గుంటూరు జిల్లాలో పదిహేనేళ్ళు గా టివి9 రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009, 2024ల్లో కృష్ణానది వచ్చిన వరదలను కవర్ చేశాను. 2014, 2019, 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రిపోర్టర్ గా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి, రిషితేశ్వరి హత్యలపై ప్రత్యేక కథనాలు ఇచ్చాను. టివి9లో చేరక ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికైన 2009 అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు సమయంలో సబ్ ఎడిటర్ గా ప్రత్యేక వార్తలు ఇచ్చాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పిజి చేసిన నేను మొదట ప్రజాశక్తి పేపర్ లో మండల రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాను. పుస్తకాలు చదవడం నా హాబీ… చరిత్ర పుస్తకాలను ఎక్కువ మక్కువతో చదువుతాను. శ్రీ శ్రీ గారంటే ప్రత్యేక అభిమానం… టివి9లో పని చేస్తూ ట్రాన్స్ ఫర్ కొద్ది నెలల పాటు శ్రీకాకుళంలో రిపోర్టర్ ఉన్నాను. ఆసమయంలో ధర్మల్ పవర్ ఫ్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సోంపేట ఉద్యమాన్ని కవర్ చేశాను
అబ్బా.. ఏం స్కెచ్ వేశార్రా.. హాస్పిటల్కని వస్తే.. రూ.20వేలు కాజేసిన కేటుగాళ్లు! అసలేంజరిగిందంటే?
వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ సామాన్యుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఇద్దరు కేటుగాళ్లు నకిలీ బంగారంతో నిలువునా దోచేశారు. సినిమా ఫక్కీలో ఒకరు చైన్ అమ్మేవాడిగా, మరొకరు కొనేవాడిగా నాటకమాడి బాధితుడికి రూ. 20 వేల కుచ్చుటోపీ పెట్టారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది.
- T Nagaraju
- Updated on: Sep 20, 2026
- 12:53 pm
Palnadu: పసి మొగ్గలపై లైంగిక దాడులు.. నిందితుడికి కఠిన శిక్ష వేసిన గుంటూరు కోర్టు
బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన లారీ క్లీనర్ మిరియాల జయరావుకు రెండు వేర్వేరు కేసుల్లో జీవిత ఖైదు శిక్షలు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పు ఇచ్చాయి. 2019లో రెంటచింతల మండలంలో ఐదేళ్ల బాలికపై దాడి చేసిన కేసులో రూ.20 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
- T Nagaraju
- Updated on: Sep 19, 2026
- 12:29 pm
తాగుబోతు భర్త కొడుతున్నాడంటూ MLA వద్దకు మహిళ.. ఆమె ఏం చేశారంటే..?
భర్త వేధింపులతో ఇబ్బందులు పడుతున్న గుంటూరుకు చెందిన రిజ్వానాకు పోలీస్ స్టేషన్లో అనుకోని పరిస్థితి ఎదురైంది. కేసు నమోదు చేయాలంటే స్థానికంగా తెలిసిన వ్యక్తిని వెంట తీసుకురావాలని పోలీసులు చెప్పినట్లు ఆమె ఎమ్మెల్యే గల్లా మాధవికి ఫిర్యాదు చేసింది. దీంతో ఎమ్మెల్యే స్వయంగా మహిళా పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు నమోదు చేయించారు. మహిళల భద్రత విషయంలో పోలీసులు మరింత చురుగ్గా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు.
- T Nagaraju
- Updated on: Sep 19, 2026
- 12:18 pm
ఏడేళ్ల బాలుడి మాటలతో వెలుగులోకి షాకింగ్ నిజం.. జైలుపాలైన కన్నతల్లి..!
పొన్నూరులో అమ్మమ్మ లక్ష్మి హత్య కేసు మిస్టరీని ఆమె ఏడేళ్ల మనవడు ఛేదించాడు. బంగారు గొలుసు కోసం కూతురు పుష్పలత, ఆమె భర్త రాజ్కుమార్ లక్ష్మిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడి వాంగ్మూలం ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది, కేసులో మరింత దర్యాప్తు జరుగుతోంది.
- T Nagaraju
- Updated on: Sep 17, 2026
- 7:44 pm
AP News: మద్యానికి బానిసై కొడుకును చంపిన తండ్రి.. జీవిత ఖైదు విధించిన కోర్టు..!
AP News: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలం పారుపల్లిలో పారుపల్లి వెంకటేశ్వర్లు జీవనం సాగిస్తున్నాడు. వెంకటేశ్వర్లుకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు బాజీ తండ్రి వద్దే ఉంటూ సెంట్రింగ్ పనిచేసేవాడు. తనకు వచ్చిన కూలీ డబ్బులను తండ్రికి ఇచ్చి బ్యాంక్ లో జమ..
