మహాభారత రచన సమయంలో గణపతి శరీరం నుంచి వెలువడిన అధిక వేడిని తగ్గించడానికి వ్యాసుడు బంకమట్టి పూశాడు. రచన పూర్తయ్యాక, నదిలో స్నానం చేయించగా, ఆ బంకమట్టి నీటిలో కరిగిపోయింది. ఈ పురాణ గాథనే ఆధారంగా చేసుకుని, గణేష్ నవరాత్రుల అనంతరం వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.