AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T Nagaraju

T Nagaraju

Special Correspondent - TV9 Telugu

nagaraju.thirthala@tv9.com

గుంటూరు జిల్లాలో పదిహేనేళ్ళు గా టివి9 రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009, 2024ల్లో కృష్ణానది వచ్చిన వరదలను కవర్ చేశాను. 2014, 2019, 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రిపోర్టర్ గా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి, రిషితేశ్వరి హత్యలపై ప్రత్యేక కథనాలు ఇచ్చాను. టివి9లో చేరక ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికైన 2009 అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు సమయంలో సబ్ ఎడిటర్ గా ప్రత్యేక వార్తలు ఇచ్చాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పిజి చేసిన నేను మొదట ప్రజాశక్తి పేపర్ లో మండల రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాను. పుస్తకాలు చదవడం నా హాబీ… చరిత్ర పుస్తకాలను ఎక్కువ మక్కువతో చదువుతాను. శ్రీ శ్రీ గారంటే ప్రత్యేక అభిమానం… టివి9లో పని చేస్తూ ట్రాన్స్ ఫర్ కొద్ది నెలల పాటు శ్రీకాకుళంలో రిపోర్టర్ ఉన్నాను. ఆసమయంలో ధర్మల్ పవర్ ఫ్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సోంపేట ఉద్యమాన్ని కవర్ చేశాను

Read More
Andhra: పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా చేస్తావా..

Andhra: పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా చేస్తావా..

పల్నాడు జిల్లా, వినుకొండ పట్టణంలో ఆదివారం నుండి అత్త ఇంటి ఎదుట ఓ కోడలు బైటాయించి ఆందోళన చేస్తుంది. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన గోపి లక్ష్మికి, పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డు చౌడమ్మ వీధికి చెందిన వినుకొండ కోటేశ్వరరావుతో ఈ ఏడాది జూన్ 4 వ తేదీన వివాహం అయింది.

Andhra News: భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహంతో..

Andhra News: భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహంతో..

అనుమానం ఓ పచ్చని కాపురంలో చిచ్చపెట్టింది. అప్పటి వరకు అనందంగా ఉన్న ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఈ అనుమానంతోనే ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఆపైన ఏం చేయాలో తెలియక మృతదేహాన్ని బైకుపై పెట్టుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. భార్యను హత్య చేసిన విషయాన్ని చెప్పి అరెస్టు చేయమని వేడుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra: అర్థరాత్రి ఉలిక్కిపడిన మంగళగిరి.. ఈ రాళ్ల కోసం పెద్ద కథే నడిచింది..

Andhra: అర్థరాత్రి ఉలిక్కిపడిన మంగళగిరి.. ఈ రాళ్ల కోసం పెద్ద కథే నడిచింది..

మంగళగిరి సమీపంలోని యర్రపాలెం ఇండ్రస్ట్రీయల్ ఏరియాలో జరిగిన చోరి కలకలం రేపుతోంది. బంగారు ఆభరణాల్లో వినియోగించే పది లక్షల రూపాయల విలువైన రంగు రాళ్లను పదిహేను మంది సభ్యుల ముఠా వచ్చి తీసుకెళ్లింది. ఈ చోరిపై పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.

Paladu: ఖాకీ కొడుకు ఆకృత్యానికి.. ఐదుగురు బలి.. అతని నేరాల చిట్టా చూస్తే..

Paladu: ఖాకీ కొడుకు ఆకృత్యానికి.. ఐదుగురు బలి.. అతని నేరాల చిట్టా చూస్తే..

పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వెనుక దోపిడీ కుట్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ట్రాక్టర్ ట్రాలీని బెదిరించి డబ్బులు దోచుకునే ప్రయత్నంలో హైవేలో కారు అడ్డుగా నిలపడంతో ప్రమాదం జరిగి ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో డీఎస్పీ కార్యాలయంలో పనిచేసే ఏఎస్ఐ కుమారుడు వెంకట్ నాయుడుతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Guntur: చదివేది ఇంటర్.. హైదరాబాద్‌లో యాంకర్.. ఫోన్ చెక్ చేస్తే బయటపడ్డ అసలు నిజం

Guntur: చదివేది ఇంటర్.. హైదరాబాద్‌లో యాంకర్.. ఫోన్ చెక్ చేస్తే బయటపడ్డ అసలు నిజం

గుంటూరు ఆర్టీసీ కాలనీలో తల్లి–కూతురి మధ్య డ్రగ్స్ వివాదం కలకలం రేపింది. కుమార్తె మాట వినడం లేదని మనస్తాపానికి గురైన తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, కూతురు డ్రగ్స్‌కు బానిసైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కూతురు మాత్రం ఇష్టం లేని పెళ్లి చేయిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Andhra: ఓం నమ: శివాయ.. నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న పంచ అఖండ జోత్యులు

Andhra: ఓం నమ: శివాయ.. నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న పంచ అఖండ జోత్యులు

గుంటూరు జిల్లా పొన్నూరులోని సహస్రలింగేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ దేవాలయంలో 1961లో జగన్నాథ స్వామి పంచ అఖండ జ్యోతులను ప్రతిష్టించారు. పంచభూతాల ప్రతీకగా ఏర్పాటు చేసిన అగ్ని, జల, వాయు, ఆకాశ, పృథ్వి జ్యోతులు నలభై ఏళ్లుగా నిర్విఘ్నంగా వెలుగుతూనే ఉన్నాయి.

