AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eswar Chennupalli

Eswar Chennupalli

Associate Editor - TV9 Telugu

parameswara.chennupalli@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 22 ఏళ్ల అనుభవం ఉంది. అప్పటి సంచలన దిన పత్రిక వార్త లో క్రైమ్ రిపోర్టర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈనాడు జర్నలిజం స్కూల్ లో 2006-2007 బ్యాచ్ విద్యార్థిగా శిక్షణ పూర్తయింది. 2008 – 2009 లో మా టీవీ స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా, 2009 – 2014 వరకు టీవీ9 లో కరెస్పాండెంట్ గా, బ్యూరో చీఫ్ గా హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీ లో పనిచేసిన అనుభవం. 2014 – 19 వరకు డెక్కన్ క్రానికల్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా ముఖ్యమంత్రి కార్యాలయ బీట్ రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం. 2019 లో హెచ్. ఎం. టీ. వీ. స్టేట్ బ్యూరో చీఫ్ గా స్వల్పకాలం పనిచేసిన అనంతరం 2021 మార్చ్ నుంచి టీవీ9 – ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ గా పనిచేస్తూ ఉన్నాను.

Read More
Andhra: అమరావతికి మరో శుభవార్త అందించిన కేంద్రం.. సూపర్ కదా..

Andhra: అమరావతికి మరో శుభవార్త అందించిన కేంద్రం.. సూపర్ కదా..

రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. అమరావతిలో రూ.80 కోట్ల వ్యయంతో వరల్డ్ క్లాస్ పోస్టల్ రీజినల్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యాలయంతో రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ పరిపాలన మరింత సమర్థవంతం కానుంది. ..

Vizag: రుషికొండ భవనాలను ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా?

Vizag: రుషికొండ భవనాలను ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా?

విశాఖ రుషికొండ ప్యాలెస్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. హాస్పిటాలిటీ రంగానికి అనుసంధానిస్తూ ప్రీమియం టూరిజం ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసి, ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టాటా, లీలా వంటి ప్రముఖ గ్రూప్‌లతో చర్చలు జరిపే అవకాశాన్ని పరిశీలిస్తోంది.

Andhra: ఏపీలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు గుడ్ న్యూస్..

Andhra: ఏపీలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు గుడ్ న్యూస్..

మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలను వేగంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ వైద్య సరఫరా వ్యవస్థను ప్రారంభిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా 60–80 కిలోమీటర్ల పరిధిలోని గిరిజన ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల ద్వారా మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేయనుంది. కోల్డ్ చైన్ సదుపాయంతో కూడిన ఈ డ్రోన్లను రక్తం, ఇతర నమూనాల రవాణాకు కూడా వినియోగించనున్నారు.

Tollywood: “టికెట్ రేట్ కంటే పాప్ కార్న్ రేట్ ఎక్కువ అయింది..”

Tollywood: “టికెట్ రేట్ కంటే పాప్ కార్న్ రేట్ ఎక్కువ అయింది..”

థియేటర్లలో సినిమా టికెట్ రేట్ల కంటే పాప్‌కార్న్‌, కూల్‌డ్రింక్స్ ధరలే ఎక్కువగా ఉన్నాయని సినీ దర్శకుడు తేజ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగా మధ్యతరగతి ప్రేక్షకులు థియేటర్లకు రావడంలో వెనుకడుగు వేస్తున్నారని చెప్పారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

Andhra: ఇంటింటి సర్వేకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం. అందుకేనా?

Andhra: ఇంటింటి సర్వేకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం. అందుకేనా?

రాష్ట్రంలోని ప్రతి కుటుంబ వివరాలు ఖచ్చితంగా నమోదు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏకీకృత కుటుంబ సర్వే (UFS) ప్రారంభిస్తోంది. అర్హులెవ్వరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి తప్పిపోకుండా చూడటమే లక్ష్యం. డిసెంబర్ చివరి వారం నుంచి ఇంటింటి సర్వే చేపట్టి, మొబైల్ యాప్–ఆధార్ ధృవీకరణతో డేటా నవీకరణ చేయనున్నారు.

Amaravati: నవ రాజధానిలో చరిత్రాత్మక ఆరంభం.. అమరావతిలో పెట్టబోయే తొలి విగ్రహం ఎవరిదో తెలుసా?