- T Nagaraju
- Updated on: Sep 16, 2026
- 1:21 pm
Andhra Pradesh: దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. మూడో భర్తతో కలిసి కన్నతల్లినే..
అమ్మా నాన్నే అమ్మమ్మను చంపేశారు.. కళ్లముందే జరిగిన ఘోరాన్ని చూసి ఓ చిన్నారి చెప్పిన ఈ మాటలు విని పోలీసులే షాక్ అయ్యారు. గుంటూరు జిల్లా పొన్నూరు క్యాబిన్ పేటలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతల్లినే కాలయమురాలై కడతేర్చింది ఓ కసాయి కూతురు. బంగారం, కాసుల కక్కుర్తితో మూడో భర్తతో కలిసి అర్ధరాత్రి నిద్రపోతున్న తల్లి మెడకు చీర బిగించి ప్రాణాలు తీసింది.
- T Nagaraju
- Updated on: Sep 12, 2026
- 9:04 pm
Andhra News: కోరిక తీర్చలేదని కత్తితో దాడి.. మహిళను 9 చోట్ల పొడిచి పారిపోయిన కామాందుడు!
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. తనతో లైంగికంగా సంబంధానికి నిరాకరించిందనే కారణంగా నెల రోజుల క్రితం పరిచయమైన ఓ మహిళపై కత్తితో దాడి చేశాడు ఓ కామాందుడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- T Nagaraju
- Updated on: Sep 12, 2026
- 12:13 pm
ప్రేమ వివాహానికి అడ్డొచ్చిందని ప్రియురాలి తల్లి కుట్ర.. మహిళ దారుణ హత్య!
గుంటూరు జిల్లా వెనిగండ్ల గ్రామంలో ఈ నెల 7వ తేదీన జరిగిన దాది కోటేశ్వరమ్మ అనే మహిళ హత్య కేసును పెదకాకాని పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను దారుణంగా హత్య చేసి, దోపిడీగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వివాహానికి అడ్డుపడుతోందన్న నెపంతోనే ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
- T Nagaraju
- Updated on: Sep 10, 2026
- 8:41 pm
Andhra News: ఇంటికొచ్చిన కుమారుడికి రక్తపు మడుగులో కనిపించిన తల్లి.. లోపలికెళ్లి చూడగా..
గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెదకాకాని మండలం వెనిగండ్లకు చెందిన దాది కోటేశ్వరమ్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. సాయంత్రం ఇంటికొచ్చిన కొడుకు రక్తపు మడుగులో పడిఉన్న తల్లిని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- T Nagaraju
- Updated on: Sep 8, 2026
- 1:29 pm
Guntur: చేరదీస్తానంటూ మైనర్ బాలికను నమ్మించింది.. తీరా తీసుకువెళ్లి..
గుంటూరులో మైనర్ బాలికను మాయమాటలతో వలలోకి దించి వ్యభిచారంలోకి దించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికను వేధించిన మహిళతో పాటు మరో మహిళ, ముగ్గురు యువకుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద ముఠా ఉందా? మహిళల అక్రమ రవాణాతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు.
- T Nagaraju
- Updated on: Sep 7, 2026
- 3:30 pm
మరీ ఇంత వైలెంట్గా ఉన్నావేంటక్కా.. అంత చిన్న విషయానికే ఇంత రియాక్ట్ అవ్వాలా?
ఈ మధ్యకాలంలో జనాలు చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. గోటలో పోయే విషయాన్ని కూడా గొడ్డలి దాకా వచ్చేలా లాగుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. ఆన్లైన్ పేమెంట్స్ విషయంలో మొదలైన వివాదం ఒకరిపై కత్తితో దాడి చేసే వరకు వెళ్లింది. ఇంతకూ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- T Nagaraju
- Updated on: Sep 6, 2026
- 1:18 pm
ఇన్స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్చేస్తే.. 3 నెలల తర్వాత..
ఇన్స్టాలో పదో తరగతి అమ్మాయితో పరిచయం పెంచుకొని.. ఆమెకు మాయమాటలు చెప్పి తన వలలో పడేసుకున్నాడో కేటుగాడు.. అంతటితో ఆగకుండా పేరెంట్స్కు చెప్పకుండా బాలికను తనతోపాటు తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి దాదాపు 3 నెలల పాటు దేశమంతా తిరిగారు. కట్చేస్తే కేసులోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.
- T Nagaraju
- Updated on: Sep 5, 2026
- 3:17 pm