తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 22 ఏళ్ల అనుభవం ఉంది. అప్పటి సంచలన దిన పత్రిక వార్త లో క్రైమ్ రిపోర్టర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈనాడు జర్నలిజం స్కూల్ లో 2006-2007 బ్యాచ్ విద్యార్థిగా శిక్షణ పూర్తయింది. 2008 – 2009 లో మా టీవీ స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా, 2009 – 2014 వరకు టీవీ9 లో కరెస్పాండెంట్ గా, బ్యూరో చీఫ్ గా హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీ లో పనిచేసిన అనుభవం. 2014 – 19 వరకు డెక్కన్ క్రానికల్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా ముఖ్యమంత్రి కార్యాలయ బీట్ రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం. 2019 లో హెచ్. ఎం. టీ. వీ. స్టేట్ బ్యూరో చీఫ్ గా స్వల్పకాలం పనిచేసిన అనంతరం 2021 మార్చ్ నుంచి టీవీ9 – ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ గా పనిచేస్తూ ఉన్నాను.
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ.. ఉద్యోగాలే ఉద్యోగాలు
ఏపీ ప్రజలకు ఇదో సూపర్ గుడ్న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో నూతనంగా నిర్మాణం కాబోతున్న రాజధానిలో అంత్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కాబోతుంది. అమరావతిలోని శాఖమూరులో 4 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటుకు ఏపీ సీఆర్డీఏతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయ స్థాయి విద్య అందుబాటులోకి రావడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి, అమరావతి పెట్టుబడులకు మరింత ఆకర్షణీయంగా మారనుంది.
- Eswar Chennupalli
- Updated on: Jun 10, 2026
- 7:27 pm
Andhra News: ఏపీ ప్రజలకు సూపర్ గుడ్న్యూస్.. కంటి సమస్యల గుర్తించేందుకు సరికొత్త ఏఐ టెక్నాలజీ!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం అదరిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. మదుమేహం కారణంగా కంటి చూపు దెబ్బతినే రెటినోపతి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి రోగులకు సకాలంలో చికిత్స అందించేందుకు సరికొత్త AI ఆధారిత స్క్రీనింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. గుంటూరు, కర్నూలు, విశాఖలోని ప్రభుత్వాసుపత్రుల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబోతుంది. కంటి వైద్యుల కొరత ఉన్న ప్రాంతాల్లో రోగులను సకాలంలో గుర్తించి చికిత్స అందించడం ఇది చాలా బాగా ఉపయోగపనుంది.
- Eswar Chennupalli
- Updated on: Jun 10, 2026
- 7:06 pm
టీడీపీ రాజ్యసభ అభ్యర్ధులందరూ కోటీశ్వరులే! అఫిడవిట్లలో ఆసక్తికర అంశాలు
రాజ్యసభ ఎన్నికల టీడీపీ అభ్యర్థుల అఫిడవిట్లు వారి వ్యక్తిగత, ఆర్థిక స్థితిని బయటపెట్టాయి. భాష్యం రామకృష్ణ రూ.672 కోట్లతో అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలవగా, సానా సతీష్బాబుకు కోట్ల చరాస్తులున్నా సొంత ఇల్లు లేకపోవడం గమనార్హం. చింతకాయల విజయ్ కుటుంబ ఆస్తులు, కేసుల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
- Eswar Chennupalli
- Updated on: Jun 9, 2026
- 10:13 am
Godavari River Pollution: గోదావరిలో ఇప్పుడు మునిగితే… నేరుగా గోదారికే!
పుష్కరాల గోదావరి... ఇప్పుడు కాలుష్య గోదావరిగా మారుతోందా? ల్యాబ్ నివేదికలో బయటపడిన సంఖ్యలు చూస్తే పరిస్థితి ఆందోళనకరంగానే కనిపిస్తోంది. నదిని కాపాడకపోతే అది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు... కోట్లాది మంది ప్రజల ఆరోగ్యం, జీవనాధారంపై ప్రభావం చూపే సంక్షోభంగా మారే ప్రమాదం ఉందనే హెచ్చరికను ఈ నివేదిక మరోసారి గుర్తు చేసింది.
- Eswar Chennupalli
- Updated on: Jun 9, 2026
- 9:05 am
చంద్రబాబును చూసి మురిసిపోయిన వైరల్ తాత.. ఊహించని బహుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి
Chandrababu Naidu: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన వృద్ధుడు సత్యనారాయణకు సీఎం చంద్రబాబును ఒక్కసారి చూడాలన్న కోరిక వైరల్ వీడియో ద్వారా నెరవేరింది. సిద్ధాంతంలో ఆయనను ప్రత్యేకంగా కలిసిన సీఎం, కుటుంబ సమస్యలు తెలుసుకుని కుమారుడికి వైద్యసాయం, సత్యనారాయణకు ఇల్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
- Eswar Chennupalli
- Updated on: Jun 9, 2026
- 7:47 am
Andhra: ఏపీలోని పేదలకు గుడ్ న్యూస్.. సాధారణ బియ్యం స్థానంలో..
