AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత క్రికెట్ జట్టు

భారత క్రికెట్ జట్టు

క్రికెట్ భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందిన క్రీడ. అందుకే భారత్‌ను క్రికెట్‌ దేశంగా పిలుస్తుంటారు. క్రికెట్‌లో కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ నుంచి వీవీఎస్ లక్ష్మణ్ వరకు భారత క్రికెట్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చారు. అలాగే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్లు ప్రస్తుతం భారత క్రికెట్‌ను ఏలుతున్నారు. టీమిండియా ఇప్పటివరకు మూడు ప్రపంచకప్‌లను గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2007లో ఎంఎస్‌ ధోనీ సారథ్యంలో భారత్‌ తొలి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోగా, 2011లో అతని నాయకత్వంలో సరిగ్గా 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా ప్రపంచంలోని బలమైన జట్లలో ఒకటిగా మారింది. అయితే, ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు రోహిత్ శర్మ సారథిగా వ్యవహరిస్తున్నాడు. కాగా, టీ20, వన్డే ఫార్మాట్‌‌లో మాత్రం అప్పుడప్పుడూ సారథ్యంలో మార్పులు చూస్తూనే ఉన్నాం.

ఇంకా చదవండి

IND vs NZ: కివీస్‌తో తలపడే భారత వన్డే జట్టు.. గంభీర్ ఫేవరేట్ ప్లేయర్ ఔట్..?

India vs New Zealand: జనవరి 11 నుంచి 18, 2026 వరకు జరగనున్న న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత జట్టు దాదాపు ఖరారైనట్లే. ఇందులో శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ టాప్, మిడిల్ ఆర్డర్‌లలో కీలక పాత్రలు పోషించే ఛాన్స్ ఉంది. అయితే, బీసీసీఐ అధికారికంగా టీం ఇండియాను ఇంకా ప్రకటించలేదు.

ఇక చాలు, పోయి రంజీ జట్టుకు కోచ్‌గా పనిచేయ్.. గంభీర్‌పై మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..

India Head Coach: మాంటీ పనేసర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. గంభీర్ అభిమానులు ఆయనకు మద్దతుగా నిలుస్తుండగా, విమర్శకులు మాత్రం పనేసర్ చెప్పింది నిజమేనని అంటున్నారు. ఏది ఏమైనా, రాబోయే టెస్ట్ సిరీస్‌లలో గంభీర్ తన వ్యూహాలతో జట్టును గెలిపించి విమర్శకుల నోళ్లు మూయించాల్సి ఉంది.

టీ20 ప్రపంచకప్‌లో చోటు.. కట్‌చేస్తే.. వరుస హాఫ్ సెంచరీలతో టీమిండియా ఫినిషర్ విశ్వరూపం

Rinku Singh, Vijay Hazare Trophy: ఉత్తరప్రదేశ్ జట్టుకు రింకూ సింగ్ వెన్నెముకగా మారాడు. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో వచ్చి వేగంగా పరుగులు రాబట్టడం ద్వారా ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నాడు. అతని ఫీల్డింగ్ నైపుణ్యాలు కూడా జట్టుకు అదనపు బలాన్ని ఇస్తున్నాయి. రింకూ ఇలాగే రాణిస్తే, విజయ్ హజారే ట్రోఫీలో యూపీ జట్టు నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Team India: టెస్ట్ కోచ్ పదవికి గంభీర్ రాజీనామా.. టీమిండియా స్టైలీష్ బ్యాటర్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్..?

Team India head Coach Gautam Gambhir: టెస్టుల్లో వరుస పరాజయాల నేపథ్యంలో, బీసీసీఐ 'స్ప్లిట్ కోచింగ్' (పరిమిత ఓవర్లకు ఒకరు, టెస్టులకు మరొకరు) విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం హైదరాబాదీ స్టైలీష్ ప్లేయర్ ను టెస్ట్ కోచ్‌గా రావాలని బీసీసీఐ కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్‌గా ఉన్న సదరు ప్లేయర్, సీనియర్ జట్టు పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఆ మ్యాచ్ నుంచి కింగ్ ఔట్.. కారణం ఏంటంటే?

