AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eswar Chennupalli

Eswar Chennupalli

Associate Editor - TV9 Telugu

parameswara.chennupalli@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 22 ఏళ్ల అనుభవం ఉంది. అప్పటి సంచలన దిన పత్రిక వార్త లో క్రైమ్ రిపోర్టర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈనాడు జర్నలిజం స్కూల్ లో 2006-2007 బ్యాచ్ విద్యార్థిగా శిక్షణ పూర్తయింది. 2008 – 2009 లో మా టీవీ స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా, 2009 – 2014 వరకు టీవీ9 లో కరెస్పాండెంట్ గా, బ్యూరో చీఫ్ గా హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీ లో పనిచేసిన అనుభవం. 2014 – 19 వరకు డెక్కన్ క్రానికల్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా ముఖ్యమంత్రి కార్యాలయ బీట్ రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం. 2019 లో హెచ్. ఎం. టీ. వీ. స్టేట్ బ్యూరో చీఫ్ గా స్వల్పకాలం పనిచేసిన అనంతరం 2021 మార్చ్ నుంచి టీవీ9 – ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ గా పనిచేస్తూ ఉన్నాను.

Read More
Andhra: ఆ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. రిటైర్ అయినా వాళ్లకు మళ్లీ ఉద్యోగం

Andhra: ఆ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. రిటైర్ అయినా వాళ్లకు మళ్లీ ఉద్యోగం

ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం.45ను జారీ చేసింది. ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా వర్తించనుంది.

ఆ ఒక్క చోట తప్ప.. ఏపీలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో బార్లు, వైన్ షాప్స్ షురూ.. దరఖాస్తు ఫీజు ఎంతంటే..

ఆ ఒక్క చోట తప్ప.. ఏపీలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో బార్లు, వైన్ షాప్స్ షురూ.. దరఖాస్తు ఫీజు ఎంతంటే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి విమానాశ్రయం మినహా రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో 24 గంటల పాటు బార్లు, వైన్ షాపుల నిర్వహణకు అనుమతి ఇస్తూ కొత్త ఎక్సైజ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూర్చడమే ఈ విధానం లక్ష్యమని తెలిపింది. తిరుమల క్షేత్ర పవిత్రత దృష్ట్యా తిరుపతి విమానాశ్రయానికి మాత్రం మినహాయింపు ఇచ్చింది.

Andhra Pradesh: ఏపీ బంగారం వచ్చేసిందోచ్చ్.. “మేడ్ ఇన్ ఆంధ్రా” పేరుతో మార్కెట్లోకి..

Andhra Pradesh: ఏపీ బంగారం వచ్చేసిందోచ్చ్.. “మేడ్ ఇన్ ఆంధ్రా” పేరుతో మార్కెట్లోకి..

మేడ్ ఇన్ ఆంధ్రా బంగారం మార్కెట్లోకి వచ్చేసింది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు నిల్వలను కనుగొన్న విషయం తెలిసిందే. దీంతో అక్కడి మైన్ నుంచి బంగారాన్ని వెలికితీశారు. వీటిని శుద్ది చేసి బంగారు బిస్కెట్లుగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ బంగారంపై ఏపీ లోగో ముద్రించారు

హైదరాబాద్ తర్వాత అమరావతిలో బసవతారకం.. వైద్య సేవల ప్రారంభ తేదీపై కీలక అప్‌డేట్!

హైదరాబాద్ తర్వాత అమరావతిలో బసవతారకం.. వైద్య సేవల ప్రారంభ తేదీపై కీలక అప్‌డేట్!

Basavatarakam Cancer Hospital Amaravati: అమరావతిలో రూ.750 కోట్లతో నిర్మిస్తున్న బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తొలి దశలో 500 పడకలతో 2028 నాటికి వైద్య సేవలు ప్రారంభించాలని ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత వెయ్యి పడకలతో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స కేంద్రంగా ఈ ఆస్పత్రి సేవలు అందించనుంది.

ప్రైవేట్ స్కూళ్ల ఇష్టారాజ్యానికి బ్రేక్.. ఇక అధిక ఫీజులు వసూలు చేస్తే తాటతీసుడే! సర్కార్ కొరడా..

ప్రైవేట్ స్కూళ్ల ఇష్టారాజ్యానికి బ్రేక్.. ఇక అధిక ఫీజులు వసూలు చేస్తే తాటతీసుడే! సర్కార్ కొరడా..

ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫీజు నియంత్రణ విధానాన్ని రూపొందిస్తోంది. జిల్లా స్థాయి కమిటీలు, ఆన్‌లైన్ ఫిర్యాదు వ్యవస్థ, ఫీజులపై పర్యవేక్షణ వంటి కీలక ప్రతిపాదనలను విద్యాశాఖ సిద్ధం చేసింది. తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు ఫీజుల వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే ఈ కొత్త పాలసీ లక్ష్యంగా ఉంది..

Pawan Kalyan: పానకాల స్వామి సాక్షిగా దీక్షలోకి పవన్ కళ్యాణ్.. డైలీ ఎలాంటి నియమాలు పాటిస్తారో తెలుసా..?

Pawan Kalyan: పానకాల స్వామి సాక్షిగా దీక్షలోకి పవన్ కళ్యాణ్.. డైలీ ఎలాంటి నియమాలు పాటిస్తారో తెలుసా..?

