భారత క్రికెట్ జట్టు
క్రికెట్ భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందిన క్రీడ. అందుకే భారత్ను క్రికెట్ దేశంగా పిలుస్తుంటారు. క్రికెట్లో కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ నుంచి వీవీఎస్ లక్ష్మణ్ వరకు భారత క్రికెట్ను సరికొత్త శిఖరాలకు చేర్చారు. అలాగే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్లు ప్రస్తుతం భారత క్రికెట్ను ఏలుతున్నారు. టీమిండియా ఇప్పటివరకు మూడు ప్రపంచకప్లను గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ తొలిసారి వన్డే ప్రపంచకప్ను గెలుచుకుంది. ఆ తర్వాత 2007లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ తొలి టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకోగా, 2011లో అతని నాయకత్వంలో సరిగ్గా 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా ప్రపంచంలోని బలమైన జట్లలో ఒకటిగా మారింది. అయితే, ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు రోహిత్ శర్మ సారథిగా వ్యవహరిస్తున్నాడు. కాగా, టీ20, వన్డే ఫార్మాట్లో మాత్రం అప్పుడప్పుడూ సారథ్యంలో మార్పులు చూస్తూనే ఉన్నాం.
ధోనీ వర్సెస్ కోహ్లీ.. నెట్వర్త్లో అసలు కింగ్ ఎవరు.. లెక్కలు చూస్తే ఔరా అనాల్సిందే..?
MS Dhoni vs Virat Kohli Net Worth: మైదానంలో కెప్టెన్సీ, ఫినిషింగ్ స్టైల్లో ధోనీ రూటే వేరైనా, కమర్షియల్ మార్కెట్, నెట్ వర్త్ రేసులో మాత్రం కింగ్ కోహ్లీ స్వల్ప ఆధిక్యంతో దూసుకుపోతున్నాడు. ఏదేమైనా, ఈ ఇద్దరు లెజెండ్స్ భారత క్రీడా రంగాన్ని ఆర్థికంగానూ సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లారనడంలో ఎలాంటి సందేహం లేదు.
- Venkata Chari
- Updated on: Jun 18, 2026
- 7:50 am
ఐర్లాండ్ టూర్కి ముందే షాకింగ్ న్యూస్.. సిరాజ్, తిలక్ వర్మలకు లీగల్ నోటీసులు.. ఎందుకంటే?
Tilak Varma Legal Notice: అటు సినిమా, ఇటు క్రికెట్ రంగాల్లోని టాప్ సెలబ్రిటీలకు నోటీసులు అందడంతో ఈ ఇష్యూ నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్గా మారింది. బీసీసీఐ అనుమతి లేని లీగ్ వివాదం ఎటు దారితీస్తుందో, దీనిపై సిరాజ్, తిలక్ వర్మతో పాటు టాలీవుడ్ హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.
- Venkata Chari
- Updated on: Jun 17, 2026
- 10:06 pm
12 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన స్మృతి, షెఫాలీ జోడీ.. జస్ట్ 2 అడుగుల దూరంలో మరొకటి మిస్..!
Highest Opening Partnership for India: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ అందించిన ఈ మెరుపు ఆరంభంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. ప్రపంచకప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఇలాంటి రికార్డు బ్రేకింగ్ ప్రదర్శనలు టీమిండియా తదుపరి దశ ప్రయాణాన్ని మరింత సులువు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
- Venkata Chari
- Updated on: Jun 17, 2026
- 8:14 pm
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్తోపాటు తెలుగోడు ఔట్.. రంగంలోకి ముగ్గుర్ని దింపిన గంభీర్..?
ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతోన్న వన్డే సిరీస్లో స్టార్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి గాయాల పాలు కావడం టీమిండియాను తీవ్ర ఆందోళనలో పడేసింది. ఈ నేపథ్యంలో, 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నీని దృష్టిలో ఉంచుకుని మేనేజ్మెంట్ ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టింది. హార్దిక్, నితీష్లకు బ్యాకప్గా జట్టులోకి రాగల ఆ ముగ్గురు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
- Venkata Chari
- Updated on: Jun 17, 2026
- 6:51 pm
Team India: 12 సిక్స్లు, 45 ఫోర్లతో 400 పరుగులు.. ఆస్ట్రేలియాకే సాధ్యంకాని రికార్డ్లో భారత్..
లక్నో వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత యువ సింహాలు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ లక్నో పిచ్పై పరుగుల తుఫాన్ సృష్టించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఇద్దరూ భారీ శతకాలతో చెలరేగడంతో భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 402 పరుగుల హిమాలయ సమానమైన భారీ స్కోరు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.
- Venkata Chari
- Updated on: Jun 17, 2026
- 5:36 pm
Video: బొద్దుగా ఉన్నాడు, ఫీల్డింగ్కు పనికిరాడంటూ విమర్శలు.. కళ్లు చెదిరే క్యాచ్తో ఇచ్చిపడేసిన బుడ్డోడు
Vaibhav Sooryavanshi catch video: విమర్శలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, మైదానంలో ప్రతిభతోనే సమాధానం చెప్పాలనే విషయాన్ని వైభవ్ సూర్యవంశీ మరోసారి నిరూపించాడు. ఈ ఫ్లయింగ్ క్యాచ్ అతనిలోని అంకితభావాన్ని, ఫిట్నెస్ను చాటిచెప్పింది. రాబోయే మ్యాచ్ల్లో బ్యాటింగ్లోనూ రాణించి భారత్ వన్డే జట్టులో ఈ యువ సంచలనం చోటు దక్కించుకోవాలని ఆశిద్దాం.
