తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 22 ఏళ్ల అనుభవం ఉంది. అప్పటి సంచలన దిన పత్రిక వార్త లో క్రైమ్ రిపోర్టర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈనాడు జర్నలిజం స్కూల్ లో 2006-2007 బ్యాచ్ విద్యార్థిగా శిక్షణ పూర్తయింది. 2008 – 2009 లో మా టీవీ స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా, 2009 – 2014 వరకు టీవీ9 లో కరెస్పాండెంట్ గా, బ్యూరో చీఫ్ గా హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీ లో పనిచేసిన అనుభవం. 2014 – 19 వరకు డెక్కన్ క్రానికల్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా ముఖ్యమంత్రి కార్యాలయ బీట్ రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం. 2019 లో హెచ్. ఎం. టీ. వీ. స్టేట్ బ్యూరో చీఫ్ గా స్వల్పకాలం పనిచేసిన అనంతరం 2021 మార్చ్ నుంచి టీవీ9 – ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ గా పనిచేస్తూ ఉన్నాను.
పవన్కు చంద్రబాబు స్పెషల్ కాల్..! పుట్టినరోజున ఫోన్ చేసి ఏం చెప్పారంటే..?
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం కేరళలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్యంపై ఆరా తీశారు. పంచాయతీరాజ్, గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో పవన్ కృషిని చంద్రబాబు కొనియాడారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆయన నిబద్ధతను ప్రశంసించారు. మంత్రి నారా లోకేష్ కూడా పవన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
- Eswar Chennupalli
- Updated on: Sep 2, 2026
- 1:12 pm
ఏపీ ఖజానాకు ఫుల్ జోష్.. ఆగస్టులో పన్నుల రాబడి ఎన్ని వేల కోట్లు తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ ఖజానాకు శుభవార్త! ఆగస్టులో పన్నుల రాబడి రూ.25,449.80 కోట్లకు చేరి, గత ఏడాదితో పోలిస్తే 18.05% వృద్ధిని నమోదు చేసింది. పన్నుల వసూళ్లను పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖ AI, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. దీనివల్ల పన్నుల ఎగవేత తగ్గి, రాష్ట్ర ఆదాయానికి గణనీయమైన జోష్ లభిస్తోంది. ఇది ఖజానాకు బలమైన పునాది వేస్తోంది.
- Eswar Chennupalli
- Updated on: Sep 2, 2026
- 10:55 am
విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. సమగ్ర విచారణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశం
అడవిలో స్వేచ్ఛగా సంచరించాల్సిన ఓ గజరాజు.. ఆహారం కోసం అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న మామిడి తోటలోకి వచ్చింది. ఇంతలో ఊహించని ప్రమాదం దాని ప్రాణాలను బలిగొంది. తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగ.. ఏనుగు మృతికి కారణమైందన్న ప్రాథమిక అంచనాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలో జరిగిన ఈ ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
- Eswar Chennupalli
- Updated on: Sep 1, 2026
- 9:38 pm
Andhra Pradesh: ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం.. ఇదే చివరి ఛాన్స్.. మిస్సయితే మీ ఓటు గల్లంతే..
ఏపీలోని ఓటర్లకు అలర్ట్. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. బీఎల్వోలు ప్రతీ ఇంటికి వెళ్లి ఈ ప్రాసెస్ చేపట్టారు. కొంతమంది పేర్లను తొలగించారు. అయితే ఇప్పుడువారికి మరో అవకాశం ఇస్తున్నారు.
- Eswar Chennupalli
- Updated on: Sep 1, 2026
- 7:19 pm
నిన్న వెలిగొండ.. రేపు పోలవరం ఎడమ కాలువ
ఒకవైపు దశాబ్దాల కలగా నిలిచిన వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రభుత్వం.. మరోవైపు రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులపైనా దృష్టి సారించింది. అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. పాయకరావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జలాలకు జలహారతి ఇవ్వనున్నారు. పోలవరం ఎడమ కాలువలో గోదావరి జలాల ప్రవాహం ప్రారంభం కానుండటంతో.. ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి అవసరాలకు మరో ముఖ్యమైన ముందడుగు పడనుంది.
