AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eswar Chennupalli

Eswar Chennupalli

Associate Editor - TV9 Telugu

parameswara.chennupalli@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 22 ఏళ్ల అనుభవం ఉంది. అప్పటి సంచలన దిన పత్రిక వార్త లో క్రైమ్ రిపోర్టర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈనాడు జర్నలిజం స్కూల్ లో 2006-2007 బ్యాచ్ విద్యార్థిగా శిక్షణ పూర్తయింది. 2008 – 2009 లో మా టీవీ స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా, 2009 – 2014 వరకు టీవీ9 లో కరెస్పాండెంట్ గా, బ్యూరో చీఫ్ గా హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీ లో పనిచేసిన అనుభవం. 2014 – 19 వరకు డెక్కన్ క్రానికల్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా ముఖ్యమంత్రి కార్యాలయ బీట్ రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం. 2019 లో హెచ్. ఎం. టీ. వీ. స్టేట్ బ్యూరో చీఫ్ గా స్వల్పకాలం పనిచేసిన అనంతరం 2021 మార్చ్ నుంచి టీవీ9 – ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ గా పనిచేస్తూ ఉన్నాను.

Read More
Andhra Pradesh: దావోస్‌లో ఏపీకి జాక్‌పాట్.. లక్ష కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాలు..

Andhra Pradesh: దావోస్‌లో ఏపీకి జాక్‌పాట్.. లక్ష కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాలు..

ఏపీలో మరో భారీ పెట్టుబడికి ఆర్ఎంజడ్ (RMZ) సంస్థ ముందుకు వచ్చింది. ఈ రోజు దావోస్ లో ఆర్ఎంజడ్ ఛైర్మన్ మనోజ్ మెండాతో మంత్రి లోకేష్ జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో లక్ష ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్ఎంజడ్ సంస్థ ముందుకు వచ్చింది.

ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయం.. భారీగా ఉద్యోగాలు!

ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయం.. భారీగా ఉద్యోగాలు!

విశాఖ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. విశాఖపట్నంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇమిగ్రేషన్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు కానుంది. దీనితో ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు విదేశీ ప్రయాణాలకు హైదరాబాద్, చెన్నైపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ కార్యాలయం విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చి, అంతర్జాతీయ విమాన సేవలు, కార్గో కార్యకలాపాలకు మార్గం సుగమం చేస్తుంది. పర్యాటకం, వ్యాపారం, ఉపాధి అవకాశాలు పెరిగి, విశాఖ ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదుగుతుంది.

Private Travels: సంక్రాంతి రద్దీతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడి.. హద్దు మీరితే చర్యలు తప్పవంటున్న అధికారులు!

Private Travels: సంక్రాంతి రద్దీతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడి.. హద్దు మీరితే చర్యలు తప్పవంటున్న అధికారులు!

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను ప్రైవేటు ట్రావెల్స్ అధిక ఛార్జీలతో దోచుకుంటున్నాయి. విమాన ఛార్జీలకు సమానంగా బస్ టికెట్లు పెంచడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై రవాణా శాఖ సీరియస్ అయింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎవరైనా అధిక చార్జీలు వసూలు చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ (9281607001) ఫిర్యాదు చేయాలని ప్రయాణికులకు సూచించింది.

Vangalapudi Anitha: కార్యకర్త కోసం అర్థరాత్రి ఆస్పత్రికి పరిగెత్తిన హోమ్ మంత్రి అనిత.. అసలు ఏం జరిగిందంటే?

Vangalapudi Anitha: కార్యకర్త కోసం అర్థరాత్రి ఆస్పత్రికి పరిగెత్తిన హోమ్ మంత్రి అనిత.. అసలు ఏం జరిగిందంటే?

రాత్రి, పగలనే తేడా లేదు.. కార్యకర్తకు కష్టం వస్తే ఏక్షణమైనా నాయకులు అండగా ఉంటారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మరోసారి నిరూపించారు. అనారోగ్యంతో బాధపడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్నానని.. కార్యకర్త నుంచి వచ్చిన ఒక్క ఫోన్‌ కాల్‌.. ఆమెరు అర్థరాత్రి హాస్పిటల్‌కు చేర్చింది. కష్టాల్లో ఉన్నాననమ్మా.. కాపాడంటూ కార్యకర్త మాటలు ఆమెను చలించిపోయేలా చేశారు. అది అర్థరాత్రి అయినా వెంటనే హాస్పిటల్‌కు చేరుకొని కార్యకర్తను పరామర్శించారు హోంమంత్రి అనిత.. అతనికి ధైర్యం చెప్పి భరోసానిచ్చారు.