- Venkata Chari
- Updated on: Jun 17, 2026
- 5:38 pm
Video: ఇటు ప్రిన్స్.. అటు ఛోటా ప్యాకెట్.. సెంచరీలతో ఆఫ్ఘాన్ తాట తీసిన ఫ్యూచర్ జోడీ..!
భారత యువ క్రికెట్ సంచలనాలు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ మైదానంలో పరుగుల వరద పారించారు. ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఇద్దరూ ఒకేసారి చెలరేగిపోయి అద్భుత శతకాలతో రికార్డుల ఊచకోత కోశారు. కేవలం 33 ఓవర్లలోనే భారత్ 2 వికెట్ల నష్టానికి 266 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్పై పూర్తి పట్టు సాధించింది.
- Venkata Chari
- Updated on: Jun 17, 2026
- 4:12 pm
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్మ్యాన్.. ఆ స్పెషల్ క్లబ్లోకి రోహిత్ శర్మ..!
India vs Afghanistan 2nd ODI: రోహిత్ శర్మ సాధించిన ఈ ఘనత అతని నిలకడకు, క్లాస్కు నిదర్శనం. ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ ఓపెనర్గా తన స్థానాన్ని అతను మరోసారి సుస్థిరం చేసుకున్నాడు. కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా, వ్యక్తిగత రికార్డులతో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న హిట్మ్యాన్ ఫామ్ టీమిండియాకు రాబోయే టోర్నమెంట్లలో కొండంత బలాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
- Venkata Chari
- Updated on: Jun 17, 2026
- 2:49 pm
స్వ్కాడ్లో ఉన్నా ఈ నలుగురికి నో ఛాన్స్.. సిరీస్ మొత్తం వాటర్ బాయ్స్గానే ఫిక్స్.. లిస్ట్లో వైభవ్?
India vs Ireland T20 series 2026: టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు మళ్లీ పొట్టి ఫార్మాట్కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్లో తలపడుతున్న భారత్, ఆ వెంటనే ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే, ప్రకటించిన 16 మంది సభ్యుల జట్టులో ఐదుగురు ఆటగాళ్లకు మాత్రం తుది జట్టులో చోటు దక్కడం గగనంగానే మారేలా కనిపిస్తోంది.
- Venkata Chari
- Updated on: Jun 17, 2026
- 3:33 pm
Video: క్యా సీన్ హై.. వైభవ్ సూర్యవంశీ కోసం వచ్చిన 80 ఏళ్ల దిగ్గజ క్రికెటర్.. ఏకంగా 161 కిలోమీటర్లు జర్నీ చేసి మరీ..!
Vaibhav Sooryavanshi - Anura Tennekoon: క్రికెట్ మైదానంలో రికార్డులు రావడం, పోవడం సహజం. కానీ కొన్ని సంఘటనలు మాత్రం అభిమానుల గుండెల్లో నిలిచిపోతాయి. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని కలవడానికి, ఆ దేశ తొలి వన్డే కెప్టెన్, 80 ఏళ్ల అనుర తెన్నెకూన్ ఏకంగా 161 కిలోమీటర్లు ప్రయాణించి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
- Venkata Chari
- Updated on: Jun 16, 2026
- 9:26 pm
INDA vs SLA: వైభవ్ సూర్యవంశీతో గొడవ.. దోషిగా తేలిన శ్రీలంక ప్లేయర్.. మరో సీనియర్కు తప్పని శిక్ష..!
Vishen Halambage Fined: మైదానంలో దూకుడు ప్రదర్శించడం సహజమే అయినా, అది వ్యక్తిగత దూషణలు, తోపులాటల వరకు వెళ్లడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. శ్రీలంక ఆటగాడిపై జరిమానా పడటంతో ఈ వివాదానికి ప్రస్తుతానికి తెరపడినట్లయింది. భారత యువ ఆటగాళ్లు ఇకనైనా లంక క్రీడాకారుల స్లెడ్జింగ్ వ్యూహాలకు చిక్కకుండా, బ్యాట్, బంతితోనే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- Venkata Chari
- Updated on: Jun 16, 2026
- 8:59 pm
IND vs ENG: ఇంగ్లాండ్ టూర్కు భారత జట్టు.. కోహ్లీ, హార్దిక్తో పాటు ఆ ఐదుగురు రీఎంట్రీ.. నలుగురిపై వేటు?
India vs England ODI: భారత క్రికెట్ అభిమానులకు అసలైన మజా మరికొద్ది రోజుల్లో షురూ కానుంది. ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ ముగిసిన వెంటనే టీమ్ ఇండియా ఇంగ్లాండ్ గడ్డపై సవాల్కు సిద్ధమవుతోంది. మిషన్ 2027 వన్డే ప్రపంచకప్ వేటను అధికారికంగా ప్రారంభించేందుకు బీసీసీఐ సరికొత్త వ్యూహాలతో 16 మంది సభ్యుల పటిష్టమైన జట్టును సిద్ధం చేస్తోంది. అందులో ఎవరున్నారో ఓసారి చూద్దాం..
- Venkata Chari
- Updated on: Jun 17, 2026
- 3:28 pm