AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eswar Chennupalli

Eswar Chennupalli

Associate Editor - TV9 Telugu

parameswara.chennupalli@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 22 ఏళ్ల అనుభవం ఉంది. అప్పటి సంచలన దిన పత్రిక వార్త లో క్రైమ్ రిపోర్టర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈనాడు జర్నలిజం స్కూల్ లో 2006-2007 బ్యాచ్ విద్యార్థిగా శిక్షణ పూర్తయింది. 2008 – 2009 లో మా టీవీ స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా, 2009 – 2014 వరకు టీవీ9 లో కరెస్పాండెంట్ గా, బ్యూరో చీఫ్ గా హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీ లో పనిచేసిన అనుభవం. 2014 – 19 వరకు డెక్కన్ క్రానికల్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా ముఖ్యమంత్రి కార్యాలయ బీట్ రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం. 2019 లో హెచ్. ఎం. టీ. వీ. స్టేట్ బ్యూరో చీఫ్ గా స్వల్పకాలం పనిచేసిన అనంతరం 2021 మార్చ్ నుంచి టీవీ9 – ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ గా పనిచేస్తూ ఉన్నాను.

Read More
Flight Journey: ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్.. వారందరికీ విమానంలో ఉచిత ప్రయాణం!

Flight Journey: ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్.. వారందరికీ విమానంలో ఉచిత ప్రయాణం!

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఉచిత విమాన ప్రయాణం కల్పించాలని నిర్ణయించింది. రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రాకపోతే ఈ ప్రాజెక్టు సాధ్యం కాకపోయేదని.. ఇది వాళ్ల త్యాగానికి ఇస్తున్న గౌరవమని సీఎం తెలిపారు.

బిగ్ అలర్ట్.. ఏపీ‌లో కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌ గుర్తింపు!

బిగ్ అలర్ట్.. ఏపీ‌లో కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌ గుర్తింపు!

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌ను గుర్తించారు. ఇది ఇతర ఒమిక్రాన్ ఉపవంశాల కంటే ప్రమాదకరమనే ఆధారాలు లేవని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రజలు భయపడకుండా, అప్రమత్తంగా ఉండాలి. గొంతు నొప్పి, దగ్గు వంటివి దీని లక్షణాలు.

అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం! డబ్బులొచ్చే స్కీమ్ వర్తింపు

అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం! డబ్బులొచ్చే స్కీమ్ వర్తింపు

అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పలుమార్లు తమ విజ్ఞప్తులను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం చివరకు వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీ సిబ్బందికి ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Amaravati Land Price: రేంజ్ మారింది.. అమరావతి భూములకు రికార్డు ధర.. ఎకరం ఎంతో తెలుసా..?

Amaravati Land Price: రేంజ్ మారింది.. అమరావతి భూములకు రికార్డు ధర.. ఎకరం ఎంతో తెలుసా..?

అమరావతి రాజధాని భూముల ధరలు కొత్త రికార్డు సృష్టించాయి. స్టార్ హోటళ్ల కోసం ఎకరానికి రూ.8.20 కోట్ల ధరను సీఆర్డీఏ నిర్ణయించగా, ప్రైవేట్ పాఠశాలలకు ఎకరానికి రూ.4.10 కోట్ల ధరను ఖరారు చేసింది. రాజధాని నిర్మాణం వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో ఐదు స్టార్ హోటళ్లు, ఐదు ప్రైవేట్ స్కూళ్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించడం అమరావతి అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

AP Elections: ఏపీలో మళ్లీ ఎన్నికలు..  సమరానికి సై అంటున్న రాజకీయ పార్టీలు! ఎప్పుడంటే?

AP Elections: ఏపీలో మళ్లీ ఎన్నికలు.. సమరానికి సై అంటున్న రాజకీయ పార్టీలు! ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించింది. సెప్టెంబర్‌లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన పరిపాలనా ప్రక్రియలను వేగవంతం చేస్తూ, దశలవారీగా పోలింగ్ నిర్వహించే దిశగా కసరత్తు చేస్తోంది. దీంతో రాజకీయ పార్టీల్లోనూ ఎన్నికల సందడి మొదలవుతోంది.

ఏపీలో కొలువుల జాతర.. 25 వేల ఉద్యోగాలు! ఏపీ ఆర్థిక రూపురేఖలు మార్చనున్న రామాయపట్నం పోర్టు..!

ఏపీలో కొలువుల జాతర.. 25 వేల ఉద్యోగాలు! ఏపీ ఆర్థిక రూపురేఖలు మార్చనున్న రామాయపట్నం పోర్టు..!

