గుంటూరు జిల్లాలో పదిహేనేళ్ళు గా టివి9 రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009, 2024ల్లో కృష్ణానది వచ్చిన వరదలను కవర్ చేశాను. 2014, 2019, 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రిపోర్టర్ గా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి, రిషితేశ్వరి హత్యలపై ప్రత్యేక కథనాలు ఇచ్చాను. టివి9లో చేరక ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికైన 2009 అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు సమయంలో సబ్ ఎడిటర్ గా ప్రత్యేక వార్తలు ఇచ్చాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పిజి చేసిన నేను మొదట ప్రజాశక్తి పేపర్ లో మండల రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాను. పుస్తకాలు చదవడం నా హాబీ… చరిత్ర పుస్తకాలను ఎక్కువ మక్కువతో చదువుతాను. శ్రీ శ్రీ గారంటే ప్రత్యేక అభిమానం… టివి9లో పని చేస్తూ ట్రాన్స్ ఫర్ కొద్ది నెలల పాటు శ్రీకాకుళంలో రిపోర్టర్ ఉన్నాను. ఆసమయంలో ధర్మల్ పవర్ ఫ్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సోంపేట ఉద్యమాన్ని కవర్ చేశాను
మానవత్వం మరిచిన భర్త..! భార్యపై పెట్రోల్ పోసి నిప్పు.. అడ్డొచ్చిన తల్లికీ గాయాలు..!
భార్యపై అనుమానంతో అమానుషంగా పెట్రోల్ పోసి తగులబెట్టాడు. కోత ముక్కలో డబ్బులు పోగొట్టుకొని మద్యానికి బానిసైన భర్త... భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో భార్య నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అడ్డుకోబోయిన తల్లిపై కూడా పెట్రోల్ పడటంతో గాయలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగ్రాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- T Nagaraju
- Updated on: Jun 11, 2026
- 1:35 pm
Guntur: భీముడు మాములోడు కాడు.. ఏకంగా 10 మంది పోలీసులు సస్పెండ్.. అంతేకాదు..
గుంటూరు జీజీహెచ్ నుంచి పోలీసుల కళ్లుగప్పి పరారైన రిమాండ్ ఖైదీ భీముడు అజిత్ కుమార్ ఎట్టకేలకు తమిళనాడులో పోలీసులకు చిక్కాడు. ఆసుపత్రుల నుంచి రెండుసార్లు తప్పించుకుని పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఈ సైబర్ నేరగాడిని తిరుప్పూర్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలలుగా కొనసాగిన ఉత్కంఠభరిత వేటకు తెరపడింది.
- T Nagaraju
- Updated on: Jun 10, 2026
- 10:55 am
ప్రోటోకాల్ పక్కనబెట్టి.. రైతు వద్దకు వెళ్లిన జిల్లా కలెక్టర్.. ప్రజల వద్దకే పాలన అంటే ఇదే!
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో గుంటూరు జిల్లా కలెక్టరేట్ వేదికగా ఒక మానవీయ ఘట్టం ఆవిష్కృతమైంది. మంచానికే పరిమితమైన ఒక పక్షవాత బాధితుడు తన భూసమస్యను చెప్పుకోవడానికి ఆటోలో కలెక్టరేట్కు వచ్చాడు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ స్వయంగా కాన్ఫరెన్స్ హాల్ నుండి కిందికి దిగివచ్చారు. నేరుగా ఆటో వద్దే బాధితుడి బాధలను ఆలకించారు. కలెక్టర్ చూపిన ఈ చొరవ, మానవత్వంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
- T Nagaraju
- Updated on: Jun 9, 2026
- 4:53 pm
Andhra: బండపై ఏంటీ పిచ్చి రాతలు అనుకుంటున్నారా..? విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
కొండవీడు కోటలోని రుద్రపాద శిఖరంపై మరో పురాతన శాసనం వెలుగులోకి వచ్చింది. రెడ్డి రాజుల కాలానికి చెందినదిగా భావిస్తున్న ఈ దాన శాసనంలో అర్చకులు, పండితులకు వృత్తులు కేటాయించిన వివరాలు ఉన్నట్లు పురావస్తు నిపుణులు గుర్తించారు. శాసనాలపై సమగ్ర సర్వే చేపడితే కొండవీడు చరిత్రలోని మరిన్ని విశేషాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పరిశోధకులు పేర్కొన్నారు.
- T Nagaraju
- Updated on: Jun 8, 2026
- 12:02 pm
రేయ్ ఏంట్రా ఇది.. సూపర్ మార్కెట్తో బంపర్ లాభాలన్నారు.. కట్ చేస్తే, రూ.10కోట్లు వసూలు చేసి..
సూపర్ మార్కెట్ ఫ్రాంచైజీ పేరుతో నిరుద్యోగులను టార్గెట్ చేసిన ఓ సంస్థ కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఐదున్నర లక్షల డిపాజిట్ చేస్తే ఫ్రాంచైజీ ఇస్తామని నమ్మించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల మంది నుంచి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- T Nagaraju
- Updated on: Jun 2, 2026
- 3:34 pm
రైల్వే స్టేషన్కు వెళ్తుండగా విరుచుకుపడ్డ మృత్యువు..భార్య, కొడుకు కళ్లెదుటే భర్త దుర్మరణం! ఏం జరిగిందో చూస్తే..
గుంటూరు నగరంలో ఒక వైపు కురుస్తున్న వర్షాలు ఆనందాన్ని కలిగిస్తుంటే, మరోవైపు ఒక కుటుంబంలో కోలుకోలేని తీవ్ర విషాదాన్ని నింపాయి. ఎన్నో ఏళ్లుగా ఎందరికో నీడనిస్తూ, నగరంలో ఒక మైలురాయిలా నిలిచిన భారీ వేప చెట్టు ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. గుంటూరు మెడికల్ కాలేజ్ ఎదుట అకస్మాత్తుగా భారీ వృక్షం విరిగిపడిన ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఇంటి యజమాని అక్కడికక్కడే మరణించగా, భార్య, ఎనిమిదేళ్ల కుమారుడు గాయపడ్డారు. ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
- T Nagaraju
- Updated on: May 30, 2026
- 3:38 pm
Andhra Pradesh: ఎవడ్రా నువ్వు.. దొంగతనానికి వచ్చి వండుకుని తిని.. పోలిసులకే సవాల్ విసిరావ్..
ఓ ప్రైవేట్ స్కూల్ మాస్టార్ ఇల్లు ఖాళీగా ఉందని తెలిసి లోపలికి చొరబడిన సదరు దొంగ.. బీరువాలోని క్యాష్ కొట్టేయడమే కాకుండా కిచెన్ లో దూరి వంటలు చేసుకుని తిన్నాడు. అంతటితో ఆగకుండా ఆ ఇంట్లోని టెడ్డీ బేర్ బొమ్మపై, గోడలపై నా పేరు రజ్ రామ్.. నన్ను పట్టుకుంటారా? అంటూ రాసి పోలీసులకే బహిరంగంగా సవాల్ విసిరాడు.
- T Nagaraju
- Updated on: May 28, 2026
- 9:05 pm
Andhra Pradesh: బంగారం చోరీ చేసిందన్న ఫ్లాట్ ఓనర్.. మహిళా వాచ్మెన్ ఊహించని నిర్ణయం.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో..
బంగారం దొంగతనం చేసిందని దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మహిళను విచారణకు పిలిచి పలు ప్రశ్నలు అడిగారు.ఆ అవమానాన్ని తట్టుకోలేక ఓ వివాహిత ప్రాణాలు తీసుకుంది. కానీ చనిపోయే ముందు ఆమె వదిలిన సెల్ఫీ వీడియో ఇప్పుడు తెనాలిలో సంచలనంగా మారింది.
- T Nagaraju
- Updated on: May 25, 2026
- 6:52 pm
Vinukonda: గోడకు కన్నం పెట్టి బంగారం షాపులోకి దూరారు.. కానీ లోపల విచిత్రంగా…
పల్నాడు జిల్లా వినుకొండ దక్షిణ బజార్లోని “వేక్షిత జ్యూయలర్స్” షోరూమ్లో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. షోరూమ్ పక్కనున్న మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకున్న దొంగలు గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. లాకర్లో ఉన్న భారీ బంగారు ఆభరణాలను వదిలేసి, వెండి వస్తువులు, చిన్న బంగారు ఆభరణాలను అపహరించారు.
- T Nagaraju
- Updated on: May 23, 2026
- 12:58 pm
ఏపీ టు కేరళ.. రూ.3 వేలు కడితే మూడు విడతల్లో 25 కోట్లు.. క్యూ కట్టిన జనం.. కట్ చేస్తే, మైండ్ బ్లాంక్..
ఏపీలోని పల్నాడు జిల్లాలో భారీ మోసం వెలుగుచూసింది. కేవలం రూ.3 వేలు కడితే మూడు విడతల్లో రూ.25 కోట్లు ఇస్తామని నమ్మించి వందలాది మందిని మోసం చేసిన ఘటన కలకలం రేపింది. నర్సరావుపేటలో ఈకేవైసీ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి, రూ.6 లక్షల నగదు సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
- T Nagaraju
- Updated on: May 21, 2026
- 5:41 pm
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే.. టెన్త్ టాపర్లకు మూడు రోజుల విమానం టూర్!
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై కూటమీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. మౌళిక సదుపాయాలను కల్పిస్తూ విద్యార్ధుల్లో పోటీతత్త్వాన్ని నింపుతోంది. ఈ క్రమంలోనే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మూడు నెలల క్రితం చేసిన ప్రకటన అందరిని ఆలోచింపజేసింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులను ప్రోత్సహిస్తూ ఆమె చేసిన ప్రకటన పట్ల విద్యార్ధులు హర్షం వ్యక్తం చేశారు..
- T Nagaraju
- Updated on: May 20, 2026
- 12:14 pm
Cryptocurrency Fraud: క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. రూ.10 కోట్లు పోగొట్టుకున్న వైద్యుడు.. రంగంలోకి పోలీసులు..!
Cryptocurrency Fraud: రంగంలోకి దిగిన పోలీసులు జయరాజ్ ను, దీపక్ కు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను నియమించి ఢిల్లీకి పంపించారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సహకారంతో దర్యాప్తు చేస్తున్నారు. ఖాతాలను ట్యాంపరింగ్ చేసి జీరోగా చూపించినట్లు..
- T Nagaraju
- Updated on: May 19, 2026
- 10:55 am