గుంటూరు జిల్లాలో పదిహేనేళ్ళు గా టివి9 రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009, 2024ల్లో కృష్ణానది వచ్చిన వరదలను కవర్ చేశాను. 2014, 2019, 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రిపోర్టర్ గా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి, రిషితేశ్వరి హత్యలపై ప్రత్యేక కథనాలు ఇచ్చాను. టివి9లో చేరక ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికైన 2009 అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు సమయంలో సబ్ ఎడిటర్ గా ప్రత్యేక వార్తలు ఇచ్చాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పిజి చేసిన నేను మొదట ప్రజాశక్తి పేపర్ లో మండల రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాను. పుస్తకాలు చదవడం నా హాబీ… చరిత్ర పుస్తకాలను ఎక్కువ మక్కువతో చదువుతాను. శ్రీ శ్రీ గారంటే ప్రత్యేక అభిమానం… టివి9లో పని చేస్తూ ట్రాన్స్ ఫర్ కొద్ది నెలల పాటు శ్రీకాకుళంలో రిపోర్టర్ ఉన్నాను. ఆసమయంలో ధర్మల్ పవర్ ఫ్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సోంపేట ఉద్యమాన్ని కవర్ చేశాను
Andhra Pradesh: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అప్రమత్తం కాకపోతే డేంజర్..
ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల కరోనాతో పలువురు మృతి చెందగా.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు చేపట్టింది. కరోనా టెస్టులు నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసింది. అలాగే గుంటూరు జీజీహెచ్లో మరో పాజిటివ్ కేసు నమోదైంది.
- T Nagaraju
- Updated on: Jul 21, 2026
- 12:42 pm
Guntur: ఆటోలో గుట్టుచప్పుడు కాకుండా వెళ్తున్న దంపతులు.. అనుమానంతో అడ్డుకున్న స్థానికులు షాక్!
గుంటూరు జిల్లా తెనాలిలో యువకుడి హత్య తీవ్ర కలకలం రేగింది. ఒక ఇంటి నుండే అదే పనిగా అరుపులు, కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. నైట్ రౌండ్ లో ఉన్న కానిస్టేబుల్ ఇంటి వద్దకు వచ్చి తలుపు కొట్టిన ఎవరూ తలుపు తీయలేదు. కొద్దిసేపు వేచి చూసిన కానిస్టేబుల్ లోపల నుండి ఎటువంటి అలికిడి లేకపోవడంతో అక్కడ నుండి వెళ్లిపోయాడు.
- T Nagaraju
- Updated on: Jul 16, 2026
- 5:48 pm
Andhra Pradesh: ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ.. కట్ చేస్తే..
ఖాకీ డ్రెస్ లేదు.. చేతిలో లాఠీ లేదు.. కానీ మేము మఫ్టీ పోలీసులమంటూ నమ్మించారు. మీ బైక్లో గంజాయి ఉందంటూ బెదిరించి, తనిఖీల పేరుతో రైతులు, వృద్ధుల సొమ్మును లూటీ చేశారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో గంజాయి తనిఖీల పేరుతో దౌర్జన్యాలకు పాల్పడుతున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. ఈ ముఠాలో ఒకరు దేశాన్ని రక్షించే బీఎస్ఎఫ్ మాజీ కానిస్టేబుల్ కావడం గమనార్హం.
- T Nagaraju
- Updated on: Jul 14, 2026
- 8:52 pm
జైలుకెళ్లి వచ్చినా మారని బుద్ధి.. మహిళల ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్.. కట్ చేస్తే..!
బాపట్ల జిల్లాలో మహిళలను బెదిరిస్తూ, డబ్బుల కోసం వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఓ ఆటో డ్రైవర్పై బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. బాపట్ల జిల్లా కేంద్రానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి తన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని మహిళలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు నమోదైనప్పటికీ వేధింపులు ఆగలేదని బాధితులు వాపోయారు.
- T Nagaraju
- Updated on: Jul 14, 2026
- 5:26 pm
Andhra Pradesh: గుడిలో ఇవేం పనులురా.. భక్తుడిలా వెళ్లి పూజారిని మాటల్లో పెట్టి ఏం చేశాడో వీడియో చూడండి..
అతడు అందరి భక్తుల మాదిరిగానే గుడికి వచ్చాడు. పూజారితో ఎంతో మర్యాదగా మాట్లాడి రూ.500 నోటు దక్షిణగా వేసి.. తిరిగి 400 ఇవ్వాలని కోరాడు. పూజారి చిల్లర కోసం బయటకు వెళ్లి లోపలికి వచ్చి చూసేసరికి అక్కడి నుండి ఉడాయించాడు. అప్పుడుగానీ అర్థంకాలేదు ఆ పూజారికి ఆ కేటుగాడి అసలు రంగు.. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..