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా వార్షిక దీక్షను ప్రారంభించారు. జ్యేష్ఠ మాసం నుంచి కార్తీక మాసం వరకు కొనసాగే ఈ దీక్షలో సాత్విక ఆహారం, నిత్య పూజలు, ధ్యానం, మంత్ర పారాయణం వంటి కఠిన నియమాలను పాటిస్తారు. రాజకీయ బాధ్యతలతో పాటు ఆధ్యాత్మిక సాధనకు సమాన ప్రాధాన్యం ఇస్తూ పవన్ కళ్యాణ్ ఈ దీక్షను ఆచరిస్తారు.

నేను కూడా సాయిబాబా భక్తుడినే.. భక్తులకు మంత్రి ఆనం క్షమాపణలు.. ఎందుకంటే..

నేను కూడా సాయిబాబా భక్తుడినే.. భక్తులకు మంత్రి ఆనం క్షమాపణలు.. ఎందుకంటే..

షిర్డీ సాయిబాబా ఆలయాలకు శ్రీవాణి ట్రస్టు నిధుల కేటాయింపుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా సాయిబాబా భక్తుడినేనని, తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే హృదయపూర్వకంగా క్షమించాలని కోరారు. సాయిబాబాపై కోట్లాది మంది ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ప్రభుత్వం గౌరవిస్తుందని స్పష్టం చేసిన మంత్రి, శ్రీవాణి ట్రస్టు నిధుల కేటాయింపు మాత్రం ట్రస్టు లక్ష్యాలు, నిబంధనల ప్రకారమే జరుగుతుందని తెలిపారు.

శ్రీవాణి నిధులతో షిర్డీ సాయి ఆలయాలు నిర్మించం: ఏపీ దేవాదాయ శాఖ

శ్రీవాణి నిధులతో షిర్డీ సాయి ఆలయాలు నిర్మించం: ఏపీ దేవాదాయ శాఖ

శ్రీవాణి నిధులను షిర్డీ సాయి ఆలయాల నిర్మాణానికి వినియోగించబోమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీవాణి నిధులు వైదిక, ఆగమ సంప్రదాయాలను అనుసరించే హిందూ దేవాలయాల అభివృద్ధి కోసమేనని తెలిపారు. షిర్డీ సాయి ఆలయాలు ఆ పరిధిలోకి రావని పేర్కొంటూ, సనాతన ధర్మ ప్రచారం కోసం ఈ నిధులను వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ, ధార్మిక వర్గాల్లో చర్చకు దారితీశాయి.

యోగాంధ్ర సంబరం.. సీఎం చంద్రబాబుతో కలిసి బాబా రాందేవ్ యోగాసనాలు.. కోటి మందితో రికార్డు లక్ష్యం!

యోగాంధ్ర సంబరం.. సీఎం చంద్రబాబుతో కలిసి బాబా రాందేవ్ యోగాసనాలు.. కోటి మందితో రికార్డు లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ హాజరుకానున్నారు. ఈ నెల 20న ఉండవల్లి గుహల వద్ద సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన ప్రత్యేక యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 21న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి వేడుకలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 33 వేల కేంద్రాల్లో దాదాపు కోటి మందితో యోగా చేయించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఏపీలో బంగారం కొండలు.. రాయలసీమ నేలలో పసిడి భాండాగారం.. వెలికితీతకు సిద్ధం!

ఏపీలో బంగారం కొండలు.. రాయలసీమ నేలలో పసిడి భాండాగారం.. వెలికితీతకు సిద్ధం!

ఆంధ్రప్రదేశ్ త్వరలోనే దేశ బంగారు ఉత్పత్తి రంగంలో కీలక కేంద్రంగా మారబోతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే తొలి భారీ ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. స్వాతంత్ర్యం తర్వాత ప్రైవేట్ రంగంలో ఏర్పాటు అవుతున్న అతిపెద్ద బంగారు గనిగా ఈ ప్రాజెక్టు ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.

Andhra Pradesh: విధులకు డుమ్మా కొడితే ఇంటికే.. 43 మంది డాక్టర్లపై ఏపీ సర్కార్ కఠిన చర్యలు..

Andhra Pradesh: విధులకు డుమ్మా కొడితే ఇంటికే.. 43 మంది డాక్టర్లపై ఏపీ సర్కార్ కఠిన చర్యలు..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరతపై తరచూ విమర్శలు వస్తున్న వేళ విధులకు గైర్హాజరవుతున్న వైద్యులపై ఏపీ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. సంవత్సరాల తరబడి ఉద్యోగాలకు దూరంగా ఉంటూ ప్రభుత్వ సేవలను నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే పలువురు వైద్యులపై చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా మరో 43 మంది వైద్యులను విధుల నుంచి తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

AP: బీచ్, బీర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏపీ  బీచ్ లలో బార్లు, బీర్లు

AP: బీచ్, బీర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏపీ బీచ్ లలో బార్లు, బీర్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరప్రాంత పర్యాటకాన్ని, ఉపాధిని పెంచే లక్ష్యంతో కొత్త 'బీచ్ షాక్ పాలసీ'ని G.O.Ms.No.363 ద్వారా అమలులోకి తెచ్చింది. విశాఖపట్నం, సూర్యలంకలలో పైలట్ ప్రాజెక్ట్‌గా తక్కువ ఆల్కహాల్ పానీయాల విక్రయానికి అనుమతిచ్చింది. అయితే, బీచ్‌లలో మద్యం లభ్యతతో భద్రతా ప్రమాదాలు పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే