AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eswar Chennupalli

Eswar Chennupalli

Associate Editor - TV9 Telugu

parameswara.chennupalli@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 22 ఏళ్ల అనుభవం ఉంది. అప్పటి సంచలన దిన పత్రిక వార్త లో క్రైమ్ రిపోర్టర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈనాడు జర్నలిజం స్కూల్ లో 2006-2007 బ్యాచ్ విద్యార్థిగా శిక్షణ పూర్తయింది. 2008 – 2009 లో మా టీవీ స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా, 2009 – 2014 వరకు టీవీ9 లో కరెస్పాండెంట్ గా, బ్యూరో చీఫ్ గా హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీ లో పనిచేసిన అనుభవం. 2014 – 19 వరకు డెక్కన్ క్రానికల్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా ముఖ్యమంత్రి కార్యాలయ బీట్ రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం. 2019 లో హెచ్. ఎం. టీ. వీ. స్టేట్ బ్యూరో చీఫ్ గా స్వల్పకాలం పనిచేసిన అనంతరం 2021 మార్చ్ నుంచి టీవీ9 – ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ గా పనిచేస్తూ ఉన్నాను.

Read More
Amaravati: అమరావతికి మరో 16,666 వేల ఎకరాలు

Amaravati: అమరావతికి మరో 16,666 వేల ఎకరాలు

అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర కేబినెట్ రెండో దశ ల్యాండ్‌ పూలింగ్‌కు ఆమోదం తెలిపింది. రైతులు స్వచ్ఛందంగా మరో 16,666.5 ఎకరాల భూములను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ భూసేకరణ ద్వారా రైల్వే ట్రాక్‌, ఇన్నర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ క్రీడా నగరం వంటి కీలక ప్రాజెక్టులు చేపట్టనున్నారు. 2028 మార్చి నాటికి అమరావతి నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనులు వేగవంతం చేస్తోంది.

సంక్రాంతి ఎఫెక్ట్.. హైదరాబాద్- వైజాగ్ బస్ టికెట్.. రూ. 7000

సంక్రాంతి ఎఫెక్ట్.. హైదరాబాద్- వైజాగ్ బస్ టికెట్.. రూ. 7000

సంక్రాంతి పండగ రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఛార్జీలను అసాధారణంగా పెంచేశాయి. కొన్ని మార్గాల్లో విమాన టికెట్ ధరలను మించి బస్సు ఛార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వం ప్రత్యేక బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

కేంద్రం సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు ??

కేంద్రం సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు ??

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో UIDAI దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా మరణించినవారి ఆధార్ నంబర్లను తొలగించింది. మోసాలను అరికట్టడానికి, ఆధార్ డేటాబేస్ ఖచ్చితత్వాన్ని కాపాడటానికి ఈ చర్య చేపట్టింది. మరణాలను నివేదించడానికి myAadhaar పోర్టల్‌లో కొత్త సౌకర్యం ప్రారంభించబడింది. పొరపాటున తొలగించిన ఆధార్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు.

Andhra Pradesh: ఏపీలో స్మార్ట్‌ కార్డ్‌.. ఆధార్‌ను మించి..

Andhra Pradesh: ఏపీలో స్మార్ట్‌ కార్డ్‌.. ఆధార్‌ను మించి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్' ను ప్రవేశపెట్టింది. చంద్రబాబు ఆదేశాల మేరకు 1.4 కోట్ల కుటుంబాలకు QR కోడ్‌తో కూడిన ఈ ఆల్‌ ఇన్ వన్ కార్డ్‌ను జారీ చేయనున్నారు. ఇది పౌర సేవలను సులభతరం చేస్తుంది, అన్ని సంక్షేమ పథకాలను ఒకే కార్డు కిందకు తెస్తుంది. P-4 సహా 25 రకాల వివరాలతో కుటుంబ ప్రయోజన నిర్వహణ వ్యవస్థ ద్వారా నిజ సమయ పాలనను లక్ష్యంగా చేసుకుంది.

CM Chandrababu Naidu: 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం

CM Chandrababu Naidu: 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయనుంది. దీంతో రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన కొలిక్కి వచ్చింది. ఐదు రెవెన్యూ డివిజన్‌లు, రెండు కొత్త మండలాల ఏర్పాటుకు కూడా సీఎం ఆమోదం తెలిపారు.

