AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

pullarao.mandapaka

pullarao.mandapaka

Chief Reporter - TV9 Telugu

pullarao.mandapaka@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియాలో 16 ఏళ్ల అనుభవం ఉంది.2008 లో ఐన్యూస్ హైదరాబాద్ లో ట్రైనీ రిపోర్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించాను.స్టేట్ బ్యూర రిపోర్ట‌ర్ గా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో హైద‌రాబాద్ లో జ‌న‌ర‌ల్ బీట్ రిపోర్ట‌ర్ గా ప‌నిచేసాను.2011 నుంచి టీవీ 5లో సీనియ‌ర్ రిపోర్ట‌ర్ గా ప‌నిచేసాను.2018 లో విజ‌య‌వాడలో AP24x7 లో అమ‌రావ‌తి బ్యూరో చీఫ్ గా ప‌నిచేసాను.2021 నుంచి అమ‌రావ‌తిలో టీవీ9 చీఫ్ రిపోర్ట‌ర్ గా ప‌నిచేస్తున్నాను.

Read More
Follow On:
HanumaVihari: నారా లోకేశ్‌, పవన్ కల్యాణ్‌లను కలిసిన క్రికెటర్ హనుమ విహారి.. కెరీర్‌పై కీలక నిర్ణయం

HanumaVihari: నారా లోకేశ్‌, పవన్ కల్యాణ్‌లను కలిసిన క్రికెటర్ హనుమ విహారి.. కెరీర్‌పై కీలక నిర్ణయం

ప్రముఖ టీమిండియా క్రికెటర్ హనుమ విహారి నారా లోకేశ్ ను కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలను నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లాడీ ట్యాలెంటెడ్ క్రికెటర్. అయితే ఇప్పుడు ఏసీఏతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని నారా లోకేష్ హామీ ఇవ్వడంతో

Andhra Pradesh: ఎక్కడికక్కడే సమస్యకు పరిష్కారం.. నేటి నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రారంభం

Andhra Pradesh: ఎక్కడికక్కడే సమస్యకు పరిష్కారం.. నేటి నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పాలన సాగించాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తోంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న త్వరితగతిన పరిష్కరించేలా అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు నేతలు.

AP Cabinet : ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం.. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ప్రధాన చర్చ!

AP Cabinet : ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం.. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ప్రధాన చర్చ!

మరికొన్ని గంటల్లో భేటీకానున్న ఏపీ కేబినెట్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది..? A అంటే అమరావతి.. P అంటే పోలవరం అన్న చంద్రబాబు.. వాటి నిర్మాణాలపై ఎలా ముందుకెళ్లాలని మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఆరు గ్యారంటీల అమలుపై ఏం తేల్చనున్నారు..? ఏపీ కేబినెట్‌ తొలి మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ ప్రాంతాలను కలుపుతూ రాజధాని అమరావతికి రైల్వే లైన్..

ఈ ప్రాంతాలను కలుపుతూ రాజధాని అమరావతికి రైల్వే లైన్..

ఆంధ్రప్రదేశ్‎లో అలా ప్రభుత్వం మారిందో లేదో ఇలా కొత్త ప్రాజెక్టులు ఊపందుకుంటున్నాయి. అమరావతిని త్వరితగతన పూర్తిచేసేలా సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రారంభ సమయంలో అనేక ప్రాజెక్టులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఆయా ప్రాజెక్టులను తిరిగి గాడినపెట్టేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటుంది.

AP Assembly: సభలో 88 మంది కొత్త ఎమ్మెల్యేలు.. ఎలా ఉండాలో చెప్పిన స్పీకర్ అయ్యన్న..

AP Assembly: సభలో 88 మంది కొత్త ఎమ్మెల్యేలు.. ఎలా ఉండాలో చెప్పిన స్పీకర్ అయ్యన్న..

సభాపతిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ సభ్యులకు పేరుపేరునా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. సభాపతి స్థానం చాలా పవిత్రమైనదన్నారు. అసెంబ్లీలోని సభ్యులు తనకు పదవి ఇవ్వలేదని ఒక బాధ్యత ఇచ్చారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.1983లో ఎన్టీఆర్‎తో పనిచేశాను. ఒక తూఫాను లాగా ప్రభుత్వ ఏర్పాడిందన్నారు.

Andhra Pradesh: ‘ప్రజాధనం పార్టీకి పనిచేసినవారికి’.. ఆ శాఖలపై సీఎం నజర్

Andhra Pradesh: ‘ప్రజాధనం పార్టీకి పనిచేసినవారికి’.. ఆ శాఖలపై సీఎం నజర్

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై దృష్టి సారించింది టీడీపీ ప్రభుత్వం. గడిచిన ఐదేళ్లలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తుంది. ప్రభుత్వ ధనాన్ని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించినట్లు తాజాగా గుర్తించింది సర్కార్. దీంతో పూర్తిస్థాయిలో ఆయా శాఖలపై దృష్టి పెట్టింది.

Andhra Pradesh: రాష్ట్ర భవితవ్యం మార్చేందుకు.. 74 వయస్సులోనూ వడివడిగా అడుగులు

Andhra Pradesh: రాష్ట్ర భవితవ్యం మార్చేందుకు.. 74 వయస్సులోనూ వడివడిగా అడుగులు

ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసం పక్కనే గత ప్రభుత్వ హయాంలో కూల్చివేసిన ప్రజావేదిక పరిశీలనతో చంద్రబాబు పర్యటన ప్రారంభం కానుంది... అక్కడ నుంచి నేరుగా ఉద్దండ రాయినిపాలెంలోని అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి సీఎం చేరుకుంటారు. 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు..

