ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు

రాష్ట్ర అసెంబ్లీలోని 175 మంది సభ్యులను ఎన్నుకునేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు త్వరలోనే జరగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభ పదవీకాలం 2024 జూన్ 11వ తేదీతో ముగియనుంది. 2019లో ఏప్రిల్ 11న 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. 79.88 శాతం పోలింగ్ నమోదయ్యింది. నాటి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. నాటి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 151 స్థానాల్లో విజయం సాధించగా.. టీడీపీ 23 స్థానాలకు పరిమితం అయ్యింది. నాటి ఎన్నికల్లో జనసేన ఒక సీటును గెలుచుకోగా.. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ నాటి ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయాయి. ఎన్నికల అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ విభజన తర్వాత జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఆ ఎన్నిక్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 49.95 శాతం ఓటింగ్ నమోదుకాగా.. టీడీపీకి 39.17 శాతం, జనసేన పార్టీకి 5.53 శాతం ఓటింగ్ నమోదయ్యింది.

రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ- జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సాధించేందుకు ధివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కృషి చేస్తున్నారు. ఏపీలో అధికార పగ్గాలు చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 88గా ఉంది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలకు జమిలి ఎన్నికలు జరగనున్నాయి.

ఇంకా చదవండి

AP News: నల్లజర్లలో దాడి ఘటనపై తానేటి వనిత నిరసన..

నల్లజర్లలో టీడీపీ శ్రేణులు తనపై దాడికి యత్నించడంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. దళితురాలినైన తనను కించపరుస్తూ.. రౌడీయిజంతో గెలవాలనుకోవడం ఎంత వరకు సబబని ప్రత్యర్థులను ఆమె నిలదీశారు. దాడి ఘటనపై తాజాగా ఆమె నిరసనకు దిగారు....

Watch Video: ‘ఏపీలో సంక్షేమ పథకాలు అడ్డుకోవడం దారుణం’.. వల్లభనేని వంశీ

గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాల విషయంలో ఈసీ పక్షపాత ధోరణి అవలంభిస్తోందన్నారు. గత ఎన్నికలకు ముందు పసుపు-కుంకమ పంపిణీకి అనుమతిచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు నాలుగేళ్లుగా నడుస్తున్న స్కీమ్స్‌ నిలిపివేశారని వివరించారు. పేదలను బాధపెట్టడమే చంద్రబాబు లక్ష్యం అని మండిపడ్డారు. ఓటు అనే ఆయుధంతో చంద్రబాబుకు సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో రైతుబంధు పంపిణీకి అనుమతిచ్చారని గుర్తుచేశారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 11:58 am

YS Jagan: ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సమాధానాలు.. సీఎం జగన్‌తో టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ సూపర్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.. డోన్ట్‌ మిస్..

TV9 interview with YS Jagan: ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే.. హైస్పీడులో ప్రచారంలో దూసుకెళ్తూ తాను చేసిన అభివృద్ధి.. కూటమి కుట్రలు.. భవిష్యత్తు గురించి చెబుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.

Pawan Kalyan: బాబాయి కోసం రంగంలోకి అబ్బాయి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా రామ్ చరణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. మంగళవారం (మే 07) మొదట మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియోను రిలీజ్ చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని అందులో కోరారు. ఈ వీడియో ఒక్కసారిగా నెట్టింట వైరల్ గా మారింది.

CM Jagan: జూన్ 4న విశాఖలోనే ముఖ్యమత్రిగా ప్రమాణస్వీకారం.. డేట్ ఫిక్స్ చేసిన జగన్!

ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కూటమిపై ఫైర్ అయ్యారు. కొనసాగుతున్న పథకాలను కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఓటు అనే ఆయుధంతో ప్రజలు కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదులుతుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి రాష్ట్రానికి ఇచ్చే హామీ ఏంటని ప్రశ్నించారు.

Pawan Kalyan: ‘ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి’.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం కదిలిన టాలీవుడ్ హీరోలు

జనసేన అధినేతకు మద్దతుగా మెగా హీరోలు వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్‌లు కూడా పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. అలాగే జబర్దస్త్ కమెడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రామ్ ప్రసాద్, కమెడియన్ పృథ్వీ, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తదితరులు కూడా పవన్ కు మద్దతుగా పిఠాపురంలో పర్యటించారు

Nani – Pawan Kalyan: వామ్మో… ఊహించని ట్విస్ట్.. పవన్ గురించి నాని ట్వీట్…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సినీ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ హీరోలు ఆయనకు మద్దతు నిలువగా.. తాజాగా నాన్ మెగా ఫ్యామిలీ హీరో, నేచురల్ స్టార్ నాని పవన్‌కు సపోర్ట్ చేస్తూ ట్వీట్ వేశారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

AP News: ఏపీలో ఆ లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడతాయా..? ఇదిగో క్లారిటీ

AP స్కీమ్స్‌కు గ్రహణం పట్టింది. పేదల పథకాలపై కత్తి వేలాడుతోంది. ఎన్నికల రాజకీయం అభాగ్యులకు శాపంగా మారుతోంది. TDP కుట్రలతోనే ఈ పరిస్థితి వచ్చిందని CM సహా YCP నేతలంతా భగ్గుమంటున్నారు. ఆ డీటేల్స్ ఏంటో తెలుసకుందాం పదండి...

ఏపీ, దేశంలో ఎన్డీయే గెలుపు ఖాయం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి..

ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందన్నారు. రాష్ట్ర సర్కార్ తీరుతో అభివృద్ధి లేకుండా పోయిందని ఆరోపించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏపీలో ప్రచారం ఊపందుకుంది. కూటమి తరపున ప్రధాని మోదీ రెండు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

‘తనను ఉండకుండా చేయాలన్నది కూటమి లక్ష్యం..’ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..

ఎన్నికలు సరిగా జరుగుతాయన్న నమ్మకం తగ్గుతోందని, కూటమి నేతలు తనపై కుట్ర చేస్తున్నారంటూ సీఎం జగన్‌ సంచలన కామెంట్లు చేశారు. పథకాల నిధులు పేదలకు చేరకుండా ఆపుతున్నారని ఆయన ఆరోపించారు. ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తున్నారని, తనను ఉండకుండా చేయాలన్నదే కూటమి లక్ష్యమన్నారు సీఎం.

AP Politics: ఏపీలో పొలిటికల్‌ బీపీ పెరుగుతోందా? మోదీ సభలపై వైసీపీ రియాక్షన్‌ ఏంటి?

ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీలో అజెండాలు మారిపోతున్నాయి.. అధికారులపై ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. ఇక ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షాలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజధానుల నుంచి పోలవరం దాకా మళ్లీ ఎన్నికల అంశాలుగా మారాయి.

PM Modi: ముందే కాంగ్రెస్‌ ఓటమిని ఒప్పుకుంది.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తాం: ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ ఓటమి ఒప్పుకుంది.. ఐదేళ్ల సమయాన్ని వైసీపీ వృథా చేసింది.. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటల తూటాలు పేల్చారు. ఏపీలో అభివృద్ధి శూన్యం..అవినీతిలో నెంబర్‌వన్‌ అంటూ విమర్శించారు. ప్రధాని మోదీ సోమవారం రాజమండ్రిలో ప్రచారం నిర్వహించారు.

DGP Harish Kumar Gupta: ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా..

పోలింగ్‌కి సరిగ్గా వారం రోజుల ముందు ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం ఏపీ డీజీపీపై బదిలీ వేటు వేసింది. అంతేకాదు, ఎలాంటి ఎన్నికల బాధ్యతలు అప్పగించొద్దని ఆదేశించింది. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి శంఖబ్రత బాగ్చీ బాధ్యతలు స్వీకరించారు.

CM Jagan: ‘నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం’.. రేపల్లె ప్రచారంలో సీఎం జగన్..

మరికొన్ని రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందరన్నారు సీఎం జగన్. బాపట్ల లోక్‌సభ పరిధిలోని రేపల్లెలో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించ ప్రసంగించారు. ఇవి పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలన్నారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు అని ఎద్దేవా చేశారు. తన హయాంలో మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99శాతం హామీల అమలు జరిగాయన్నారు.

  • Srikar T
  • Updated on: May 6, 2024
  • 1:05 pm

CM Jagan: రేపల్లె ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్.. మూడు నియోజకవర్గాల్లో పర్యటన..

ఒకరోజు విరామం తరువాత ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు సీఎం జగన్. మే 6న మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. సీఎం జగన్ పూర్తి షెడ్యూల్ ను వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ సిద్దం, మేమంతా సిద్దం అంటూ బస్సుయాత్రలు చేపట్టారు. ఆ తరువాత ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

  • Srikar T
  • Updated on: May 6, 2024
  • 11:31 am
Latest Articles
హీరో శ్రీరామ్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? ఫోటోస్ వైరల్..
హీరో శ్రీరామ్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? ఫోటోస్ వైరల్..
ఈ బ్యాంకు కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. ఖాతాలు క్లోజ్‌.. ఎందుకంటే
ఈ బ్యాంకు కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. ఖాతాలు క్లోజ్‌.. ఎందుకంటే
మీ కంటి చూపులో పదునెక్కువా.? ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో కనిపెట్టండి
మీ కంటి చూపులో పదునెక్కువా.? ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో కనిపెట్టండి
లక్ష్మీపురంలో నా యువ మిత్రుడిని కలిశాను.. : మోదీ
లక్ష్మీపురంలో నా యువ మిత్రుడిని కలిశాను.. : మోదీ
మునగాకు నీటిని తాగండి.. ఊహించని బెనిఫిట్స్ మీ సొంతం!
మునగాకు నీటిని తాగండి.. ఊహించని బెనిఫిట్స్ మీ సొంతం!
54వ ఫ్లోర్ నుంచి దూకేందుకు సిద్ధంగాఉన్న యువతి! అంతలో ఊహించని సీన్
54వ ఫ్లోర్ నుంచి దూకేందుకు సిద్ధంగాఉన్న యువతి! అంతలో ఊహించని సీన్
టాటా నుంచి కొత్త సీఎన్‌జీ కారు.. లాంచింగ్ ఎప్పుడంటే..
టాటా నుంచి కొత్త సీఎన్‌జీ కారు.. లాంచింగ్ ఎప్పుడంటే..
ఈ ఫోటోలో ఓ స్టార్ హీరోయిన్ ఉంది.! ఆ వయ్యారి మేకోవర్ చూస్తే..
ఈ ఫోటోలో ఓ స్టార్ హీరోయిన్ ఉంది.! ఆ వయ్యారి మేకోవర్ చూస్తే..
ఉత్కంఠగా ప్లేఆఫ్స్ రేసు.. ఢిల్లీ, బెంగళూరులో ఏజట్టుకు ఛాన్స్?
ఉత్కంఠగా ప్లేఆఫ్స్ రేసు.. ఢిల్లీ, బెంగళూరులో ఏజట్టుకు ఛాన్స్?
మేష రాశిలో బుధ సంచారం.. ఈ రాశుల వారికి శుభ యోగాలు పక్కా.. !
మేష రాశిలో బుధ సంచారం.. ఈ రాశుల వారికి శుభ యోగాలు పక్కా.. !