గుంటూరు జిల్లాలో పదిహేనేళ్ళు గా టివి9 రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009, 2024ల్లో కృష్ణానది వచ్చిన వరదలను కవర్ చేశాను. 2014, 2019, 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రిపోర్టర్ గా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి, రిషితేశ్వరి హత్యలపై ప్రత్యేక కథనాలు ఇచ్చాను. టివి9లో చేరక ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికైన 2009 అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు సమయంలో సబ్ ఎడిటర్ గా ప్రత్యేక వార్తలు ఇచ్చాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పిజి చేసిన నేను మొదట ప్రజాశక్తి పేపర్ లో మండల రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాను. పుస్తకాలు చదవడం నా హాబీ… చరిత్ర పుస్తకాలను ఎక్కువ మక్కువతో చదువుతాను. శ్రీ శ్రీ గారంటే ప్రత్యేక అభిమానం… టివి9లో పని చేస్తూ ట్రాన్స్ ఫర్ కొద్ది నెలల పాటు శ్రీకాకుళంలో రిపోర్టర్ ఉన్నాను. ఆసమయంలో ధర్మల్ పవర్ ఫ్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సోంపేట ఉద్యమాన్ని కవర్ చేశాను
Andhra: రాత్రివేళ స్కూటీపై ఒంటరిగా బయలు దేరిన మహిళ.. అకస్మాత్తుగా ఫోన్ బంద్.. ఆ తర్వాత..
పల్నాడు జిల్లా ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన ఒక మహిళ నర్సరావుపేటలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుంది. ప్రతి రోజూ షాపు నుండి స్కూటీ మీద ఇంటికి వెళుతుంటుంది. ఎప్పటిలాగే సోమవారం రాత్రి షాపు నుండి ఇంటికి స్కూటీపై బయలు దేరింది. అయితే రొంపిచర్ల మండలం తుంగపాడు వద్దకు వచ్చే సరికి ఆమె కనిపించడకుండా పోయింది.
- T Nagaraju
- Updated on: Mar 18, 2026
- 11:23 am
AP News: అర్ధరాత్రి వృద్ధురాలి అగచాట్లు.. దారి మళ్లించి దోచుకున్న ఆటో డ్రైవర్! ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ముప్పుతిప్పలు
ఓ వృద్ధురాలు గత శనివారం రాత్రి ఆమె నెల్లూరు నుంచి గుంటూరు వచ్చింది. గుంటూరు బస్టాండ్ లో బస్సు దిగిన మరియమ్మ డిపో బయటకు వచ్చి ఆటో స్టాండ్ లో నిల్చుంది. కొద్దీ సేపటి తర్వాత ఆటో వచ్చి ఆగింది. నంబూరు సమీపంలోని కల్వరి టెంపుల్ వెళ్లాలని చెప్పింది. ఆటో ఎక్కించుకున్న డ్రైవర్ కాకాని వైపు..
- T Nagaraju
- Updated on: Mar 16, 2026
- 9:39 pm
Andhra: ప్రేమ పేరుతో ఎంతకు తెగించావురా.. అమ్మాయిని రూమ్కు తీసుకెళ్లి..
బాపట్ల జిల్లా రేపల్లేకు చెందిన ఆనంద్ గుంటూరుకు వచ్చి నివసిస్తున్నాడు. నగరంలోని ఓ మిఠాయి దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే దుకాణంలో పనిచేసే మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకొని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు.
- T Nagaraju
- Updated on: Mar 15, 2026
- 12:17 pm
Andhra: గుడ్ న్యూస్.. Hi అని మెసేజ్ పెట్టగానే ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీ.. భారీ క్యూలైన్లకు చెక్
గుంటూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో (జిజిహెచ్) రోగుల క్యూలైన్ల సమస్యకు పరిష్కారం చూపేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. వాట్సాప్ ద్వారా ఓపీ స్లిప్ పొందే సౌకర్యాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. 95523 00009 నంబర్కు “Hi” మెసేజ్ పంపితే టోకెన్ నంబర్ జనరేట్ అయ్యే విధంగా సాఫ్ట్వేర్ రూపొందించారు.
- T Nagaraju
- Updated on: Mar 14, 2026
- 11:54 am
Andhra News: చూసి అమాయకుడు అనుకునేరు.. ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
తనతో పాటు తన కుటుంబ సభ్యులను పెట్రోల్ పోసి తగబెడతానన్న రౌడీ షీటర్ భర్త బెదిరింపులతో తీవ్ర భయాందోళనకు గురైన మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఘటనపై విచారణ జరిపిన కోర్టు నిందితుడి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది.
- T Nagaraju
- Updated on: Mar 13, 2026
- 8:30 pm
నా కూతురి ఆచూకీ చెప్పండయ్యా.. పోలీస్ స్టేషన్లో తండ్రి ఏం చేశాడో తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు!
