AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఈసీదే బాధ్యత..! ఈవీఎంలపై వైసీపీ – కూటమి నేతల మధ్య డైలాగ్‌ వార్‌..

ఏపీలో ఈవీఎం కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ- కూటమి నేతల మధ్య డైలాగ్‌ వార్‌ పీక్స్‌కు చేరింది. ఈవీఎం రీ -వెరిఫికేషన్‌కు పట్టుబడుతున్నారు వైసీపీ నేతలు. ఫలితాలు ప్రకటించిన రెండు నెలలకు అనుమానాలా ! అన్ని ప్రశ్నిస్తున్నారు కూటమి నాయకులు. ఫిర్యాదు సరే మరి ఈసీ రియాక్షన్‌ ఏంటి?

Andhra Pradesh: ఈసీదే బాధ్యత..! ఈవీఎంలపై వైసీపీ - కూటమి నేతల మధ్య డైలాగ్‌ వార్‌..
Evm Verification
Shaik Madar Saheb
|

Updated on: Aug 28, 2024 | 7:46 AM

Share

2024 ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నాయంటూ వైసీపీ నేతలు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. ఈసీ ప్రకటించిన పోలింగ్‌ శాతానికి.. కౌంటింగ్‌లో చూపిన పోలీంగ్‌ పర్సంటేజీకి మధ్య తేడా వుండడం అనుమానాలకు తావిస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.. ఎన్నికలు జరిగిన రోజు ఈసీ ఫైనల్‌గా 80.66 శాతం పోలింగ్‌ నమోదయినట్టు ప్రకటించిందన్నారు. జూన్‌4న కౌంటింగ్‌లో మాత్రం పోలింగ్‌ పర్సెంటేజీని 82శాతంగా చూపారన్నారు అంబటి. ఈ తేడా ఎందుకొచ్చింది? ఇన్ని రోజులైనా పార్టీల వారీగా ఓట్లను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారాయన. ఇక ఈవీఎం బ్యాటరీ చార్జింగ్‌ 99 శాతం ఉండడం ఏంటన్నారు. భద్ర పరిచాక బ్యాటరీ ఛార్జింగ్‌ ఎలా పెరుగుతుందన్నారు. వీవీ ప్యాడ్‌లను లెక్కించమమే మాక్‌ పోలింగ్‌ అంటున్నారు. ఈవీఎంల తనిఖీ కోసం వెళ్తే అధికారులు తమ దగ్గర తాళం చెవి లేదని చేతులెత్తేశారని.. ఇలా ప్రతీ అంశం అనుమానాస్పదంగా వుందన్నారు. తమకు ఉన్న సందేహాలు ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

కాగా.. ఈవీఎంలపై వైసీపీ ఈసీని ఆశ్రయించడాన్ని కూటమి నేతలు తప్పు పట్టారు. ప్రజాతీర్పును వైసీపీ గౌరవించాలన్నారు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ. ఫలితాలు ప్రకటించిన రెండు నెలల తరువాత అనుమానాలేంటన్నారాయన. ఈవీఎంల ట్యాంపరింగ్‌కు అవకాశం లేదన్నారు మంత్రి సత్యకుమార్‌. ఓటమికి కారణాలను విశ్లేషించుకోవాల్సింది పోయి ఈవీఎంలపై అనుమానాలంటూ వైసీపీ ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు . 2019లో ఈవీఎంలపై వైసీపీకీ డౌట్లు రాలేదా? అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ప్రశ్నించారు.

ఈవీఎంలపై తలెత్తుతోన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదని వైసీపీ అంటోంది.ఇదంతా ప్రజల దృష్టి మర్చలాడినికి వైసీపీ వేసిన ఎత్తుగడ అంటున్నారు కూటమి నేతలు. అలా ఈవీఎంల కేంద్రంగా ఏపీ పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు ఇవే..
బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు ఇవే..
బుధుడు కర్కాటకంలోకి.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, పదోన్నతులు ఖాయం
బుధుడు కర్కాటకంలోకి.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, పదోన్నతులు ఖాయం
అరుదైన పరివర్తన యోగం.. వారి జీవితాల్లో సానుకూల మార్పులు
అరుదైన పరివర్తన యోగం.. వారి జీవితాల్లో సానుకూల మార్పులు
లేడీ కోహ్లీపై కోపంతో ఊగిపోయిన సౌతాఫ్రికా బౌలర్.. ఎందుకంటే?
లేడీ కోహ్లీపై కోపంతో ఊగిపోయిన సౌతాఫ్రికా బౌలర్.. ఎందుకంటే?
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే బట్టలు పువ్వులు లెక్క అవుతాయి..
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే బట్టలు పువ్వులు లెక్క అవుతాయి..
ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో రిపోర్ట్..
ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో రిపోర్ట్..
చంద్ర బలం.. మరో వారంలో వారికి మానసిక ఒత్తిళ్ల నుంచి విముక్తి
చంద్ర బలం.. మరో వారంలో వారికి మానసిక ఒత్తిళ్ల నుంచి విముక్తి
అమ్మాయిల మర్డర్ మిస్టరీ.. OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
అమ్మాయిల మర్డర్ మిస్టరీ.. OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చి రైతులపైనే
రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చి రైతులపైనే
వచ్చేశాడ్రోయ్.. 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా తోపు
వచ్చేశాడ్రోయ్.. 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా తోపు