AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డొనాల్డ్ ట్రంప్

డొనాల్డ్ ట్రంప్

గతేడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇందులో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించి అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అమెరికాకు 45వ, 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ విధంగా గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ తర్వాత వరుసగా పదవీ బాధ్యతలు చేపట్టని రెండవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్. అంతేకాకుండా, డోనాల్డ్ ట్రంప్ క్రిమినల్ నేరానికి పాల్పడిన మొదటి అధ్యక్షుడిగా అలాగే కమాండర్-ఇన్-చీఫ్‌గా పనిచేసిన రెండవ అత్యంత వయసున్న అధ్యక్షుడిగా పేరొందారు.

ట్రంప్‌కు ఇంత వయసు వచ్చినప్పటికీ.. అప్పటికీ ఇప్పటికీ నవ యువకుడిలాగే ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు హుషారుగా కనిపిస్తుంటారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడుగా తిరిగి రెండోసారి ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌… ఎట్టకేలకు మళ్లీ వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టారు. నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్‌ భవంతిపై తన మద్దతుదారులు చేసిన హంగామా నడుమ శ్వేతసౌధాన్ని ట్రంప్‌ వీడిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి

కార్ల దిగుమతులపై ‘ట్రంప్ టారిఫ్’ బాంబు.. అమెరికా నిర్ణయంతో ప్రపంచ వాణిజ్యంలో అలజడి!

అమెరికా - యూరోపియన్ యూనియన్ (EU) మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఉమ్మడి వాణిజ్య ఒప్పందానికి విరుద్ధంగా యూరప్ నుండి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను 25 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో, తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని మార్గాలనూ తెరిచి ఉంచుతామని యూరోపియన్ యూనియన్ శనివారం (మే 2, 2026) హెచ్చరించింది.

పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ప్రతిపాదనలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య బుధవారం (ఏప్రిల్ 29, 2026) జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధం ముగింపు, ఇరాన్ అణు సంక్షోభం ప్రధానాంశాలుగా నిలిచాయి.

Watch: వాషింగ్టన్‌ డీసీ గోడలపై డొనాల్ట్ ట్రంప్ చీకటి భాగోతాలు.. నివ్వెరపోతున్న జనం…!

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బాగోతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తప్పుడు పనులను కూడా సమర్థించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయంలో ఆయనతో ఆయనకే పోటీ. అందుకే ట్రంప్‌ గురించి వచ్చే బ్యాడ్ న్యూస్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ లైంగిక నేరస్థుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌ కలిసి ఉన్న ఫోటోలు ఏకంగా వాషింగ్టన్‌ డీసీలో గోడలపై ప్రత్యక్షం కావడం ట్రంప్‌ ఇమేజ్‌కు పెద్ద డ్యామేజ్‌గా మారింది.

భారత్-అమెరికా బంధానికి కొత్త ఊపిరి.. త్వరలో ప్రధాని మోదీ, ట్రంప్ కీలక సమావేశం!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య త్వరలో జరగనున్న భేటీ అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూన్ 15 నుండి 17 వరకు ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సమావేశం ఈ ఇద్దరు ప్రపంచ నేతల కలయికకు వేదిక కానుంది. 2025 ఫిబ్రవరి తర్వాత ఈ నేతలు ముఖాముఖి కలుసుకోవడం ఇదే తొలిసారి.

ఇరాన్ ఆర్థిక మూలాలపై ట్రంప్ దెబ్బ.. చైనా రిఫైనరీలపై అమెరికా ఆంక్షలు!

ఇరాన్ - అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ఇరాన్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడమే లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం చైనాపై తన పట్టు బిగిస్తోంది. తాజాగా, ఇరాన్ చమురు వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్న చైనాలోని హెంగ్లీ పెట్రోకెమికల్ రిఫైనరీతో పాటు, సుమారు 40 షిప్పింగ్ కంపెనీలు, నౌకలపై అమెరికా ట్రెజరీ శాఖ కఠినమైన ఆంక్షలు విధించింది.

“ఒక్కసారి భారతదేశానికి వచ్చి ఇక్కడి సంస్కృతిని చూడండి”.. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్‌కు మద్దతుగా ఇరాన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, చైనాలను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్‌లో, భారత్‌ను "నరక కూపం"గా అభివర్ణించడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. భారతీయులకు ఇంగ్లీష్ రాదని, అమెరికాలో పుట్టిన పిల్లలకు ఇచ్చే పౌరసత్వ చట్టం వల్ల సమస్యలు వస్తున్నాయని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

“నేను నిజంగా పెద్ద తప్పు చేశా.. వాళ్లు పిల్లి, కుక్కల్లా కొట్టుకుంటున్నారు”.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - ఇరాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. ఇరాన్‌తో రెండో విడత చర్చలకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్ అగ్రనాయకత్వం మధ్య ఐక్యత లేదని, దేశాన్ని ఎవరు నియంత్రించాలనే అంశంపై వారు "పిల్లి, కుక్కల్లా" కొట్టుకుంటున్నారని ట్రంప్ ఎద్దేవా చేశారు.

హోర్ముజ్ జలసంధిలో హైడ్రామా.. నౌకల నిర్బంధంతో ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు..!

అమెరికా, ఇరాన్‌ల మధ్య దౌత్యపరమైన, సైనికపరమైన ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. హోర్ముజ్ జలసంధి వేదికగా జరుగుతున్న నౌకాదళ కార్యకలాపాలు, ఆర్థిక దిగ్బంధనం, అణు కార్యక్రమంపై ఇరు దేశాలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఇరాన్ నౌకాదళాన్ని "సముద్రపు దొంగల ముఠా"తో పోల్చారు.

అమెరికా రక్షణ శాఖలో సంక్షోభం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం..!

ఇరాన్‌తో యుద్ధ వాతావరణం, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా రక్షణ శాఖలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. యూఎస్ నేవీ సెక్రటరీ జాన్ సి. ఫెలాన్‌ను ట్రంప్ ప్రభుత్వం తక్షణమే పదవి నుండి తొలగించింది. ఈ మేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.

మరోసారి కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్.. ఇదో ఒక కుట్ర అంటున్న ఇరాన్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని తాత్కాలికంగా చల్లబరుస్తూ, ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణను (Ceasefire) పొడిగిస్తున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. చర్చల ప్రక్రియకు ఇరాన్‌కు మరికొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

అమెరికా-ఇరాన్ మధ్య చావో రేవో తేలాల్సిన సమయం.. శాంతి చర్చలకు డొనాల్డ్ ట్రంప్!

అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి ఇస్లామాబాద్ వైపు మళ్లాయి. హోర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముగియనున్న కాల్పుల విరమణ గడువు వెరసి.. ప్రపంచం మొత్తం ఇప్పుడు పాకిస్థాన్ రాజధానిలో జరగబోయే కీలక శాంతి చర్చల వైపు ఆసక్తిగా చూస్తోంది.

భారత్-అమెరికా వాణిజ్య బంధంలో కొత్త అధ్యాయం.. వాషింగ్టన్‌లో కీలక చర్చలు!

భారతదేశం - అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలను మరో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా వాషింగ్టన్‌లో కీలకమైన వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య ఒక సమగ్ర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది.