భారత క్రికెట్ జట్టు
క్రికెట్ భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందిన క్రీడ. అందుకే భారత్ను క్రికెట్ దేశంగా పిలుస్తుంటారు. క్రికెట్లో కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ నుంచి వీవీఎస్ లక్ష్మణ్ వరకు భారత క్రికెట్ను సరికొత్త శిఖరాలకు చేర్చారు. అలాగే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్లు ప్రస్తుతం భారత క్రికెట్ను ఏలుతున్నారు. టీమిండియా ఇప్పటివరకు మూడు ప్రపంచకప్లను గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ తొలిసారి వన్డే ప్రపంచకప్ను గెలుచుకుంది. ఆ తర్వాత 2007లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ తొలి టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకోగా, 2011లో అతని నాయకత్వంలో సరిగ్గా 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా ప్రపంచంలోని బలమైన జట్లలో ఒకటిగా మారింది. అయితే, ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు రోహిత్ శర్మ సారథిగా వ్యవహరిస్తున్నాడు. కాగా, టీ20, వన్డే ఫార్మాట్లో మాత్రం అప్పుడప్పుడూ సారథ్యంలో మార్పులు చూస్తూనే ఉన్నాం.
Cricketers Who Changed Their Religion: మతం మార్చిన ఐదుగురు క్రికెటర్లు.. లిస్ట్లో మనోడు కూడా..!
Five Cricketers Who Changed Their Religion: క్రికెట్ ప్రపంచంలో రన్స్, వికెట్లు మాత్రమే కాదు.. ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలు కూడా చర్చకు వస్తుంటాయి. ముఖ్యంగా మత మార్పులు వంటి నిర్ణయాలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. కొందరు ప్రేమ కోసం, మరికొందరు నమ్మకాల కోసం తమ మతాన్ని మార్చుకున్నారు.
- Venkata Chari
- Updated on: Mar 17, 2026
- 8:50 pm
టీమిండియా తదుపరి హెడ్ కోచ్ ఆయనే.. నా వారసుడు ఇదిగో అంటూ గంభీర్ షాకింగ్ కామెంట్స్..!
Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎప్పుడూ గంభీరంగానే కనిపిస్తారు. కానీ, ఇటీవల భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచిన వేళ ఆయన ముఖంలో విరిసిన చిరునవ్వు నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఎంఎస్ ధోనీ చేసిన ఒక కామెంట్, దానికి గంభీర్ ఇచ్చిన అదిరిపోయే రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
- Venkata Chari
- Updated on: Mar 17, 2026
- 3:23 pm
Shivam Dube: వామ్మో.. రూ.27.5 కోట్లతో ఫ్లాట్లు కొన్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ హీరో.. లగ్జరీ లైఫ్ చూశారా?
Shivam Dube Mumbai Flats: టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించిన శివమ్ దూబే ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచాడు. సెమీఫైనల్, ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఈ ఆల్రౌండర్ ముంబైలో కోట్ల విలువైన రెండు లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేయడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
- Venkata Chari
- Updated on: Mar 13, 2026
- 2:15 pm
Sanju Samson: సంజూ ఎక్కడ?.. గిల్ పోస్ట్పై అభిమానుల ఆగ్రహం.. ఇంకా నీ తిక్క తగ్గలేదా బ్రో అంటూ..
Shubman Gill Instagram photo controversy: టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత సోషల్ మీడియాలో కొత్త వివాదం మొదలైంది. భారత బ్యాటర్ శుభ్మన్ గిల్ పోస్ట్ చేసిన “ఛాంపియన్స్” ఫొటోలో సంజూ శాంసన్ కనిపించకపోవడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. కీలక పాత్ర పోషించిన ఆటగాడిని ఎందుకు చూపలేదంటూ గిల్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- Venkata Chari
- Updated on: Mar 13, 2026
- 12:54 pm
Team India: టీమిండియా ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. ట్రోఫీ ఎఫెక్ట్తో ఏకంగా ఐదుగురు రిటైర్మెంట్?
Team India Players Retirement News: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ చారిత్రక విజయం సాధించిన తర్వాత టీమిండియాలో కీలక మార్పులు రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో కొంతమంది సీనియర్ క్రికెటర్లు త్వరలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
- Venkata Chari
- Updated on: Mar 13, 2026
- 11:43 am
‘అలాంటోడు మా జట్టులో ఉంటే ట్రోఫీ మాదే.. టీమిండియాలో ఉన్నందుకు కుళ్లి కుళ్లి ఏడుస్తున్నాం..’
