AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డొనాల్డ్ ట్రంప్

డొనాల్డ్ ట్రంప్

గతేడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇందులో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించి అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అమెరికాకు 45వ, 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ విధంగా గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ తర్వాత వరుసగా పదవీ బాధ్యతలు చేపట్టని రెండవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్. అంతేకాకుండా, డోనాల్డ్ ట్రంప్ క్రిమినల్ నేరానికి పాల్పడిన మొదటి అధ్యక్షుడిగా అలాగే కమాండర్-ఇన్-చీఫ్‌గా పనిచేసిన రెండవ అత్యంత వయసున్న అధ్యక్షుడిగా పేరొందారు.

ట్రంప్‌కు ఇంత వయసు వచ్చినప్పటికీ.. అప్పటికీ ఇప్పటికీ నవ యువకుడిలాగే ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు హుషారుగా కనిపిస్తుంటారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడుగా తిరిగి రెండోసారి ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌… ఎట్టకేలకు మళ్లీ వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టారు. నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్‌ భవంతిపై తన మద్దతుదారులు చేసిన హంగామా నడుమ శ్వేతసౌధాన్ని ట్రంప్‌ వీడిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి

సన్నిహిత సంబంధాలు – వ్యూహాత్మక భాగస్వామ్యం.. త్వరలో భారత్‌ పర్యటనకు డొనాల్డ్ ట్రంప్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది 2027 ఆరంభంలో భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పర్యటనకు సంబంధించిన వివరాలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధికారికంగా ప్రకటించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను, వ్యూహాత్మక అంశాలను ఖరారు చేసేందుకు తాను త్వరలోనే భారతదేశంలో పర్యటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు షాక్.. పౌరసత్వం, గ్రీన్ కార్డ్ ఖర్చులు భారీగా పెంపు!

అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న లక్షలాది మంది వలసదారులకు, ముఖ్యంగా భారతీయులకు, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికా పౌరసత్వం, గ్రీన్ కార్డ్‌లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను మరింత ఖరీదుగా మార్చే కొత్త నిబంధనలను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతిపాదించింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే, అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ పౌరసత్వం పొందాలని ఆశిస్తున్న లక్షలాది మంది వలసదారులపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది.

‘‘జస్ట్ జోక్ చేశాను అంతే..’’ G7లో సరదా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్

ఫ్రాన్స్ వేదికగా జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నాయకుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన “నేనే బాస్” వ్యాఖ్య ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యను కొందరు అహంకారపూరితంగా భావించగా, మరికొందరు సరదా వ్యాఖ్యగా తీసుకున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ తన ఉద్దేశం పెత్తనం చెలాయించడం కాదని, కేవలం సరదాగా మాట్లాడానని స్పష్టం చేశారు.

“ఇరాన్ సరిగ్గా ప్రవర్తించకపోతే మళ్లీ బాంబులే”.. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక..!

ఇరాన్‌తో నెలల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరే దశకు చేరుకుంది. అయితే ఈ ఒప్పందంపై సంతకాలు జరగడానికి కేవలం రెండు రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.

కాశ్మీర్‌పై అమెరికా కొత్త వివాదం.. భారత సరిహద్దులను మార్చేసిన మ్యాప్! భారత్‌లో ఆగ్రహ జ్వాలలు!

జూన్ 16న విడుదల చేసిన అధికారిక సమాచారంలో ఉపయోగించిన మ్యాప్‌లో భారతదేశ భౌగోళిక సరిహద్దులను తప్పుగా చూపించారని భారతీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆ పటంలో జమ్మూ కాశ్మీర్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు ప్రధాన భారత భూభాగం నుంచి వేరుగా కనిపించగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) పాకిస్తాన్‌లో భాగంగా చూపించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అక్సాయ్ చిన్ ప్రాంతం కూడా భారతదేశం నుంచి విడిగా చూపినట్లు గమనించారు. భారత దృష్టిలో ఇది దేశ సార్వభౌమాధికారానికి విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు.

యుద్ధం ముగిసింది.. ఇంజన్లు స్టార్ట్ చేయండి.. ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు ధరలు

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు, అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 84 డాలర్లకు, డబ్ల్యూటీఐ ధర 80 డాలర్లకు చేరింది.

అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి తెరుచుకోనుందా? ట్రంప్ ప్రకటన ఇదే

US-Iran Deal: అమెరికా-ఇరాన్ మధ్య కీలక ఒప్పందం త్వరలో కుదిరే అవకాశాలు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందంతో హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో పాటు ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంపై కఠిన నియంత్రణలు అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఒబామా విధానాలను విమర్శిస్తూ, మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు ఇది కీలక మలుపు కావొచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇరాన్‌తో ‘గ్రేట్ డీల్’ ఖరారు?.. సంతకాలే మిగిలాయని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

మధ్యప్రాచ్య రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలు, యుద్ధ భయాలు, పరస్పర ఆరోపణల అనంతరం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఒక కీలక ఒప్పందం దాదాపు పూర్తయిందని ప్రకటించారు. గురువారం (జూన్ 11) వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇరు దేశాల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ప్రస్తుతం కేవలం పత్రాల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు.

America: ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు గుడ్‌న్యూస్.. లక్ష డాలర్ల హెచ్-1బీ పన్ను రద్దు!

అమెరికాలో ఉద్యోగం చేయాలనే కలలతో ఉన్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులు, ఐటీ నిపుణులు, యజమానులకు అమెరికా ఫెడరల్ కోర్టు శుభవార్త అందించింది. డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదించిన వివాదాస్పద లక్ష డాలర్లు (సుమారు రూ. 84 లక్షలు) వార్షిక హెచ్-1బీ వీసా రుసుమును యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి లియో సోరోకిన్ చట్టవిరుద్ధమని పేర్కొంటూ కొట్టివేశారు. ఈ తీర్పుతో అమెరికాలో స్థిరపడాలనుకునే అంతర్జాతీయ ప్రతిభావంతులు, ముఖ్యంగా భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు.

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు శుభవార్త.. ట్రంప్ సర్కార్ నిర్ణయాలను కొట్టివేసిన అమెరికా ఫెడరల్ కోర్టు!

అమెరికాలో చట్టబద్ధంగా స్థిరపడాలని, గ్రీన్ కార్డ్ సాధించాలని కలలు కంటున్న వేలాది మంది వలసదారులకు యూఎస్ ఫెడరల్ కోర్టు ఒక పెద్ద శుభవార్త అందించింది. దాదాపు 39 దేశాలకు చెందిన వలసదారుల గ్రీన్ కార్డ్‌లు, వర్క్ పర్మిట్‌లు, ఆశ్రయం, పౌరసత్వ దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన కఠినమైన విధానాలను కోర్టు కొట్టివేసింది. ఈ ఆదేశాలు చట్టబద్ధంగా చెల్లవని స్పష్టం చేస్తూ రోడ్ ఐలాండ్‌లోని ఫెడరల్ కోర్టు చీఫ్ జడ్జి జాన్ మెక్‌కానెల్ కీలక తీర్పునిచ్చారు.

అమెరికా – ఇరాన్ ఒప్పందంపై ముమ్మర చర్చలు.. పంతం వీడని నేతలు.. సస్పెన్స్‌లో గ్లోబల్ డీల్!

అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరే అవకాశం ఉన్న ఒక ఒప్పందంపై చర్చలు ముమ్మరమవుతున్నాయి. అయితే, ఈ చర్చలు తుది దశకు చేరుకున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య ఇంకా ఎలాంటి తుది నిర్ణయం జరగలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లోని అత్యంత సురక్షితమైన 'సిట్యుయేషన్ రూమ్‌'లో ప్రతిపాదిత ఒప్పంద ముసాయిదాపై దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం.. ట్రంప్ ఆమోదంపైనే ఉత్కంఠ!

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. కొనసాగుతున్న శాంతి చర్చల నేపథ్యంలో, కాల్పుల విరమణను 60 రోజుల పాటు పొడిగించేందుకు అమెరికా - ఇరాన్‌లు ఒక ప్రాథమిక ఒప్పందానికి వచ్చాయి. ఈ రెండు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం, కాల్పుల విరమణను పొడిగించడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమంపై కూడా అధికారిక చర్చలు ప్రారంభం కానున్నాయి.