AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eswar Chennupalli

Eswar Chennupalli

Associate Editor - TV9 Telugu

parameswara.chennupalli@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 22 ఏళ్ల అనుభవం ఉంది. అప్పటి సంచలన దిన పత్రిక వార్త లో క్రైమ్ రిపోర్టర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈనాడు జర్నలిజం స్కూల్ లో 2006-2007 బ్యాచ్ విద్యార్థిగా శిక్షణ పూర్తయింది. 2008 – 2009 లో మా టీవీ స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా, 2009 – 2014 వరకు టీవీ9 లో కరెస్పాండెంట్ గా, బ్యూరో చీఫ్ గా హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీ లో పనిచేసిన అనుభవం. 2014 – 19 వరకు డెక్కన్ క్రానికల్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా ముఖ్యమంత్రి కార్యాలయ బీట్ రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం. 2019 లో హెచ్. ఎం. టీ. వీ. స్టేట్ బ్యూరో చీఫ్ గా స్వల్పకాలం పనిచేసిన అనంతరం 2021 మార్చ్ నుంచి టీవీ9 – ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ గా పనిచేస్తూ ఉన్నాను.

Read More
మెగా ఫ్యామిలీకి వెరీ గుడ్ టైం.. కొణిదెల సుస్మితకు కీలక పోస్ట్..

మెగా ఫ్యామిలీకి వెరీ గుడ్ టైం.. కొణిదెల సుస్మితకు కీలక పోస్ట్..

చిరంజీవి పెద్ద కుమార్తె కొణిదెల సుస్మితకు ఏపీ ప్రభుత్వం కీలక అవకాశం కల్పించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డులో సుస్మితను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..

గుడ్‌న్యూస్.. కొత్త పెన్షన్లకు పచ్చజెండా.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే..

గుడ్‌న్యూస్.. కొత్త పెన్షన్లకు పచ్చజెండా.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే..

ఏపీలో కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు కొత్త పెన్షన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం అర్హత పరిశీలన, భౌతిక వెరిఫికేషన్, బడ్జెట్ ప్రతిపాదనలు చేపట్టి, ప్రభుత్వ ఆమోదం తర్వాత అర్హులకు దశలవారీగా పెన్షన్లు మంజూరు చేయనున్నారు. 28 కేటగిరీలకు ఈ పథకం వర్తించనుంది.

Vizag Zoo: పిల్లలకు ఇక పండగే.. విశాఖ జూలోకి అరుదైన కొత్త అతిథులు!

Vizag Zoo: పిల్లలకు ఇక పండగే.. విశాఖ జూలోకి అరుదైన కొత్త అతిథులు!

వైజాగ్ జూ లవర్స్‌కి ఇదో అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అవును ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్‌లోకి కొత్త అతిథులు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ముచ్చటైన జీబ్రాలు, చురుకైన వాలబీలతో పాటు చరిత్రలోనే తొలిసారిగా అంతరించిపోతున్న అరుదైన కాటన్-టాప్ టామరిన్లు సైతం విశాఖ జూలో సందడి చేయబోతున్నాయి.

Local Body Elections: ఏపీలో స్థానిక సమరానికి ముందడుగు.. మూడు దశల్లో మున్సిపల్ వార్డుల డీలిమిటేషన్

Local Body Elections: ఏపీలో స్థానిక సమరానికి ముందడుగు.. మూడు దశల్లో మున్సిపల్ వార్డుల డీలిమిటేషన్

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా మరో కీలక ప్రక్రియ ముందుకు సాగుతోంది. పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు మున్సిపల్ శాఖ షెడ్యూల్ ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 39 పట్టణ స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్ ప్రక్రియను దశలవారీగా పూర్తి చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 3, 8, 15 తేదీల్లో వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

విజయవాడలో మద్యానికి బదులు శానిటైజర్ తాగుతున్నారా? అసలు విషయం తెలిస్తే షాకే..!

విజయవాడలో మద్యానికి బదులు శానిటైజర్ తాగుతున్నారా? అసలు విషయం తెలిస్తే షాకే..!

ఇథనాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను కొందరు మద్యానికి ప్రత్యామ్నాయంగా దుర్వినియోగం చేస్తున్నారు. విజయవాడలో భారీ విక్రయాలు వెలుగులోకి రావడంతో రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్ సమయంలో ఇచ్చిన లైసెన్స్ మినహాయింపును ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరింది. ఇది ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగించే అంశం.

Onion, Palm Oil Prices: నిత్యావసర ధరలకు కళ్లెం.. ఉల్లి కిలో రూ.35కే, పామాయిల్‌పై రూ.10 తక్కువ..!

