AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..

ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..

Samatha J
|

Updated on: Aug 12, 2026 | 1:19 PM

Share

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎల్‌నినో ప్రభావం వల్ల భవిష్యత్తులో వర్షపాతం తగ్గే ప్రమాదం ఉందని వాతావరణ సంస్థ హెచ్చరించింది.

వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బుధవారానికి అల్పపీడనంగా మారనుండటంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. రాగల రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి.వాతావరణ శాఖ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, ఆగస్టు, అక్టోబర్ మధ్య ఎల్‌నినో ప్రభావం తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది. ఇది దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, తీవ్రమైన ఉష్ణోగ్రతలకు దారి తీయవచ్చని పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం :

టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్స్: ఇప్పటివరకు ఓటేసింది 20 మందే..

రాకింగ్ స్టార్ యశ్ మాస్టర్ ప్లాన్

మహేష్‌ ఫ్యాన్స్‌ను మోసం చేసిన రాజమౌళి!

అవతార్‌ను బీట్ చేస్తున్న రామాయణ.. ఏ విషయంలో?

Follow Us