AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డొనాల్డ్ ట్రంప్

డొనాల్డ్ ట్రంప్

గతేడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇందులో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించి అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అమెరికాకు 45వ, 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ విధంగా గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ తర్వాత వరుసగా పదవీ బాధ్యతలు చేపట్టని రెండవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్. అంతేకాకుండా, డోనాల్డ్ ట్రంప్ క్రిమినల్ నేరానికి పాల్పడిన మొదటి అధ్యక్షుడిగా అలాగే కమాండర్-ఇన్-చీఫ్‌గా పనిచేసిన రెండవ అత్యంత వయసున్న అధ్యక్షుడిగా పేరొందారు.

ట్రంప్‌కు ఇంత వయసు వచ్చినప్పటికీ.. అప్పటికీ ఇప్పటికీ నవ యువకుడిలాగే ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు హుషారుగా కనిపిస్తుంటారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడుగా తిరిగి రెండోసారి ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌… ఎట్టకేలకు మళ్లీ వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టారు. నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్‌ భవంతిపై తన మద్దతుదారులు చేసిన హంగామా నడుమ శ్వేతసౌధాన్ని ట్రంప్‌ వీడిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి

కుటుంబం కోసం పదవి త్యాగం.. యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ రాజీనామా..!

అమెరికా జాతీయ గూఢచార విభాగంలో (DNI) కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ స్థానంలో కొత్త తాత్కాలిక డైరెక్టర్‌గా ఆరోన్ లూకాస్ నియమితులవుతారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. గూఢచార సంస్థల పనితీరుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసేందుకే ఈ తక్షణ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

‘నేను వెళ్ళినా, వెళ్ళకపోయినా నన్ను చంపేస్తారు..’ తన కొడుకు పెళ్లిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహంపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, తనదైన శైలిలో చమత్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సొంత పార్టీ నుంచే షాక్.. ట్రంప్ ఇరాన్ యుద్ధ వ్యూహానికి బ్రేక్ వేసిన అమెరికా సెనేట్!

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమై 80 రోజులు గడిచిన నేపథ్యంలో, అమెరికా రాజకీయాల్లో ఒక అరుదైన పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా, కాంగ్రెస్ అనుమతి లేని పక్షంలో ఇరాన్ యుద్ధాన్ని ముగించాలనే 'యుద్ధ అధికారాల తీర్మానాన్ని' (War Powers Resolution) అమెరికా సెనేట్ ముందుకు తీసుకెళ్లింది.

ప్రపంచ సంక్షోభం వేళ.. పారిస్‌లో ప్రధాని మోదీ-ట్రంప్ మధ్య వ్యూహాత్మక భేటీ!

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరమైన కదలికలు వేగం పుంచుకున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే ముఖాముఖి భేటీ కానున్నారు. వచ్చే నెల జూన్ 15 - 17 మధ్య ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదిక కానుంది.

చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన ట్రంప్… ఇరాన్‌పై సైనిక దాడి నిలిపివేత!

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై మంగళవారం (మే 19)జరపాల్సిన భారీ సైనిక దాడిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య "తీవ్రమైన చర్చలు" జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Viral News: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ట్రంప్, నెతన్యాహు దున్నపోతులు.. అసలు కథ ఇదీ!

ఈద్ అల్-అధా (బక్రీద్) పండుగ వేళ బంగ్లాదేశ్‌లో ఒక విచిత్రమైన సంఘటన సోషల్ మీడియాను ఊపేస్తోంది. పండుగ కోసం సిద్ధం చేసిన రెండు దున్నపోతులు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. వాటి భారీ పరిమాణం కంటే, ప్రపంచ దేశాల అగ్రనేతలైన డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహులను అవి పోలి ఉన్నాయనే ప్రచారం జనాల్లో విపరీతమైన ఉత్సుకతను రేకెత్తిస్తోంది.

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బెంగాల్ ఫలితం.. ప్రధాని మోదీని అభినందించిన ట్రంప్

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన చారిత్రాత్మక విజయం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలుకుతూ, బెంగాల్ గడ్డపై బీజేపీ తొలిసారి అధికార పీఠాన్ని దక్కించుకుంది.

కార్ల దిగుమతులపై ‘ట్రంప్ టారిఫ్’ బాంబు.. అమెరికా నిర్ణయంతో ప్రపంచ వాణిజ్యంలో అలజడి!

అమెరికా - యూరోపియన్ యూనియన్ (EU) మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఉమ్మడి వాణిజ్య ఒప్పందానికి విరుద్ధంగా యూరప్ నుండి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను 25 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో, తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని మార్గాలనూ తెరిచి ఉంచుతామని యూరోపియన్ యూనియన్ శనివారం (మే 2, 2026) హెచ్చరించింది.

పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ప్రతిపాదనలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య బుధవారం (ఏప్రిల్ 29, 2026) జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధం ముగింపు, ఇరాన్ అణు సంక్షోభం ప్రధానాంశాలుగా నిలిచాయి.

Watch: వాషింగ్టన్‌ డీసీ గోడలపై డొనాల్ట్ ట్రంప్ చీకటి భాగోతాలు.. నివ్వెరపోతున్న జనం…!

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బాగోతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తప్పుడు పనులను కూడా సమర్థించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయంలో ఆయనతో ఆయనకే పోటీ. అందుకే ట్రంప్‌ గురించి వచ్చే బ్యాడ్ న్యూస్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ లైంగిక నేరస్థుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌ కలిసి ఉన్న ఫోటోలు ఏకంగా వాషింగ్టన్‌ డీసీలో గోడలపై ప్రత్యక్షం కావడం ట్రంప్‌ ఇమేజ్‌కు పెద్ద డ్యామేజ్‌గా మారింది.

భారత్-అమెరికా బంధానికి కొత్త ఊపిరి.. త్వరలో ప్రధాని మోదీ, ట్రంప్ కీలక సమావేశం!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య త్వరలో జరగనున్న భేటీ అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూన్ 15 నుండి 17 వరకు ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సమావేశం ఈ ఇద్దరు ప్రపంచ నేతల కలయికకు వేదిక కానుంది. 2025 ఫిబ్రవరి తర్వాత ఈ నేతలు ముఖాముఖి కలుసుకోవడం ఇదే తొలిసారి.

ఇరాన్ ఆర్థిక మూలాలపై ట్రంప్ దెబ్బ.. చైనా రిఫైనరీలపై అమెరికా ఆంక్షలు!

ఇరాన్ - అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ఇరాన్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడమే లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం చైనాపై తన పట్టు బిగిస్తోంది. తాజాగా, ఇరాన్ చమురు వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్న చైనాలోని హెంగ్లీ పెట్రోకెమికల్ రిఫైనరీతో పాటు, సుమారు 40 షిప్పింగ్ కంపెనీలు, నౌకలపై అమెరికా ట్రెజరీ శాఖ కఠినమైన ఆంక్షలు విధించింది.