నా కుమార్తె కనిపించడం లేదు.. ఎనిమిది రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయింది. బ్రతికే ఉందా.. లేదా.. చెప్పాలంటూ ఆ తండ్రి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్లిందో తెలియక ఆవేదన చెందుతున్నాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెంది పోలీస్ స్టేషన్ లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది.
- T Nagaraju
- Updated on: Mar 13, 2026
- 1:40 pm
AP News: చోరి సొమ్ము వాటాల పంపిణీలో బెడిసిన యవ్వారం.. గ్యాంగ్ లీడర్ హత్య!
మార్చి నాలుగో తేదిన పెదకాకాని రైల్వే స్టేషన్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి హత్య జరిగింది. స్టేషన్ లోని ప్లాట్ ఫాం చివరన గుర్తు తెలియని మృతదేహం ఉందన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రాధమిక ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీస్ దర్యాప్తులో హత్యకు గురైన వ్యక్తి.. చంపిన నిందితులు అంతా ఒకే గ్యాంగ్ కు చెందిన వారుగా గుర్తించారు. హత్య నిందితులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే..
- T Nagaraju
- Updated on: Mar 12, 2026
- 12:21 pm
Andhra Pradesh: వైద్యుల అద్భుత ఘనత.. ముక్కలు ముక్కలుగా తెగిపడ్డ చెయ్యిని అతికించిన డాక్టర్లు..!
జార్ఖండ్ కు చెందిన యువకుడు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద నిర్మాణ రంగంలోని ఒక సంస్థలో పనిచేస్తున్నాడు. రోడ్డు నిర్మాణం పనుల్లో నిమగ్నమై ఉన్న యువకుడు చెయ్యి పొరపాటును తారు యంత్రంలో చిక్కుకుపోయింది. కొద్దిసేపటికే చెయ్యి శరీరం నుండి విడిపోయింది. దీంతో తీవ్ర గాయాలైన యువకుడిని తెగిపడిన చేతిని తీసుకుని స్థానికులు మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
- T Nagaraju
- Updated on: Mar 10, 2026
- 1:09 pm
Andhra: సొంత అక్క ఇలా చేస్తదనుకోలేదు.. కోర్టులో ఆ మహిళ ఏం చేసిందంటే..
తెనాలి పురపాలక సంఘంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న కమలమ్మ ఎప్పటిలాగే నిన్న కూడా కోర్టుకు వచ్చింది. తన తల్లికి చెందిన ఆస్తి విషయంలో సొంత అక్కతో వివాదం ఉంది. ఈ విషయం కోర్టులో ఉండటంతో వాయిదాలున్నప్పుడల్లా కమలమ్మ కోర్టుకు వస్తుంది. తన తల్లి ఆస్తిని అక్క కొడుకు ఆక్రమించుకుని తనకు రాకుండా చేయడంతో కోర్టును ఆశ్రయించింది.
- T Nagaraju
- Updated on: Mar 7, 2026
- 2:27 pm
Andhra: అయ్యో.. చిట్టి తల్లి ఎంత ఘోరం జరిగిపోయింది.. చూశారా బెలూన్ ఎలా ప్రాణం తీసిందో..
గుంటూరు జిల్లా పెదకాకానిలో విషాద ఘటన చోటుచేసుకుంది. బెలూన్తో ఆడుకుంటూ నాలుగేళ్ల చిన్నారి శిరీష ప్రాణాలు కోల్పోయింది. బెలూన్ గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరి ఆడక చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారులకు బెలూన్లు వంటి వస్తువులు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన సూచిస్తోంది.
- T Nagaraju
- Updated on: Mar 5, 2026
- 7:16 pm
Andhra: ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్కే మస్కా కొట్టారు.. చివరకు..
గత ఏడాది అక్టోబర్ 29న బాపట్ల జిల్లా కర్లపాలంలోని అయ్యప్ప స్వామి గుడి వద్దకు సచివాలయంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న కర్రి లక్ష్మీ ప్రసన్న వచ్చారు. ఆమె వస్తున్న విషయాన్ని గమనించిన ఇద్దరూ యువకులు బైక్ పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకుని బుద్దాం వైపు వెళ్లిపోయారు. దీంతో మహిళా పోలీస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- T Nagaraju
- Updated on: Mar 3, 2026
- 6:45 pm
Andhra: ఏంటి మామ ఇలా ఉన్నారు.. భార్యను హత్య చేసిన భర్త, లవర్.. అసలు కథ తెలిస్తే..
పల్నాడు జిల్లా ఉప్పలపాడులో భార్య మల్లేశ్వరి హత్య కేసు సంచలనం రేపింది. ఆమె భర్త ఈశ్వరయ్య, ప్రియుడు నాగేశ్వరరావులు కలిసి మల్లేశ్వరిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మల్లేశ్వరి మూడో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించడంపై ఈశ్వరయ్య, నాగేశ్వరరావు ఆగ్రహంతో రాత్రి మద్యం సేవించి ఘర్షణ పడ్డారు. ఘర్షణలో మల్లేశ్వరి తలపై కొట్టి, ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
- T Nagaraju
- Updated on: Mar 2, 2026
- 11:51 am