Onion, Palm Oil Prices: నిత్యావసర ధరలకు కళ్లెం.. ఉల్లి కిలో రూ.35కే, పామాయిల్‌పై రూ.10 తక్కువ..!

Onion, Palm Oil Prices: నిత్యావసరాల్లో కీలకమైన ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకుని నాణ్యమైన ఉల్లిపాయలను తక్కువ ధరకే అందించనున్నారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా కిలో ఉల్లిని రూ.35కే విక్రయించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు..

Local Body Elections: ఏపీలో సర్ఫంచ్ ఎన్నికలపై బిగ్‌ అప్‌డేట్.. ఎలక్షన్ జరిగేది ఆ నెలలోనే!

Local Body Elections: ఏపీలో సర్ఫంచ్ ఎన్నికలపై బిగ్‌ అప్‌డేట్.. ఎలక్షన్ జరిగేది ఆ నెలలోనే!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తోంది. అక్టోబర్‌లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్ష్యంతో.. ఇప్పటికే ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించే దిశగా చర్యలు చేపడుతోంది. ఓటర్ల జాబితా, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై స్పష్టత తీసుకొస్తూనే.. దశలవారీగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఆ పేరు వెనుక ఉద్యమ స్ఫూర్తి.. జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..

ఆ పేరు వెనుక ఉద్యమ స్ఫూర్తి.. జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..

జనసేన పార్టీ తొలిసారిగా ప్రత్యేక యువజన విభాగాన్ని ఏర్పాటు చేసింది. ‘జై కొట్టు’ పేరుతో రూపొందించిన ఈ యూత్ వింగ్‌ను పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా పిఠాపురంలో ఆవిష్కరించారు. జెన్‌జీతో పాటు యువతను పార్టీ కార్యకలాపాలకు మరింత దగ్గర చేయడం, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా ఈ విభాగాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.

“జలం… జీవం – జీవితం! ఆకట్టుకుంటున్న సీఎం చంద్రబాబు పోస్ట్

“జలం… జీవం – జీవితం! ఆకట్టుకుంటున్న సీఎం చంద్రబాబు పోస్ట్

మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా నల్లమల కొండలను చీల్చుకుంటూ కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి. వెలిగొండ ఫీడర్‌ కెనాల్‌లో ప్రవహిస్తున్న నీటిని కోతులు తాగుతున్న అందమైన దృశ్యాలను సీఎం చంద్రబాబు సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. “జలం... జీవం – జీవితం!” అంటూ క్యాప్షన్‌ పెట్టారు. కరువు ప్రాంతాలకు నీరు చేరడంతో సాగు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..! పుట్టినరోజున ఫోన్ చేసి ఏం చెప్పారంటే..?

పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..! పుట్టినరోజున ఫోన్ చేసి ఏం చెప్పారంటే..?

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం కేరళలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్యంపై ఆరా తీశారు. పంచాయతీరాజ్, గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో పవన్ కృషిని చంద్రబాబు కొనియాడారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆయన నిబద్ధతను ప్రశంసించారు. మంత్రి నారా లోకేష్ కూడా పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ ఖజానాకు ఫుల్ జోష్.. ఆగస్టులో పన్నుల రాబడి  ఎన్ని వేల కోట్లు తెలుసా..?

ఏపీ ఖజానాకు ఫుల్ జోష్.. ఆగస్టులో పన్నుల రాబడి ఎన్ని వేల కోట్లు తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ ఖజానాకు శుభవార్త! ఆగస్టులో పన్నుల రాబడి రూ.25,449.80 కోట్లకు చేరి, గత ఏడాదితో పోలిస్తే 18.05% వృద్ధిని నమోదు చేసింది. పన్నుల వసూళ్లను పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖ AI, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. దీనివల్ల పన్నుల ఎగవేత తగ్గి, రాష్ట్ర ఆదాయానికి గణనీయమైన జోష్ లభిస్తోంది. ఇది ఖజానాకు బలమైన పునాది వేస్తోంది.

విద్యుత్‌ షాక్‌తో ఏనుగు మృతి.. సమగ్ర విచారణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశం

విద్యుత్‌ షాక్‌తో ఏనుగు మృతి.. సమగ్ర విచారణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశం

అడవిలో స్వేచ్ఛగా సంచరించాల్సిన ఓ గజరాజు.. ఆహారం కోసం అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న మామిడి తోటలోకి వచ్చింది. ఇంతలో ఊహించని ప్రమాదం దాని ప్రాణాలను బలిగొంది. తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్‌ తీగ.. ఏనుగు మృతికి కారణమైందన్న ప్రాథమిక అంచనాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలో జరిగిన ఈ ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.