AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డొనాల్డ్ ట్రంప్

డొనాల్డ్ ట్రంప్

గతేడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇందులో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించి అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అమెరికాకు 45వ, 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ విధంగా గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ తర్వాత వరుసగా పదవీ బాధ్యతలు చేపట్టని రెండవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్. అంతేకాకుండా, డోనాల్డ్ ట్రంప్ క్రిమినల్ నేరానికి పాల్పడిన మొదటి అధ్యక్షుడిగా అలాగే కమాండర్-ఇన్-చీఫ్‌గా పనిచేసిన రెండవ అత్యంత వయసున్న అధ్యక్షుడిగా పేరొందారు.

ట్రంప్‌కు ఇంత వయసు వచ్చినప్పటికీ.. అప్పటికీ ఇప్పటికీ నవ యువకుడిలాగే ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు హుషారుగా కనిపిస్తుంటారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడుగా తిరిగి రెండోసారి ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌… ఎట్టకేలకు మళ్లీ వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టారు. నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్‌ భవంతిపై తన మద్దతుదారులు చేసిన హంగామా నడుమ శ్వేతసౌధాన్ని ట్రంప్‌ వీడిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి

ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే తీవ్ర పరిణామాలు.. చైనా, రష్యాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఆయుధాల సరఫరా అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు సైనిక సహాయం అందించే విషయంలో చైనా, రష్యాలకు ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ రెండు దేశాలు టెహ్రాన్‌కు ఆయుధాలు అందించడం లేదని తమకు స్పష్టమైన హామీ ఇచ్చాయని వెల్లడించారు.

US VISA Rules: భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్.. అమెరికా వీసా నిబంధనల్లో భారీ మార్పులు..!

అమెరికాలో చదువుతున్న భారతీయులతో సహా లక్షలాది మంది అంతర్జాతీయ విద్యార్థులపై ప్రభావం చూపే కీలక వలస నిబంధనను అమెరికా ప్రభుత్వం సిద్ధం చేసింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ విధానానికి ముగింపు పలికి, విద్యార్థులకు నిర్దిష్ట కాలపరిమితితో అమెరికాలో ఉండే విధానాన్ని తీసుకురావాలని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) నిర్ణయించింది.

US-Iran War: ప్రపంచంలో ఏ శక్తీ మా నుండి హోర్ముజ్‌ను తీసుకోలేదు.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!

మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. హోర్ముజ్ జలసంధి విషయంలో ఎలాంటి బాహ్య జోక్యాన్నీ సహించబోమని ఇరాన్ ఘాటుగా హెచ్చరించింది. ముఖ్యంగా అమెరికా తమ దేశ మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలపై దాడులు కొనసాగిస్తే, భారీ స్థాయిలో ప్రతీకార చర్యలు తప్పవని స్పష్టం చేసింది. దీంతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇరాన్ టార్గెట్‌గా అమెరికా గ్లోబల్ షాక్! గల్ఫ్‌ దేశాలకు ట్రంప్ కొత్త షరతు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధి కేంద్రంగా అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలసంధిపై ఇరాన్ నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పూర్తి దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం మోసపూరితమైనదని, హింసాత్మక, దురుద్దేశపూరితం వల్లే పూర్తి వినాశన మార్గంలోకి వెళ్తోందని ట్రంప్ విమర్శించారు.

టోల్ ఫీజు..! హర్మూజ్‌పై ట్రంప్‌ సంచలన ప్రకటన.. అబ్బో.. ’20 శాతం ఎక్కువే’ అంటూ ఇరాన్ కౌంటర్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతూ గల్ఫ్ ప్రాంతాన్ని యుద్ధ వాతావరణంలోకి నెట్టుతున్నాయి. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్య పోరు ముదురుతుండగా, అంతర్జాతీయ నౌకలకు భద్రత కల్పించే పేరుతో అమెరికా కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. దీనికి ప్రతిగా హర్మూజ్ జలసంధికి అసలైన సంరక్షకుడు ఇరాన్‌నే అంటూ టెహ్రాన్ తీవ్రంగా స్పందించింది.

