AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: రెస్టారెంట్‌ వాళ్లతో గొడవ పడ్డావంట.. బాక్సర్‌ లవ్లీనాతో ప్రధాని మోదీ సరదా సంభాషణ..

PM Narendra Modi Meets Lovlina Borgohain: ఈ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 39 పతకాలు సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. క్రీడాకారులలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ప్రధాని మోదీ చేసిన ఈ భేటీ రాబోయే అంతర్జాతీయ టోర్నీలలో మన అథ్లెట్లు మరింతగా రాణించేందుకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది.

Video: రెస్టారెంట్‌ వాళ్లతో గొడవ పడ్డావంట.. బాక్సర్‌ లవ్లీనాతో ప్రధాని మోదీ సరదా సంభాషణ..
Pm Narendra Modi Meets Lovlina Borgohain
Venkata Chari
|

Updated on: Aug 10, 2026 | 12:28 PM

Share

PM Narendra Modi Meets Lovlina Borgohain: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన భారత విజేతలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా స్టార్ బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌ను సరదాగా పలకరిస్తూ విదేశీ రెస్టారెంట్‌లో భారత మ్యాప్‌పై అభ్యంతరం తెలిపిన తీరును మోదీ ఎంతో మెచ్చుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

“ఏంటి రెస్టారెంట్ వాళ్లతో గొడవ?”.. ప్రధాని మోదీ జోక్..

2026 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో పతకాలతో దేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన భారత అథ్లెట్లు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో ప్రధాని క్రీడాకారులతో ఎంతో ఆప్యాయంగా, సరదాగా ముచ్చటించారు. గ్లాస్గో అనుభవాలను అడిగి తెలుసుకునే క్రమంలో స్టార్ బాక్సర్‌ లవ్లీనా వైపు చూస్తూ “ఏంటి.. రెస్టారెంట్ వాళ్లతో అంత గొడవ పడ్డావు?” అని మోదీ చమత్కరించారు. దానికి లవ్లీనా ఎంతో వినయంగా నవ్వుతూ ఆ ఘటన వెనుక ఉన్న అసలు విషయాన్ని ప్రధానికి వివరించింది.

ఇవి కూడా చదవండి

జాతీయ జెండా, దేశ పటంపై గౌరవం.. లవ్లీనా సమయస్ఫూర్తి..

కామన్వెల్త్ గేమ్స్ ముగింపు సందర్భంగా భారత బాక్సింగ్ బృందం గ్లాస్గోలోని ఒక రెస్టారెంట్‌లో విజయోత్సవ వేడుకలు జరుపుకుంది. ఆ సమయంలో అక్కడ మెనూ కార్డ్, గోడలపై ఉన్న భారత దేశ పటంలో ఈశాన్య రాష్ట్రాలు, కాశ్మీర్ భాగాలు సరిగ్గా ముద్రించకపోవడాన్ని లవ్లీనా గమనించింది. సంబరాల్లో మునిగిపోయినప్పటికీ దేశపటం అసంపూర్తిగా ఉండటాన్ని ఆమె సహించలేకపోయింది. వెంటనే రెస్టారెంట్ యాజమాన్యంతో మాట్లాడి మర్యాదపూర్వకంగానే నిరసన తెలిపింది. ఆమె విజ్ఞప్తిని అర్థం చేసుకున్న యాజమాన్యం వెంటనే తప్పును దిద్దుకుని లోగోను మారుస్తామని హామీ ఇచ్చింది.

“దేశం పట్ల నీ ప్రేమ అద్భుతం”.. ప్రధాని మోదీ ప్రశంసలు..

ఈ విషయాన్ని లవ్లీనా చెప్పగానే ప్రధాని మోదీ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. “సంతోషకరమైన విజయ ఘడియల్లోనూ దేశ చిహ్నాలు, గౌరవం గురించి ఆలోచించడం నీలో ఉన్న దేశభక్తికి నిదర్శనం. నువ్వు చేసిన ఈ పనిని దేశప్రజలు చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు” అని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. విదేశీ గడ్డపై మన జాతీయ పతాకం, దేశ సరిహద్దుల పట్ల లవ్లీనా చూపిన ఈ చొరవ నిజంగా అభినందనీయమని ప్రధాని కార్యాలయం విడుదల చేసిన వీడియో ద్వారా వెల్లడైంది.

బాక్సింగ్‌లో 100 శాతం సక్సెస్.. చారిత్రాత్మక పతకాల పంట..

గ్లాస్గో వేదికగా జరిగిన ఈ కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సింగ్ బృందం అద్భుతమైన రికార్డు సృష్టించింది. బరిలోకి దిగిన 10 మంది భారత బాక్సర్లు పతకాలు సాధించి 100 శాతం విజయవంతమైన ఫలితాన్ని నమోదు చేశారు. ఇందులో ఏకంగా 7 స్వర్ణ, 3 రజత పతకాలు ఉండడం విశేషం. లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో రజత పతకం సాధించి తన పంచ్ పవర్ చూపించింది. గోల్డ్ మెడల్ విజేత సాక్షి చౌదరి సహా ఇతర ఛాంపియన్లు ప్రధాని నిరాడంబరతను కొనియాడుతూ ఆయనతో సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి మన్ సుఖ్ మాండవీయా, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష పాల్గొన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us