గుంటూరు జిల్లాలో పదిహేనేళ్ళు గా టివి9 రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009, 2024ల్లో కృష్ణానది వచ్చిన వరదలను కవర్ చేశాను. 2014, 2019, 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రిపోర్టర్ గా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి, రిషితేశ్వరి హత్యలపై ప్రత్యేక కథనాలు ఇచ్చాను. టివి9లో చేరక ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికైన 2009 అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు సమయంలో సబ్ ఎడిటర్ గా ప్రత్యేక వార్తలు ఇచ్చాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పిజి చేసిన నేను మొదట ప్రజాశక్తి పేపర్ లో మండల రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాను. పుస్తకాలు చదవడం నా హాబీ… చరిత్ర పుస్తకాలను ఎక్కువ మక్కువతో చదువుతాను. శ్రీ శ్రీ గారంటే ప్రత్యేక అభిమానం… టివి9లో పని చేస్తూ ట్రాన్స్ ఫర్ కొద్ది నెలల పాటు శ్రీకాకుళంలో రిపోర్టర్ ఉన్నాను. ఆసమయంలో ధర్మల్ పవర్ ఫ్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సోంపేట ఉద్యమాన్ని కవర్ చేశాను
20 ఏళ్ల పగ.. టీ తాగేందుకు రోడ్డుపైకి రాగానే కత్తులతో దాడి! పట్టపగలే దారుణ హత్య
Guntur Murder News: గుంటూరులోని కెవిపి కాలనీలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. 20 ఏళ్లుగా కొనసాగుతున్న పాత కక్షల నేపథ్యంలో చిన్నాపై ప్రత్యర్థులు కర్రలు, కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాబాయ్ అంత్యక్రియలకు వచ్చిన చిన్నా టీ తాగేందుకు బయటకు రాగానే ఈ దాడి జరిగినట్లు సమాచారం.
- T Nagaraju
- Updated on: Aug 31, 2026
- 1:13 pm
పక్కపక్కనే ఇళ్లు.. అగ్గి పెట్టె కోసం గొడవ.. ఎంతకు తెగించావ్రా..?
గుంటూరు జిల్లా వేమూరు మండలం వెల్లబాడులో చిన్న అగ్గిపెట్టె వివాదం హత్యకు దారితీసింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరి మధ్య అగ్గిపెట్టె అడిగిన విషయంలో గొడవ జరగగా.. శరణ్ తేజ్ కత్తితో యోహానుపై దాడి చేశాడు. మెడపై తీవ్ర గాయం కావడంతో యోహాను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసిన వేమూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
- T Nagaraju
- Updated on: Aug 30, 2026
- 11:33 am
లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్లలే అని భార్యను వేధించిన భర్త
గుంటూరులో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి, ఆడపిల్ల పుడుతుందని తెలుసుకున్న ప్రతిసారీ భార్యను వేధిస్తూ పుట్టింటికి పంపిస్తున్నాడని ఓ భర్తపై ఆరోపణలు వచ్చాయి. మూడు సార్లు ఇదే విధంగా వేధింపులకు గురైన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు ఆడపిల్లలతో వచ్చిన ఆమెకు అడిషనల్ ఎస్పీ రమణమూర్తి అండగా నిలిచి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
- T Nagaraju
- Updated on: Aug 25, 2026
- 1:16 pm
ఒక్కరితో ఇద్దరు ఎఫైర్.. కట్చేస్తే, దారుణం.. గుంటూరులో ఓ మహిళ చుట్టూ నడిచిన క్రైమ్ స్టోరీ ఇది..
గుంటూరు నల్లపాడు ఎకో పార్క్ సమీపంలో కలకలం రేపిన మృతదేహం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత మహిళ మృతదేహంగా భావించిన పోలీసులు, దర్యాప్తులో అది పెదపలకలూరుకు చెందిన ప్రసన్నకుమార్దిగా గుర్తించారు. ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో బుల్లయ్య, అతని సోదరుడు వెంకటయ్య కలిసి ప్రసన్నకుమార్ను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
- T Nagaraju
- Updated on: Aug 24, 2026
- 4:15 pm
భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం మాయమైందా..? మాయం చేశారా? అసలేం జరిగింది?
Pedakakani Bhramaramba Temple: పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో రూ. 12 లక్షల విలువైన మంగళసూత్రం, నానుతాడు చోరీకి గురయ్యాయి. శ్రావణ మాసం మొదటి శుక్రవారం అలంకరణ తర్వాత, పూజారులు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. పోలీసులు విచారణ ప్రారంభించి, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇదివరకు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని, ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుందని కథనం వివరిస్తుంది.
- T Nagaraju
- Updated on: Aug 22, 2026
- 2:30 pm
బాలికల స్కూల్ వద్ద ఆగంతకుడి అసభ్య చేష్టలు.. మారువేశంలో రంగంలోకి తహశీల్దార్, పోలీసులు!
స్థానికంగా ఉన్న ఓ బాలికల పాఠశాల వద్ద గత కొన్ని రోజులుగా విద్యార్థినులను వేధిస్తున్న ఓ ఆగంతకుడిని పట్టుకునేందు ఏకంగా స్థానిక తహశీల్దార్, ఎస్ఐ మారువేషంలో రంగంలోకి దిగారు. సరిగ్గా అదే టైంకి అక్కడికి వచ్చిన నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తృటిలో తప్పించుకొని పారిపోయాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.
- T Nagaraju
- Updated on: Aug 21, 2026
- 2:37 pm
అంజనం వేసి ఆచూకీ తెలుసుకుంటారన్న సమాచారంతో అలెర్టైన దొంగ.. ఏం చేశాడంటే..?
నరసరావుపేటలో భారీ చోరీ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఇంట్లో రూ.20 లక్షల నగదు, 317 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ కాగా.. కొద్ది రోజుల తర్వాత ఇంటి బయట రూ.19 లక్షల నగదుతో ఓ బ్యాగ్, లేఖ ప్రత్యక్షమయ్యాయి. తన వాటాగా వచ్చిన డబ్బును తిరిగి ఇస్తున్నానని, బంగారం గురించి మాత్రం అడగొద్దని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
- T Nagaraju
- Updated on: Aug 15, 2026
- 12:39 pm
సోషల్ మీడియా మాయలో పడొద్దు.. ప్రాణాలు పోగొట్టుకోవద్దు.. ఈమె విషయంలో అదే..
తెనాలిలో సోషల్ మీడియా పరిచయాలు ఓ వివాహితను తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందుల్లోకి నెట్టాయి. బాజి, నాగరాజు అనే వ్యక్తులు ఆర్థిక అవసరాల పేరుతో ఆమె వద్ద నుంచి సుమారు రూ.40 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని డబ్బులు కావాలంటూ వేధింపులు, బెదిరింపులకు పాల్పడటంతో ..
- T Nagaraju
- Updated on: Aug 13, 2026
- 11:10 am
Andhra: ఇత్తడి సామాన్లు కనిపిస్తే చాలు.. వాళ్లు చేతులకు తిమ్మిర్లు మొదలవుతాయ్..
పగటిపూట గ్రామాల్లో చిత్తు కాగితాలు ఏరుకుంటూ షాపులపై రెక్కీ.. రాత్రివేళల్లో ఇత్తడి వస్తువుల చోరీ. పక్కా ప్రణాళికతో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పొన్నూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1.50 లక్షల నగదుతో పాటు చోరీ చేసిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
- T Nagaraju
- Updated on: Aug 12, 2026
- 5:48 pm
పల్నాడులో హత్య.. గోవాలో జాడ..! నిందితుల కోసం పోలీసుల షాకింగ్ ఆపరేషన్!
పల్నాడు జిల్లా వైసీపీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ చెన్నారెడ్డి హత్య కేసులో నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగుతుంది. ఆగస్టు నెల ఆరో తేదీన రాత్రి సమయంలో తన స్వగ్రామమైన రెంటాలకు బైక్పై వెళుతున్న చెన్నారెడ్డిపై దుండగులు దాడి చేశారు. దారి కాచిన ప్రత్యర్థులు కారుతో ఢీ కొట్టి అనంతరం కళ్లలో కారం చల్లి పీక కోసం హత్య చేశారు. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.
- T Nagaraju
- Updated on: Aug 11, 2026
- 5:22 pm
Andhra News: ఇన్స్టాలో మొదలైన ప్రేమకు.. చెరువు గట్టు వద్ద ఎండ్ కార్డు.. ఐదేళ్ల తర్వాత
పడ్నాడు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. తాను ప్రేమించిన యువతి మరో వ్యక్తితో మాట్లాడుతూ.. తనను పట్టించుకోవట్లదనే కోపంతో.. ఆమెపై పగ పెంచుకున్న ఓ యువకుడు పక్కా ప్లాన్ చేసి.. ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
- T Nagaraju
- Updated on: Aug 9, 2026
- 2:20 pm
రెంటచింతలలో YCP నేత చెన్నారెడ్డి దారుణ హత్య
పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ నేత నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. స్వగ్రామానికి స్కూటీపై వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి, అనంతరం కళ్లలో కారం చల్లి గొంతు కోసి హతమార్చారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ ఆధిపత్య పోరు, వ్యక్తిగత కక్షలు సహా పలు అంశాలపై విచారణ కొనసాగుతోంది. నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఘటనతో మాచర్లలో ఉద్రిక్తత నెలకొంది.
- T Nagaraju
- Updated on: Aug 8, 2026
- 9:17 pm