Amaravati: నవ రాజధానిలో చరిత్రాత్మక ఆరంభం.. అమరావతిలో పెట్టబోయే తొలి విగ్రహం ఎవరిదో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో చరిత్రాత్మకత ఆరంభం కాబోతోంది. ప్రజా రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని మొట్టమొదటగా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 25న వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని అమరావతిలోని వెంకటపాలెంలో అధికారికంగా ఆవిష్కరించనున్నారు. రాజకీయాలకు అతీతంగా అజాతశత్రువుగా గుర్తింపు పొందిన వాజ్‌పేయి విగ్రహాన్ని అమరావతిలో తొలి విగ్రహంగా నిలపడం వెనుక ఒక స్పష్టమైన సంకేతం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Andhra: ఆ పరిశోధనతో నోబెల్ సాధిస్తే.. రూ. 100 కోట్లు మీవే.. సీఎం చంద్రబాబు మెగా ఆఫర్

Andhra: ఆ పరిశోధనతో నోబెల్ సాధిస్తే.. రూ. 100 కోట్లు మీవే.. సీఎం చంద్రబాబు మెగా ఆఫర్

ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం. క్వాంటం టెక్నాలజీ ద్వారా ఈ ఘనత ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వంద కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Andhra: విన్నారా ఇది..  బీర్ అమ్మకాల్లో దక్షిణ భారతదేశంలోనే ఏపీ టాప్

Andhra: విన్నారా ఇది.. బీర్ అమ్మకాల్లో దక్షిణ భారతదేశంలోనే ఏపీ టాప్

దక్షిణ భారతదేశంలో మద్యం అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి చేరింది. కొత్త ఎక్సైజ్ విధానాలు, అంతర్జాతీయ బ్రాండ్‌ల ప్రవేశం, నాణ్యమైన మద్యం అందుబాటు ధరకు లభించడం వల్ల విక్రయాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. అయితే ఆదాయమే లక్ష్యంగా కాకుండా, అక్రమాల నియంత్రణ, పారదర్శకత, ఆరోగ్యకరమైన వృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.

Amaravati Avakai Festival: అమరావతిలో అవకాయ్‌ ఫెస్టివల్.. 3 రోజులు జాతరే!

Amaravati Avakai Festival: అమరావతిలో అవకాయ్‌ ఫెస్టివల్.. 3 రోజులు జాతరే!

అమరావతి బ్రాండ్‌ను జాతీయంగా, అంతర్జాతీయంగా బలంగా నిలబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అన్ని మంత్రిత్వ శాఖలు తమ తమ పరిధిలో అమరావతిని ప్రమోట్ చేసేలా కొత్త కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఆ దిశగా పర్యాటక శాఖ తాజాగా ‘ఆవకాయ’ పేరుతో అమరావతి ఫెస్టివల్‌ను..

అమరావతి క్వాంటం వ్యాలీకి నిధులు విడుదల.. ఇక ఉద్యోగాల జాతర షురూ!

అమరావతి క్వాంటం వ్యాలీకి నిధులు విడుదల.. ఇక ఉద్యోగాల జాతర షురూ!

అమరావతి ఇక కేవలం రాజధాని మాత్రమే కాదు. రానున్న కాలంలో దేశానికి దిశ చూపే టెక్నాలజీ కేంద్రంగా మారేందుకు అడుగులు వేస్తోంది. క్వాంటం టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పరిశోధనలు, ఉద్యోగాల కల్పన.. all in one కాన్సెప్ట్ అమరావతి నుంచే ప్రారంభం కానుంది..

Andhra Pradesh: గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు

Andhra Pradesh: గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు

2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారం అయ్యాయి. ఈసారి పుష్కరాలు జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజులపాటు జరగనున్నాయి. టీటీడీ ఆస్తాన సిద్ధాంతి థంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఇచ్చిన జ్యోతిష్య నివేదిక ఆధారంగా ప్రభుత్వం తేదీలను నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఘాట్‌ల పునరుద్ధరణ, భద్రత, రవాణా, నీటి–ఆరోగ్య సేవల కోసం శాఖలు ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నాయి. త్వరలోనే విభాగాల సమన్వయ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Amaravati: అమరావతికి మరో 16,666 వేల ఎకరాలు

Amaravati: అమరావతికి మరో 16,666 వేల ఎకరాలు

అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర కేబినెట్ రెండో దశ ల్యాండ్‌ పూలింగ్‌కు ఆమోదం తెలిపింది. రైతులు స్వచ్ఛందంగా మరో 16,666.5 ఎకరాల భూములను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ భూసేకరణ ద్వారా రైల్వే ట్రాక్‌, ఇన్నర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ క్రీడా నగరం వంటి కీలక ప్రాజెక్టులు చేపట్టనున్నారు. 2028 మార్చి నాటికి అమరావతి నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనులు వేగవంతం చేస్తోంది.