AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ దెబ్బతో ఇరాన్ పని ఖతం.. యుద్ధానికి శాశ్వత ముగింపు పలకబోతున్నాంః డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. వైట్ హౌస్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ, ఇరాన్‌తో యుద్ధం అంతం కాలేదని అన్నారు. ప్రపంచ చరిత్రలో ఇరాన్‌పై దాడి చాలా తీవ్రంగా ఉందని ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు. ఇరాన్ 47 సంవత్సరాల మూల్యం చెల్లించుకుంటుందని ట్రంప్ పేర్కొన్నారు.

ఈ దెబ్బతో ఇరాన్ పని ఖతం.. యుద్ధానికి శాశ్వత ముగింపు పలకబోతున్నాంః  డొనాల్డ్ ట్రంప్
Trump Warns Iran
Balaraju Goud
|

Updated on: Mar 12, 2026 | 8:20 AM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. వైట్ హౌస్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ, ఇరాన్‌తో యుద్ధం అంతం కాలేదని అన్నారు. ప్రపంచ చరిత్రలో ఇరాన్‌పై దాడి చాలా తీవ్రంగా ఉందని ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు. ఇరాన్ 47 సంవత్సరాల మూల్యం చెల్లించుకుంటుందని ట్రంప్ పేర్కొన్నారు. “చరిత్రలో ఏ దేశమూ దెబ్బతిననంత తీవ్రంగా మేము వారిని దెబ్బతీశాము, ఇంకా యుద్ధం పూర్తి కాలేదు” అని డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ అధికారిక కమ్యూనికేషన్ ఛానల్‌ ద్వారా పేర్కొన్నారు. 47 సంవత్సరాలుగా ఇరాన్ ప్రపంచానికి కలిగిస్తున్న నష్టానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోబోతోందని ఆయన అన్నారు.

ఇరాన్ సైనిక శక్తి పూర్తిగా నాశనమైందని డోనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నారు. ఇరాన్ నావికాదళం, సైన్యాన్ని అమెరికా నాశనం చేసిందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇరాన్ – అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఈ తాజా ప్రకటన వచ్చింది. ఇరాన్ నుండి వచ్చే ఎలాంటి దాడికి తాను భయపడనని ట్రంప్ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాను కొనసాగించాలని చమురు కంపెనీలకు కూడా ఆయన సూచించారు.

హార్ముజ్ జలసంధిలో ఇరాన్ మందుపాతరలు అమర్చిందనే నివేదికల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఇరాన్ అలా చేస్తే, అమెరికా “మునుపెన్నడూ చూడని విధంగా” సైనిక ప్రతిస్పందనతో స్పందిస్తుందని ట్రంప్ హెచ్చరించారు. నిజానికి, అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి ఆపరేషన్‌తో ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు మధ్యప్రాచ్యం అంతటా వ్యాపించింది. ఇరాన్ సైతం అమెరికా – ఇజ్రాయెల్ స్థావరాలపై దాడులు ప్రారంభించింది. యుఎఇ, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఒమన్ వంటి పొరుగు దేశాలు కూడా డ్రోన్, క్షిపణి దాడులను ఎదుర్కొంటున్నాయి. ఈ మొత్తం సమస్య చమురు మార్కెట్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు మార్గమైన హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంది. దీని వలన చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి.

ఇదిలావుంటే, “ఇరాన్ యుద్ధం అతి త్వరలో ముగుస్తుంది”, “నేను చెప్పినప్పుడల్లా ఈ యుద్ధం ముగియవచ్చు” అని ట్రంప్ గతంలో పేర్కొన్నారు, కానీ ఆయన తాజా ప్రకటన అమెరికా ఇరాన్‌పై మరింత ఒత్తిడి తీసుకురాబోతోందని స్పష్టంగా సూచిస్తుంది. తర్వాత ఏమి జరుగుతుందో ప్రపంచం మొత్తం చూస్తోంది. ట్రంప్ వైఖరి అమెరికా ఇరాన్‌ను వదలబోదని చూపిస్తుంది. ఇరాన్ ఇప్పుడు వెనక్కి తగ్గుతుందా, లేదా ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అన్నదీ ఉత్కంఠగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us