Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T Nagaraju

T Nagaraju

Special Correspondent - TV9 Telugu

nagaraju.thirthala@tv9.com

గుంటూరు జిల్లాలో 14 ఏళ్ళుగా టివి రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009లో గుంటూరు జిల్లా టివి9 రిపోర్టర్ గా చేరాను. 2009లో కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో జిల్లా రిపోర్టర్ గా కవర్ చేశారు. 2014, 2019 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను జిల్లా రిపోర్టర్ గా కవర్ చేశాను. అంతకు ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. మాటివిలో చేరక ముందు ప్రజా శక్తిలో అచ్చంపేట మండల రిపోర్టర్ గా పని చేశాను. పుస్తక పఠనం నా హాబీ. చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదవటం అంటే ఇష్టం.

Read More
Andhra News: మరో మస్తాన్ సాయే.. సెల్‌ఫోన్లో ఆ వీడియోలు, ఫొటోలు..? ఆ సంబంధాలతో రచ్చకెక్కిన ఉన్నతాధికారి..

Andhra News: మరో మస్తాన్ సాయే.. సెల్‌ఫోన్లో ఆ వీడియోలు, ఫొటోలు..? ఆ సంబంధాలతో రచ్చకెక్కిన ఉన్నతాధికారి..

ప్రేమించానన్నాడు.. పెళ్ళి చేసుకుంటానన్నాడు.. పిల్లలు పుట్టక పోయిన పర్వాలేదన్నాడు... కులాలు అడ్డురావన్నాడు.. ఆమె జీవితానికి భరోసాగా ఉంటానన్నాడు. ఇలా ఎన్నో మాటలు చెప్పి.. ఆమెను 1998లో వివాహం చేసుకున్నాడు. అప్పట్లో జీవిత భీమా సంస్థలో పని చేసే కిరణ్, అనసూయలు ప్రేమించుకున్నారు. కులాలు ఒకటి కాకపోయినా పెద్దలు ఒప్పుకోకపోయిన, పిల్లలు పుట్టరని తెలిసినా అనసూయను కిరణ్ వివాహం చేసుకున్నాడు.

Macharala: గుడి వద్ద ఓ ముక్క.. పక్కన పొలంలో మరో ముక్క.. మాములు రాయి అనుకుంటే పొరపాటే..

Macharala: గుడి వద్ద ఓ ముక్క.. పక్కన పొలంలో మరో ముక్క.. మాములు రాయి అనుకుంటే పొరపాటే..

శాసనాలు చరిత్రకు ఆధారాలు. నాటి పాలనకు తార్కాణాలు. పురాతన గుళ్లను పునర్నిర్మాణం చేస్తుండగా లేదా ఏదైనా ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా.. నిధి, నిక్షేపాలు, శాసనాలు బయటపడిన దాఖలాలు ఉన్నాయి. ఒక శాసనం బయపడితే అప్పటి చారిత్ర విశేషాలు విస్పష్టంగా అర్థమవుతాయి. దీనితో పరిశోధన చేయడం వీలవుతుంది. తాజాగా మాచర్ల జిల్లాలో మరొక అరుదైన శాసనం వెలుగు చూసింది.

AP News: ఆంధ్రాలో పెరుగుతున్న GBS కేసులు.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త

AP News: ఆంధ్రాలో పెరుగుతున్న GBS కేసులు.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త

గుంటూరు జిల్లా GGHకు గులియన్ బారే సిండ్రోమ్ బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో ఐదుగురు బాధితులకు చికిత్స కొనసాగుతోంది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఏడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరిని డిశ్చార్జ్ చేశామని చెబుతున్నారు జీజీహెచ్ సూపరింటెండెంట్. కరోనా బాధితుల్లో ఎక్కువగా ఈ సిండ్రోమ్ కనిపిస్తోందంటున్నారు

Guntur District: అతని ఇంటి పక్కన పొలంలో అలికిడి.. వెళ్లి చూడగా.. భార్య మరొకరితో..

