గుంటూరు జిల్లాలో పదిహేనేళ్ళు గా టివి9 రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009, 2024ల్లో కృష్ణానది వచ్చిన వరదలను కవర్ చేశాను. 2014, 2019, 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రిపోర్టర్ గా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి, రిషితేశ్వరి హత్యలపై ప్రత్యేక కథనాలు ఇచ్చాను. టివి9లో చేరక ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికైన 2009 అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు సమయంలో సబ్ ఎడిటర్ గా ప్రత్యేక వార్తలు ఇచ్చాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పిజి చేసిన నేను మొదట ప్రజాశక్తి పేపర్ లో మండల రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాను. పుస్తకాలు చదవడం నా హాబీ… చరిత్ర పుస్తకాలను ఎక్కువ మక్కువతో చదువుతాను. శ్రీ శ్రీ గారంటే ప్రత్యేక అభిమానం… టివి9లో పని చేస్తూ ట్రాన్స్ ఫర్ కొద్ది నెలల పాటు శ్రీకాకుళంలో రిపోర్టర్ ఉన్నాను. ఆసమయంలో ధర్మల్ పవర్ ఫ్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సోంపేట ఉద్యమాన్ని కవర్ చేశాను
Andhra: ఇదేం ట్విస్ట్.. మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగిపై అత్యాచారం కేసులో నిందితుడు వాడే..
పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఉద్యోగినిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె కాళ్లు, చేతులు కట్టివేసి, వివస్త్రను చేసి, జననాంగంపై ఇనుప చువ్వతో దాడి చేశాడు. మహిళపై వికృతంగా దాడి చేసిన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు.
- T Nagaraju
- Updated on: Apr 8, 2026
- 10:04 am
గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్న విద్యార్థిని.. కాసేపటి తర్వాత కిటికిలోంచి చూడగా..
ఆదివారం సెలవు కావడంతో విద్యార్థినులంతా సరదాగా గడుపుతున్నారు. ఉన్నట్లుండి తనకు ఒంటరిగా ఉండాలని ఉందని చెప్పి శ్వేత తన గదిలోకి వెళ్లింది. అయితే సాయంత్రం ఫోన్ చేసిన తల్లిదండ్రులకు శ్వేత నుండి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఆమె స్నేహితురాలికి ఫోన్ చేసి శ్వేతతో మాట్లాడించాలని చెప్పారు. ఆమె వెళ్లి తలుపు కొట్టగా తీయలేదు.
- T Nagaraju
- Updated on: Apr 7, 2026
- 5:44 pm
Hyderabad: ఆదివారం రూమ్ నుంచి బయటకు రాని యువతి.. ఫ్రెండ్ కిటికీలో తొంగి చూడగా
అమృత యూనివర్సిటీలో బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్న శ్వేత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆదివారం సెలవు రోజు అందరితో సరదాగా గడిపిన ఆమె, ఉన్నట్లుండి గదిలోకి వెళ్లి బలవన్మరణానికి పాల్పడింది. ఆ వివరాలు ఇలా ఓ సారి చూసేయండి.
- T Nagaraju
- Updated on: Apr 7, 2026
- 1:22 pm
సినిమా లెవెన్ సీన్.. ఛేజ్ చేసి మరీ నలుగురి ప్రాణాలు కాపాడిన పోలీసులు.. అసలు ఏం జరిగిందంటే?
అప్పుల బాధతో కుటుంబ మొత్తం ఆత్మహత్య చేసుకునేందుకు కార్లో బయల్దేరిన ఓ కుటుంబాన్ని పోలీసులు సినిమా తరహాలో కాపాడారు. కారు ఎక్కిన తర్వాత భర్త చెప్పిన మాటలు విని కంగుతున్న భార్య వెంటనే కుటుంబ సభ్యులు మెసేజ్ చేయడంతో అలర్ట్ అయిన ఫ్యామిలీ.. పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మొబైల్ నెంబర్ ద్వారా కారును ట్రాక్ చేసి.. ఆ ఫ్యామిలీ సూసైడ్ చేసుకోకుండా మధ్యలోనే ఆపేశారు. దీంతో అందరూ ఊపిరపీల్చుకున్నారు.ఈ ఘటన గుంజూరు జిల్లాలో మాచర్లలో వెలుగు చూసింది.
- T Nagaraju
- Updated on: Apr 4, 2026
- 6:37 pm
Andhra Pradesh: కన్నతండ్రే కాలయముడయ్యాడు.. లవ్ మ్యారెజ్ చేసుకుందని ఇంటికి తీసుకెళ్లి మరి..
కన్న తండ్రే కాలయముడయ్యాడు. ప్రేమించిన నేరానికి కడుపున పుట్టిన దాని ఉసురు తీశాడు.. గుండెలపై ఆడించుకున్న చేతులతోనే గొంతునులిపి చంపేశాడు.. తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో పక్కాగా ప్లాన్ చేసి హత్య చేయడమే కాకుండా ఆత్మహత్య అంటూ చిత్రీకరించాడు. సాంకేతిక ఆధారాలతో హత్య అని రూడీ చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
- T Nagaraju
- Updated on: Apr 2, 2026
- 12:42 pm
Andhra News: 10గంటల పాటు ఎస్పీ ఛాంబర్లో ఎమ్మెల్యే.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి?
