
భారత క్రికెట్ జట్టు
క్రికెట్ భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందిన క్రీడ. అందుకే భారత్ను క్రికెట్ దేశంగా పిలుస్తుంటారు. క్రికెట్లో కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ నుంచి వీవీఎస్ లక్ష్మణ్ వరకు భారత క్రికెట్ను సరికొత్త శిఖరాలకు చేర్చారు. అలాగే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్లు ప్రస్తుతం భారత క్రికెట్ను ఏలుతున్నారు. టీమిండియా ఇప్పటివరకు మూడు ప్రపంచకప్లను గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ తొలిసారి వన్డే ప్రపంచకప్ను గెలుచుకుంది. ఆ తర్వాత 2007లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ తొలి టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకోగా, 2011లో అతని నాయకత్వంలో సరిగ్గా 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా ప్రపంచంలోని బలమైన జట్లలో ఒకటిగా మారింది. అయితే, ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు రోహిత్ శర్మ సారథిగా వ్యవహరిస్తున్నాడు. కాగా, టీ20, వన్డే ఫార్మాట్లో మాత్రం అప్పుడప్పుడూ సారథ్యంలో మార్పులు చూస్తూనే ఉన్నాం.
Team India: భారత ఏ జట్టులో సీనియర్ ఆటగాళ్లు.. ఐపీఎల్ తర్వాత ఏ జట్టుతో ఢీ కొట్టనున్నారంటే?
ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజుల తర్వాత, భారత క్రికెట్లో వర్ధమాన స్టార్ ఇండియా-ఎ జట్టుతో ఇంగ్లాండ్లో పర్యటిస్తారు. ఇండియా ఎ జట్టు ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో రెండు 4 రోజుల మ్యాచ్లలో తలపడనుంది. ఇండియా-ఎ , ఇంగ్లాండ్ లయన్స్ మధ్య ఈ మ్యాచ్లు మే 30 నుంచి జూన్ 6 వరకు కాంటర్బరీలోని సెయింట్ లారెన్స్లోని స్పిట్ఫైర్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతాయి.
- Venkata Chari
- Updated on: Mar 25, 2025
- 11:11 pm
Team India: ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్ ఇదే.. తొలిసారి ఆ వేదికలో మ్యాచ్ ఆడనున్న భారత్
వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో భారత క్రికెట్ జట్టు స్వదేశీ సిరీస్ల షెడ్యూల్ వెల్లడైంది. మార్చి 22న జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్లు, సౌతాఫ్రికాతో వన్డే, టెస్ట్, టీ20 సిరీస్లు ఆడనుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- Venkata Chari
- Updated on: Mar 22, 2025
- 5:10 pm
Cricket vs other Sports: విరాట్ ఒక్కడే కాదు మేము కూడా ప్లేయర్లమే! ఇండియన్ బాక్సర్ బోల్డ్ కామెంట్స్
భారత బాక్సర్ గౌరవ్ బిధురి, క్రికెట్కు లభించే గుర్తింపుతో పోలిస్తే ఇతర క్రీడల పరిస్థితిని ఎత్తిచూపాడు. బాక్సింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో అథ్లెట్లు సరైన స్పాన్సర్షిప్, మీడియా కవరేజ్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఒలింపిక్ క్రీడలకు భారతదేశంలో మరింత ప్రాధాన్యత అవసరమని, క్రీడా విధానంలో సమానత రావాలని బిధురి అభిప్రాయపడ్డాడు. అథ్లెట్ల విజయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సరైన ఆర్థిక మద్దతు అవసరమని ఇతర క్రీడాకారులు కూడా పేర్కొన్నారు.
- Narsimha
- Updated on: Mar 22, 2025
- 9:59 am
WTC 2027: డబ్ల్యూటీసీ పాయింట్లలో కీలక మార్పులు.. భారత్, ఇంగ్లండ్ సిరీస్తో కొత్త విధానం.. అదేంటంటే?
ICC World Test Championship 2027: ప్రస్తుత నిబంధనల ప్రకారం, టెస్ట్ మ్యాచ్ గెలిచిన జట్టుకు 12 పాయింట్లు లభిస్తాయి. టై అయితే, రెండు జట్లకు చెరో 6 పాయింట్లు, డ్రా అయితే చెరో 4 పాయింట్లు లభిస్తాయి. అయితే, ఒక కొత్త నివేదిక ప్రకారం, ఒక జట్టు పెద్ద తేడాతో లేదా ఇన్నింగ్స్ తేడాతో గెలిస్తే, దానికి అదనపు బోనస్ పాయింట్లు ఇవ్వనున్నారంట.
