డొనాల్డ్ ట్రంప్
గతేడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇందులో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించి అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అమెరికాకు 45వ, 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ విధంగా గ్రోవర్ క్లీవ్ల్యాండ్ తర్వాత వరుసగా పదవీ బాధ్యతలు చేపట్టని రెండవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్. అంతేకాకుండా, డోనాల్డ్ ట్రంప్ క్రిమినల్ నేరానికి పాల్పడిన మొదటి అధ్యక్షుడిగా అలాగే కమాండర్-ఇన్-చీఫ్గా పనిచేసిన రెండవ అత్యంత వయసున్న అధ్యక్షుడిగా పేరొందారు.
ట్రంప్కు ఇంత వయసు వచ్చినప్పటికీ.. అప్పటికీ ఇప్పటికీ నవ యువకుడిలాగే ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు హుషారుగా కనిపిస్తుంటారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడుగా తిరిగి రెండోసారి ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్… ఎట్టకేలకు మళ్లీ వైట్హౌస్లోకి అడుగుపెట్టారు. నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవంతిపై తన మద్దతుదారులు చేసిన హంగామా నడుమ శ్వేతసౌధాన్ని ట్రంప్ వీడిన విషయం తెలిసిందే.
విఫలమైన చర్చలు.. యుద్ధం తప్పదా? ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన కోసం పాకిస్థాన్ వేదికగా జరిగిన కీలక చర్చలు నిష్ఫలమయ్యాయి. ఇజ్రాయెల్, అమెరికా - ఇరాన్ల మధ్య యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు ఇస్లామాబాద్లో శనివారం (ఏప్రిల్ 11, 2026) ప్రారంభమైన చర్చలు ఎటువంటి సానుకూల నిర్ణయం లేకుండానే ముగిశాయి.
- Balaraju Goud
- Updated on: Apr 12, 2026
- 9:44 pm
ఇరాన్ లొంగకపోతే, నౌకాదళ దిగ్బంధనం విధిస్తాం.. వెనిజులాగా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేస్తాంః ట్రంప్
అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో, ఇరాన్ అమెరికాకు తలొగ్గడానికి నిరాకరించింది. ఈ రెండు దేశాల భవిష్యత్ కార్యాచరణపై అందరి దృష్టి నెలకొంది. ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ చర్చలు ఒప్పందం లేకుండా ముగిసిన తర్వాత, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్' సోషల్ ప్లాట్ఫామ్లో కీలక ప్రకటన చేశారు. అమెరికా డిమాండ్లను ఇరాన్ పాటించడానికి నిరాకరిస్తే, ట్రంప్ నావికా దిగ్బంధనాన్ని విధించవచ్చని పేర్కొన్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 12, 2026
- 2:46 pm
శాంతి రాయబారిగా చెప్పుకుంటున్న పాకిస్థాన్ బండారాన్ని బయటపెట్టిన డొనాల్డ్ ట్రంప్..!
ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. అమెరికా యుద్ధనౌకలపై టెహ్రాన్ ప్రయోగించిన 100కు పైగా క్షిపణులు పాకిస్తాన్ ద్వారానే వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్షిపణుల వెనుక చైనా ఉందని, పాకిస్తాన్ ద్వారా వాటిని ఇరాన్కు సరఫరా చేసిందని ఆయన ఆరోపించారు.
- Balaraju Goud
- Updated on: Apr 9, 2026
- 6:04 pm
ఇరాన్ ఉన్నత సైనికాధికారులు మృతి.. స్వయంగా ప్రకటించిన ట్రంప్.. వీడియో విడుదల!
మధ్యప్రాచ్యంలో ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, టెహ్రాన్పై జరిగిన ఒక భారీ దాడిలో ఇరాన్కు చెందిన పలువురు ఉన్నత సైనికాధికారులు మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తన సోషల్ మీడియా వేదికలో ఒక పోస్ట్లో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. దానితో పాటు ఆయన ఒక వీడియోను షేర్ చేశారు.
- Balaraju Goud
- Updated on: Apr 5, 2026
- 4:40 pm
యుద్ధం తెచ్చిన తంట.. యూఎస్ ఆర్మీ చీఫ్ తొలగింపు.. తక్షణమే వైదొలగాలని రక్షణ మంత్రి ఆదేశం..!
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా తన సైన్యాధిపతిని తొలగించింది. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, సైన్యాధిపతి రాండీ జార్జ్ను తక్షణమే పదవీ విరమణ చేయాలని ఆదేశించారు. ఆయన నిష్క్రమణ తరువాత, డిప్యూటీ చీఫ్ జనరల్ క్రిస్టోఫర్ లానెవ్ తాత్కాలిక సైన్యాధిపతిగా బాధ్యతలు అప్పగించారు. జార్జ్ 2023 ఆగస్టులో సైన్యాధిపతి అయ్యారు. ఈ పదవి కాలపరిమితి నాలుగేళ్లు. ఆయన పదవీకాలం ఇంకా ఒక సంవత్సరం మిగిలి ఉంది.
- Balaraju Goud
- Updated on: Apr 3, 2026
- 7:35 am
పరస్పరం ఆర్థిక మూలాలే టార్గెట్.. అమెరికా వెన్నెముకను విరిచేందుకు ఇరాన్ మాస్టర్ ప్లాన్!
