AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T Nagaraju

T Nagaraju

Special Correspondent - TV9 Telugu

nagaraju.thirthala@tv9.com

గుంటూరు జిల్లాలో పదిహేనేళ్ళు గా టివి9 రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009, 2024ల్లో కృష్ణానది వచ్చిన వరదలను కవర్ చేశాను. 2014, 2019, 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రిపోర్టర్ గా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి, రిషితేశ్వరి హత్యలపై ప్రత్యేక కథనాలు ఇచ్చాను. టివి9లో చేరక ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికైన 2009 అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు సమయంలో సబ్ ఎడిటర్ గా ప్రత్యేక వార్తలు ఇచ్చాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పిజి చేసిన నేను మొదట ప్రజాశక్తి పేపర్ లో మండల రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాను. పుస్తకాలు చదవడం నా హాబీ… చరిత్ర పుస్తకాలను ఎక్కువ మక్కువతో చదువుతాను. శ్రీ శ్రీ గారంటే ప్రత్యేక అభిమానం… టివి9లో పని చేస్తూ ట్రాన్స్ ఫర్ కొద్ది నెలల పాటు శ్రీకాకుళంలో రిపోర్టర్ ఉన్నాను. ఆసమయంలో ధర్మల్ పవర్ ఫ్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సోంపేట ఉద్యమాన్ని కవర్ చేశాను

Read More
Andhra: ఓరి దుర్మార్గుడా.. భార్యతో గొడవ వద్దన్నందుకు దాడి చేశాడు.. చివరకు

Andhra: ఓరి దుర్మార్గుడా.. భార్యతో గొడవ వద్దన్నందుకు దాడి చేశాడు.. చివరకు

భార్యతో గొడవ వద్దని ప్రశ్నించిన అత్త కుటుంబంపై అల్లుడు దారుణంగా దాడి చేసిన ఘటన పల్నాడు జిల్లాలో కలకలం రేపింది. కర్రలు, రాడ్లతో జరిగిన దాడిలో వృద్ధురాలు ఫాతిమా మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Andhra Pradesh: ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. కట్‌చేస్తే భార్యకు ఊహించని ట్విస్ట్

Andhra Pradesh: ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. కట్‌చేస్తే భార్యకు ఊహించని ట్విస్ట్

అర్ధరాత్రి వేళ.. మద్యం మత్తులో బైకులపై వచ్చిన నలుగురు యువకులు.. చేతిలో గండ్ర గొడ్డలి.. బీర్ బాటిళ్లు పగులగొడుతూ ఓ వ్యక్తిని చంపేస్తామంటూ వీరంగం సృష్టించారు. సత్తెనపల్లిలో ఒక వివాహేతర సంబంధం చినికి చినికి గాలివానలా మారి హత్యాయత్నం వరకు వెళ్ళింది. చివరకు స్థానికులు రంగంలోకి దిగడంతో కిలేడీ భార్య, ఆమె ప్రియుడి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది.

గాల్లో ఎగిరే ఎయిర్ ట్యాక్సీ సిద్ధం.. గుంటూరులో యువ ఇంజినీర్ సంచలనం, త్వరలో ఆకాశ ప్రయాణాలు!

గాల్లో ఎగిరే ఎయిర్ ట్యాక్సీ సిద్ధం.. గుంటూరులో యువ ఇంజినీర్ సంచలనం, త్వరలో ఆకాశ ప్రయాణాలు!

ట్రాఫిక్ సమస్యలను అధిగమించి సులభంగా ప్రయాణించే మార్గాలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. రోడ్లపై ప్రయాణించాలంటే ట్రాఫిక్ సమస్య పెద్ద అవరోధంగా మారింది. గాల్లో ప్రయాణాలు అత్యంత్య ఖర్చుతో కూడుకొని ఉంటాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ సమస్యలు లేని ఆకాశ ప్రయాణాల పట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Andhra News: వర్కర్ చేసిన ఆ పనికి.. ఏకంగా ప్రాణాలే తీసిన యజమాని.. ఏం జరిగిందంటే?

