్యాగరాజు వీధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు నిర్లక్ష్యం కారణమైంది. త్యాగరాజు వీధిలో ఉంటున్న మురళి సెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు. మురళి రేవతి దంపతులకు నలుగురు సంతానం కాగా తల్లిదండ్రులతో కలిసి త్యాగరాజు వీధిలోనే మురళి నివాసం ఉన్నాడు.
- Raju M P R
- Updated on: Mar 15, 2026
- 12:36 pm
Tirumala: పాలకవర్గం వర్సెస్ ప్రతిపక్షం.. టీటీడీ భగవద్గీత పుస్తకాలపై బిగ్ ఫైట్!
టీటీడీలో ఇప్పుడు మరో వివాదం హాట్ టాపిక్ అయ్యింది. భగవద్గీత పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. పాలక పక్షాలు, ప్రతిపక్షాలే కాదు స్వామీజీలు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు, విమర్శలకు దిగడంతో భగవద్గీతపై బిగ్ ఫైట్ నడుస్తోంది.భగవద్గీత 18 అధ్యాయాల పవిత్ర గ్రంథం. నిత్య జీవితంలో ధర్మం, కర్తవ్యం, భక్తి, జ్ఞాన మార్గాలను బోధిస్తూ, మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించేదిగా పరిగణించే మహా గ్రంధం. అలాంటి గ్రంధాన్ని సరళ భాషలో చిన్న పుస్తకంగా విద్యార్థులకు అందజేయాలని టిటిడి భావించింది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా మానవులందరికీ భగవద్గీత పేరుతో 34 పేజీల పుస్తకాన్ని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ముద్రించింది.
- Raju M P R
- Updated on: Mar 13, 2026
- 7:09 pm
Andhra: యాడ లేని పాము మన దగ్గరే.. పచ్చరంగు త్రాచును మీరెప్పుడైనా చూస్తిరా..?
శేషాచలం అటవీ ప్రాంతంలో అరుదైన పచ్చ నాగుపాము కనిపించడం ఆసక్తి రేపింది. తిరుమలలో స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. ఈ అరుదైన తాచుపాము ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. పూర్తి డీటేల్స్ కథనం లోపల ...
- Raju M P R
- Updated on: Mar 13, 2026
- 12:02 pm
TTD Dollars: ఇకపై తిరుమల శ్రీవారి డాలర్లు ఆన్లైన్లో అందుబాటులోకి..!
తిరుమల శ్రీవారి డాలర్లను కొనేందుకు తిరుమల వెళ్లకుండానే కొనుగోలు చేయవచ్చు. ఇందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా భక్తులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. శ్రీవారి గోల్డ్, సిల్వర్, బ్రాస్ డాలర్ల ను విక్రయిస్తున్న టీటీడీ డాలర్లను ఆన్లైన్లో విక్రయించేందుకు పరిశీలన చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే టీటీడీ ట్రెజరీ, జూవెలరీ వింగ్, బ్యాంక్ సిబ్బందితో సమావేశాలు కూడా జరిపింది..
- Raju M P R
- Updated on: Mar 13, 2026
- 10:09 am
TTD: గ్యాస్ కొరత నేపథ్యంలో టీటీడీ స్మార్ట్ మూవ్.. ఏం చేసిందంటే?
పశ్చిమాషియా యుద్ధం వలన ప్రపంచ చమురు సంక్షోభం తలెత్తే ముప్పులో, టీటీడీ అప్రమత్తమైంది. తిరుమలలో అన్నప్రసాదాలు, ఇతర అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సరఫరాకు ఆటంకం రాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. గ్యాస్ సరఫరా ఆపోద్దంటూ ఐఓసీఎల్ కు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. దీనిపై ఐఓసీఎల్ సైతం సానుకూలంగా స్పందించింది.
- Raju M P R
- Updated on: Mar 11, 2026
- 8:15 pm
Andhra Pradesh: రాష్ట్రపతి భవన్ కు చేరిన శ్రీకాళహస్తి కీర్తి..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా..
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కలంకారి కళకు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రపతి భవన్లో బ్రిటిష్ కాలం నాటి చిత్రాల స్థానంలో శ్రీకాళహస్తి కళాకారులు గీసిన కలంకారి చిత్రాలు ప్రదర్శనకు నిలిచాయి. సహజసిద్ధమైన రంగులతో వెదురు కలంతో వస్త్రాలపై చిత్రించే ఈ ప్రాచీన కళకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ ఆదరణ లభించింది. ఇది శ్రీకాళహస్తి కళాకారులకు, ప్రాచీన కళా వారసత్వానికి జాతీయ గుర్తింపు తెచ్చింది.
- Raju M P R
- Updated on: Mar 11, 2026
- 6:20 pm
Tirumala: అక్రమాలకు చెక్.. ఏఐతో టెండర్లు.. టీటీడీ కొనుగోళ్లలో సరికొత్త అధ్యాయం
తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోళ్ల వ్యవహారంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. భక్తుల సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండటంతో పాటు వస్తువుల సేకరణలో ఎక్కడా అవినీతికి తావులేకుండా ఉండేందుకు అధికారులు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. అత్యాధునిక ఏఐ సాంకేతికతతో కూడిన డిజిటల్ ప్రోక్యూర్మెంట్ టెండర్ పోర్టల్ ద్వారా ఇకపై టెండర్ల ప్రక్రియ అంతా సాగనుంది.
- Raju M P R
- Updated on: Mar 8, 2026
- 9:41 pm
Janhvi Kapoor : కాలి నడకన తిరుమలకు జాన్వీ కపూర్.. పుట్టినరోజున శ్రీవారి దర్శనం..
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల చేరుకున్నారు. శుక్రవారం (మార్చి 6న) ఆమె బర్త్ డే కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అలిపిరి నడకదారిలో నడుచుకుంటూ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల కొండపైకి చేరుకున్నారు. జాన్వీ కపూర్తో పాటు నటి మహేశ్వరి రేపు స్వామివారిని దర్శించుకోనున్నారు.
- Raju M P R
- Updated on: Mar 6, 2026
- 9:56 am