Andhra: ఏపీలోనూ మందుబాబులు రఫ్పాడించారు.. డిసెంబర్ చివరి 3 రోజుల్లో రికార్డు స్థాయిలో..

Andhra: ఏపీలోనూ మందుబాబులు రఫ్పాడించారు.. డిసెంబర్ చివరి 3 రోజుల్లో రికార్డు స్థాయిలో..

నూతన సంవత్సర వేడుకలతో ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. 2025 డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.2,767 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగగా… గత ఏడాదితో పోలిస్తే సుమారు 8 శాతం వృద్ధి నమోదైంది. ప్రత్యేకంగా డిసెంబర్ చివరి మూడు రోజుల్లోనే రూ.543 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరగడం న్యూ ఇయర్ జోష్‌ను స్పష్టంగా చూపిస్తోంది.

Andhra: ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్.. ఎన్ని రోజులంటే.?

Andhra: ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్.. ఎన్ని రోజులంటే.?

ఏపీ విద్యార్ధులకు పండుగ ముందే వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా భారీగా సెలవులు ఇచ్చింది. అయితే సెలవులు అయిన తర్వాతి రోజు నుంచి తిరిగి స్కూల్స్ రీ-స్టార్ట్ కానున్నట్టు తెలిపింది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Amaravathi: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

Amaravathi: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

Andhra Pradesh: ఈ ఐకానిక్ భవనం నిర్మాణానికి సుమారు 45 వేల టన్నుల స్టీల్ వినియోగించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. భవనం భద్రత, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ నాణ్యత గల నిర్మాణ సామగ్రిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. రాఫ్ట్ ఫౌండేషన్..

Andhra: అమరావతికి మరో శుభవార్త అందించిన కేంద్రం.. సూపర్ కదా..

Andhra: అమరావతికి మరో శుభవార్త అందించిన కేంద్రం.. సూపర్ కదా..

రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. అమరావతిలో రూ.80 కోట్ల వ్యయంతో వరల్డ్ క్లాస్ పోస్టల్ రీజినల్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యాలయంతో రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ పరిపాలన మరింత సమర్థవంతం కానుంది. ..

Vizag: రుషికొండ భవనాలను ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా?

Vizag: రుషికొండ భవనాలను ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా?

విశాఖ రుషికొండ ప్యాలెస్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. హాస్పిటాలిటీ రంగానికి అనుసంధానిస్తూ ప్రీమియం టూరిజం ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసి, ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టాటా, లీలా వంటి ప్రముఖ గ్రూప్‌లతో చర్చలు జరిపే అవకాశాన్ని పరిశీలిస్తోంది.

Andhra: ఏపీలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు గుడ్ న్యూస్..

Andhra: ఏపీలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు గుడ్ న్యూస్..

మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలను వేగంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ వైద్య సరఫరా వ్యవస్థను ప్రారంభిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా 60–80 కిలోమీటర్ల పరిధిలోని గిరిజన ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల ద్వారా మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేయనుంది. కోల్డ్ చైన్ సదుపాయంతో కూడిన ఈ డ్రోన్లను రక్తం, ఇతర నమూనాల రవాణాకు కూడా వినియోగించనున్నారు.

Tollywood: “టికెట్ రేట్ కంటే పాప్ కార్న్ రేట్ ఎక్కువ అయింది..”

Tollywood: “టికెట్ రేట్ కంటే పాప్ కార్న్ రేట్ ఎక్కువ అయింది..”

థియేటర్లలో సినిమా టికెట్ రేట్ల కంటే పాప్‌కార్న్‌, కూల్‌డ్రింక్స్ ధరలే ఎక్కువగా ఉన్నాయని సినీ దర్శకుడు తేజ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగా మధ్యతరగతి ప్రేక్షకులు థియేటర్లకు రావడంలో వెనుకడుగు వేస్తున్నారని చెప్పారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

Andhra: ఇంటింటి సర్వేకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం. అందుకేనా?

Andhra: ఇంటింటి సర్వేకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం. అందుకేనా?

రాష్ట్రంలోని ప్రతి కుటుంబ వివరాలు ఖచ్చితంగా నమోదు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏకీకృత కుటుంబ సర్వే (UFS) ప్రారంభిస్తోంది. అర్హులెవ్వరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి తప్పిపోకుండా చూడటమే లక్ష్యం. డిసెంబర్ చివరి వారం నుంచి ఇంటింటి సర్వే చేపట్టి, మొబైల్ యాప్–ఆధార్ ధృవీకరణతో డేటా నవీకరణ చేయనున్నారు.