భారత క్రికెట్ జట్టు
క్రికెట్ భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందిన క్రీడ. అందుకే భారత్ను క్రికెట్ దేశంగా పిలుస్తుంటారు. క్రికెట్లో కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ నుంచి వీవీఎస్ లక్ష్మణ్ వరకు భారత క్రికెట్ను సరికొత్త శిఖరాలకు చేర్చారు. అలాగే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్లు ప్రస్తుతం భారత క్రికెట్ను ఏలుతున్నారు. టీమిండియా ఇప్పటివరకు మూడు ప్రపంచకప్లను గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ తొలిసారి వన్డే ప్రపంచకప్ను గెలుచుకుంది. ఆ తర్వాత 2007లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ తొలి టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకోగా, 2011లో అతని నాయకత్వంలో సరిగ్గా 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా ప్రపంచంలోని బలమైన జట్లలో ఒకటిగా మారింది. అయితే, ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు రోహిత్ శర్మ సారథిగా వ్యవహరిస్తున్నాడు. కాగా, టీ20, వన్డే ఫార్మాట్లో మాత్రం అప్పుడప్పుడూ సారథ్యంలో మార్పులు చూస్తూనే ఉన్నాం.
అర్ష్దీప్ సింగ్కు ఏమైంది.. ఏకంగా 200లకుపైగా పోస్ట్లు డిలీట్.. అసలు రీజన్ అదేనా..?
Arshdeep Singh Instagram Posts Deleted: మైదానంలో ఆటపై కంటే సోషల్ మీడియాపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారనే విమర్శలు రావడం ఏ ఆటగాడికైనా మంచిది కాదు. బహుశా అర్ష్దీప్ సింగ్ కూడా తన తప్పులను తెలుసుకొని, ఇకపై వివాదాలకు దూరంగా ఉంటూ కేవలం తన క్రికెట్ కెరీర్పైనే పూర్తి దృష్టి పెట్టాలని భావించే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
- Venkata Chari
- Updated on: May 26, 2026
- 3:11 pm
Video: టీ20ల్లో 200 బాదడమే నా టార్గెట్..: కెవిన్ పీటర్సన్ ఛాలెంజ్లో వైభవ్ సూర్యవంశీ
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ భవిష్యత్తు నెక్స్ట్ జనరేషన్ స్టార్గా మారుతున్న వైభవ్ సూర్యవంశీ ప్రతిభకు ఈ ఛాలెంజ్ ఒక నిదర్శనంగా నిలిచింది. వంద మైళ్ల వేగంతో దూసుకొచ్చే బంతులను కూడా ఒక అనుభవజ్ఞుడైన సీనియర్ బ్యాటర్ లాగా ఆడిన తీరు నిజంగా ప్రశంసనీయం. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్లో వైభవ్ మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
- Venkata Chari
- Updated on: May 25, 2026
- 7:01 pm
Team India: ‘వాళ్లంతా తోపులేమో’.. ఒక్క మాటతో ఇచ్చిపడేసిన సూర్యకుమార్ యాదవ్..!
సూర్యకుమార్ యాదవ్ తనపై వస్తున్న గాయం పుకార్లను పటాపంచలు చేసినప్పటికీ, అసలైన సవాలు మునుముందు ఉంది. ఫామ్ లేమి, వయసుపై పడటం, మరియు యువ ఆటగాళ్ల నుంచి వస్తున్న పోటీ అతనికి కఠిన పరీక్షగా మారాయి. మైదానంలో తన విలక్షణమైన ఆటతో అభిమానులను అలరించే ఈ 'మిస్టర్ 360' ఆటగాడు, రాబోయే అంతర్జాతీయ మ్యాచ్ల్లో సెలెక్టర్ల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటాడో చూడాలి.
- Venkata Chari
- Updated on: May 25, 2026
- 6:43 pm
‘పద్మశ్రీ’ అందుకున్న లేడీ రోహిత్.. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారం..!
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. దేశంలోనే నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ అవార్డును ఆమె అందుకున్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఘనమైన వేడుకలో గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా హర్మన్ప్రీత్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు.
- Venkata Chari
- Updated on: May 25, 2026
- 6:15 pm
రెండో పెళ్లికి హార్దిక్ పాండ్యా రెడీ.. ఇన్స్టా ‘పింక్’ స్టోరీతో రివీల్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Hardik Pandya Mahikaa Sharma Marriage: మైదానంలో తన ఆటతోనే కాకుండా, వ్యక్తిగత విషయాలతోనూ ఎప్పుడూ వార్తల్లో ఉండే హార్దిక్ పాండ్యా, ఈసారి తన రెండో పెండ్లి వార్తలతో టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు. ఇన్స్టా స్టోరీ ద్వారా వ్యక్తమవుతున్న ఈ సంకేతాలు నిజమై జులై 7న ఆయన పెండ్లి పీటలు ఎక్కుతాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
- Venkata Chari
- Updated on: May 25, 2026
- 4:52 pm
IPL 2026: యార్కర్ కింగ్ కెరీర్లోనే చెత్త సీజన్.. 10 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా..!