Guntur District: అతని ఇంటి పక్కన పొలంలో అలికిడి.. వెళ్లి చూడగా.. భార్య మరొకరితో..

అయితే 6-10-22 ఇంటిలో నిద్రపోతున్న వెంకటప్పయ్య కొడుకు జితేంద్ర ప్రసాద్‌కు బాత్రూం నుంచి ఏదో అలికిడి వినిపించింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా... తన తండ్రి వెంకటప్ప ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే జితేంద్ర ప్రసాద్ ఇరుగుపొరుగవారిని పిలిచి ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.

Palnadu: పల్నాడులో పెరుగుతున్న పులల సంఖ్య…

Palnadu: పల్నాడులో పెరుగుతున్న పులల సంఖ్య…

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంచారం పెరిగినట్లు అటవీ అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలోని నీటి కుంట వద్దకు వచ్చిన పులులను లెక్క తీసిన అనంతంర అధికారులు ఈ వివరాలు తెలిపారు. త్వరలో పూర్తి స్థాయి డేటా విడుదల చేయనున్నారు అధికారులు.. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

అన్యోన్య దాంపత్యంలో అనుకోని సంఘటన.. భర్త కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని భార్య.. చేతులెత్తి మొక్కాల్సిందే..

అన్యోన్య దాంపత్యంలో అనుకోని సంఘటన.. భర్త కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని భార్య.. చేతులెత్తి మొక్కాల్సిందే..

గుంటూరుకు చెందిన గుంటుపల్లి రామక్రిష్ణ ఒక ఛానెల్లో రిపోర్టర్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. 2005లో విజయతో ఆయనకు వివాహమైంది. వీరికి ఇద్దరూ పిల్లలు కలిగిన తర్వాత అనారోగ్య సమస్య తలెత్తింది. ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయిన జాండిస్ ను సరైన సమయంలో గుర్తించలేకపోవడంతో లివరర్ సిరోసిస్ కు దారి తీసింది.

RGV:  డైరెక్టర్ ఆర్జీవీకి మరో తలనొప్పి.. ఈసారి రంగంలోకి  సీఐడీ.. విచారణకు హాజరయ్యేనా…

RGV: డైరెక్టర్ ఆర్జీవీకి మరో తలనొప్పి.. ఈసారి రంగంలోకి సీఐడీ.. విచారణకు హాజరయ్యేనా…

2019లో రామ్‌గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరుతో ఓ సినిమా తీశారు. ఆ మూవీపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అనే పేరుతో సినిమాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను యూట్యూబ్‌లో మాత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరిట విడుదల చేశారని గుంటూరు జిల్లాకు మంగళగిరి సమీపంలోని ఆత్మకూర్‌కు చెందిన వంశీకృష్ణ బండారు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

AP News: లొట్టలేసుకుంటూ కోడి మాంసం తినాలనుకున్నాడు.. తీరా ఇంటికి వచ్చేసరికి..

AP News: లొట్టలేసుకుంటూ కోడి మాంసం తినాలనుకున్నాడు.. తీరా ఇంటికి వచ్చేసరికి..

రోజూలానే ఆ వ్యక్తి తనకు ఇష్టమైన కోడి మాంసం తెచ్చుకునేందుకు షాప్‌నకు వచ్చాడు. దగ్గరుండి చికెన్ ముక్కలు కొట్టించుకున్నాడు. తీరా ఇంటికి వచ్చేసరికి.. దెబ్బకు షాక్ అయ్యాడు. ఇంతకీ అసలు ఆ స్టోరీ ఏంటంటే.? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందామా మరి.

Amaravati:  మార్కెట్‌కు తీసుకెళ్దామని రాత్రి బస్తాల్లో నింపి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా..

Amaravati: మార్కెట్‌కు తీసుకెళ్దామని రాత్రి బస్తాల్లో నింపి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా..