Andhra Pradesh: ఏపీ సంక్షేమ హాస్టల్స్‌లో ఉండే పిల్లల కోసం సర్కార్ కిర్రాక్ నిర్ణయం

Andhra Pradesh: ఏపీ సంక్షేమ హాస్టల్స్‌లో ఉండే పిల్లల కోసం సర్కార్ కిర్రాక్ నిర్ణయం

Andhra Pradesh: సంక్షేమ శాఖ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పారిశుద్ధ్యం నూటికి నూరు శాతం నిర్వహించాలన్నారు. ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదు. ఇటీవల కాలంలో హాస్టళ్లల్లో జరిగిన తప్పిదాలు మళ్లీ రిపీట్ కాకూడదు. అలాంటివి పునరావృతమైతే.. ఏం జరిగిందని తెలుసుకునేది..

Andhra News: ఇకపై ఏపీలో ఆధార్‌ను మించిన ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్స్.. వీటి ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

Andhra News: ఇకపై ఏపీలో ఆధార్‌ను మించిన ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్స్.. వీటి ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. ఇకపై రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి ఆధార్‌ను మించిన సూపర్ స్మార్ట్ కార్డ్‌ను ఇవ్వబోతుంది. ఈ కార్డుతో లబ్ధిదారులకు అనేక రకాల ప్రయోజనాలు చేకూరనున్నాయి. రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలనీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. 25 రకాల వివరాలతో పాటు పీ4 లాంటి అంశాలను అందులో చేర్చాలని సీఎం అధికారులకు సూచించారు.

Andhra Pradesh: స్థానిక సంస్థల ఎన్నికలు.. ఏపీ సర్కార్ ముందున్న సవాల్ ఇదే..

Andhra Pradesh: స్థానిక సంస్థల ఎన్నికలు.. ఏపీ సర్కార్ ముందున్న సవాల్ ఇదే..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రెడీ అవుతుండగా.. రిజర్వేషన్ల అంశం కీలకంగా మారింది. మార్చిలో పంచాయతీల గడువు ముగుస్తుంది. 34శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న హామీ, సుప్రీంకోర్టు 50శాతం పరిమితి, ట్రిపుల్ టెస్ట్ వంటి చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. దీనికోసం ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయి.

Chandrababu Naidu: అరటి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన AP CM

Chandrababu Naidu: అరటి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన AP CM

రాయలసీమలోని అరటి రైతులు తీవ్ర గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. టన్నుకు రూ.28 వేలు పలకాల్సిన అరటి ధర ప్రస్తుతం రూ.1000-2000కు పడిపోయింది. ఈ సంక్షోభంపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రానికి లేఖ రాసి, రైల్వే వ్యాగన్ల ద్వారా అరటిని ముంబై, కోల్కతా మార్కెట్లకు తరలించి, గిట్టుబాటు ధర కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Andhra Pradesh: కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. మరోసారి..

Andhra Pradesh: కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. మరోసారి..

ఏపీ జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రుల కమిటీ విస్తృతంగా చర్చించి, ప్రజల సూచనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. మార్కాపురం, మదనపల్లె సహా కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులపై చర్చించి తుది నివేదిక సమర్పించనుంది. సీఎం ఆమోదం తర్వాత కీలక ప్రకటన చేయనున్నారు.

Amaravati: ఆకట్టుకుంటున్న అమరావతి క్వాంటం వ్యాలీ నిర్మాణ నమూన.. బలే ఉన్నాయిగా బిల్డింగ్స్!

Amaravati: ఆకట్టుకుంటున్న అమరావతి క్వాంటం వ్యాలీ నిర్మాణ నమూన.. బలే ఉన్నాయిగా బిల్డింగ్స్!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన భవన నమూనాలను సచివాలయంలో ఏర్పాటు చేసిన అధికారులు సమీక్షించారు. అమరావతిని టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తోంది.

Andhra Pradesh: ఈ నెల 30న సీఎస్‌ పదవీ విరమణ..! తదుపరి చీఫ్ సెక్రటరీ ఎవరో తెలుసా?

Andhra Pradesh: ఈ నెల 30న సీఎస్‌ పదవీ విరమణ..! తదుపరి చీఫ్ సెక్రటరీ ఎవరో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ నవంబర్ 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయనకు మరో మూడు నెలల పాటు కొనసాగింపు ఇవ్వాలా లేదా అనే అంశంపై కూటమి ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. చివరికి తదుపరి సీఎస్ ఎవరనే ఉత్కంఠ తొలగింది. ఈ నెలాఖరుకు ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ రిటైర్ అవ్వనున్నారు. ఈ నేపధ్యంలో తదుపరి సీఎస్ ఎవరు అన్నదానిపై గత కొద్దిరోజులుగా చర్చలు నడిచాయి.