AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hormuz: హర్ముజ్ జలసంధి గుండా భారత నౌకలకు ఇరాన్ అనుమతి..!

ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా యుద్ధ ఉద్రిక్తతల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత ముఖ్యమైన హర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ భారత జెండా ఉన్న నౌకలకు ఇరాన్ మార్గం ఇవ్వడానికి అనుమతించినట్లు సమాచారం. తాజాగా భారత్‌కు చెందిన కొన్ని ఆయిల్ ట్యాంకర్లు హర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించేందుకు అనుమతి లభించిందని దౌత్య వర్గాలు చెబుతున్నాయి. యుద్ధ పరిస్థితుల్లో కూడా భారత్‌తో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Hormuz: హర్ముజ్ జలసంధి గుండా భారత నౌకలకు ఇరాన్ అనుమతి..!
Strait Of Hormuz
Ram Naramaneni
|

Updated on: Mar 12, 2026 | 10:06 AM

Share

ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం ప్రభావం మధ్య ఆసియాలో తీవ్ర ఉద్రిక్తతలను సృష్టిస్తోంది. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటైన హర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం, యుద్ధ ఉద్రిక్తతల మధ్య కూడా భారత జెండా ఉన్న కొన్ని ట్యాంకర్లకు ఇరాన్ మార్గం ఇవ్వడానికి అంగీకరించినట్లు దౌత్య వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల విదేశాంగ స్థాయిలో జరిగిన చర్చల తర్వాత భారత్‌కు చెందిన రెండు ఆయిల్ ట్యాంకర్లు హర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించేందుకు అనుమతి లభించింది అని వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉండగా, ఈ మార్గంలో పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉంది. ఇరాన్ సైన్యం అక్కడ సీ మైన్స్ (Sea Mines) మోహరించిందని సమాచారం. దీంతో ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గంలో నౌకల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా, కొన్ని విదేశీ జెండా నౌకలపై దాడులు జరిగిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఒక థాయ్ జెండా నౌకపై దాడి జరగడంతో సముద్ర రవాణా భద్రతపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్ తన ఆయిల్ సరఫరాలను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు, నౌకలకు భద్రతా చర్యలు గురించి కూడా పరిశీలిస్తోంది. మొత్తానికి, యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో హర్ముజ్ జలసంధి పరిస్థితి ప్రపంచ చమురు సరఫరా మరియు భారత ఇంధన భద్రతపై కీలక ప్రభావం చూపే అవకాశముంది.

Follow Us