AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T Nagaraju

T Nagaraju

Special Correspondent - TV9 Telugu

nagaraju.thirthala@tv9.com

గుంటూరు జిల్లాలో పదిహేనేళ్ళు గా టివి9 రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009, 2024ల్లో కృష్ణానది వచ్చిన వరదలను కవర్ చేశాను. 2014, 2019, 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రిపోర్టర్ గా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి, రిషితేశ్వరి హత్యలపై ప్రత్యేక కథనాలు ఇచ్చాను. టివి9లో చేరక ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికైన 2009 అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు సమయంలో సబ్ ఎడిటర్ గా ప్రత్యేక వార్తలు ఇచ్చాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పిజి చేసిన నేను మొదట ప్రజాశక్తి పేపర్ లో మండల రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాను. పుస్తకాలు చదవడం నా హాబీ… చరిత్ర పుస్తకాలను ఎక్కువ మక్కువతో చదువుతాను. శ్రీ శ్రీ గారంటే ప్రత్యేక అభిమానం… టివి9లో పని చేస్తూ ట్రాన్స్ ఫర్ కొద్ది నెలల పాటు శ్రీకాకుళంలో రిపోర్టర్ ఉన్నాను. ఆసమయంలో ధర్మల్ పవర్ ఫ్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సోంపేట ఉద్యమాన్ని కవర్ చేశాను

Read More
Andhra News: ఇన్‌స్టాలో మొదలైన ప్రేమకు.. చెరువు గట్టు వద్ద ఎండ్ కార్డు.. ఐదేళ్ల తర్వాత

Andhra News: ఇన్‌స్టాలో మొదలైన ప్రేమకు.. చెరువు గట్టు వద్ద ఎండ్ కార్డు.. ఐదేళ్ల తర్వాత

పడ్నాడు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. తాను ప్రేమించిన యువతి మరో వ్యక్తితో మాట్లాడుతూ.. తనను పట్టించుకోవట్లదనే కోపంతో.. ఆమెపై పగ పెంచుకున్న ఓ యువకుడు పక్కా ప్లాన్ చేసి.. ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

రెంటచింతలలో YCP నేత చెన్నారెడ్డి దారుణ హత్య

రెంటచింతలలో YCP నేత చెన్నారెడ్డి దారుణ హత్య

పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ నేత నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. స్వగ్రామానికి స్కూటీపై వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి, అనంతరం కళ్లలో కారం చల్లి గొంతు కోసి హతమార్చారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ ఆధిపత్య పోరు, వ్యక్తిగత కక్షలు సహా పలు అంశాలపై విచారణ కొనసాగుతోంది. నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఘటనతో మాచర్లలో ఉద్రిక్తత నెలకొంది.

రెంటచింతల సమీపంలో వైపీసీ నేత దారుణ హత్య.. ఎలా చంపారో తెలిస్తే వణుకు పుట్టాల్సిందే!

రెంటచింతల సమీపంలో వైపీసీ నేత దారుణ హత్య.. ఎలా చంపారో తెలిస్తే వణుకు పుట్టాల్సిందే!

పల్నాడు జిల్లా మాచర్ల మరోసారి కత్తిపోట్లు కలకలం రేపాయి. సాయంత్రం స్కూటీపై ఇంటికి వెళ్తున్న చెన్నారెడ్డి అనే వైసీపీ నేతను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి, కళ్లలో కారం చల్లి గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ హత్య వెనక కుట్రకోణం ఉందని.. వైపీసీ నేతలు ఆరోపిస్తున్నారు.

పట్టపగలు ఆధార్ వెరిఫికేషన్ పేరిట ఇంట్లోకి దూరి ఘోరం.. భార్య మృతి, భర్త ఆస్పత్రిపాలు!

పట్టపగలు ఆధార్ వెరిఫికేషన్ పేరిట ఇంట్లోకి దూరి ఘోరం.. భార్య మృతి, భర్త ఆస్పత్రిపాలు!

పెదకూరపాడులో వృద్ధ దంపతులపై దుండగులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఆధార్ కార్డు వెరిఫికేషన్ పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు యువకులు సుత్తితో దాడి చేసి, వృద్ధురాలిని హతమార్చారు. భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి, సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు..

మాయమవుతున్న మిర్చి బస్తాలు.. అనుమానంతో ఫిర్యాదు చేస్తే.. చిన్న కథ కాదు ఇది..

మాయమవుతున్న మిర్చి బస్తాలు.. అనుమానంతో ఫిర్యాదు చేస్తే.. చిన్న కథ కాదు ఇది..

మిర్చి ధరలు భారీగా పెరగడంతో గుంటూరులో మిర్చి బస్తాల దొంగతనాలు పెరుగుతున్నాయి. గురజాల నుంచి తీసుకొచ్చిన మిర్చి బస్తాలు చోరీకి గురవడంతో వ్యాపారి ఫిర్యాదు చేయగా, సాంకేతిక ఆధారాలతో నగరంపాలెం పోలీసులు 10 మంది సభ్యులతో కూడిన ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, వాహనాలు, మిర్చి బస్తాలను స్వాధీనం చేసుకుని ప్రధాన నిందితుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

పులికి గోర్లు ఎన్ని ఉంటాయి..? వాటికి ఎందుకు డిమాండ్..? తాజాగా వీళ్లు అరెస్ట్..