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు పేదలకు మెరుగైన నాణ్యత గల బియ్యం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టీమ్ రైస్ పంపిణీపై దృష్టి సారించింది. ముందుగా మధ్యాహ్న భోజన పథకంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, అనంతరం ప్రజా పంపిణీ వ్యవస్థలో దశలవారీగా ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తోంది.
- Eswar Chennupalli
- Updated on: Jun 8, 2026
- 4:27 pm
Andhra Pradesh: ఏపీ రోడ్లపై రోడ్ డాక్టర్ మ్యాజిక్.. గంటలోనే గుంత మాయం.. వాహనదారులకు ఇక నో టెన్షన్..
ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త రోడ్ డాక్టర్ మొబైల్ వాహనాలు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్తో దూసుకుపోతున్నాయి. గతంలో ఒక రోడ్డు పాడైతే పనులు మొదలవడానికి నెలల సమయం పట్టే పాత పద్ధతులకు చెక్ పెడుతూ.. లేటెస్ట్ టెక్నాలజీతో స్పాట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కేవలం గంటలోపే గుంతలను పూడ్చేస్తూ, అటు సమయాన్ని, ఇటు ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నారు.
- Eswar Chennupalli
- Updated on: Jun 8, 2026
- 9:13 am
AP EAPCET ఫలితాల విడుదలకు డేట్ ఫిక్స్? ఆ పరీక్షలు పూర్తి అవ్వగానే..
ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు జూన్ 18న విడుదల అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల ప్రక్రియ కారణంగా జూన్ 1న రావాల్సిన ఫలితాలు ఆలస్యం అయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్ నంబర్తో ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల అనంతరం ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించనున్నారు.
- Eswar Chennupalli
- Updated on: Jun 8, 2026
- 8:46 am
Andhra Pradesh: వారెవ్వా.. ఏపీలోనూ గోవా తరహా బీచ్ షాక్స్.. మద్యం విక్రయాలు కూడా..!
ఆంధ్రప్రదేశ్లో గోవా తరహా బీచ్ పర్యాటకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో సూర్యలంక, విశాఖ బీచ్లలో నాలుగు బీచ్ ష్యాక్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ష్యాక్స్లో ఆహారం, వినోదంతో పాటు మద్యం విక్రయాలకు కూడా అనుమతి ఉండనుంది. పర్యాటక రంగానికి ఊతమివ్వడంతో పాటు తీర ప్రాంత ఆర్థిక కార్యకలాపాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యంగా చెబుతోంది.
- Eswar Chennupalli
- Updated on: Jun 5, 2026
- 1:21 pm
గోదావరి పుష్కరాలు వచ్చేస్తున్నాయ్.. ఈ సారి ఏర్పాట్లు అంతకు మించి ఉండేలా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!
2027 గోదావరి పుష్కరాలను కేవలం ఆధ్యాత్మిక వేడుకగా కాకుండా, గోదావరి పరివాహక ప్రాంత సమగ్ర అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ఒక సువర్ణావకాశంగా మారుస్తోంది. రూ.12 వేల కోట్ల నిధులతో ఘాట్లు, రోడ్లు, పరిశుభ్రత, పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రచించింది. రాజమండ్రిని మెగా సిటీగా తీర్చిదిద్దడంతో పాటు, నది స్వచ్ఛత, భక్తుల భద్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశిస్తోంది.
- Eswar Chennupalli
- Updated on: Jun 2, 2026
- 5:11 pm
ఓరీ దేవుడో.. ఎబోలా వెంటాడుతోంది..! సర్కార్ ముందస్తు అప్రమత్తత.. ఎయిర్పోర్టుల్లో కట్టుదిట్టమైన నిఘా
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఏపీ ప్రభుత్వం మరో ప్రమాదకరమైన వైరస్ పట్ల ముందస్తు చర్యలను వేగవంతం చేసింది. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ (Ebola Virus) కేసులు, మరణాలు వేగంగా పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధమైందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
- Eswar Chennupalli
- Updated on: May 24, 2026
- 7:18 pm
ఎండలతో పోటీగా బీర్ విక్రయాలు.. ఏపీలో ‘కూలింగ్ డ్రింక్’గా మారిన బీర్!
Beer sales in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో మండుతున్న ఎండలతో బీర్ అమ్మకాలు భారీగా పెరిగాయి. మార్చి చివరి నుంచే వేసవి తీవ్రత పెరగడంతో ప్రజలు చల్లదనం కోసం బీర్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో రాష్ట్రంలో బీర్ విక్రయాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. బీర్ ఇప్పుడు కూల్ చేసే డ్రింక్గా మారిపోయింది.
- Eswar Chennupalli
- Updated on: May 22, 2026
- 9:20 pm