Jasprit Bumrah Worst Season: భారత జట్టుకు బుమ్రా ఎంత కీలకమైన ఆటగాడో అందరికీ తెలిసిందే. అందుకే అతని శారీరక దృఢత్వాన్ని కాపాడేందుకు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ సిరీస్తో పాటు వన్డే సిరీస్ నుంచి కూడా బుమ్రాకు పూర్తి విశ్రాంతి కల్పించారు.
- Venkata Chari
- Updated on: May 24, 2026
- 4:58 pm
Team India: టీమిండియా టీ20 జట్టు కెప్టెన్గా తెలుగోడు..? బీసీసీఐ స్కెచ్ అదుర్స్..!
India Next T20 Captain: తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ, కెప్టెన్గా జట్టును నడిపించే అవకాశం రావడం చాలా అరుదు. ఇప్పుడు తిలక్ వర్మ రూపంలో ఆ సువర్ణ అవకాశం మనకు దక్కబోతోంది. మరి ఈ యువ సంచలనం తన అద్భుతమైన ప్రదర్శనతో, నాయకత్వంతో భారత క్రికెట్ను కొత్త ఎత్తులకు తీసుకెళ్తాడో లేదో చూడాలి.
- Venkata Chari
- Updated on: May 24, 2026
- 4:29 pm
Video: ఇది రా రోహిత్ అంటే.. లేడీ ఫ్యాన్కి సారీ చెబుతూ వీడియో.. అసలు మ్యాటర్ తెలిస్తే సెల్యూట్ చేస్తారంతే..!
Rohit Sharma Fan Girl at Eden Gardens Kolkata: భారత క్రికెట్ దిగ్గజం, హిట్మ్యాన్ రోహిత్ శర్మ మైదానంలోనే కాదు, నిజజీవితంలోనూ తన అభిమానుల పట్ల ఎంతటి ప్రేమను కనబరుస్తాడో మరోసారి నిరూపితమైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో తనను కలవలేక ఏడ్చేసిన ఒక మహిళా అభిమాని ఆవేదనను చూసి చలించిపోయిన రోహిత్, ఆమెకు ప్రత్యేకంగా క్షమాపణలు చెబుతూ పంపిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
- Venkata Chari
- Updated on: May 23, 2026
- 4:35 pm
శ్రేయస్ అయ్యర్ అంటే పిచ్చి.. ఆయనతో డేటింగ్ చేయాలని ఉంది.. షాకిచ్చిన బిగ్ బాస్ విన్నర్..!
Sana Makbul vs Shreyas Iyer: క్రికెట్, సినీ ప్రపంచాల మధ్య బంధం ఈనాటిది కాదు. పిచ్పై ఆటగాళ్ల సిక్సర్లకు మైదానంలో ఫ్యాన్స్ ఫిదా అయితే, కొందరు భామలు మాత్రం వారి వ్యక్తిత్వానికి క్లీన్ బౌల్డ్ అయిపోతుంటారు. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్, ఐపీఎల్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రేమలో పడిపోయానంటూ బాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఓటీటీ విజేత సనా మక్బూల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
- Venkata Chari
- Updated on: May 23, 2026
- 1:45 pm
Team India: రిటైర్మెంట్తో షాకిచ్చిన టీమిండియా 3డీ ప్లేయర్.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్..!
Team India Player Vijay Shankar Retirement: భారత ఆల్రౌండర్ విజయ్ శంకర్ విరిటైర్మెంట్ నిర్ణయంతో ఒక విలక్షణమైన ఆల్రౌండర్ భారత క్రికెట్ ప్రయాణం ముగిసింది. తీవ్రమైన పోటీ ఉండే భారత క్రీడారంగంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన శంకర్.. తనదైన శైలిలో ముద్ర వేశాడు.
- Venkata Chari
- Updated on: May 22, 2026
- 7:07 pm
Video: ‘ఇక నువ్ మారవా.. సొంత జట్టు ఆటగాడిపై ఈ పైత్యం ఏంది.. ఆ టీమిండియా ప్లేయర్ను నిషేధించండి’
Arshdeep Singh Controversy: సౌమ్యుడిగా పేరు తెచ్చుకోవాల్సిన అంతర్జాతీయ క్రికెటర్, ఇలా వరుస వివాదాలతో వార్తల్లో నిలవడం క్రీడా స్ఫూర్తికే విరుద్ధం. మైదానంలో రాణించడమే కాకుండా, తోటి ఆటగాళ్లకు గౌరవం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని అర్ష్దీప్ సింగ్ లాంటి సీనియర్ ఆటగాళ్లు గుర్తిస్తేనే వారి కెరీర్కు, జట్టుకు మంచిది.
- Venkata Chari
- Updated on: May 22, 2026
- 3:48 pm
‘ఎవరున్నా లేకపోయినా.. 2027 ప్రపంచకప్లో ఈ ఇద్దరు ఉంటే చాలు.. ట్రోఫీ టీమిండియాదే..’
ODI World Cup 2027: ఇటీవల అఫ్ఘనిస్తాన్తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో రోహిత్, కోహ్లీల పేర్లు ఉండటం అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. 2027 వరల్డ్ కప్ లక్ష్యంగా వీరు సాగిస్తున్న ఈ ప్రయాణం విజయవంతమై, భారత్కు మరో ప్రపంచ కప్ అందించాలని కోరుకుందాం.
- Venkata Chari
- Updated on: May 22, 2026
- 1:28 pm