తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 22 ఏళ్ల అనుభవం ఉంది. అప్పటి సంచలన దిన పత్రిక వార్త లో క్రైమ్ రిపోర్టర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈనాడు జర్నలిజం స్కూల్ లో 2006-2007 బ్యాచ్ విద్యార్థిగా శిక్షణ పూర్తయింది. 2008 – 2009 లో మా టీవీ స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా, 2009 – 2014 వరకు టీవీ9 లో కరెస్పాండెంట్ గా, బ్యూరో చీఫ్ గా హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీ లో పనిచేసిన అనుభవం. 2014 – 19 వరకు డెక్కన్ క్రానికల్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా ముఖ్యమంత్రి కార్యాలయ బీట్ రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం. 2019 లో హెచ్. ఎం. టీ. వీ. స్టేట్ బ్యూరో చీఫ్ గా స్వల్పకాలం పనిచేసిన అనంతరం 2021 మార్చ్ నుంచి టీవీ9 – ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ గా పనిచేస్తూ ఉన్నాను.
AP News: ఏపీ విద్యార్ధులకు అలెర్ట్.. ఇకపై ఆ స్కూళ్లలో చికెన్ బంద్.. పూర్తి వివరాలు
ఏపీ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రమంతటా గిరిజన గురుకులాల్లో చికెన్ వడ్డింపునకు కొద్దికాలం తాత్కాలికంగా నిలిపేసింది. మరి దీనికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఆహార పదార్ధాలు వడ్డిస్తారో.? ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
- Eswar Chennupalli
- Updated on: Feb 14, 2025
- 6:41 pm
Chandrababu: మన ఒంగోలు గిత్త ధర రూ.41 కోట్లు.. సీఎం చంద్రబాబు ఏమన్నారో తెలుసా..?
ఒంగోలు జాతి గిత్త ఏకంగా రూ. 41 కోట్లు పలకడం ఒంగోలు గిత్త ప్రాముఖ్యతను మరింతగా ప్రపంచానికి చాటింది. ఏకకాలంలో చలి, వేడిని తట్టుకునే గుణం, గణనీయమైన బలం, అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం ఈ జాతికి ప్రత్యేకతను అందిస్తాయి. మిగతా గిత్తలతో పోలిస్తే ఒంగోలు గిత్తలు ఎక్కువ కాలం జీవిస్తాయి.. జెనెటిక్ పరంగా బలంగా ఉంటాయి. వాటి సంతానం కూడా ఇదే విధంగా బలమైన లక్షణాలను కలిగి ఉంటాయి.
- Eswar Chennupalli
- Updated on: Feb 13, 2025
- 7:26 pm
AP News: ఏపీలో ఇకపై స్మార్ట్ఫోన్లోనే అన్నీ.. ప్రజలకు ఇది కదా కావాల్సింది
ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. వచ్చే కొద్దిరోజుల్లో అన్ని ప్రభుత్వ సర్టిఫికెట్లు.. 161 సర్వీసులు వాట్సాప్ ద్వారా ప్రజలకు అందనున్నాయి. అందుకు మెటాతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే..
- Eswar Chennupalli
- Updated on: Feb 8, 2025
- 9:24 am
AP News: స్టార్ హోటళ్లలో మద్యం తాగాలని ఉందా.? మీకో పండుగలాంటి వార్త
స్టార్ హోటళ్లలో లిక్కర్ యమా కాస్ట్లీగా ఉంటుంది. తాగాలంటే భారీగా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. అయితే మందుబాబులకు గుడ్ న్యూస్ అందించనుంది ఏపీ ప్రభుత్వం.. ఇకపై స్టార్ హోటళ్లలోనూ మద్యం తాగొచ్చు.. ఎలాగంటే ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓసారి లుక్కేయండి.
- Eswar Chennupalli
- Updated on: Feb 8, 2025
- 9:23 am
Liquor Scam: లిక్కర్ అక్రమాలపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. లెక్క తేలాల్సిందే..!
ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మద్యం అక్రమాలపై దర్యాప్తు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులతో సిట్ వేయడం ఆసక్తి రేపుతోంది.
- Eswar Chennupalli
- Updated on: Feb 6, 2025
- 7:24 am
Andhra Pradesh: కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కార్.. ఇక యాక్షన్ షురూ..!
అమ్మభాషకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇకపై ఏపీలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో వెలువడనున్నాయి. తెలుగుభాష పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక ఖైదీ పెరోల్కు సంబంధించిన ఉత్తర్వులను తెలుగులో విడుదల చేసింది ఏపీ హోం శాఖ.
- Eswar Chennupalli
- Updated on: Feb 5, 2025
- 2:46 pm
Sonu Sood: గొప్పమనసు చాటుకున్న సోనూసూద్.. ఏపీకి అంబులెన్సులు ఇచ్చిన సూద్ చారిటీ ఫౌండేషన్
ఆరోగ్యం-సామాజిక సంక్షేమం విషయంలో సేవలు అందించే ‘సూద్ చారిటీ ఫౌండేషన్’... రాష్ట్రంలో ప్రజారోగ్య సంరక్షణ కోసం నాలుగు అంబులెన్స్లను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ మేరకు నటుడు, ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్ మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు.
- Eswar Chennupalli
- Updated on: Feb 3, 2025
- 7:25 pm
AP News: విజయవాడ, విశాఖ మెట్రోపై బిగ్ అప్డేట్.. ఎగిరి గంతేసే వార్త.. వివరాలు ఇవిగో
ఏపీ ప్రజలకు పండుగ లాంటి వార్త.. విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులపై కీలక అప్ డేట్ వచ్చేసింది. విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూసేకరణకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..
- Eswar Chennupalli
- Updated on: Jan 30, 2025
- 9:30 am
DGP Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సీఎస్ విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చెయనున్న నేపథ్యలో.. హరీష్ కుమార్ గుప్తా నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు..
- Eswar Chennupalli
- Updated on: Jan 30, 2025
- 7:16 am
AP WhatsApp Governance: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్లోనే ధృవపత్రాల జారీ !
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ మరో శుభవార్త తీసుకువచ్చింది. పౌరసేవల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం(జనవరి 29) సమీక్ష నిర్వహించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
- Eswar Chennupalli
- Updated on: Jan 30, 2025
- 7:23 am
Nara Bhuvaneshwari: సెక్యూరిటీ లేకుండా అమరావతిలో నారా భువనేశ్వరి పర్యటన.. ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అమరావతి ప్రాంతంలో పర్యటించారు. అది కూడా ఎలాంటి హంగు, ఆర్భాటాలు, భద్రత లేకుండా రాజధాని ప్రాంతంలో కలియ తిరిగారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉండే రైతులతో భువనేశ్వరి ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
- Eswar Chennupalli
- Updated on: Jan 24, 2025
- 1:07 pm
Andhra Pradesh: నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి..? సీఎం చంద్రబాబు ఊహించని రియాక్షన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా చంద్రబాబు రాజకీయ వారసత్వంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇందులో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని కొందరంటుంటే, మరికొందరేమో కాబోయే సీఎం లోకేష్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక వీటిపై తాజాగా సీఎం చంద్రబాబు పెదవివిప్పారు..
- Eswar Chennupalli
- Updated on: Jan 23, 2025
- 8:07 am