తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 22 ఏళ్ల అనుభవం ఉంది. అప్పటి సంచలన దిన పత్రిక వార్త లో క్రైమ్ రిపోర్టర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈనాడు జర్నలిజం స్కూల్ లో 2006-2007 బ్యాచ్ విద్యార్థిగా శిక్షణ పూర్తయింది. 2008 – 2009 లో మా టీవీ స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా, 2009 – 2014 వరకు టీవీ9 లో కరెస్పాండెంట్ గా, బ్యూరో చీఫ్ గా హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీ లో పనిచేసిన అనుభవం. 2014 – 19 వరకు డెక్కన్ క్రానికల్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా ముఖ్యమంత్రి కార్యాలయ బీట్ రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం. 2019 లో హెచ్. ఎం. టీ. వీ. స్టేట్ బ్యూరో చీఫ్ గా స్వల్పకాలం పనిచేసిన అనంతరం 2021 మార్చ్ నుంచి టీవీ9 – ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ గా పనిచేస్తూ ఉన్నాను.
ఎండలతో పోటీగా బీర్ విక్రయాలు.. ఏపీలో ‘కూలింగ్ డ్రింక్’గా మారిన బీర్!
Beer sales in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో మండుతున్న ఎండలతో బీర్ అమ్మకాలు భారీగా పెరిగాయి. మార్చి చివరి నుంచే వేసవి తీవ్రత పెరగడంతో ప్రజలు చల్లదనం కోసం బీర్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో రాష్ట్రంలో బీర్ విక్రయాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. బీర్ ఇప్పుడు కూల్ చేసే డ్రింక్గా మారిపోయింది.
- Eswar Chennupalli
- Updated on: May 22, 2026
- 9:20 pm
ఉద్యోగులు, విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ గుడ్న్యూస్.. బక్రీద్ సెలవు తేదీలో మార్పు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సందర్భంగా గతంలో ప్రకటించిన సెలవు తేదీలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత మే 27న సాధారణ సెలవుగా నిర్ణయించినప్పటికీ, తాజా ఉత్తర్వుల ప్రకారం ఆ సెలవును మే 28కి మారుస్తూ ప్రభుత్వం అధికారికంగా జీఓ విడుదల చేసింది.
- Eswar Chennupalli
- Updated on: May 21, 2026
- 2:00 pm
CM Chandrababu: అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఇదిగో వీడియో
కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఆగింది. భార్య భువనేశ్వరితో కలిసి కారు దిగి తాటి ముంజలు అమ్ముతున్న ఓ వ్యాపారి వద్దకు వెళ్లిన చంద్రబాబు.. ముంజలు రుచి చూస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సీఎం దంపతుల సరళత, సామాన్య ప్రజలతో మమేకమైన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Eswar Chennupalli
- Updated on: May 20, 2026
- 5:49 pm
Chandrababu: అన్నం తినడం పూర్తిగా మానేసిన ఏపీ సీఎం.. ఎక్కువగా ప్రొటీన్..
అన్నం తగ్గించి… ప్రోటీన్ పెంచితేనే ఆరోగ్యం బాగుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారు. రోజూ చేపలు, కంట్రోల్డ్ డైట్, హెల్త్ ట్రాకింగ్ టెక్నాలజీతో ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న ఆయన మాటలు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. పూర్తి వివరాలు కథనంలో ...
- Eswar Chennupalli
- Updated on: May 20, 2026
- 1:38 pm
Nara Lokesh: సీఎం చంద్రబాబుకు మత్స్యకారుల బోట్ల వందనం.. మంత్రి లోకేష్ అదిరిపోయే గిఫ్ట్!
కృష్ణానది సాక్షిగా ఒక అరుదైన, అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. కూటమి ప్రభుత్వంపై మత్స్యకారులు తమ కృతజ్ఞతను వినూత్న రీతిలో చాటుకున్నారు. వందలాది పడవలతో నదీమార్గాన వచ్చి సీఎం చంద్రబాబుకు ‘బోట్ల వందనం’ చేశారు. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ తన పెద్ద మనసును చాటుకున్నారు. నదిలో పడవలపై వచ్చిన మత్స్యకారులను నేరుగా తన నివాసానికి ఆహ్వానించి, ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు.
- Eswar Chennupalli
- Updated on: May 19, 2026
- 4:54 pm
Andhra Pradesh: గుడ్ న్యూస్.. ఆంధ్రాలో కొత్త పింఛన్లు వీరికే.. ఇదిగో పూర్తి వివరాలు..
ఏపీలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేదలకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ, లివర్, గుండె సంబంధిత తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వారికి 895 కొత్త పింఛన్లు మంజూరు చేసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ భరోసా పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న వారు, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారు, ద్వైపాక్షిక బోదకాలు, కుష్టు వంటి వ్యాధులతో బాధపడుతున్న అర్హులైన పేదలను ఈ పింఛన్ పరిధిలోకి తీసుకొచ్చారు.