- Venkata Chari
- Updated on: Mar 21, 2025
- 9:49 pm
Yuvraj Singh: మరోసారి కెప్టెన్గా యువరాజ్.. భారత జట్టులో చేరిన శిఖర్ ధావన్.. బరిలోకి ఎప్పుడంటే?
World Championship of Legends: యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్ వంటి భారత క్రికెట్ స్టార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ మొదటి ఎడిషన్లో అద్భుతంగా రాణించారు. ఈ క్రికెటర్లకు ఆట పట్ల ఉన్న ప్రేమ, అంకితభావం ఇప్పటికీ బలంగా ఉందని ఇది రుజువు చేసింది.
- Venkata Chari
- Updated on: Mar 21, 2025
- 5:20 pm
Champions Trophy: రోహిత్ సేనపై కాసుల వర్షం.. ఏకంగా రూ. 58 కోట్లు ప్రకటించిన బీసీసీఐ.. ఎందుకంటే?
BCCI Cash Prize for Team India: ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న టీం ఇండియాపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. రోహిత్ శర్మ నాయకత్వంలో ఛాంపియన్గా నిలిచిన జట్టుకు బీసీసీఐ రూ.58 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఆటగాళ్లు, కోచింగ్, సపోర్ట్ సిబ్బంది, సెలక్షన్ కమిటీ సభ్యులకు బోర్డు ప్రైజ్ మనీ ప్రకటించింది.
- Venkata Chari
- Updated on: Mar 20, 2025
- 12:10 pm
Video: ఓరినీ ఇరికించావుగా భయ్యా! ఆ ఇద్దరి ప్రేమాయణంపై ఆశ్ కామెంట్స్ వైరల్!
రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ విశ్లేషణలో సచిన్ టెండూల్కర్, శుభ్మాన్ గిల్ పేర్లను ప్రస్తావించడంతో, సారా టెండూల్కర్ పుకార్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. అభిమానులు అశ్విన్ ఉద్దేశపూర్వకంగా సారా గురించి ట్రోలింగ్ చేశాడని చర్చిస్తున్నారు. గతంలో గిల్, సారా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చిన నేపథ్యంలో, ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
- Narsimha
- Updated on: Mar 20, 2025
- 9:17 am
IPL 2025: ఐపీఎల్ 2025 తర్వాత టీమిండియా షెడ్యూల్ ఇదే.. రోహిత్ – కోహ్లీ కూడా బరిలోకి
India vs England Tour: ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు ఐపీఎల్ 2025లో సందడి చేసేందుకు సిద్దమయ్యారు. ఆ తర్వాత భారత జట్టు షెడ్యూల్ వెల్లడైంది. ఇంగ్లండ్ టూర్కి వెళ్లనుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ టూర్కి ముందు భారత ఏ జట్టు కూడా మ్యాచ్లు ఆడనుంది.
- Venkata Chari
- Updated on: Mar 18, 2025
- 11:06 pm
Mohammed Shami: రంజాన్ మాసంలో హోలీ ఆడతావా? మహ్మద్ షమీ కూతురిపై ముస్లిం మత పెద్ద ఆగ్రహం
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూతురు ఐరా ఇటీవల హోలీ వేడుకల్లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీనిపై ప్రముఖ మత గురువు, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.
- Basha Shek
- Updated on: Mar 17, 2025
- 8:51 am
Team India: ఏంటీ! ఈ టీమిండియా క్రికెటర్ సినిమాల్లోనూ నటించాడా? ఎవరో గుర్తు పట్టారా?
సాధారణంగా రిటైరైన క్రికెటర్లు ఎక్కువగా రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ అడుగు పెడుతుంటారు. ఈ మధ్యన శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ తదితర రిటైరైన క్రికెటర్లు టీవీషోలు, సినిమాల్లో కనిపించారు. అయితే ఈ టీమిండియా క్రికెటర్ అరంగేట్రానికి ముందే ఓ సినిమాలో మెరిశాడు.
- Basha Shek
- Updated on: Mar 15, 2025
- 7:19 pm