ఇరాన్ యుద్దం తీవ్రస్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. యుద్ధం ఆపకపోతే ఇక విధ్వంసమే అన్న ట్రంప్ హెచ్చరికలకు.. అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ చేసింది ఇరాన్. ఏకంగా అమెరికా ఆర్థిక వెన్నెముకను విరిచేసే మాస్టర్ ప్లాన్ను బయటపెట్టింది. ఇప్పుడీ యుద్ధ జ్వాలలు.. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల గుమ్మం వరకు చేరాయి. ఇరాన్ ప్రకటించిన 'హిట్ లిస్ట్' ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది!
- Balaraju Goud
- Updated on: Apr 1, 2026
- 7:03 am
మరో కీలక ఘట్టానికి కౌంట్డౌన్ షురూ.. ట్రంప్ జస్ట్ స్టాంప్ అధ్యక్షుడిగా మిగిలిపోతాడా..?
అమెరికాలో మరో కీలక ఘట్టానికి కౌంట్డౌన్ మొదలైంది. మధ్యంతర ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ రాజకీయ వేడి పెరుగుతోంది. ఓవైపు ఇరాన్తో వార్, మరోవైపు దేశీయంగా పెరుగుతున్న వ్యతిరేకత.. ఈరెండూ కలిసి డొనాల్డ్ ట్రంప్ ఫ్యూచర్పై ప్రభావం చూపబోతున్నాయా..? మిడ్టర్మ్లో ఓడిపోతే, ట్రంప్ జస్ట్ స్టాంప్ అధ్యక్షుడిగానే మిగిలిపోతాడా..? నో కింగ్ ఆందోళనలు ట్రంప్ దూకుడుకు బ్రేకులు వేస్తున్నాయా ?
- Balaraju Goud
- Updated on: Mar 31, 2026
- 7:50 am
సొంత దేశంలోనే చుక్కలు చూస్తున్న డొనాల్డ్ ట్రంప్.. ‘రాజులు వద్దు’ అంటూ కదంతొక్కిన అమెరికా జనం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా చర్యలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్డెక్కారు. నో కింగ్స్ అంటూ నిరసనలు వెల్లువెత్తాయి. ఇది అమెరికాలో చరిత్రలోనే అతిపెద్ద నిరసనల్లో ఒకటిగా మారుతుందని, దీనికి మిన్నెసోటా కేంద్ర బిందువుగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. 50 రాష్ట్రాల్లో 3,100 చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించామని, వీటిలో మొత్తం 90 లక్షల మందికి పైగా పాల్గొన్నారని తెలిపారు.
- Balaraju Goud
- Updated on: Mar 29, 2026
- 9:09 am
ఇస్లామాబాద్లో ఇరాన్-అమెరికా యుద్ధంపై చర్చలు.. మధ్యవర్తిత్వంలో ఎవరు పాల్గొంటున్నారు..?
అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం దాదాపు నెల రోజులుగా కొనసాగుతోంది. అమెరికా తన మిత్రదేశమైన ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై నిరంతరం దాడులు చేస్తోంది. దీంతో ఇరాన్ మధ్యప్రాచ్యాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. అంతేకాకుండా, హోర్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా విస్తృత ఆగ్రహానికి కారణమైంది.
- Balaraju Goud
- Updated on: Mar 29, 2026
- 8:53 am
పశ్చిమాసియా సంక్షోభం వేళ భారత్ – అమెరికా కీలక చర్చలు.. మోదీ – ట్రంప్ మధ్యలో మస్క్..?
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన చర్చలు జరిపారు. ఈ సంభాషణలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నారని న్యూయార్క్ టైమ్స్ మీడియా ప్రచురించింది. మార్చి 24న ఫోన్లో మోదీ, ట్రంప్ చర్చలు చర్చించారు. అయితే రెండు దేశాల అగ్ర నాయకుల మధ్య జరిగే సంభాషణలో ఒక ప్రైవేట్ వ్యక్తి పాల్గొనడం అసాధారణం.
- Balaraju Goud
- Updated on: Mar 28, 2026
- 11:51 am
‘ప్రధాని మోదీతో కలిసి ఉద్రిక్తతలను పరిష్కరిస్తాం..’ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన..!
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య దాదాపు నెల రోజులుగా యుద్ధం సాగుతోంది. మరోసారి అమెరికా సైనిక చర్యకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు . "ప్రధాని మోదీ, నేను కలిసి మాత్రమే ఈ సంఘర్షణకు పరిష్కారం చూపగలము " అని ట్రంప్ పేర్కొన్నారు.
- Balaraju Goud
- Updated on: Mar 27, 2026
- 12:31 pm
165 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతున్న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా చరిత్రలో తొలిసారిగా..!
డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. అమెరికా 165 ఏళ్ల చరిత్రలో మునుపెన్నడూ జరగని పనిని ఆయన ఇప్పుడు చేయబోతున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం త్వరలో యూఎస్ డాలర్ నోట్లపై ఉండబోతోంది. ఈ సమాచారాన్ని అమెరికన్ ట్రేడర్ అందించింది. అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవం సందర్భంగా డాలర్ నోట్లపై ట్రంప్ సంతకం ఉండబోతోంది.
- Balaraju Goud
- Updated on: Mar 27, 2026
- 7:35 am