తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 22 ఏళ్ల అనుభవం ఉంది. అప్పటి సంచలన దిన పత్రిక వార్త లో క్రైమ్ రిపోర్టర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈనాడు జర్నలిజం స్కూల్ లో 2006-2007 బ్యాచ్ విద్యార్థిగా శిక్షణ పూర్తయింది. 2008 – 2009 లో మా టీవీ స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా, 2009 – 2014 వరకు టీవీ9 లో కరెస్పాండెంట్ గా, బ్యూరో చీఫ్ గా హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీ లో పనిచేసిన అనుభవం. 2014 – 19 వరకు డెక్కన్ క్రానికల్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా ముఖ్యమంత్రి కార్యాలయ బీట్ రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం. 2019 లో హెచ్. ఎం. టీ. వీ. స్టేట్ బ్యూరో చీఫ్ గా స్వల్పకాలం పనిచేసిన అనంతరం 2021 మార్చ్ నుంచి టీవీ9 – ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ గా పనిచేస్తూ ఉన్నాను.
Home Minister Anitha: ఎప్పుడూ వాళ్లేనా.. మేమూ చేస్తాం.. పవర్ పాలి’ట్రిక్స్’ కేరాఫ్ అనిత..!
ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన, శక్తివంతమైన పోర్ట్ ఫోలియోను చేపట్టిన ఆ మహిళా నేత, ఇప్పుడు ఆ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నారా? పంటి బిగువున కష్టాలను, ఇబ్బందులను, అవమానాలను దిగమింగిన ఆ జేజమ్మ.. ఇప్పుడు ఇది నా అడ్డా! ఎవరొస్తారో రండి చూద్దాం అని గర్వంగా తల ఎగురవేస్తోందా? రాజకీయం అంటే వాళ్ళే కాదు, మేమూ చేస్తాం అని పవర్ పాలిటిక్స్ ను ప్రాక్టీస్ చేస్తోందా?
- Eswar Chennupalli
- Updated on: Jul 13, 2024
- 6:25 pm
వైజాగ్ పోర్టుకు మహర్థశ.. ఈ రెండు దేశాల కార్గో ఒప్పందాలపై చర్చలు..
ఇటీవల కాలంలో మెరుగైన పనితీరుతో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న విశాఖ పోర్టుపై అందరి దృష్టి పడుతోంది. తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్తో వాణిజ్యం కోసం వైజాగ్ పోర్టును రవాణా కేంద్రంగా ఎంచుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. భారత జలరవాణా మంత్రిత్వ శాఖ, బంగ్లాదేశ్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖల మధ్య కొనసాగుతున్న చర్చలు విజయవంతమైతే, బంగాళాఖాతం వెంబడి తూర్పు తీరంలో జలమార్గం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యం మరింత మెరుగుపడుతుంది.
- Eswar Chennupalli
- Updated on: Jul 13, 2024
- 10:19 am
Visakha Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ విజిటర్స్ బుక్లో ఆసక్తికర వ్యాఖ్యలు రాసిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి..!
స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుందని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో... కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ పర్యటనపై కార్మికుల్లో ఆశలు చిగురించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ మూత పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. విజిటర్స్ బుక్లో స్పష్టంగా ఆ విషయం నమోదు చేశారు.
- Eswar Chennupalli
- Updated on: Jul 11, 2024
- 6:13 pm
Visakhapatnam: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా? కేంద్రమంత్రి పర్యటన ఉద్దేశం ఏంటి?
మూడు సంవత్సరాలకు పైగా పోరాటం చేస్తున్న కార్మికులతో పాటు.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన ఆంధ్రప్రదేశ్ అభిమానులందరికీ సంతోషం కలిగించే వార్త రాబోతోందా? విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పెట్టుబడుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించబోతుందా? కేంద్ర ఉక్కు మంత్రి హెచ్ డి కుమారస్వామి నేడు, రేపు విశాఖ పర్యటన అందుకోసమేనా? పూర్తిస్థాయి ఉత్పత్తికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడంతో పాటు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చేసిన సెయిల్లో విలీనం ప్రతిపాదన చర్చకు రాబోతోందా?
- Eswar Chennupalli
- Updated on: Jul 10, 2024
- 10:27 am
Visakha MLC Election: మళ్ళీ మరో ఎన్నికకు సిద్ధమవుతున్న విశాఖ.. మరోసారి అభ్యర్థులు వాళ్లేనా..?
ఎమ్మెుల్యే వంశీ రాజీనామాతో ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందుకోసం తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతోంది. 164 స్థానాలతో అధికారంలో వచ్చింది టీడీపీ. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఓటర్ల మద్దతు పొందడం సులభం అన్నది టీడీపీ నేతల అభిప్రాయం.
- Eswar Chennupalli
- Updated on: Jul 2, 2024
- 8:09 pm
PM Modi: అరకు వ్యాలీకి మరో అరుదైన గుర్తింపు.. తొలి మన్ కీ బాత్లో ప్రధాని మోదీ..
మన అరకు కాఫీకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బ్రాండ్ అంబాసిడర్గా మారారు. అవకాశం దొరికినప్పుడల్లా అరకు కాఫీని గుర్తు తెచ్చుకుంటారు ఆయన. హ్యాట్రిక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి మన్ కీ బాత్లో మరోమారు అరకు కాఫీని ప్రశంసించారు. ఈ సందేశం అరకు వ్యాలీని మరోసారి ఆనందోత్సాహాలలో నింపింది. కేవలం ప్రశంసలు మాత్రమే కాదు.. అరకు కాఫీ రుచిని ఆస్వాధించమని మన్ కి బాత్ శ్రోతలను కూడా కోరారు ప్రధాని మోడీ.