Andhra News: 200 ఏళ్ల నాటి అరుదైన శంఖం.. ఆ ఒక్కరోజు మాత్రమే చూసే అవకాశం.. ప్రత్యేకత ఏంటంటే?

Andhra News: 200 ఏళ్ల నాటి అరుదైన శంఖం.. ఆ ఒక్కరోజు మాత్రమే చూసే అవకాశం.. ప్రత్యేకత ఏంటంటే?

మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది. ప్రముఖ వైష్ణవాలయంగా వెలుగొందుతుంది. ఇక్కడి ఆలయ గోపురం, ముఖ మండపం, కోనేరులకు ఎంతో చారిత్రక నేపధ్యం ఉంది. నాలుగు వందల ఏళ్ల క్రితమే ముఖ మండపం నిర్మించగా రెండు వందల ఏళ్ళ క్రితం గాలి గోపురాన్ని నిర్మించారు. ఇవే కాదు.. ఈ ఆలయంలో రెండు వందల ఏళ్ల నాటి ఎంతో ప్రసిద్ధి చెందిన శంఖం కూడా ఉంది. భక్తులు దాన్ని చూడాలంటే.. ఏడాదిపాటు వేచి చూడాల్సి ఉంటుంది.

Guntur: ఓ కేసు విచారణ చేస్తుంటే.. మరో కేసు గుట్టు వీడింది.. భలే చిక్కార్రా..

Guntur: ఓ కేసు విచారణ చేస్తుంటే.. మరో కేసు గుట్టు వీడింది.. భలే చిక్కార్రా..

ఒక మహిళా మరొక నలుగురితో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేసింది. ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి దొంగతనాలు చేసేందుకు ముఠాను ప్రేరేపించింది. అందరూ కలిసి స్కెచ్ వేసి చేసిన చోరి గుట్టు రట్టైంది. పోలీసులకు దొరికి పోవడంతో ముఠాను జైలుకు పంపించారు.

Andhra News:  నట్టేట ముంచిన నమ్మకం.. తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు

Andhra News: నట్టేట ముంచిన నమ్మకం.. తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు

తన మేనమామకు కష్టం వస్తే తట్టుకోలేకపోయాడు. తాను తప్పా ఇంకేవరూ లేరనుకున్నాడు. తన ఆస్తి మొత్తాన్ని తాకట్టు పెట్టి మేనమామ కష్టాన్ని తీర్చాడు. అయితే ఆ విషయాన్ని మేనమామ మర్చి పోవడంతో అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటన పెదకాకానిలో చోటు చేసుకుంది. సూసైడ్ నోట్ లో మేనమామ మోసం గురించి వివరించడంతో అసలు విషయం వెలుగు చూసింది.

Guntur: స్నేహితుడి పుట్టిన రోజు… ఆశ్చర్యపరుస్తానంటూ అనంత లోకాలకు చేరుకున్న మిత్రుడు…

Guntur: స్నేహితుడి పుట్టిన రోజు… ఆశ్చర్యపరుస్తానంటూ అనంత లోకాలకు చేరుకున్న మిత్రుడు…

మిత్రుడికి ఎవరూ ఊహించని విధంగా జన్మదిన సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్న హిమేష్ రెడ్డి తీసుకున్న ఒక్క నిర్ణయం… చివరకు విషాదంగా మారింది. అర్ధరాత్రి సమయంలో బ్యానర్‌తో లోకేష్ హాస్టల్ వద్దకు వెళ్లిన హిమేష్, దాన్ని కట్టే ప్రయత్నంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.

బిందెలకు బిందెలు పానకం తాగేస్తున్న నరసింహ స్వామి.. భక్తితో సమర్పిస్తున్న జనాలు.. ఎక్కడో తెలుసా?

బిందెలకు బిందెలు పానకం తాగేస్తున్న నరసింహ స్వామి.. భక్తితో సమర్పిస్తున్న జనాలు.. ఎక్కడో తెలుసా?

హిందూవులలో దేవుళ్లకు నైవేద్యం పెట్టడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ప్రతి ఒక్క హిందువు తాము కొలిచే దైవానికి నైవేద్యం సమర్పిస్తారు.అయితే మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు సమర్పించే నైవేద్యాన్ని సగం స్వీకరించి మిగతా సగం తిరిగి ఇస్తారట..ఇలా ప్రతి నెల స్వామివారు స్వీకరించే నైద్యానికి సంబంధించిన లెక్కలను తాజాగా విడుదల చేశారు అధికారులు.

Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది

Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది

చంపేశాడు.. ఇద్దరిని అత్యంత కిరాతకంగా హత్య చేసేశాడు. అతనేమీ కరుడు గట్టిన నేరస్థుడు కాడు. అసాంఘీక కార్యకలాపాల్లో మునిగి తేలేవాడు అంతకంటే కాదు. అయినా మరో ఇద్దరు మైనర్లను వెంటబెట్టుకుని వెళ్లి మరీ కసితీరా నరికి చంపాడు. తన అక్క కళ్లలో కన్నీళ్లు చూడలేక ఆ కుటుంబాన్నే అడ్డు తొలగించుకోవాలన్న ప్లాన్ వేశాడు.