పడ్నాడు జిల్లాలో ఎస్పీ కార్యాలయంలో మంగళవారం హైడ్రామా చోటుచేసుకుంది. ఎస్పీ కార్యాలయ లీగల్ అడ్వైజర్ నియామకం విషయంలో నర్సరావుపేట ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీల మద్య వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న గుంటూరు రేంజ్ ఐజీ కలగజేసుకొని సమస్యను పరిష్కరించడంతో ఈ వివాదం సద్దుమణిగింది.
- T Nagaraju
- Updated on: Apr 1, 2026
- 6:45 pm
Andhra News: లిఫ్ట్ ఇస్తామని బైక్ ఎక్కించుకున్నారు.. కట్చేస్తే అసలు ట్విస్ట్ ఇదే!
గంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రోడ్డుపై ఒంటిరిగా నిల్చున్న వ్యక్తికి లిఫ్ట్ ఇస్తామని బైక్పై ఎక్కించుకెళ్లిన ఇద్దరు యువకులు మార్గమధ్యలో అతన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అతని ఒంటిపై ఉన్న బంగారం, డబ్బులు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదులో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
- T Nagaraju
- Updated on: Mar 26, 2026
- 12:34 pm
Andhra News: పనికిరావని పడేసిన వాటితో కోట్లు సంపాదించాడు.. అసలు మ్యాటర్ లీక్ అవ్వడంతో
సిక్ ఇండ్రస్ట్రీలో చోరి కలకలం రేపింది. కోట్ల రూపాయల యంత్రాలను అమ్ముకోవడంపై పోలీసులు రంగంలోకి దిగారు. ప్రధాన నిందితుడు అమెరికాకు పారిపోగా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 45 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకొని ప్రధాన నిందితుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. రాజధాని పరిధిలో జరిగిన ఈ చోరి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
- T Nagaraju
- Updated on: Mar 24, 2026
- 1:22 pm
Guntuir: వీళ్లిద్దరూ మామూళ్లో కాదు.. ఈ మైనర్ల నేర్పరితనం చూసి పోలీసులే షాక్..!
చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. సోదరీమణుల వద్ద పెరుగుతున్నాడు. గంజాయికి అలవాటు పడ్డాడు. మైనార్టీ కూడా తీరలేదు. ఇప్పటికే పలు చోరీలకు పాల్పడి 9 నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. అయినా ఆ మైనర్ మాయగాడి బుద్ధి మారలేదు. తన స్నేహితుడితో కలిసి చేసిన దొంగతనం మరోసారి పోలీసులకు పట్టించింది.
- T Nagaraju
- Updated on: Mar 24, 2026
- 1:23 pm
ఛీ.. ఛీ.. ఇదేం పని రా.. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో లైంగిక వేధింపులా..?
ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో వీడియో కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఇదే విధంగా చేస్తున్నాడని తెలిపింది. అంతేకాకుండా డ్యూటీ వేసే అంశంలో ఇష్టమొచ్చినట్లు షిఫ్టులు మారుస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. అధికారి వినిపించుకోకపోవడంతో తన వెంట తెచ్చుకున్న ఆలౌట్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
- T Nagaraju
- Updated on: Mar 22, 2026
- 12:48 pm
Andhra News: ఊరి చివర చెరువు ఏదో కదులుతూ కనిపించింది.. భయం.. భయంగా దగ్గరకు వెళ్లి చూడగా
గుంటూరు జిల్లా ఈదులపాలెంలో చెరువులో దొరికిన మృతదేహం మిస్టరీ వీడింది. ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. తాగుబోతు భర్త వెంకటేశ్వరరావు వేధింపులు భరించలేక అతని భార్య, ఆమె బంధువులే అతన్ని కొట్టి చంపారని.. అనంతరం మృతదేహాన్ని రాయి కట్టి చెరువులో పడేశారని తెలిపారు. విచారణలో భార్య వాస్తవాలు వెల్లడించడంతో ఆమెతో పాటు నిందితులను అరెస్ట్ చేశాసినట్టు పోలీసులు తెలిపారు. నింది తులపపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.
- T Nagaraju
- Updated on: Mar 21, 2026
- 1:19 pm
బాబోయ్ మీరేం మనుషులురా..! అన్నదాత కష్టార్జితాన్ని కూడా వదిలి పెట్టరా..!
ఏ ధరలు ఎక్కువుగా ఉంటే వాటిపై దొంగలు దృష్టి పెడుతున్నారు. బంగారం ధరలు పెరిగిపోవడంతో చెయిన్ స్నాచింగ్స్ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దొంగలు గుంటూరు మిర్చిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఉన్నారు. గత కొంతకాలంగా మిర్చి ధరలు పెరుగుతూ ఉన్నాయి. క్వింటా మిర్చి ఇరవై ఐదు వేల రూపాయల ధర పలుకుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
- T Nagaraju
- Updated on: Mar 20, 2026
- 8:39 pm