- Eswar Chennupalli
- Updated on: Jun 30, 2024
- 5:45 pm
విశేష సేవలందించిన హెలికాప్టర్కు వీడ్కోలు.. ఎంత గొప్పగా చేశారంటే..
భారత నౌకాదళంలో 17 సంవత్సరాల పాటు అద్భుతమైన సేవలు అందించిన UH-3H హెలికాప్టర్కు భారత నావికాదళం ఘనంగా వీడ్కోలు పలికింది. ఇందుకోసం ఏకంగా విశాఖలోని నౌకా విమానాశ్రయం INS డేగాలో జరిగిన డి-ఇండక్షన్ పేరుతో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్ అడ్మిరల్ సమీర్ సక్సేనా అధ్యక్షత వహించారు. UH3H స్క్వాడ్రన్లోని సేవలు అందించిన అనుభవజ్ఞులైన అధికారులు, సిబ్బంది హెలికాప్టర్ అద్భుతమైన సేవలను గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులతో ఈవెంట్ను తిలకించారు.
- Eswar Chennupalli
- Updated on: Jun 30, 2024
- 4:42 pm
ఆ వర్సిటీని పార్టీ ఆఫీసుగా మార్చారంటూ విమర్శలు.. వీసీ పదవికి ప్రొఫెసర్ రాజీనామా..
ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్కు తన రాజీనామా లేఖను పంపారు. నాలుగు సంవత్సరాలుగా ఏయూ వీసీగా కొనసాగుతున్న ప్రసాద్ రెడ్డి.. 1987 నుంచి ఆంధ్రా యూనివర్శిటీలో కంప్యూటర్స్ విభాగపు హెచ్ఓడీ, ప్రిన్సిపాల్, డీన్, రిజిస్ట్రార్, రెక్టార్గా పనిచేశారు.
- Eswar Chennupalli
- Updated on: Jun 29, 2024
- 2:58 pm
పురంధేశ్వరి ప్రత్యేక చొరవ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగినట్టేనా.?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని ఆంధ్రపదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రయత్నిస్తున్నారు. అందుకే ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి కేంద్రాన్ని కోరుతున్నారు. లాభాల బాటలో నడిపేందుకు సహకరించాలని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామిని తాజాగా దగ్గుబాటి పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు. అందుకు స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడమే అత్యుత్తమ ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు. మరి పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుని, పురంధరేశ్వరి ప్రతిపాదనను అంగీకరిస్తుందా? లేదా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది.
- Eswar Chennupalli
- Updated on: Jun 27, 2024
- 5:32 pm
ఇది కదా అంబానీ రేంజ్ అంటే..! అనంత్ అంబానీ ఒక్కో వెడ్డింగ్ కార్డు ధర తెలిస్తే..
అనంత్ అంబానీ ఒక్కో వెడ్డింగ్ కార్డు ధర ఎంతో తెలుసా.? అక్షరాలా రూ. 6.50 లక్షలు. మూడు కేజీల వెండి దేవాలయంలో 24 క్యారెట్ల బంగారు విగ్రహాలతో కూడిన వెడ్డింగ్ కార్డు ఇది. అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల..
- Eswar Chennupalli
- Updated on: Jun 27, 2024
- 9:57 am
అంతులేని విషాదం.. రోజుల వ్యవధిలోనే తండ్రీ కొడుకులు మృతి.. పెంపుడు కుక్క కూడా.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
సాధారణంగా పెంపుడు కుక్కల్ని బయట కుక్కలు కరిచినప్పుడు కొన్ని రకాల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. వాటికి ఆ సమయంలో వ్యాక్సిన్ ఇవ్వకపోతే అది విషం గా మారే ప్రమాదం ఉంటుంది. అలాంటి కుక్కలు కరిస్తే ప్రాణాలకి ఇబ్బందులు కలిగే పరిస్థితులు వస్తాయి.. ఇప్పుడు కూడా అదే జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. పెంపుడు కుక్క మరణించిన తర్వాత భార్గవ్ హుటాహుటినా హాస్పిటల్ కి వెళ్లినా అప్పటికే రేబిస్ వ్యాధి వారి శరీరంతో పాటు మెదడుకు కూడా సోకిందని తేలింది.
- Eswar Chennupalli
- Updated on: Jun 26, 2024
- 1:33 pm
విశాఖపోర్టుకు అరుదైన ఘనత.. వాటి ఎగుమతుల్లో అగ్రస్థానం..
మన విశాఖ పోర్ట్ అన్ని రంగాల్లో తన ప్రతిభను ప్రదర్శిస్తోంది. ఇటీవలనే ప్రపంచ బ్యాంక్ నిర్వహించిన పోర్టు పని తీరు సూచికలో విశాఖ పోర్టు 20వ స్థానంలో నిలిచింది. అదే విధంగా కంటైనర్ పోర్టు పని తీరు సూచీలో 19వ స్థానంలో నిలిచి మరో రెండు రికార్డుల్ని నెలకొల్పింది. కంటైనర్ పోర్టు పని తీరు సూచీలో తనకున్న విశేష అవకాశాల్ని అందిపుచ్చుకుని 2022లో ఉన్న 122వ స్థానం నుంచి ఏకంగా 103 స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి చేరుకుంది.
- Eswar Chennupalli
- Updated on: Jun 25, 2024
- 9:45 pm