Michael Vaughan Hails Jasprit Bumrah: టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా విజయంలో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించారు. సెమీ-ఫైనల్, ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మైఖేల్ వాన్ బుమ్రాను ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్గా కితాబిచ్చారు. లియోనో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలతో పోలుస్తూ, బుమ్రా ఏ జట్టులో ఉంటే ఆ జట్టు ప్రపంచ కప్ గెలుస్తుందని అభిప్రాయపడ్డాడు.
- Venkata Chari
- Updated on: Mar 13, 2026
- 10:40 am
నేను రెడీ.. ప్రపంచ ఛాంపియన్ సంజూకి బీసీసీఐకి అదిరిపోయే న్యూస్.. ఇకపై కొత్త పాత్రలో బ్యాడ్ లక్కోడు..?
Sanju Samson Captaincy: 2026 టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాలో కేరళ స్టార్ సంజు శాంసన్ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. రిజర్వ్ బెంచ్ నుంచి వచ్చి వరుస హాఫ్ సెంచరీలతో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంజుపై బీసీసీఐ (BCCI) ఇప్పుడు ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. భారత క్రికెట్ భవిష్యత్తులో అతను అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- Venkata Chari
- Updated on: Mar 13, 2026
- 9:56 am
నీ స్మైల్ అదుర్స్.. కానీ, డగౌట్లో ఎందుకంత సీరియస్.. ధోని ప్రశ్నకు గంభీర్ షాకింగ్ ఆన్సర్..!
Gautam Gambhir Comments India Dugout: టీ20 వరల్డ్ కప్ 2026 విజయం అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. భారత జట్టు డగౌట్లో ఎందుకు ఆటగాళ్లు, కోచ్లు ఎక్కువగా నవ్వరు అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రపంచ కప్ వంటి టోర్నీలలో ఒత్తిడి ఎంతగా ఉంటుందో వివరించారు.
- Venkata Chari
- Updated on: Mar 13, 2026
- 8:18 am
‘మరో 5 ఏళ్లు టీమిండియా జోలికి పోకండి.. కరెంట్ షాక్ కంటే పవర్ ఫుల్.. మాడి మసైపోతారంతే..’
Viv Richards on Team India: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించిన నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ వివ్ రిచర్డ్స్ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ ఆటను మరో స్థాయికి తీసుకెళ్లిందని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
- Venkata Chari
- Updated on: Mar 13, 2026
- 7:10 am
ఫెయిల్యూర్ అంటూ ఛీకొట్టారు.. కట్చేస్తే.. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్తో ఇచ్చిపడేసిన ఫ్యూచర్ స్టార్?
Shubman Gill Cricketer of the Year: టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో చోటు దక్కకపోయినా భారత స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్కు పెద్ద గౌరవం దక్కనుంది. బీసీసీఐ నిర్వహించే నామన్ అవార్డ్స్లో ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఆయనకు లభించనుందని నివేదికలు వెల్లడించాయి. గిల్ ప్రదర్శనలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వనున్నారు.
- Venkata Chari
- Updated on: Mar 12, 2026
- 1:50 pm
Goutam gambhir: ట్రోఫీ గెలిచాక గౌతమ్ గంభీర్ చెప్పిన తొలి మాట ఇదే..: సూర్యకుమార్ యాదవ్
టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఘన విజయం సాధించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన భావోద్వేగ క్షణాలను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. జట్టు విజయానంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ప్రేరణాత్మక ప్రసంగం ఆటగాళ్లను మరింత ఉత్సాహపరిచిందని ఆయన తెలిపారు.
- Venkata Chari
- Updated on: Mar 12, 2026
- 1:25 pm
Team India: ఆ తోపును తప్పించడం నా తప్పే.. ప్లేయింగ్ 11 వివాదంపై సారీ చెప్పిన సూర్యకుమార్ యాదవ్
Suryakumar Playing XI Decision: టీ20 వరల్డ్ కప్ 2026లో దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో అక్షర్ పటేల్ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించడం తన తప్పేనని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంగీకరించారు. ఆ నిర్ణయం తర్వాత అక్షర్ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారని, తాను వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పినట్టు వెల్లడించారు.
- Venkata Chari
- Updated on: Mar 12, 2026
- 1:00 pm