IAS Transfer: ఐఏఎస్ అధికారుల బదిలీల్లో చంద్రబాబు మార్క్.. గత ప్రభుత్వంలో కీలక అధికారులకు నో పోస్టింగ్స్‌

IAS Transfer: ఐఏఎస్ అధికారుల బదిలీల్లో చంద్రబాబు మార్క్.. గత ప్రభుత్వంలో కీలక అధికారులకు నో పోస్టింగ్స్‌

వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది ప్రభుత్వం. గత టీడీపీ ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకున్న అధికారులకు కీలక శాఖల్లో పోస్టింగ్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ శాఖలకూ సీనియర్ అధికారులను నియమించింది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. ఒకేసారి 19మంది అధికారులకు స్థానచలనం..

CBN Focus on Key Officials: సెలవుపై వెళ్లిన సీఎస్‌.. ఏపీలో అధికారులపై మార్పుపై ఉత్కంఠ..!

CBN Focus on Key Officials: సెలవుపై వెళ్లిన సీఎస్‌.. ఏపీలో అధికారులపై మార్పుపై ఉత్కంఠ..!

ఆంధ్ర ప్రదేశ్‌లో త్వరలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే సీఎం టీంలో ఉండే అధికారులు ఎవరు..? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు పాలనకు కేంద్ర బిందువైన ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య అధికారులు ఎవరు ఉంటారనే దానిపై చర్చ మొదలైంది.

AP Elections 2024: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ఆ రూల్స్ తప్పక పాటించాలి.. మీనా కీలక ఆదేశం..

AP Elections 2024: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ఆ రూల్స్ తప్పక పాటించాలి.. మీనా కీలక ఆదేశం..

ఓట్ల లెక్కింపుకు గ‌డువు ద‌గ్గర‌ప‌డ‌టంతో కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద తీసుకోవాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కీల‌క సూచ‌న‌లు చేశారు. అన్ని జిల్లాల ఎన్నిక‌ల అధికారులు, ఎస్సీలు, సీపీల‌తో స‌చివాల‌యం నుంచి సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా కౌంటింగ్ ఏర్పాట్లపై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొన్నందున ఓట్ల లెక్కింపు రోజు పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేయాలన్నారు. కేవలం జూన్ 4న కాకుండా దానికి ముందు, తదుపరి రోజుల్లో భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందన్నారు.

TDP: ఏపీలో కూట‌మి తిరుగులేని విజ‌యం సాధిస్తుంద‌న్న చంద్రబాబు.. పార్టీ నేతలతో సమావేశం..

TDP: ఏపీలో కూట‌మి తిరుగులేని విజ‌యం సాధిస్తుంద‌న్న చంద్రబాబు.. పార్టీ నేతలతో సమావేశం..

ఎన్నిక‌ల కౌంటింగ్‎కు మ‌రికొన్ని గంట‌లు మాత్రమే స‌మ‌యం ఉండ‌టంతో కూట‌మి పార్టీల నేత‌లు అల‌ర్ట్ అయ్యారు. పోలింగ్ ముగిసిన త‌ర్వాత ఫ‌లితాల విష‌యంలో ఇప్పటి వ‌ర‌కు మూడు పార్టీల నేత‌లు మౌనం వ‌హించారు. ప్రధాని మోడీ నామినేష‌న్ వేసిన రోజు మాత్రమే వార‌ణాసిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నిక‌ల్లో ఎన్డీయే విజ‌యం సాధిస్తుంద‌ని చెప్పుకొచ్చారు. ఆ త‌ర్వాత విదేశీ ప‌ర్యట‌న‌కు వెళ్లిన చంద్రబాబు.. మూడు రోజుల క్రిత‌మే హైద‌రాబాద్‎కు వచ్చారు. ఆ త‌ర్వాత శ‌నివారం రాత్రి ఉండ‌వ‌ల్లి నివాసానికి చేరుకున్నారు.

TDP: మౌనం దేనికి సంకేతం.? ఫ‌లితాల‌పై నోరు విప్పని టీడీపీ ముఖ్య నేత‌లు..

TDP: మౌనం దేనికి సంకేతం.? ఫ‌లితాల‌పై నోరు విప్పని టీడీపీ ముఖ్య నేత‌లు..

ఎన్నిక‌లు ముగిసి రోజులు గ‌డుస్తున్నాయి. ఫ‌లితాలు కూడా త్వర‌లోనే రానున్నాయి. మ‌రి ఫ‌లితాల‌పై తెలుగు త‌మ్ముళ్ల మౌనం ఎందుకు? అధినేత నుంచి కింది స్థాయి నాయ‌కుల వ‌ర‌కు నోరు మెద‌ప‌క‌పోవ‌డం వెనుక కార‌ణం ఏంటి.? మౌనం గెలుపున‌కు అంగీకార‌మా.? లేక పార్టీ స్ట్రాట‌జీలో భాగ‌మా.? అస‌లేం జ‌రుగుతందో తెలియ‌క ప‌సుపు నేత‌లు డైల‌మాలో ప‌డిపోయార‌ట‌. తెలుగుదేశం పార్టీ కేడ‌ర్‎లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొద‌లైంద‌ట‌.