- Eswar Chennupalli
- Updated on: Sep 1, 2026
- 3:04 pm
గోదావరి తీరానికి మరో రూ.100 కోట్ల హారతి! పుష్కరాల వేళ అభివృద్ధి పనుల్లో వేగం
గోదావరి పుష్కరాల వేళ తీర ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం మరో రూ.100 కోట్లు కేటాయించింది. ఏడు నియోజకవర్గాల్లో రూ.90 కోట్లతో 111 రహదారి పనులు చేపట్టనున్నారు. మరో రూ. 10 కోట్లతో పుష్కర ఘాట్ల వద్ద రక్షిత తాగునీటి సదుపాయాలు కల్పించనున్నారు.
- Eswar Chennupalli
- Updated on: Sep 1, 2026
- 3:04 pm
పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత బలమైన రక్షణ
రాష్ట్రంలో పులుల సంరక్షణ, వాటి ఆవాసాల రక్షణ, వన్యప్రాణుల భద్రతకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇచ్చింది. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టేట్ లెవల్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఈ స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది..
- Eswar Chennupalli
- Updated on: Aug 31, 2026
- 7:42 pm
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీ రిజర్వేషన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఈ కమిషన్ బీసీల వెనుకబాటుతనంపై సమగ్ర అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదిక సమర్పించి, స్థానిక ఎన్నికల నిర్వహణకు ఈ పొడిగింపు అత్యంత కీలకంగా మారనున్నట్టు స్పష్టం చేసింది.
- Eswar Chennupalli
- Updated on: Aug 31, 2026
- 6:42 pm
ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి విమాన ప్రయాణంలో చేదు అనుభవం!
ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సహా పలువురు ప్రయాణికులు బెంగళూరు విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయవాడకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ATC క్లియరెన్స్ లేక దాదాపు నాలుగు గంటలు ఆలస్యమైంది. విమానంలోనే వేచి ఉన్న ప్రయాణికులకు సరైన సమాచారం లేకపోవడంతో అసహనం వ్యక్తమైంది. మంత్రి బందీ అయిన ఈ ఘటన చర్చనీయాంశమైంది.
- Eswar Chennupalli
- Updated on: Aug 31, 2026
- 6:20 pm
Andhra Politics: విజయసాయిరెడ్డి Vs బొత్స సత్యనారాయణ.. కేఏ పాల్ సీరియస్ వార్నింగ్..
విజయసాయిరెడ్డి రాసిన లేఖలో ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత పార్టీ మారబోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. పేరు చెప్పకపోయినా ఆ వ్యాఖ్యలు బొత్స సత్యనారాయణను ఉద్దేశించినవేనన్న చర్చ జరుగుతోంది. గతంలో సాయిరెడ్డి, బొత్స మధ్య కోల్డ్వార్ ప్రచారం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. మరోవైపు బొత్స చేసిన ‘కేఏ పాల్-2’ వ్యాఖ్యలపై కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు.
- Eswar Chennupalli
- Updated on: Aug 31, 2026
- 9:29 am
కొండలు.. అడవులు అడ్డురావిక! గిరిజనుల చెంతకు వేగంగా డ్రోన్లతో వైద్య సేవలు
కొండలు.. లోయలు.. దట్టమైన అడవులు.. రహదారి సౌకర్యం అంతంతమాత్రమే. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరుకోవాలంటే గంటల తరబడి ప్రయాణించాల్సిన పరిస్థితి. వైద్య పరీక్షల కోసం నమూనాలు పంపాలన్నా, మందులు.. వ్యాక్సిన్లు తెప్పించుకోవాలన్నా దూరం పెద్ద అడ్డంకిగా మారేది. ఇప్పుడు సాంకేతికత ఆ దూరాన్ని తగ్గిస్తోంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను వేగంగా అందించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ విధానంతో సత్ఫలితాలు సాధిస్తోంది..
- Eswar Chennupalli
- Updated on: Aug 30, 2026
- 7:16 pm
MBBS, BDS మెడికల్ కోర్సుల ఫీజులు పెరిగాయ్.. పూర్తి వివరాలు ఇవిగో
మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజుల భారం మరింత పెరిగింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి UG కోర్సులతో పాటు PG మెడికల్, డెంటల్ కోర్సులకు కూడా ప్రభుత్వం మధ్యంతర ఫీజులను ఖరారు చేసింది. UG కోర్సులకు 10 శాతం, PG కోర్సులకు 15 శాతం పెంపుతో కొత్త ఫీజులను..
- Eswar Chennupalli
- Updated on: Aug 29, 2026
- 3:39 pm