AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఒకే నెలలో 2సార్లు భారత్, పాక్ పోరు.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

India vs Pakistan: సమర్థవంతమైన ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఆసియా కప్‌లో మరోసారి జెండా పాతేందుకు సిద్ధమైంది. లీగ్ దశతో పాటు నాకౌట్ పోరులోనూ పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా టీమిండియా మైదానంలోకి దిగనుంది. అభిమానులకు మాత్రం ఈ సెప్టెంబర్ నెలలో క్రికెట్ విందు ఖాయంగా కనిపిస్తోంది.

IND vs PAK: ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఒకే నెలలో 2సార్లు భారత్, పాక్ పోరు.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
Ind Vs Pak Match
Venkata Chari
|

Updated on: Aug 09, 2026 | 2:49 PM

Share

IND vs PAK: భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానులకు పండగే. ఈ రెండు చిరకాల ప్రత్యర్థుల మధ్య మరో బిగ్ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. మహిళల టీ20 ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల కావడంతో క్రీడా ప్రపంచంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మెగా టోర్నీలో ఏకంగా రెండుసార్లు ఇరుజట్లు తలపడే అరుదైన అవకాశం లభించనుంది.

దుబాయ్ మైదానంలో సెప్టెంబర్ 5న తొలి సమరం..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముహూర్తం ఖరారైంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మహిళల టీ20 ఆసియా కప్ టోర్నీ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనుంది. అన్ని మ్యాచ్‌లకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. గ్రూప్-ఎ లో భారత్, పాకిస్తాన్ జట్లతో పాటు థాయిలాండ్, హాంగ్‌కాంగ్ జట్లు చోటు దక్కించుకున్నాయి. సెప్టెంబర్ 5వ తేదీన భారత్, పాకిస్తాన్ మధ్య లీగ్ దశ పోరు జరగనుంది. ఈ హైవోల్టేజ్ పోరును తిలకించేందుకు అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎక్కువమంది చదివినది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?

ఇవి కూడా చదవండి

రెండోసారి పోరుకు ఎలా అవకాశం ఉందంటే?

ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య రెండో మ్యాచ్ ఖాయం కాకపోయినా, ఇరుజట్ల నైపుణ్యం చూస్తే అది దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. టోర్నమెంట్ నిబంధనల ప్రకారం ప్రతీ గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. భారత జట్టుతో పాటు పాకిస్తాన్ కూడా తమ గ్రూప్‌లో అద్భుత ప్రదర్శన చేసి సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే ఇరుజట్ల మధ్య మరోసారి హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంటుంది. నైపుణ్యం పరంగా చూస్తే భారత్, పాకిస్తాన్ జట్లు తమ గ్రూప్‌లో మిగిలిన జట్ల కంటే బలంగా ఉన్నాయి. దీంతో నాకౌట్ బెర్త్‌లు సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

సెమీఫైనల్ లేదా ఫైనల్లో మరోసారి..

సెమీఫైనల్ పోరు సెప్టెంబర్ 10, 11 తేదీల్లో జరగనుండగా, టైటిల్ పోరు సెప్టెంబర్ 13న నిర్వహించనున్నారు. గ్రూప్ దశ ఫలితాలు, పాయింట్ల పట్టికలోని స్థానాల ఆధారంగా సెమీఫైనల్ సమీకరణాలు మారుతాయి. ఒకవేళ ఇరుజట్లు వేర్వేరు సెమీఫైనల్స్ ఆడి గెలిస్తే, సెప్టెంబర్ 13న జరిగే ఫైనల్ పోరులో ముఖాముఖి తలపడతాయి. లేదా సెమీఫైనల్లోనే నేరుగా ఢీకొట్టే అవకాశమూ ఉంటుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ నెలలో అభిమానులకు రెండుసార్లు ఈ క్రికెట్ సమరాన్ని వీక్షించే అరుదైన అవకాశం దక్కుతుంది.

ఎక్కువమంది చదివినది: ఇది ఇండియన్ టీమా లేక హాస్పిటల్ వార్డా..? ఆ దెబ్బకు రంగంలోకి బిగ్ బాస్..!

టోర్నీలో టీమిండియా ఆధిపత్యం..

మహిళల ఆసియా కప్ చరిత్రలో భారత జట్టు అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు ఏడుసార్లు విజేతగా నిలిచిన టీమిండియా ఈసారి కూడా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సెప్టెంబర్ 5న జరిగే తొలి పోరులో విజయం సాధించి నాకౌట్ దశకు సులువుగా చేరుకోవాలని భావిస్తోంది. గతంలో కూడా పాకిస్తాన్‌పై భారత జట్టుకే మెరుగైన రికార్డు ఉంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లలో టీమిండియా ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలని అభిమానులు ఆత్రుతగా ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us