భారత క్రికెట్ జట్టు

భారత క్రికెట్ జట్టు

క్రికెట్ భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందిన క్రీడ. అందుకే భారత్‌ను క్రికెట్‌ దేశంగా పిలుస్తుంటారు. క్రికెట్‌లో కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ నుంచి వీవీఎస్ లక్ష్మణ్ వరకు భారత క్రికెట్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చారు. అలాగే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్లు ప్రస్తుతం భారత క్రికెట్‌ను ఏలుతున్నారు. టీమిండియా ఇప్పటివరకు మూడు ప్రపంచకప్‌లను గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2007లో ఎంఎస్‌ ధోనీ సారథ్యంలో భారత్‌ తొలి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోగా, 2011లో అతని నాయకత్వంలో సరిగ్గా 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా ప్రపంచంలోని బలమైన జట్లలో ఒకటిగా మారింది. అయితే, ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు రోహిత్ శర్మ సారథిగా వ్యవహరిస్తున్నాడు. కాగా, టీ20, వన్డే ఫార్మాట్‌‌లో మాత్రం అప్పుడప్పుడూ సారథ్యంలో మార్పులు చూస్తూనే ఉన్నాం.

ఇంకా చదవండి

Champions Trophy: ఆ టీమ్‌ డ్రెస్‌ను కాపీ కొట్టారా? పాకిస్తాన్ జట్టు కొత్త జెర్సీపై ట్రోల్స్‌

పాకిస్తాన్ క్రికెట్ జట్టు నిత్యం ఏదో ఒక విధంగా వివాదాల్లో నిలుస్తూ ఉంటోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి స్టేడియాలను రెడీ చేయడంలో జాప్యం, అలాగే టీమ్ సెలక్షన్ తోనూ పాకిస్తాన్ జట్టుపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా దాయాది జట్టు మరోసారి ట్రోలింగ్ కు గురువుతోంది. క్రికెట్ అభిమానులు ఆ జట్టును ఘోరంగా ఎగతాళి చేస్తున్నారు.

Team India: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఎక్స్-ఫాక్టర్ అతనే: ఆసీస్ దిగ్గజం

రికీ పాంటింగ్ శ్రేయాస్ అయ్యర్‌ను టీం ఇండియాకు అత్యంత ముఖ్యమైన బ్యాట్స్‌మన్‌గా అభివర్ణించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌ను పాంటింగ్ ప్రశంసించాడు. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో అతని నైపుణ్యం, వైట్ బాల్ క్రికెట్‌లో విజయానికి తోడ్పడే అతని ఆటశైలిని పాంటింగ్ హైలైట్ చేశాడు. గాయాల తర్వాత తిరిగి రావడం పట్ల పాంటింగ్ సంతోషం వ్యక్తం చేశాడు.

Unbreakable Records: ప్రపంచ క్రికెట్‌లో ఎప్పటికీ బద్దలవ్వని 6 రికార్డులు.. అవేంటో తెలుసా?

Top 6 Cricket Records: క్రికెట్ ప్రపంచంలో దాదాపు అసాధ్యమైన ప్రపంచ రికార్డులు ఆరు ఉన్నాయి. ఇందులో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల నుంచి డాన్ బ్రాడ్‌మాన్ 99.94 బ్యాటింగ్ సగటు వరకు ఇలా ఎన్నో ప్రపంచ రికార్డులు ఉన్నాయి. ఆ వివరాలను ఓసారి తెలుసుకుందాం..

IND vs ENG: ఆడాల్సింది జట్టు కోసం, నీ కోసం కాదు.. భారత స్టార్ బ్యాటర్‌పై గవాస్కర్ ఫైర్

Sunil Gavaskar Key Comments on KL Rahul: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. 9 బంతుల్లో అతని బ్యాట్ నుంచి కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. అతని ఇన్నింగ్స్ తర్వాత, మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ ఈ సీనియర్ ప్లేయర్‌పై విమర్శలు గుప్పించారు.

Team India: తదుపరి భారత వన్డే సారథిగా అతనే.. నాగ్‌పూర్‌లో హింట్ ఇచ్చేసిన ఫ్యూచర్ స్టార్?

Team India Next ODI Captain: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల శకం ముగిసినట్లేనని తెలుస్తోంది. ముఖ్యంగా రోహిత్ ప్రస్తుతం వన్డే సారథిగా ఉన్నాడు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ వారసత్వాన్ని చేపట్టేది ఎవరంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. రోహిత్ వారసుడిగా నేనున్నాడంటూ నాగ్‌పూర్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలిపించిన ప్లేయర్ సవాల్ చేసేశాడు.

Virat Kohli: ఫిట్‌నెస్‌కే పిచ్చెక్కించే కింగ్ కోహ్లీ.. గాయాలతో ఎన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడో తెలిస్తే షాకే?

Virat Kohli Injury: మోకాలి గాయం కారణంగా నాగ్‌పూర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. 1130 రోజుల్లో తొలిసారిగా కోహ్లీ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. తన కెరీర్‌లో ఐదవసారి గాయం కారణంగా కోహ్లీ జట్టుకు దూరమయ్యాడు. అసలు ఎప్పుడెప్పుడు గాయాలతో జట్టుకు దూరమయ్యాడో ఓసారి తెలుసుకుందాం..

IND vs ENG: రోహిత్ దోస్తా లేదా గంభీర్ శిష్యుడా.. కోహ్లీ రాకతో కటక్ వన్డే నుంచి తప్పుకునేది ఎవరు?

Shreyas iyer: ఇంగ్లాండ్‌తో జరిగిన నాగ్‌పూర్ వన్డేలో శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించి టీమిండియాను విజయపథంలో నడిపించాడు. అయితే, ఈ విజయం తర్వాత, తాను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండబోనని వెల్లడించాడు. విరాట్ కోహ్లీ ఫిట్‌గా లేకపోవడం వల్ల తనకు ఆ అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చి షాకిచ్చాడు. దీంతో ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే రెండో వన్డేలో ఎవరు తప్పుకుంటారు?

Team India: ధోని నుంచి సచిన్ వరకు.. ఈ 5 భారీ రికార్డులు బద్దలయ్యే ఛాన్స్.. అవేంటంటే?

5 Records May Broken in IND vs ENG ODI Series: భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఈ సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అనేక భారీ రికార్డులను బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..

యశస్వి జైస్వాల్ వల్లే విరాట్ కోహ్లీని తొలగించారా.. మధ్యలో గిల్ ఎందుకు బలయ్యాడు?

ఇంగ్లాండ్‌తో జరిగే తొలి వన్డే నుంచి విరాట్ కోహ్లీని తప్పించారు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌కు కూడా సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో జట్టులో స్థానం కల్పించలేదు. ఈ మ్యాచ్ ద్వారా యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర కారణం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

IND vs ENG 1st ODI: తొలి వన్డేలో భారత్ ఘన విజయం.. హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, అయ్యర్, అక్షర్..

India vs England1st ODI Result: నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు సూనాయసంగా గెలిచింది. ఇంగ్లండ్ అందించిన 249 పరుగుల లక్ష్యాన్ని కేవలం 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ 87, శ్రేయాస్ అయ్యర్ 59, అక్షర్ పటేల్ 52 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు పడగొట్టారు.