T Nagaraju

T Nagaraju

Special Correspondent - TV9 Telugu

nagaraju.thirthala@tv9.com

గుంటూరు జిల్లాలో 14 ఏళ్ళుగా టివి రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009లో గుంటూరు జిల్లా టివి9 రిపోర్టర్ గా చేరాను. 2009లో కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో జిల్లా రిపోర్టర్ గా కవర్ చేశారు. 2014, 2019 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను జిల్లా రిపోర్టర్ గా కవర్ చేశాను. అంతకు ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. మాటివిలో చేరక ముందు ప్రజా శక్తిలో అచ్చంపేట మండల రిపోర్టర్ గా పని చేశాను. పుస్తక పఠనం నా హాబీ. చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదవటం అంటే ఇష్టం.

Read More
AP News: లొట్టలేసుకుంటూ కోడి మాంసం తినాలనుకున్నాడు.. తీరా ఇంటికి వచ్చేసరికి..

AP News: లొట్టలేసుకుంటూ కోడి మాంసం తినాలనుకున్నాడు.. తీరా ఇంటికి వచ్చేసరికి..

రోజూలానే ఆ వ్యక్తి తనకు ఇష్టమైన కోడి మాంసం తెచ్చుకునేందుకు షాప్‌నకు వచ్చాడు. దగ్గరుండి చికెన్ ముక్కలు కొట్టించుకున్నాడు. తీరా ఇంటికి వచ్చేసరికి.. దెబ్బకు షాక్ అయ్యాడు. ఇంతకీ అసలు ఆ స్టోరీ ఏంటంటే.? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందామా మరి.

Amaravati:  మార్కెట్‌కు తీసుకెళ్దామని రాత్రి బస్తాల్లో నింపి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా..

Amaravati: మార్కెట్‌కు తీసుకెళ్దామని రాత్రి బస్తాల్లో నింపి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా..

అమరావతి రాజధాని పరిధిలోని పెనమాక, తాడేపల్లి, ఉండవల్లి, యర్రబాలెం పరిసర గ్రామాల్లో వాణిజ్య పంటలను అధికంగా సాగు చేస్తుంటారు. నీటి వసతి ఉండటంతో ఇక్కడ ఏడాదంతా పంటలు సాగవుతుంటాయి. పెనమాక పరిసర ప్రాంతాల్లో ఉల్లి సాగు కూడా అధికంగా ఉంటుంది. దిగుబడులు, ధర ఎలా ఉన్న వందల ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తుంటారు రైతులు...ఇక్కడ పండే ఉల్లికి ఘాటు ఎక్కువన్న ప్రచారం కూడా ఉంది. దీంతో వివిధ ప్రాంతాల నుండి ఉల్లిపాయలను కొనుగోలు చేసేందుకు పెనమాక వస్తుంటారు. ప్రస్తుతం రైతుల వద్ద నుండి కేజీ ఉల్లిపాయలను 25 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో యాభై రూపాయల వరకూ కేజీ ఉల్లి ధర ఉంది.

Guntur: సైకో మంజు టార్గెట్ చేస్తే మిస్ అవ్వదు.. జైలుకు వెళ్ళొచ్చినా మారని బుద్ధి..!

Guntur: సైకో మంజు టార్గెట్ చేస్తే మిస్ అవ్వదు.. జైలుకు వెళ్ళొచ్చినా మారని బుద్ధి..!

ఒంటరిగా ఉన్న వృద్దురాళ్ళను మంజు అనే వ్యక్తి టార్గెట్‌గా చేసుకుని మద్యం మత్తులో అత్యాచారం చేసి హత్య చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గంజాయి కూడా సేవిస్తుంటాడని చెప్పుకొచ్చారు. తమ ప్రాంతంలో మరికొంత మంది వృద్ధురాళ్ళపై అత్యాచారాలు జరిగాయని, అయితే పరువు పోతుందన్న భావనతో మరికొంతమంది బయటకు చెప్పుకోవటం లేదని స్థానికులు తెలిపారు.

అతను ఇంటికొస్తే ఏడుస్తుందనీ.. నాలుగేళ్ల కూతురిపై కన్నతల్లి కర్కశత్వం! ఏం చేసిందంటే..

అతను ఇంటికొస్తే ఏడుస్తుందనీ.. నాలుగేళ్ల కూతురిపై కన్నతల్లి కర్కశత్వం! ఏం చేసిందంటే..

కడుపులో నెట్టుకుని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ కన్న తల్లి కనికరం లేకుండా నాలుగేళ్ల చిన్నారిని చిత్ర హింసలకు గురి చేసింది. మాటలు కూడా సరిగ్గారాని చిన్నారి ఒంటిపై అట్లకాడతో కాల్చి వాతలు పెట్టింది. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా పది రోజుల పాటు ఆ చిన్నారికి నరకం చూపించింది. అయితే ఇదంతా ఎందుకు చేసిందో తెలస్తే హతాసులవుతారు..

Andhra News: సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ఫోన్.. అలా చెప్పడంతో ఒక్కసారిగా కంగారు.. ఆ తర్వాత..

Andhra News: సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ఫోన్.. అలా చెప్పడంతో ఒక్కసారిగా కంగారు.. ఆ తర్వాత..

పోలీస్ అధికారులు ఎంత అవగాహన కల్పించిన సైబర్ నేరగాళ్ల కొత్త కొత్త టెక్నిక్ లకు అమాయకులు చిక్కుతూనే ఉన్నారు. అరెస్ట్ పేరిట.. పదకొండు లక్షల రూపాయల రుణం ఇప్పించి.. ఆ రుణాన్ని కొట్టేసిన సైబర్ నేరగాళ్లపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ నేరగాళ్ల కోసం ప్రత్యేక గాలింపు చేపట్టారు.

Guntur District: జనాలకి శఠగోపం పెట్టాలనుకుంటే.. దేవుడే వాళ్లకు పెట్టాడు.. దురాశ దు:ఖానికి చేటు..

Guntur District: జనాలకి శఠగోపం పెట్టాలనుకుంటే.. దేవుడే వాళ్లకు పెట్టాడు.. దురాశ దు:ఖానికి చేటు..

దురాశ దు:ఖానికి చేటు.. తాటిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు.. ఈ సామెతల్ని వారికి పెద్దవాళ్లు నూరిపోసినట్లు లేరు. దీంతో అత్యాశకు పోయి జనాలకు దొంగనోట్లు ఇచ్చి మాయ చేయాలనుకున్నారు. పథకం అంతా పక్కాగా అమలు చేశారు. కట్ చేస్తే చివరకు వారే మోసపోయారు. ఆ డీటేల్స్...

ఓరి దుర్మార్గుడా.. భార్య పోరు పడలేక.. కన్న తండ్రిని ఎత్తి కాల్వలో పడేసిన కొడుకు! తర్వాత జరిగిందిదే

ఓరి దుర్మార్గుడా.. భార్య పోరు పడలేక.. కన్న తండ్రిని ఎత్తి కాల్వలో పడేసిన కొడుకు! తర్వాత జరిగిందిదే

వృద్ధుడైన తండ్రిని పోషించేందుకు కన్న కొడుకుకి, అతడి భార్యకు మనసు రాలేదు. దీంతో తండ్రిని ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. నమ్మకంగా కారులో తీసుకెళ్లి కాల్వ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కాల్వ ఒడ్డున తండ్రిని కారు దిగమని చెప్పి.. తాను కూడా దిగి.. చేతులతో తండ్రిని అమాంతం ఎత్తి కాల్వలోకి విసిరేసి చేతులు దులుపుకున్నాడు. కానీ అంతలోనే..

Andhra Pradesh: పైకి వారంతా యాచకులే.. తీరా యవ్వారం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Andhra Pradesh: పైకి వారంతా యాచకులే.. తీరా యవ్వారం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో కనిపించకుండాపోయిన ఆరేళ్ల బాలుడి కేసును గుంటూ రైల్వే పోలీసులు ఛేదించారు. పక్కా సమాచారంతో అనుమానితులను అనుసరించిన పోలీసులు, కిడ్నాపర్ల గుట్టురట్టు చేశారు. నర్సరావుపేట పరిసర ప్రాంతాలకు చెందిన ఐదుగురు సభ్యులు గల లేడీ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాలుడిని సురక్షితంగా తల్లికి అప్పగించారు.

మనిషి గుండెకు జంతు రక్తనాళంతో చికిత్స.. పూర్తి ఉచితంగా ఈ అరుదైన ఆపరేషన్

మనిషి గుండెకు జంతు రక్తనాళంతో చికిత్స.. పూర్తి ఉచితంగా ఈ అరుదైన ఆపరేషన్

అత్యంత్య అరుదైన శస్త్రచికిత్స ఉచితంగా చేయడమే కాకుండా విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులకు రాము ధన్యవాదాలు తెలిపాడు. దేశం మొత్తం మీద ఇటువంటి తరహా ఆపరేషన్లు రెండు మూడు మాత్రమే జరిగాయని వైద్యులు సురేంద్ర తెలిపారు. గతంలోనూ గుంటూరులో అత్యంత్య అరుదైన శస్త్రచికిత్సలు జరిగాయని మరోసారి ఇటువంటి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బ్రుందంపై స్థానికులు ప్రసంశల జల్లు కురిపిస్తున్నాడు.

Andhra News: ఉదయం లేచేసరికి 12 ఇళ్ల ముందు ఎర్ర జాకెట్ ముక్క, మిరప కాయలు.. బాబోయ్

Andhra News: ఉదయం లేచేసరికి 12 ఇళ్ల ముందు ఎర్ర జాకెట్ ముక్క, మిరప కాయలు.. బాబోయ్

అది ఒక చిన్న పల్లెటూరు... పులిచింతల ప్రాజెక్ట్ సమీపంలో కొండల మధ్య కొలువై ఉన్న చిన్న గ్రామంలో ఇప్పుడు ఆందోళన వ్యక్తం అవుతోంది. గ్రామంలో మొత్తం యాభై ఇళ్లు మాత్రమే ఉంటాయి. అయినా ఎవరూ చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియదు కాని క్షుద్ర పూజల ఆనవాళ్లు మాత్రమే తెల్లవారే సరికి ఇంటి ముందు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాయ పాలెంలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Raghurama Krishnam Raju: తన గుండెలపై కూర్చుని టార్చర్ చేసిన వ్యక్తిని గుర్తుపట్టిన రఘురామకృష్ణంరాజు..

Raghurama Krishnam Raju: తన గుండెలపై కూర్చుని టార్చర్ చేసిన వ్యక్తిని గుర్తుపట్టిన రఘురామకృష్ణంరాజు..

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రైవేటు వ్యక్తి అయిన తులసిబాబును జనవరి 8న పోలీసులు అరెస్ట్ చేశారు. తన గుండెలపై కూర్చున్న వ్యక్తిని గుర్తించేందుకు అనుమతి కోరుతూ ఈ కేసును విచారిస్తోన్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఈ క్రమంలో జిల్లా జడ్జి సమక్షంలో తులసీబాబును పోలిన వ్యక్తులతో గుంటూరు జైల్లో పరేడ్ నిర్వహించారు పోలీసులు.

Amaravati: ఇవి రాజధాని చేపలండోయ్.. దక్కించుకునేందుకు ఎగబడ్డ జనం

Amaravati: ఇవి రాజధాని చేపలండోయ్.. దక్కించుకునేందుకు ఎగబడ్డ జనం

ఐకానిక్‌ భవనాల పనులను ప్రారంభించేందుకు ఏపీలోని కూటమి సర్కార్ సిద్ధమైంది. దీని కోసం ఐకానిక్‌ ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ వద్ద ఉన్న నీటిని తోడే కార్యక్రమం చేపట్టింది. అయితే ఆ నీటిని తోడుతుండగా పెద్ద ఎత్తున చేపలు బయటపడుతున్నాయి. ఏకంగా కిలోల కొద్ది పెరిగిన ఆ చేపల్ని దక్కించుకునేందుకు స్థానికులు పోటీ పడుతున్నారు.