రామాయపట్నం పోర్టు అభివృద్ధిలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచస్థాయి సంస్థల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో పోర్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి తొలి దశలోనే రూ.1,500 కోట్ల ముందస్తు ప్రీమియంతో పాటు దీర్ఘకాలిక ఆదాయం లభించనుంది. మరోవైపు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు, సుమారు 25 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల సృష్టికి ఈ పోర్టు వేదిక కానుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. సొంత ఖర్చులతోనే శస్త్రచికిత్స

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. సొంత ఖర్చులతోనే శస్త్రచికిత్స

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మరోసారి తన మాటకు కట్టుబడి ఉన్నట్టు నిరూపించుకున్నాడు. ఇటీవల ముంబైలోని ఓ హాస్పిటల్‌లో ఆయన కుడి భూజానికి శస్త్ర చికిత్స జరగ్గా.. అందుకు అయ్యే ఖర్చు ప్రభుత్వ నిధుల నుంచి పొందే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజాధనాన్ని తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదనే స్వీయ నిబంధనకు కట్టుబడి ఖర్చులు మొత్తం ఆయనే భరించారు.

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్‌తో 175 కొత్త ఎంబీబీఎస్ సీట్లు

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్‌తో 175 కొత్త ఎంబీబీఎస్ సీట్లు

AP MBBS Seats 2026: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య విద్యకు భారీ ఊతం లభించింది. ఎన్ఎంసీ అనుమతులతో పిడుగురాళ్లలో కొత్తగా 100 ఎంబీబీఎస్ సీట్లు ప్రారంభం కాగా, విజయవాడ సిద్ధార్థ, కడప, నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 175 సీట్లు మంజూరయ్యాయి. దీంతో 2026-27 విద్యా సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం 275 కొత్త ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

పవన్ కళ్యాణ్‌కు భుజం ఆపరేషన్ సక్సెస్, కానీ.. వైద్యుల హెల్త్ బులెటిన్‌లో కీలక వివరాలు

పవన్ కళ్యాణ్‌కు భుజం ఆపరేషన్ సక్సెస్, కానీ.. వైద్యుల హెల్త్ బులెటిన్‌లో కీలక వివరాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో భుజం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. రొటేటర్ కఫ్ గాయం, ఫ్రాక్చర్‌కు చికిత్స చేసిన వైద్యులు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి సుమారు నాలుగు నెలలు పట్టవచ్చని హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం పవన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

CM Chandrababu: ముంబయి ఆస్పత్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: ముంబయి ఆస్పత్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

రాష్ట్ర రాజకీయాల్లో ఆత్మీయతకు అద్దం పట్టిన దృశ్యం ఇది. ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు కొంతసేపు ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య ఆత్మీయ సంభాషణ చోటుచేసుకుంది. ఎన్డీఏ కూటమి నాయకుల మధ్య ఉన్న సమన్వయానికి ఈ భేటీ మరో నిదర్శనంగా నిలిచింది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స ఎంతసేపు జరిగిందంటే..? ప్రధాని నుంచి ఫోన్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స ఎంతసేపు జరిగిందంటే..? ప్రధాని నుంచి ఫోన్

పదేళ్లుగా భుజాల నొప్పిని భరిస్తూనే ప్రజా జీవితాన్ని కొనసాగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఎట్టకేలకు శస్త్రచికిత్స జరిగింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ వైద్య నిపుణుల బృందం కుడి భుజానికి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీపై మూడున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది. రెండు భుజాల్లోనూ తీవ్ర గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించగా... మరో భుజానికి రెండు నెలల తర్వాత శస్త్రచికిత్స చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Pawan Kalyan: ముంబైకి పవన్ కల్యాణ్.. భుజానికి సర్జరీ చేయించుకోనున్న జనసేనాని..

Pawan Kalyan: ముంబైకి పవన్ కల్యాణ్.. భుజానికి సర్జరీ చేయించుకోనున్న జనసేనాని..

ప్రజా సేవ కోసం భుజం నొప్పిని భరిస్తూ ఇన్నాళ్లూ ముందుకు సాగిన జనసేనాని ఇవాళ ముంబైలో భుజం సర్జరీ చేయించుకోనున్నారు. గతవారమే డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పినా.. ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తి చేసుకుని వస్తానని అప్పుడు వైద్యులకు చెప్పారు. ఇప్పుడు కార్యక్రమలను పూర్తి చేసుకుని సర్జరీకి సిద్ధమయ్యారు.