గుంటూరు వెస్ట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుంటూరు వెస్ట్ ఒకటి.. ఇది గుంటూరు లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. గుంటూరు జిల్లా కేంద్రంలోని ఈ నియోజకవర్గంలో మద్దాలి గిరిధరరావు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన మద్దాలి గిరిధరరావు.. ఆ తర్వాత YSR కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2019 నాటికి నియోజకవర్గంలో మొత్తం 265,135 మంది ఓటర్లు ఉన్నారు. డిలిమిటేషన్ ఆర్డర్స్ ప్రకారం 2008లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని స్థాపించారు.
ఈ నియోజకవర్గం స్వరూపం ఇలా.. గుంటూరు మండలం (పార్ట్), గుంటూరు ( ఎం.కార్ప్ ) (పార్ట్), గుంటూరు ( ఎం.కార్ప్ ) – వార్డు నెం.1 నుండి 6, 24 నుచి 28 వరకు ఉంటుంది.
గుంటూరు వెస్ట్ నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విడదల రజిని పోటీచేయనుండగా.. టీడీపీ నుంచి పిడుగురాళ్ల మాధవి బరిలో నిలవనున్నారు
గుంటూరు వెస్ట్ లో 2009లో కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి మోదుగుల వేణుగోపాల రెడ్డి, 2019 మద్దాలి గిరిధరరావు గెలుపొందారు.
Phase | Date | State | Seat |
---|---|---|---|
1 | April 19, 2024 | 21 | 102 |
2 | April 26, 2024 | 13 | 89 |
3 | May 07, 2024 | 12 | 94 |
4 | May 13, 2024 | 10 | 96 |
5 | May 20, 2024 | 8 | 49 |
6 | May 25, 2024 | 7 | 57 |
7 | Jun 01, 2024 | 8 | 57 |