ఢిల్లీ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కోహ్లీ లేకపోవడం జట్టుకు లోటే అయినప్పటికీ, పంత్ నాయకత్వంలో యువ ఆటగాళ్లు రాణిస్తారని మేనేజ్మెంట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కింగ్ కోహ్లీ తిరిగి రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో మళ్ళీ తన బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

టీమిండియా 24 క్యారెట్ల గోల్డ్ అతనే.. దేవుడు వరం ఇస్తే నేను కోరుకునేది అదే: సిద్ధూ సంచలన వ్యాఖ్యలు

Navjot Singh Sidhu Key Comments on Virat Kohli: దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేల్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన సత్తాను మరోసారి నిరూపించుకున్నాడు. రెండు సెంచరీలు సాధించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 302 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మారాడు. ఈ సిరీస్‌కు ముందు, కోహ్లీ ఒకే ఫార్మాట్‌లో చురుగ్గా ఉన్నందున అతని ఫామ్‌పై చాలా మంది ఊహాగానాలు చేశారు. అయితే, 37 ఏళ్ల అతను ప్రోటీస్‌పై తన అద్భుతమైన ప్రదర్శనతో విమర్శకులందరినీ సైలెంట్ చేశాడు.

Team India: మిథాలీ రాజ్‌ రికార్డ్‌కే చెమటలు పట్టించిన లేడీ కోహ్లీ.. సరికొత్త ప్రపంచ రికార్డ్

India vs Sri Lanka Women's T20 2025: ఆదివారం తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన 4వ టీ20లో భారత బ్యాట్స్‌మన్ స్మృతి మంధాన భారీ ప్రపంచ రికార్డును సృష్టించింది. 29 ఏళ్ల ఈమె అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో 10,000 పరుగులు నమోదు చేసి, అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న మహిళగా నిలిచింది. ఆమె భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను అధిగమించి , కేవలం 280 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకుంది.

కివీస్‌తో వన్డే సిరీస్ కోసం బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. 3 నెలల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్న మిడిలార్డర్ తోపు

India vs New Zealand ODI 2026: జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో భారత బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతోందని ఒక వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 25న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే సందర్భంగా గాయం కారణంగా 30 ఏళ్ల అతను ఆటకు దూరంగా ఉన్నాడు. భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ ప్రస్తుతం బెంగళూరులోని భారత (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లోని క్రికెట్ నియంత్రణ బోర్డులో కోలుకుంటున్నాడు.

వామ్మో.. గంటలో 45 సిక్సర్లు.. బౌలర్లకు చుక్కలు చూపించిన కావ్యపాప బ్రహ్మస్త్రం..!

Abhishek Sharma 45 Sixes in Nets: విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ తన తర్వాతి మ్యాచ్‌లు ఆడబోతోంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కూడా అభిషేక్ కీలక పాత్ర పోషించనున్నాడు. నెట్స్‌లో చూపించిన ఈ జోరును గనుక అతను మైదానంలో చూపిస్తే, ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు.

IND vs NZ ODI: కివీస్‌తో వన్డే సిరీస్‌.. గంభీర్ సర్జికల్ స్ట్రైక్‌తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?

India vs New Zealand ODI 2026: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌లతో కూడిన వన్డే సిరీస్ జనవరి 11, 2026న ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌కు జట్లను ఇంకా ప్రకటించలేదు. అయితే, ముగ్గురు ఆటగాళ్లకు సంబంధించి ఇప్పటికే కీలక వార్తలు వెలువడ్డాయి.

IND vs NZ : కివీస్‌తో వన్డే సిరీస్‌..టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?

IND vs NZ : న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం భారత జట్టులో భారీ మార్పులు జరగనున్నాయి. శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి వస్తుండగా.. తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్ జట్టుకు దూరం కానున్నారు. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో గాయపడిన గిల్, ప్రస్తుతం కోలుకుని జట్టు పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.

  • Rakesh
  • Updated on: Dec 28, 2025
  • 3:45 pm

Team India: ద్రవిడ్ హయాంలో తోపు ఫినిషర్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌గా మార్చిన గంభీర్..

Team India: 2026 టీ20 ప్రపంచకప్ దృష్ట్యా ఈ మ్యాచ్ విన్నర్‌ను సరైన రీతిలో వాడుకోవడం టీమ్ ఇండియాకు చాలా ముఖ్యం. గంభీర్ తన వ్యూహాలను మార్చుకుని ఇలాంటి అద్భుతమైన ప్లేయర్‌కు మళ్ళీ ఫినిషర్ పాత్రను ఇస్తారా? లేక మరికొంత కాలం వేచి చూడాల్సిందేనా? అనేది వేచి చూడాలి.