ట్రంప్ హత్యకు ఇరాన్ కొత్త కుట్ర? అమెరికాను హెచ్చరించిన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్!

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ముగింపు, ఆపై ఇరాన్‌పై అమెరికా ముందస్తు దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్ సరికొత్తగా కుట్ర పన్నుతోందని ఇజ్రాయెల్ సంచలన విషయాలు బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన పక్కా నిఘా సమాచారాన్ని ఇజ్రాయెల్ తాజాగా అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం 'పెంటగాన్'కు అందించిందని అమెరికా మీడియా వెల్లడించింది.

మళ్లీ రణరంగంగా మారిన హోర్ముజ్ జలసంధి.. ఇరాన్‌‌పై విరుచుకుపడ్డ అమెరికా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధ విరమణ కోసం కుదిరిన మధ్యంతర అవగాహన ఒప్పందం ముగిసిపోయింది అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే, ఇరాన్‌పై అమెరికా మరోసారి భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. హోర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య నౌకల భద్రతను కాపాడడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) వెల్లడించింది.

సన్నిహిత సంబంధాలు – వ్యూహాత్మక భాగస్వామ్యం.. త్వరలో భారత్‌ పర్యటనకు డొనాల్డ్ ట్రంప్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది 2027 ఆరంభంలో భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పర్యటనకు సంబంధించిన వివరాలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధికారికంగా ప్రకటించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను, వ్యూహాత్మక అంశాలను ఖరారు చేసేందుకు తాను త్వరలోనే భారతదేశంలో పర్యటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు షాక్.. పౌరసత్వం, గ్రీన్ కార్డ్ ఖర్చులు భారీగా పెంపు!

అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న లక్షలాది మంది వలసదారులకు, ముఖ్యంగా భారతీయులకు, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికా పౌరసత్వం, గ్రీన్ కార్డ్‌లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను మరింత ఖరీదుగా మార్చే కొత్త నిబంధనలను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతిపాదించింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే, అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ పౌరసత్వం పొందాలని ఆశిస్తున్న లక్షలాది మంది వలసదారులపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది.

‘‘జస్ట్ జోక్ చేశాను అంతే..’’ G7లో సరదా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్

ఫ్రాన్స్ వేదికగా జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నాయకుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన “నేనే బాస్” వ్యాఖ్య ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యను కొందరు అహంకారపూరితంగా భావించగా, మరికొందరు సరదా వ్యాఖ్యగా తీసుకున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ తన ఉద్దేశం పెత్తనం చెలాయించడం కాదని, కేవలం సరదాగా మాట్లాడానని స్పష్టం చేశారు.

“ఇరాన్ సరిగ్గా ప్రవర్తించకపోతే మళ్లీ బాంబులే”.. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక..!

ఇరాన్‌తో నెలల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరే దశకు చేరుకుంది. అయితే ఈ ఒప్పందంపై సంతకాలు జరగడానికి కేవలం రెండు రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.

కాశ్మీర్‌పై అమెరికా కొత్త వివాదం.. భారత సరిహద్దులను మార్చేసిన మ్యాప్! భారత్‌లో ఆగ్రహ జ్వాలలు!

జూన్ 16న విడుదల చేసిన అధికారిక సమాచారంలో ఉపయోగించిన మ్యాప్‌లో భారతదేశ భౌగోళిక సరిహద్దులను తప్పుగా చూపించారని భారతీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆ పటంలో జమ్మూ కాశ్మీర్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు ప్రధాన భారత భూభాగం నుంచి వేరుగా కనిపించగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) పాకిస్తాన్‌లో భాగంగా చూపించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అక్సాయ్ చిన్ ప్రాంతం కూడా భారతదేశం నుంచి విడిగా చూపినట్లు గమనించారు. భారత దృష్టిలో ఇది దేశ సార్వభౌమాధికారానికి విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు.