జనసేన పార్టీ
జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు చెందిన ఓ రాజకీయ పార్టీ. ఈ పార్టీని తెలుగు సినీ నటుడు పవన్ కల్యాణ్ 2014 మార్చి 14న స్థాపించారు. 2014 ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉన్నప్పటికీ ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్లో పోటీ చేసినా.. కేవలం ఒక్క స్థానంలో మాత్రం గెలిచింది. నాటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి రెండుచోట్లా ఓడిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఒక్కరే విజయం సాధించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్గా నాదెండ్ల మనోహర్, సభ్యుడికి నాగబాబు ఉన్నారు. సమ సమాజ స్థాపన, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి ప్రశ్నించడం, ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ జనసేన పార్టీ సిద్ధాంతాలుగా ఉంది.
2014 జమిలి ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి జనసేన పార్టీ మద్ధతు ప్రకటించింది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని విమర్శిస్తూ ఆ తర్వాత బీజేపీకి దూరం జరిగారు. 2020 జనవరిలో మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ-బీజేపీ కూటమితో జనసేన చేతులు కలిపింది. పొత్తులో భాగంగా జనసేన ఏపీలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్సభ స్థానాల నుంచి పోటీ చేయనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
Telangana: ‘దిష్టి’చుక్క .. దీనికుందో లెక్క..! నిత్యం రగులుతూనే ఉన్న తెలంగాణ సెంటిమెంట్..
ఇంతకీ.. ఏం జరిగింది అక్కడ? తెలంగాణ టాపిక్ ఎందుకొచ్చింది? కోనసీమ అంటేనే కొబ్బరిచెట్లకు నెలవు. ఆ అందం అద్భుతం. కాని, క్రమంగా ఆ ఛాయలు తగ్గిపోతున్నాయి. లక్షలాది కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. కొబ్బరి చెట్టు పైభాగం రాలిపోయి ఎండిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం.. సముద్రపు ఆటుపోటులే..
- Shaik Madar Saheb
- Updated on: Dec 2, 2025
- 9:56 pm
పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే సినిమాలు రిలీజ్ కావు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
విభజన గాయాన్ని మళ్లీ రేపిందెవరు.. ఎవరి దిష్టి ఎవరికి తగిలింది.. సెంటిమెంట్తో కూడిన అంశాల్లో నేతల మాట ఒక్క శాతం అటు ఇటు అయినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయ్. ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్పై విమర్శలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయ్. ఈ క్రమంలోనే.. పవన్ కల్యాణ్కు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
- Shaik Madar Saheb
- Updated on: Dec 2, 2025
- 7:06 pm
రాజకీయ కక్షపూరిత కేసులపై వాడి వేడి చర్చ.. హోంమంత్రి అనిత రియాక్షన్ ఇదే..
ఏపీ శాసనమండలిలో రాజకీయ కక్షపూరిత కేసులపై వాడి వేడి చర్చ జరిగింది. గత ప్రభుత్వంలో పెట్టిన రాజకీయ కక్షపూరిత కేసులు ఎత్తేయాలని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రభుత్వాన్ని కోరారు. అయితే.. 2019- 24తో పాటు నేటి వరకు ఉన్న తప్పుడు కేసులు కూడా ఎత్తేయాలని వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం అన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 23, 2025
- 1:36 pm
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. వైఎస్ జగన్ హాజరు అయ్యేనా..?
ఇవాళ్టి (సెప్టెంబర్ 18) నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. 16వ శాసనసభ నాలుగో సమావేశం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాలులో మొదలవుతాయి. ఈ సమావేశాలు 7 రోజుల పాటు జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో కొన్ని ముఖ్య బిల్లులు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
- Balaraju Goud
- Updated on: Sep 18, 2025
- 8:46 am
“జన సైనికులూ బీ అలర్ట్..! మీరు ఇబ్బందుల్లో పడొద్దు..పార్టీని ఇబ్బందుల్లో పెట్టోదు”: పవన్ కల్యాణ్
"జన సైనికులూ బీ అలర్ట్.." "మీరు ఇబ్బందుల్లో పడొద్దు.. పార్టీని ఇబ్బందుల్లో పెట్టోదు". ఇవీ.. పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ ఉపదేశించిన వ్యాఖ్యలు. ఇంతకూ జనసేన నేతలను పార్టీ అధినేత అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? మచిలీపట్నం వ్యవహారంపై పవన్ కల్యాణ్ వాదన ఏంటి..?
- Balaraju Goud
- Updated on: Sep 13, 2025
- 9:08 pm
ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు దసరా కానుక ఇదే.. ఒక్కొక్కరికి రూ 15 వేలు..
ఏ రైతుకూ యూరియా కొరత రాకుండా నేను చూసుకుంటాను. ఎంత యూరియా కావాలో అంతే వాడండి. మనం అడిగిన వెంటనే కేంద్రం యూరియా అందిస్తోంది అని హామీ ఇచ్చారు. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా రైతులకు అండగా నిలుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరుతో అనంతపురంలో నిర్వహించిన NDA తొలి బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు.
- Balaraju Goud
- Updated on: Sep 10, 2025
- 6:41 pm
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహం.. పిఠాపురంపై ఫుల్ ఫోకస్..
నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? పార్టీకి ఎవరు బలం? ఎవరు నష్టం? భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలనే దానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆయన అమలుచేసిన ఆ కొత్త వ్యూహమేంటి?.. లాంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..
- Shaik Madar Saheb
- Updated on: Sep 6, 2025
- 8:52 pm
Teachers Day: తనదైన శైలిలో గురువులని గౌరవించిన ఏపీ డిప్యుటీ సీఎం.. ఉపాధ్యాయులకు సర్ప్రైజ్ గిఫ్ట్స్..
తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువుకి ఇచ్చాం. అందుకనే ఆచార్య దోవో భవ అంటూ నమస్కరిస్తాం. ఈ రోజు టీచర్స్ డేని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. దేశాన్ని ఏలే రాజు కూడా ఒక గురువుకి శిష్యుడే. అవును దేశ భవిష్యత్ తరగతి గదిలోనే మొదలవుతుంది. ఆ తరగతి గదిలోనే పిల్లల తలరాతలను మార్చి అందమైన భవిష్యత్ కు బాటలు వేస్తారు. అటువంటి గురువులందరికీ.. ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలను ఏపీ డిప్యూటీ సిఎం చెబుతూ.. తన నియోజక వర్గంలో ఉన్న టీచర్స్ కు స్పెషల్ గిఫ్ట్స్ పంపించారు.
- Surya Kala
- Updated on: Sep 5, 2025
- 3:17 pm
HBDPawankalyan: పవన్ బర్త్ డే స్పెషల్ మ్యాష్అప్ ఎమోషనల్ డైలాగ్స్, స్పీచ్ తో సినీ, రాజకీయ జర్నీ
ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తన 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నటుడు-రాజకీయ నాయకుడైన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గీతా ఆర్ట్స్ స్పెషల్ విశేష్ తో రిలీజ్ చేసిన వీడియో పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్స్ తో .. అయన నేచర్ ని .. ఆలోచన తీరుని.. సిని ప్రముఖులు పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన విషయాలను, రాజకీయ ప్రయాణం.. అన్నీ పొందుపరిచారు.
- Surya Kala
- Updated on: Sep 2, 2025
- 1:38 pm
ప్రజాస్వామ్యంలో హింస పనిచేయదని.. జెండా కర్రే ఆయుధంః పవన్ కల్యాణ్
ప్రజాస్వామ్యంలో హింస పనిచేయదని, జెండా కర్రే ఆయుధం, గుండెల నుంచి వచ్చే మాటే తూటా కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసైనికులకు పిలుపునిచ్చారు. అలా చేస్తే కచ్చితంగా మార్పు వస్తుందని అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కోసం దసరా తర్వాత త్రిశూల్ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు.
- Balaraju Goud
- Updated on: Aug 30, 2025
- 9:22 pm