Andhra News: వర్కర్ చేసిన ఆ పనికి.. ఏకంగా ప్రాణాలే తీసిన యజమాని.. ఏం జరిగిందంటే?

క్రైమ్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయింది. చట్టాలు, శిక్షలపై కాస్త కూడా భయం లేకుండా విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతున్నారు జనాలు. చిన్న చిన్న విషయాలకే అనుకున్న వెంటనే ఈజీగా ఒక మనిషిని హత్య చేయగలుగుతున్నారు. తాజగా ఇలాంటి గంటూరు జిల్లాలో వెలుగు చూసింది. క్యాటరింగ్ పనులకు డుమ్మా కొడుతున్న కోపంతో ఓ యజమాని తన అనుచరుడిని దారుణంగా హత్య చేశాడు.

Andhra Pradesh: పోలీసులు చేసిన చిన్న పనితో కామాంధుడికి కఠిన శిక్ష.. నేరం ఎలా బయటపడిందో తెలుసా..?

Andhra Pradesh: పోలీసులు చేసిన చిన్న పనితో కామాంధుడికి కఠిన శిక్ష.. నేరం ఎలా బయటపడిందో తెలుసా..?

ఒక చిన్న అవగాహన.. ఒక నిండు జీవితంలో వెలుగులు నింపడమే కాదు, ఒక నేరస్తుడి అంతం చూసింది.. పోలీసులు పాఠశాలల్లో నిర్వహించిన బ్యాడ్ టచ్ క్లాస్, నాలుగేళ్ల క్రితం ఒక బాలికలో నింపిన ధైర్యం నేడు గెలిచింది. కన్నకూతురిపై కన్నేసి, దయ్యం పట్టిందంటూ నాటకాలాడిన కామాంధుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

Andhra News: తాకట్టు పెట్టుకున్న ఫోన్ తిరిగివ్వలేదని చెయ్యి నరికి చేతిలో పెట్టిన కారు డ్రైవర్

Andhra News: తాకట్టు పెట్టుకున్న ఫోన్ తిరిగివ్వలేదని చెయ్యి నరికి చేతిలో పెట్టిన కారు డ్రైవర్

సాధారణంగా మనం ఎవరిదగ్గరైనా ఏదైనా వస్తువు తాకట్టు పెడితే ఏం చేస్తాం.. తర్వాత డబ్బులు చెల్లించి తీసుకుంటాం. డబ్బులు ఇచ్చినప్పటికీ ఆ వస్తువు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతాం. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం తాను తాకట్టు పెట్టిన ఫోన్‌ను తిరిగి ఇవ్వడం లేదని.. ఏకంగా తాకట్టె పెట్టుకున్న వ్యక్తి చేతినే నరికేశాడు. అనంతరం అతన్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Guntur: ఎంత పనిచేశావ్ అల్లుడా.. భార్య మీద కోపంతో అర్థరాత్రి ఇంట్లోకి దూరి..

Guntur: ఎంత పనిచేశావ్ అల్లుడా.. భార్య మీద కోపంతో అర్థరాత్రి ఇంట్లోకి దూరి..

గుంటూరు జిల్లాలో భార్యపై కోపంతో అల్లుడు అత్త ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. మద్యానికి, పేకాటకు బానిసైన గోపి, భార్య పుట్టింటికి వెళ్ళినా వేధించడం మానలేదు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి 8 సవర్ల బంగారం, వెండి పట్టీలు దొంగిలించాడు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో గోపిని పట్టుకొని, దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

రేణుకను పక్కా ప్లాన్‌తోనే చంపేశారా..? క్రోసూరు పోలీస్ స్టేషన్‌లో ఆ రోజు ఏం జరిగింది.. ఏపీలో సంచలనం

రేణుకను పక్కా ప్లాన్‌తోనే చంపేశారా..? క్రోసూరు పోలీస్ స్టేషన్‌లో ఆ రోజు ఏం జరిగింది.. ఏపీలో సంచలనం

పల్నాడు క్రోసూరు పోలీసు స్టేషన్ భవనంపై నుండి పడి వల్లపు రేణుక మృతి చెందడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానిస్టేబుల్ వెంకటేశ్వరరెడ్డి హత్య చేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విచారణ సమయంలోనే ఈ ఘటన జరిగిందని, పోలీసులు దీనిని ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని బంధువులు అంటున్నారు. దీనిపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు.

Andhra: ఆలయం పునర్నిర్మాణ పనులు చేస్తుండగా మెరుస్తూ కనిపించాయ్.. ఏంటా అని వెలికి తీయగా..

Andhra: ఆలయం పునర్నిర్మాణ పనులు చేస్తుండగా మెరుస్తూ కనిపించాయ్.. ఏంటా అని వెలికి తీయగా..

పల్నాడు జిల్లా ఇనిమెళ్లలో అద్భుతం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజినేయులు స్వగ్రామంలోని పురాతన భావన్నారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో ఏడు అరుదైన పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. ఆలయ బావిలో దశాబ్దాలుగా దాగి ఉన్న ఈ విగ్రహాలతో పాటు కొన్ని రాగి రేకులు కూడా లభ్యమవ్వడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Watch: ఎవరూ లేని ఇంట్లో అర్థరాత్రి అదేపనిగా వెలుగుతున్న లైట్స్.. తీరా డోర్ ఓపెన్‌ చేయగా..

Watch: ఎవరూ లేని ఇంట్లో అర్థరాత్రి అదేపనిగా వెలుగుతున్న లైట్స్.. తీరా డోర్ ఓపెన్‌ చేయగా..

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో భారీ చోరీ కలకలం రేపింది. కూతురి పెళ్లికోసం చేయించిన రూ.25 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను అర్థరాత్రి ఇంట్లోకి దూరిన కేటుగాళ్లు ఎత్తెకెళ్లారు. ఎవరూ లేని ఇంట్లో రాత్రి ఇంట్లో లైట్లు వెలగడంతో అనుమానం వచ్చిన స్థానికులు యజమానికి సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

Andhra: లోపల ముగ్గురు మహిళలు.. ఓ పురుషుడు.. కట్‌చేస్తే, పోలీసుల ఎంట్రీతో..

Andhra: లోపల ముగ్గురు మహిళలు.. ఓ పురుషుడు.. కట్‌చేస్తే, పోలీసుల ఎంట్రీతో..

గుంటూరు నగరంలో మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు లక్ష్మీపురం, ఇన్నర్ రింగ్ రోడ్డులోని స్పా సెంటర్లపై మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో పలువురు మహిళలు, పురుషులు పట్టుబడ్డారు. వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయని నిర్ధారణ కావడంతో నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న స్పా యజమానులకు టాస్క్ ఫోర్స్ దాడులతో వణుకు పుడుతోంది.

Andhra: ట్రాన్స్‌జెండర్‌కి పిఏ ఉద్యోగం ఇచ్చిన ఎమ్మెల్యే.. మంత్రి నారా లోకేష్ ఏమన్నారంటే..

Andhra: ట్రాన్స్‌జెండర్‌కి పిఏ ఉద్యోగం ఇచ్చిన ఎమ్మెల్యే.. మంత్రి నారా లోకేష్ ఏమన్నారంటే..

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల సమస్యలు వింటున్న క్రమంలో ఓ ట్రాన్స్‌జెండర్ ఆమెను కలిశారు. అనంతరం ఆమె ఎడ్యూకేషన్ గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే.. ఆమెకు తన పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)గా ఉద్యోగం ఇచ్చారు. నెలకు రూ. 25,000 జీతంతో వర్షిణి ఇప్పుడు ఎమ్మెల్యే వెంటే ఉంటూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ చర్య సామాజిక సాధికారతకు ప్రతీకగా నిలుస్తోంది.. పలువురి ప్రశంసలు అందుకుంటోంది.