- Eswar Chennupalli
- Updated on: May 14, 2026
- 6:20 pm
Be Alert: బీ అలెర్ట్.. ఏపీలో సైబర్ క్రైమ్ బాధితులు ఎంతమందో తెలుసా? రూ.652 కోట్ల లూటీ
Be Alert: సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడం, ఫిర్యాదులపై వెంటనే స్పందించడం, డబ్బుల ట్రాకింగ్ను వేగవంతం చేయడం కీలకమని అధికారులు చెబుతున్నారు. ఒక్క నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో సీఐడీ సైబర్..
- Eswar Chennupalli
- Updated on: May 13, 2026
- 8:30 pm
ట్రాన్స్జెండర్లకు గుడ్స్యూస్.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. దేశంలోనే తొలిసారిగా..!
సమాజంలో దశాబ్దాలుగా వివక్ష, నిరాకరణ, ఉపాధి లేమి మరియు గుర్తింపు సమస్యలతో సతమతమవుతున్న ట్రాన్స్జెండర్ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొండంత భరోసా ఇచ్చింది. ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ, వారి సామాజిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 'రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు'ను ఏర్పాటు చేస్తూ, దానికి ప్రతినిధులను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీఓ ఎంఎస్ నంబర్ 14ను విడుదల చేసింది.
- Eswar Chennupalli
- Updated on: May 12, 2026
- 5:29 pm
హైదరాబాద్ వేదికగా ఏపీ రాజకీయం.. ప్రోటోకాల్ దాటిన స్నేహం.. మిత్రుల ఇళ్లకు మోదీ!
హైదరాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన రాజకీయంగా విస్తృత చర్చకు దారి తీసింది. సాధారణంగా ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్లినా అధికారిక కార్యక్రమాలకే పరిమితం కావడం ఆనవాయితీ. కానీ ఈసారి తెలంగాణ పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలకు మోదీ వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
- Eswar Chennupalli
- Updated on: May 10, 2026
- 7:09 pm
Andhra News: పాస్టర్ ముసుగులో పాపాత్ముడు.. నమ్మి ఇంట్లోకి రానిస్తే.. చిన్న పిల్లని కూడా చూడకుండా..
నమ్మకంగా ఉండాల్సిన వారే కీచకులుగా మారుతున్న ఘటనలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కళ్లచెరువు గ్రామంలో వెలుగు చూసింది. ఒక మైనర్ బాలికపై చర్చి పాస్టర్ అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు పాస్టర్ బాలికకు ట్యాబ్లెట్స్ ఇవ్వడం జనాల్లో మరింత ఆగ్రహాన్ని రేకెత్తించింది.
- Eswar Chennupalli
- Updated on: May 9, 2026
- 7:03 pm
బియ్యపు గింజపై బొమ్మలు.. టూత్పిక్పై కొటెషన్స్.. ఆమె ట్యాలెంట్ చూస్తే మతిపోవాల్సిందే!
సాధారణంగా చూస్తే చిన్నవిగా అనిపించే వస్తువులపై అసాధారణమైన కళను ఆవిష్కరిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. టూత్పిక్పై పేర్లు చెక్కడం, బియ్యపు గింజపై బొమ్మలు వేయడం, చిన్న టాబ్లెట్స్పై 'జనగణమన' రాయడం.. ఇవన్నీ వినడానికే అసాధ్యం అనిపించే కళలు. కానీ విజయవాడకు చెందిన సుజాత అనే మైక్రో ఆర్టిస్ట్ మాత్రం తన ఓపిక, ఏకాగ్రతతో ఈ సూక్ష్మ కళలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. శ్రద్ధ ఉంటే ఎంత చిన్న స్థలంలోనైనా కళను పండించవచ్చని ఆమె నిరూపిస్తున్నారు.
- Eswar Chennupalli
- Updated on: May 8, 2026
- 8:06 pm
Andhra Pradesh: మంత్రులు, కార్యదర్శులూ బి కేర్ ఫుల్.. 24 గంటల్లో ఫైల్ క్లియర్ అవ్వాలి.. సీఎం వార్నింగ్
Andhra Pradesh: కొంతమంది కార్యదర్శులు మాత్రం ఒక్కో ఫైల్కు 5 నుంచి 6 రోజులు తీసుకుంటున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. జయలక్ష్మి, బాలసుబ్రహ్మణ్యం, ఆమ్రపాలి సహా పలువురు అధికారులు 24 గంటల్లోపు ఫైళ్లు క్లియర్ చేసేలా పని తీరు మార్చుకోవాలని..
- Eswar Chennupalli
- Updated on: May 8, 2026
- 2:31 pm