గుంటూరు జిల్లాలో పదిహేనేళ్ళు గా టివి9 రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009, 2024ల్లో కృష్ణానది వచ్చిన వరదలను కవర్ చేశాను. 2014, 2019, 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రిపోర్టర్ గా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి, రిషితేశ్వరి హత్యలపై ప్రత్యేక కథనాలు ఇచ్చాను. టివి9లో చేరక ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికైన 2009 అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు సమయంలో సబ్ ఎడిటర్ గా ప్రత్యేక వార్తలు ఇచ్చాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పిజి చేసిన నేను మొదట ప్రజాశక్తి పేపర్ లో మండల రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాను. పుస్తకాలు చదవడం నా హాబీ… చరిత్ర పుస్తకాలను ఎక్కువ మక్కువతో చదువుతాను. శ్రీ శ్రీ గారంటే ప్రత్యేక అభిమానం… టివి9లో పని చేస్తూ ట్రాన్స్ ఫర్ కొద్ది నెలల పాటు శ్రీకాకుళంలో రిపోర్టర్ ఉన్నాను. ఆసమయంలో ధర్మల్ పవర్ ఫ్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సోంపేట ఉద్యమాన్ని కవర్ చేశాను
అనుమానం.. ఆవేశం.. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది.. భార్యను చంపి భర్త చేశాడంటే?
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయిబాబా క్యాటరింగ్ పనులకు వెళ్తుంటాడు. సాయిబాబాకు నల్గొండకు చెందిన శిరీషతో 2015లో వివాహం అయింది. వీరికి ఇద్దరూ పిల్లలున్నారు. పెళ్లైనా తర్వాత హైదరాబాద్లో కొంతకాలం పాటు కాపురం పెట్టారు. సంసారం సాఫీగా సాగుతుండటంతో దంపతులు ఆరు నెలల క్రితమే తెనాలి వచ్చారు.
- T Nagaraju
- Updated on: Jan 28, 2026
- 12:32 pm
తాను మరణించి.. ఆరుగురికి ప్రాణదానం చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి!
తాడికొండ మండలం నిడు ముక్కల వద్ద గత శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు చనిపోగా మరో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. అయితే బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చదువుతున్న అమర్ బాబు కాలేజ్ విద్యార్ధులతో బైక్ పై వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
- T Nagaraju
- Updated on: Jan 27, 2026
- 1:21 pm
Palnadu: మద్యం మత్తులో చేతిలోకి కత్తి వచ్చింది.. స్నేహితుడి ప్రాణమే తీసింది..
మద్యం మత్తు స్నేహితుల మధ్య ఘర్షణకు, చివరకు హత్యకు దారి తీసింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ఈ ఘటనలో మద్యం సేవించిన ఇద్దరు స్నేహితుల మధ్య వాగ్వాదం తీవ్రంగా మారి ఒకరి మృతి చెందగా, మరో వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు.
- T Nagaraju
- Updated on: Jan 26, 2026
- 1:01 pm
Andhra Pradesh: భర్తను వదిలి నీకోసం వస్తే నన్ను వదిలేస్తావా.. ఈ మహిళ చేసిన పనికి ఆస్పత్రిలో ప్రియుడి ఫ్యామిలీ..
నీకోసమే భర్తను వదిలివస్తే.. నన్ను నిర్లక్ష్యం చేస్తావా అంటూ ఓ మహిళ చేసిన పని పది మంది ప్రాణాలకు మీదకు వచ్చింది. తన ప్రియుడి ఇంటికి వెళ్లి, అందరూ చూస్తుండగానే పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకోవడంతో.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ప్రియుడి భార్య, పిల్లలు, తల్లి సహా పదిమంది ఆ మంటల్లో చిక్కుకున్నారు.
- T Nagaraju
- Updated on: Jan 25, 2026
- 7:07 pm
Andhra News: బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..
గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పక్కా సమాచారంతో ఓ రేకుల షెడ్డు నివాసంలో సోదాలు జరిపిన పోలీసులకు ఏకంగా కోటిన్నర రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు దొరికాయి. చూస్తే రేకుల షెడ్డు.. మరి ఇంత బంగారం, వారికెలా వచ్చిందని స్థానికులంతా షాకవుతున్నారు. ఇంతకు వారి దగ్గరకు ఆ బంగారం, వెండి ఎలా వచ్చిందో తెలుసుకుందాం పదండి.
- T Nagaraju
- Updated on: Jan 24, 2026
- 1:12 pm
Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
ప్రేమించిన యువతి తనను కాదందని యువకులు ప్రాణం తీసుకోవడమో, లేదా ప్రియురాలి ప్రాణాలు తీయడమో చేసిన ఘటనలు మనం చాలానే చూశాం. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం తనను దూరం పెట్టిందన్న కోపంతో ఏకంగా ప్రియురాలి ముక్కునే కోసేశాడు. ఈ వింత ఘటన పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది.