పులికి గోర్లు ఎన్ని ఉంటాయి..? వాటికి ఎందుకు డిమాండ్..? తాజాగా వీళ్లు అరెస్ట్..

నల్లమలలో చనిపోయిన పులి గోర్లు మాయం కేసులో అటవీ శాఖ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న అధికారులు, అక్రమ వన్యప్రాణి వ్యాపార కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. పులి గోర్లకు అక్రమ మార్కెట్లో భారీ డిమాండ్ ఉండటమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

నాయనమ్మ అంత్యక్రియలు ముగిశాయి.. కానీ, బంగారం మాయమైంది.. చిన్న అనుమానంతో ఆరాతీస్తే..

నాయనమ్మ అంత్యక్రియలు ముగిశాయి.. కానీ, బంగారం మాయమైంది.. చిన్న అనుమానంతో ఆరాతీస్తే..

గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన 75 ఏళ్ల సుబ్బాయమ్మ మృతి అనంతరం ఆమె ధరించిన సుమారు 52 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తులో బంధువైన నాంచారమ్మ ఆభరణాలను తీసుకున్నట్లు ఒప్పుకోగా, పోలీసులు రెండు గొలుసులు, మంగళసూత్రం, ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుబ్బాయమ్మ మృతిపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Andhra Pradesh: అతనికి 32.. ఆమెకు 19.. మాట్లాడాలి రమ్మంటూ పిలిచి.. మెడలో తాళికట్టి పరార్..!

Andhra Pradesh: అతనికి 32.. ఆమెకు 19.. మాట్లాడాలి రమ్మంటూ పిలిచి.. మెడలో తాళికట్టి పరార్..!

బాపట్ల జిల్లాలో ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి తన ప్రేమను తిరస్కరించినా వెంటాడుతూ, యాసిడ్ పోస్తానంటూ బెదిరించిన వ్యక్తి.. మాట్లాడాల్సి ఉందంటూ గుడికి పిలిచి బలవంతంగా మెడలో తాళి కట్టిన ఘటన కలకలం రేపింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అమరావతి సమీపంలో 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం.. భక్తులను ఆకట్టుకుంటున్న మహా నిర్మాణం!

అమరావతి సమీపంలో 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం.. భక్తులను ఆకట్టుకుంటున్న మహా నిర్మాణం!

మంగళగిరి మండలం నవులూరులో భారీ కార్తికేయ విగ్రహా నిర్మాణం జరుగుతుంది. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఈ విగ్రహాన్ని స్థానికులు నిర్మిస్తున్నారు. 123 అడుగుల ఎత్తులో నిర్మితమవుతన్న విగ్రహాం అందరిని ఆకట్టుకుంటుంది. స్థానికులు దాతల సాయంతో గత కొంతకాలంగా నిర్మాణం కొనసాగిస్తున్నారు.

Andhra: పొలంలో నాగలితో దున్నుతుండగా.. బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..

Andhra: పొలంలో నాగలితో దున్నుతుండగా.. బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..

గుంటూరు–మంగళగిరి మార్గంలోని కాజ గ్రామంలో ఓ రైతు పొలం తవ్వుతుండగా రెండు ప్రాచీన గణపతి విగ్రహాలు, పురాతన మట్టి పాత్రల పెంకులు వెలుగులోకి వచ్చాయి. పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి పరిశీలనలో ఇవి శాతవాహనులు–ఆనందగోత్రినుల కాలానికి చెందినవిగా, సుమారు క్రీ.శ. నాలుగో శతాబ్దం నాటి అరుదైన శిల్పాలుగా గుర్తించారు.

అమరావతిలో దొంగతనాలకు పాల్పడింది వీళ్లేనట.. ఇకపై మొత్తం 8 చెక్ పోస్టులు.. తేడా వస్తే దబిడి దిబిడే..

అమరావతిలో దొంగతనాలకు పాల్పడింది వీళ్లేనట.. ఇకపై మొత్తం 8 చెక్ పోస్టులు.. తేడా వస్తే దబిడి దిబిడే..

అమరావతి రాజధాని ప్రాంతంలోని నిర్మాణ సంస్థల గోదాములను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారుల సహాయంతో ముందుగా రెక్కీ నిర్వహించి, రాత్రివేళల్లో విలువైన సామగ్రిని అపహరిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రూ.11 లక్షల విలువైన టీవీలు, కాపర్ బండిల్స్, బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. మరో ఆరుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

డ్రైవింగ్ టెస్ట్‌లో బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్ తొక్కిన యువతి.. ఆ తర్వాత సీన్‌ ఇదే

డ్రైవింగ్ టెస్ట్‌లో బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్ తొక్కిన యువతి.. ఆ తర్వాత సీన్‌ ఇదే

డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో ఓ యువతి బ్రేక్‌కు బదులు పొరపాటున యాక్సిలరేటర్ తొక్కడంతో కారు అదుపుతప్పి జనం, వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వృద్ధులు, ఒక మహిళ గాయపడగా, కారులో ఉన్న మరో యువతి హ్యాండ్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది..