ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు

రాష్ట్ర అసెంబ్లీలోని 175 మంది సభ్యులను ఎన్నుకునేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు త్వరలోనే జరగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభ పదవీకాలం 2024 జూన్ 11వ తేదీతో ముగియనుంది. 2019లో ఏప్రిల్ 11న 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. 79.88 శాతం పోలింగ్ నమోదయ్యింది. నాటి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. నాటి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 151 స్థానాల్లో విజయం సాధించగా.. టీడీపీ 23 స్థానాలకు పరిమితం అయ్యింది. నాటి ఎన్నికల్లో జనసేన ఒక సీటును గెలుచుకోగా.. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ నాటి ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయాయి. ఎన్నికల అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ విభజన తర్వాత జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఆ ఎన్నిక్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 49.95 శాతం ఓటింగ్ నమోదుకాగా.. టీడీపీకి 39.17 శాతం, జనసేన పార్టీకి 5.53 శాతం ఓటింగ్ నమోదయ్యింది.

రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ- జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సాధించేందుకు ధివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కృషి చేస్తున్నారు. ఏపీలో అధికార పగ్గాలు చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 88గా ఉంది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలకు జమిలి ఎన్నికలు జరగనున్నాయి.

ఇంకా చదవండి

Teachers to Ministers: రాజకీయాల్లోకి వచ్చిన మహిళ టీచర్లకు ఏకంగా మంత్రి పదవులే..!

ఏపీలో ఓ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ ట్రెండు ఇప్పుడేమి కొత్తగా మొదలైందీ కాదు..! ఓ సినిమాలో నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా.. అన్నట్లు ఇక్కడ వ్యవహారం ఉంది. అయితే ఇక్కడ అదే ట్రెండు ఫాలో అవుతూ జాక్‌పాట్ కొట్టేస్తున్నారు ఆ మహిళా నేతలు.

Pawan Kalyan: ‘వెల్‌కమ్‌ చీఫ్’.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై హీరో మనోజ్ ఆసక్తికర పోస్ట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ఏపీ క్యాబినేట్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన పదవి దక్కింది. వీటితో పాటు పవన్ ఆశించిన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అలాగే పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను జనసేన అధినేతకు అప్పగించారు.

మహిళలా మజాకా.. దేశంలో 33శాతం రిజర్వేషన్ లేకుండానే 55శాతం విజయం సాధించిన నేతలు..

చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలంటూ దశాబ్దాలుగా మహిళలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యేక రిజర్వేషన్లు లేకపోయినా ఆ జిల్లాలో మాత్రం 55% శాతం మహిళలే చట్టసభలకు వెళ్తుండటం అందరిని ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది. అంతే కాకుండా ఆ జిల్లాను నడుపుతున్న అధికారులు సైతం మహిళలే కావటం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇంతకీ 50 శాతం దాటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లా ఏది? అక్కడ మహిళలు ఎవరు? అనుకుంటున్నారా? అదే ఒకప్పుడు గజపతిరాజులు ఏలిన విజయనగరం.

YSRCP: ఏపీ ఫలితాల తర్వాత వైసీపీకి మరో అగ్నిపరీక్ష.. రంగంలోకి వైవీ సుబ్బారెడ్డి..

ఎన్నికలు ముగిశాయి. కూటమికి అనూహ్య విజయం లభించింది. కనీవిని ఎరుగని రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాలను దక్కించుకున్న కూటమి తాజాగా రాష్ట్రంలో స్థానిక సంస్థలు, కార్పొరేషన్‎ల పై దృష్టి సారించాయి. వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా 90కి పైగా స్థానిక సంస్థలు, కార్పొరేషన్‎లు వైసిపి నాయకత్వంలోనే ఉన్నాయి. వాటిన్నంటిపై దృష్టిసారించింది కూటమి. ముందుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‎పై కూటమి నేతలు దృష్టి సారించారు. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 7 మంది ఎమ్మెల్యేలకు గానూ విశాఖ నగరం పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ ఆధ్వర్యంలో ఉన్నాయి.

CM Chandrababu: ‘ఆవిధంగా వ్యవహరిస్తారని తానెప్పుడూ అనుకోలేదు’.. ఈ అధికారులపై సీఎం చంద్రబాబు ఫోకస్..

తన పరిపాలన ఎలా ఉండబోతుందో ఫస్ట్‌ మీటింగ్‌లోనే శాంపిల్‌ చూపించారు సీఎం చంద్రబాబు. తన ప్రాధాన్యతలేంటో, ప్రజలు ఆకాంక్షలు, ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పుకొచ్చారు. అదే టైమ్‌లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లపై హాట్‌ కామెంట్స్‌ చేశారు చంద్రబాబు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే అఖిలభారత సర్వీస్‌ అధికారులతో సమావేశమయ్యారు చంద్రబాబు. పాలనలో కీలకమైన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌లతో కాసేపు మాట్లాడారు. తనపై ఎంతో పెద్ద బాధ్యత ఉందంటూ ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Srikar T
  • Updated on: Jun 14, 2024
  • 6:15 am

పవర్ స్టార్ ఫ్యాన్ అంటే మామూలుగా ఉండదు.. శపథం చేశాడు.. అనుకున్నది నెరవేరగానే అలా మారిపోయాడు..

ఈ ఫోటోలో ఉన్నది ఆడా.. మగా అర్ధం కావట్లేదా. మరొక్కసారి బాగా చూడండి అయినా అర్ధం కాకపోతే పూర్తి వివరాలు చదవాలి. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఇతని పేరు తోట నరేంద్ర. ఊరు.. తెనాలి సమీపంలోని కొలకలూరు. అది 2019వ సంవత్సరం.. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అతని అభిమాన నటుడు పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో నరేంద్ర తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ నాయకుడు రెండు చోట్ల పరాజయం పాలవ్వడం తీవ్ర వేదనకు గురి చేసింది.

YS Jagan: 40 శాతం ప్రజలు మనవైపే.. ప్రలోభాలకు లొంగొద్దు.. కేసులు పెట్టినా భయపడొద్దు: జగన్ కీలక వ్యాఖ్యలు

శాసనసభలో నోరు కట్టడి చేసే అవకాశం ఉంది... శాసనమండలిలోనైనా గట్టిగా ప్రభావం చూపాలని వైసీపీ ఎమ్మెల్సీలకు ఆపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.. ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని.. కేసులు పెట్టినా భయపడొద్దు.. అంటూ సూచించారు. గురువారం వైఎస్‌ జగన్‌‌ వైసీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..

Renu Desai: చెల్లెల్ని ప్రధాని మోదీకి పరిచయం చేసిన అకీరా.. రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..

ఇటీవల ఢిల్లీ వెళ్లిన పవన్ ప్రధాని మోదీకి అకీరాను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తాను మొదటి నుంచి బీజేపీ వ్యక్తినని.. అలాంటిది తన కుమారుడు మోదీని కలవడం సంతోషంగా ఉందంటూ రేణూ దేశాయ్ పోస్ట్ చేసింది. ఆ సమయంలో కూతురు ఆద్య అకీరాతో కలిసి ఢిల్లీకి వెళ్లలేకపోయింది.

Megastar Chiranjeevi: పవన్, చిరులతో మోదీ మాట్లాడింది ఇదే.. వీడియో పోస్ట్ చేసిన మెగాస్టార్..

ప్రధాని మోదీని స్వయంగా అన్నయ్యకు పరిచయం చేశారు పవర్ స్టార్. అనంతరం చిరు, పవన్‏తో మాట్లాడిన మోదీ.. మెగా బ్రదర్స్ చేతులు పట్టుకొని అభివాదం చేశారు. ఆ సమయంలో చిరు తమ్ముడిని చూస్తూ ఉప్పోంగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మోదీతో మెగా బ్రదర్స్ అనుబంధం చూసి మెగా ఫ్యాన్స్ సంతోషం అంబరాన్నంటింది. అన్నదమ్ముల బంధం ఇదే అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్‎పై విచారణ.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. గత విచారణలో ఇవాళ్టి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగించింది హైకోర్టు. ఈవీఎం ధ్వంసంతో పాటు మరో మూడు కేసుల్లో మధ్యంతర బెయిల్‌పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన గొడవల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 4 కేసులు నమోదయ్యాయి. EVM ధ్వంసం కేసులో A1గా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. కాగా గతంలో టీడీపీ రిలీజ్ చేసిన వీడియోనే ఆధారంగా చూపుతున్నారని పిన్నెల్లి లాయర్‌ హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించారు.

  • Srikar T
  • Updated on: Jun 13, 2024
  • 7:53 am

Vijayawada: చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ.. కృష్ణా నదిలో వినూత్న కార్యక్రమం..

చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో రాజధాని ప్రాంతంలో సందడి నెలకొంది. చంద్రబాబు కూడా రాజధానికి వెళ్లే కరకట్ట వద్ద ఉన్న ఇంట్లోనే నివాసం ఉంటారు. ఈ క్రమంలోనే కరకట్ట వద్ద ఉన్న బోటు యజమానులు క్రిష్ణా నదిలో బోటు ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బోట్లతో మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్ద కృష్ణా నదిలో చక్కర్లు కొట్టారు. తమ అభిమాన నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో రాజధానిలోని బోట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

Pawan Kalyan: తమ్ముడి ప్రమాణ స్వీకారం వేళ.. అలా చూస్తుండిపోయిన అన్నయ్య.. భావోద్వేగానికి గురైన అన్నా లెజనోవా..

కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ఆయన భార్య అన్నా లెజనోవా ముఖం సంతోషంతో వెలిగిపోయింది. భర్త ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీడియో తీస్తూ ఉప్పోంగిపోయింది. జనాల మధ్యలో కూర్చున్న అన్నా లెజనోవా పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆనందంతో తన ఫోన్ లో వీడియో తీసుకుంది.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న ఇరువురు నేతలు..

ఉమ్మడి విజయనగరం జిల్లా నుండి ఇద్దరు ఎమ్మెల్యేలకు రాష్ట్ర క్యాబినెట్‎లో స్థానం దక్కింది. బిసి, తూర్పు కాపు సామాజికవర్గం నుండి కొండపల్లి శ్రీనివాసరావుకు అవకాశం రాగా, ఎస్టీ సామాజిక వర్గం నుండి గుమ్మిడి సంధ్యారాణికి మంత్రి పదవి దక్కింది. జిల్లాలో పలువురు సీనియర్లు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి వచ్చిన వారసులు ఉన్నప్పటికీ వారిని పక్కనపెట్టి వీరిద్దరికి మంత్రి పదవి దక్కటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మంత్రి పదవి దక్కించుకున్న కొండపల్లి శ్రీనివాస్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన నేత.

Watch Video: చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముందే.. ఆత్మీయతలు అనుబంధాలతో వెల్లివిరిసిన వేదిక..

చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే వేదికపై ఆత్మీయ అనుభందాలు వెల్లివిరిశాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. వేదికపై కూర్చున్న నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని అప్యాయంగా పలకరించారు తమ్ముడు నందమూరి బాలకృష్ణ. అందరూ చూస్తుండగా చెల్లిని పలకరిస్తూ తలపై నిమురుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు బాలయ్య. దీనికి ప్రతీకగా భువనేశ్వరి కూడా నవ్వుతూ పలకరించారు. దీంతో ఇరువురి మధ్య ఆత్మీయత వెల్లివిరిసింది.

  • Srikar T
  • Updated on: Jun 12, 2024
  • 1:12 pm

Pawan Kalyan: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో ఆసక్తికర సన్నివేశం.. చిరు, పవన్‏తో మోదీ..

ఒక చేతితో పవన్ చేయి, మరో చేతితో చిరంజీవి చేయి పట్టుకొని అక్కడి వారికి అభివాదం చేశారు ప్రధాని. ఈ సందర్భంగా మెగా బదర్స్‌లో మెగా ఆనందం కనిపించింది. ఆ సన్నివేశంతో ఇద్దరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. అలాగే అటు రామ్ చరణ్..మెగా అభిమానులు సంతోషంతో చూస్తూ ఉండిపోయారు. దీంతో సభకు హాజరైన వారంతా చప్పట్లతో అభినందించారు.

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!