- T Nagaraju
- Updated on: Jan 23, 2026
- 12:28 pm
Andhra Pradesh: సైకో భార్య.. భర్తను చంపేసి.. ఆ వీడియోలు చూస్తూ రాత్రంతా.. షాకింగ్ నిజాలు..
అది అర్ధరాత్రి సమయం.. అందరూ నిద్రపోతున్నారు. కానీ ఆ ఇంట్లో మాత్రం ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది. భర్తకు ఇష్టమైన బిర్యానీలోనే భార్య చావును కలిపి ఇచ్చింది. అంతటితో ఆగకుండా ప్రియుడితో కలిసి అతడిని ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత ఆమె ప్రవర్తించిన తీరు చూస్తే.. మనిషిలో ఇంతటి వికృత రూపం ఉంటుందా అనిపించక మానదు. అసలు ఏం జరిగిందంటే..?
- T Nagaraju
- Updated on: Jan 22, 2026
- 3:50 pm
Andhra Pradesh: ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన సాఫ్ట్వేర్ ఇంజినీర్కు ఊహించని షాక్..
సాఫ్ట్వేర్ ఇంజనీర్.. పైకి చూస్తే పద్ధతైన వ్యక్తిత్వం.. కానీ ఆ ముసుగు వెనుక ఉన్నది మాత్రం ఒక పక్కా క్రిమినల్ మైండ్సెట్. కట్టుకున్న భార్యలను కట్నం కోసం వేధించడమే కాకుండా విడాకులు ఇవ్వకుండానే వరుస పెళ్లిళ్లతో జీవితాలను నాశనం చేస్తున్న ఒక ప్రబుద్ధుడి ఉదంతం గుంటూరులో సంచలనం రేపుతోంది. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
- T Nagaraju
- Updated on: Jan 20, 2026
- 11:54 am
Telugu Traditional: సంక్రాంతి సంబరాల్లో విదేశీ వనితలు.. కట్టుబొట్టుతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు
తెనాలిలో ఆస్ట్రేలియా విద్యార్థులు తెలుగు కట్టుబొట్టును అలంకరించి, స్థానిక సంప్రదాయాలను ఆస్వాదించారు. జోసెఫ్ పాఠశాల వార్షికోత్సవంలో భాగంగా వచ్చిన వీరు, చీరలు, పంచెలతో సాంస్కృతిక మార్పిడిని ప్రదర్శించారు. పల్లెటూళ్లలో జీవన విధానాన్ని తెలుసుకుంటూ, సంక్రాంతి విశేషాలను పరిశీలించారు. విదేశీయులు తెలుగు సంస్కృతిని ఎంతగానో ప్రశంసించారు, సాంప్రదాయ వస్త్రధారణ పట్ల మక్కువ చూపారు.
- T Nagaraju
- Updated on: Jan 19, 2026
- 8:44 pm
Andhra News: కనడమే వాళ్ల పాపమా? డబ్బు ఇవ్వలేదని.. అర్థరాత్రి కొడుకు ఏం చేశాడంటే..
రోజురోజుకూ మానవ సంబధాలు మంటకలుస్తున్నాయి. డబ్బు మోజులో పడి రక్త సంబంధాలనే తెంచుకుంటున్నారు కుటుంబ సభ్యులు. తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని.. తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు ఒక కొడుకు. ఈ దాడిలో తీవ్రంగా గాపడిన తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
- T Nagaraju
- Updated on: Jan 19, 2026
- 8:21 pm
Andhra News: వక్క కాయలపై అందమైన చిత్రాలు.. ఆక్టటుకుంటున్న స్టాల్ బొమ్మలు
గుంటూరులో ఏర్పాటు చేసిన జాతీయ డ్వాక్రా బజార్ లో గుజరాత్ మహిళల ప్రత్యేక వక్క కాయల బొమ్మలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. చేతితో తయారు చేసే ఈ దైవ ప్రతిమలు, ముఖ్యంగా వినాయకుడి భార్యలైన రిద్ది, సిద్ది బొమ్మలు, ఇంట అలంకరణకు, పూజలకు ఉపయోగిస్తారు. వీటిని ఉంచడం వలన శుభం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లలో వీటికి అధిక డిమాండ్ ఉంది, జాతీయ సరస్ మేళాలలో కూడా విక్రయిస్తున్నారు.
- T Nagaraju
- Updated on: Jan 18, 2026
- 2:53 pm
Tenali: గోదావరి సంప్రదాయం గుంటూరుకి పాకింది
గోదావరి జిల్లాల్లో అల్లుళ్లకు పిండి వంటల మర్యాద సంప్రదాయమే. కానీ ఈసారి ఆ సంప్రదాయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు గుంటూరు జిల్లా తెనాలి దంపతులు. మొదటి సంక్రాంతికి వచ్చిన అల్లుడికి ఏకంగా 158 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
- T Nagaraju
- Updated on: Jan 15, 2026
- 12:44 pm