అమరావతి రాజధాని పరిధిలోని పెనమాక, తాడేపల్లి, ఉండవల్లి, యర్రబాలెం పరిసర గ్రామాల్లో వాణిజ్య పంటలను అధికంగా సాగు చేస్తుంటారు. నీటి వసతి ఉండటంతో ఇక్కడ ఏడాదంతా పంటలు సాగవుతుంటాయి. పెనమాక పరిసర ప్రాంతాల్లో ఉల్లి సాగు కూడా అధికంగా ఉంటుంది. దిగుబడులు, ధర ఎలా ఉన్న వందల ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తుంటారు రైతులు...ఇక్కడ పండే ఉల్లికి ఘాటు ఎక్కువన్న ప్రచారం కూడా ఉంది. దీంతో వివిధ ప్రాంతాల నుండి ఉల్లిపాయలను కొనుగోలు చేసేందుకు పెనమాక వస్తుంటారు. ప్రస్తుతం రైతుల వద్ద నుండి కేజీ ఉల్లిపాయలను 25 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో యాభై రూపాయల వరకూ కేజీ ఉల్లి ధర ఉంది.

Guntur: సైకో మంజు టార్గెట్ చేస్తే మిస్ అవ్వదు.. జైలుకు వెళ్ళొచ్చినా మారని బుద్ధి..!

Guntur: సైకో మంజు టార్గెట్ చేస్తే మిస్ అవ్వదు.. జైలుకు వెళ్ళొచ్చినా మారని బుద్ధి..!

ఒంటరిగా ఉన్న వృద్దురాళ్ళను మంజు అనే వ్యక్తి టార్గెట్‌గా చేసుకుని మద్యం మత్తులో అత్యాచారం చేసి హత్య చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గంజాయి కూడా సేవిస్తుంటాడని చెప్పుకొచ్చారు. తమ ప్రాంతంలో మరికొంత మంది వృద్ధురాళ్ళపై అత్యాచారాలు జరిగాయని, అయితే పరువు పోతుందన్న భావనతో మరికొంతమంది బయటకు చెప్పుకోవటం లేదని స్థానికులు తెలిపారు.

అతను ఇంటికొస్తే ఏడుస్తుందనీ.. నాలుగేళ్ల కూతురిపై కన్నతల్లి కర్కశత్వం! ఏం చేసిందంటే..

అతను ఇంటికొస్తే ఏడుస్తుందనీ.. నాలుగేళ్ల కూతురిపై కన్నతల్లి కర్కశత్వం! ఏం చేసిందంటే..

కడుపులో నెట్టుకుని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ కన్న తల్లి కనికరం లేకుండా నాలుగేళ్ల చిన్నారిని చిత్ర హింసలకు గురి చేసింది. మాటలు కూడా సరిగ్గారాని చిన్నారి ఒంటిపై అట్లకాడతో కాల్చి వాతలు పెట్టింది. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా పది రోజుల పాటు ఆ చిన్నారికి నరకం చూపించింది. అయితే ఇదంతా ఎందుకు చేసిందో తెలస్తే హతాసులవుతారు..

Andhra News: సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ఫోన్.. అలా చెప్పడంతో ఒక్కసారిగా కంగారు.. ఆ తర్వాత..

Andhra News: సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ఫోన్.. అలా చెప్పడంతో ఒక్కసారిగా కంగారు.. ఆ తర్వాత..

పోలీస్ అధికారులు ఎంత అవగాహన కల్పించిన సైబర్ నేరగాళ్ల కొత్త కొత్త టెక్నిక్ లకు అమాయకులు చిక్కుతూనే ఉన్నారు. అరెస్ట్ పేరిట.. పదకొండు లక్షల రూపాయల రుణం ఇప్పించి.. ఆ రుణాన్ని కొట్టేసిన సైబర్ నేరగాళ్లపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ నేరగాళ్ల కోసం ప్రత్యేక గాలింపు చేపట్టారు.