- T Nagaraju
- Updated on: Jul 13, 2026
- 9:01 pm
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి.. కట్ చేస్తే.. సీన్ లోకి అల్లుడు! షాకింగ్ నిజాలు వెలుగులోకి..!
ప్రేమించి పెళ్లాడిన భార్య కాపురానికి రావడం లేదనే కక్షతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇందుకు కారణమైన అత్తమామలను కారుతో తొక్కించి చంపేందుకు ప్రయత్నించాడు కిరాతక అల్లుడు. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు జరిపిన లోతైన విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుపారీ ఇచ్చి మరీ అత్తమామలను అంతమొందించాలని చూసిన అల్లుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
- T Nagaraju
- Updated on: Jul 11, 2026
- 12:15 pm
ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్కి భర్త.. పోలీసులు వచ్చి చూడగా రక్తపు మడుగులో..
తెనాలి మండలం అంగలకుదురులో దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల క్రితం పెళ్లైన సంధ్యారాణి, నరేంద్రబాబు దంపతుల మధ్య అనుమానం పెరిగి పెద్దదైంది. భార్య ప్రవర్తనపై అనుమానంతో భర్త నరేంద్రబాబు దారుణంగా కత్తితో నరికి చంపాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
- T Nagaraju
- Updated on: Jul 11, 2026
- 7:52 am
Andhra News: అర్థరాత్రి ఫామ్ హౌస్ నుంచి అదేపనిగా అరుపులు.. ఏంటని వెళ్లి చూడగా
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్ల అడ్డరోడ్డులో ఇటీవలే నిర్మించిన ఓ ఫామ్ వ్యవహారం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫామ్ హౌస్ను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారని..అలాగే ఫామ్హౌస్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణులు రావడంతో..తనిఖీలకు వెళ్లిన పోలీసులపై సైతం యజమాని దౌర్జన్యానికి దిగడంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామని తెలిపారు.
- T Nagaraju
- Updated on: Jul 10, 2026
- 7:36 pm
యజమాని ఇంటికే కన్నం వేసిన డ్రైవర్.. చోరీ చేసిన బంగారంతో గోవా ట్రిప్ ఎంజాయ్..! చివరకు..
గుంటూరు జిల్లాకు చెందిన కారు డ్రైవర్ జోసఫ్ తన యజమాని ఇంట్లో 234.5 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. కొంత బంగారాన్ని స్నేహితుల సాయంతో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో గోవా వెళ్లగా, సాంకేతిక ఆధారాలతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.
- T Nagaraju
- Updated on: Jul 9, 2026
- 1:17 pm
నారీ నారీ నడుమ సీఐ రాములు నాయక్.. ఒంటరి మహిళతో పెళ్లి.. మరో లేడీ గుట్టుగా యవ్వారం.. కట్ చేస్తే..
సీఐ రాములు నాయక్ తనను మోసం చేసి వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఒంగోలుకు చెందిన అరుణ కుమారి గుంటూరు ఎస్పీని ఆశ్రయించడం కలకలం రేపింది. ఇప్పటికే సస్పెండ్ అయిన సీఐపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
- T Nagaraju
- Updated on: Jul 8, 2026
- 7:46 pm
Andhra: గంజాయ్ ఉందంటూ అకస్మాత్తుగా బైక్ ఆపి చెక్ చేశారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
పోలీసులమంటూ ఓ వృద్ధ రైతును అడ్డగించిన ఇద్దరు కేటుగాళ్లు తనిఖీల పేరుతో రూ.50 వేల నగదుతో పరారైన ఘటన తెనాలి సమీపంలో కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన రైతు బ్యాంక్ నుంచి నగదు తీసుకుని ఇంటికి వెళ్తుండగా నకిలీ పోలీసులు బైక్ను ఆపి తనిఖీలు నిర్వహించినట్లు నటించారు. అనంతరం డబ్బు మాయమైనట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
- T Nagaraju
- Updated on: Jul 8, 2026
- 5:15 pm
రేషన్ కార్డు ఉన్నవారికి సూపర్ గుడ్న్యూస్.. ఈ మార్టుల్లో తక్కువ ధరకే నిత్యావసర సరుకులు!
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. పేద ప్రజలకు తక్కువ ధరలోనే నిత్యావసర వస్తువులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని రేషన్ దుకాలణాను మీ మార్టులుగా మార్చేందుకు చర్యలు చేపట్టింది.ఇది ప్రజలతో పాటు రేషన్ డీలర్స్కు సైతం ఆర్థకంగా సహాయపడనుంది.
- T Nagaraju
- Updated on: Jul 7, 2026
- 7:00 pm