జనసేన పార్టీ
జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు చెందిన ఓ రాజకీయ పార్టీ. ఈ పార్టీని తెలుగు సినీ నటుడు పవన్ కల్యాణ్ 2014 మార్చి 14న స్థాపించారు. 2014 ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉన్నప్పటికీ ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్లో పోటీ చేసినా.. కేవలం ఒక్క స్థానంలో మాత్రం గెలిచింది. నాటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి రెండుచోట్లా ఓడిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఒక్కరే విజయం సాధించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్గా నాదెండ్ల మనోహర్, సభ్యుడికి నాగబాబు ఉన్నారు. సమ సమాజ స్థాపన, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి ప్రశ్నించడం, ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ జనసేన పార్టీ సిద్ధాంతాలుగా ఉంది.
2014 జమిలి ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి జనసేన పార్టీ మద్ధతు ప్రకటించింది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని విమర్శిస్తూ ఆ తర్వాత బీజేపీకి దూరం జరిగారు. 2020 జనవరిలో మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ-బీజేపీ కూటమితో జనసేన చేతులు కలిపింది. పొత్తులో భాగంగా జనసేన ఏపీలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్సభ స్థానాల నుంచి పోటీ చేయనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
‘దేశమే ఫస్ట్.. మిగతావన్నీ నెక్స్ట్’.. ఢిల్లీ వేదికగా జనసేన కొత్త నినాదం ప్రకటించిన పవన్ కల్యాణ్
జనసేన పార్టీకి దేశ సమగ్రత, జాతీయ సమైక్యతే అత్యున్నత ప్రాధాన్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. "దేశమే ఫస్ట్.. మిగతావన్నీ నెక్స్ట్" అనేది ఇకపై జనసేన పార్టీ విధానం మాత్రమే కాకుండా అధికారిక నినాదంగా కూడా కొనసాగుతుందని ప్రకటించారు. దేశ విభజన భావజాలం, ప్రాంతీయ విద్వేషాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టే శక్తులపై జనసేన రాజీలేని పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు.
- Gopikrishna Meka
- Updated on: Jun 15, 2026
- 5:25 pm
Andhra: స్వర్ణాంధ్ర దిశగా పన్నెండో అడుగు.. పడుతూ లేస్తూనే ప్రగతి వైపు..!
రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంపై విస్తృత చర్చ జరుగుతోంది. రాజధాని లేకుండా ప్రారంభమైన రాష్ట్ర ప్రయాణం రాజకీయ మార్పులు, పాలనా విధానాల ప్రభావంతో ఎన్నో మలుపులు తిరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అమరావతి పునర్నిర్మాణం, భారీ పెట్టుబడుల ఆకర్షణ, పోలవరం ప్రాజెక్టు పురోగతి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రభుత్వం విజయాలుగా చెబుతోంది.
- Shaik Madar Saheb
- Updated on: Jun 12, 2026
- 9:50 pm
తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్!
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం (జూన్ 12) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. "2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం" పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది.
- Balaraju Goud
- Updated on: Jun 12, 2026
- 10:59 am
Andhra Politics: ఆంధ్రా పాలిటిక్స్ గురూ.. టాపిక్ ఏదైనా టాప్ లేచిపోవాల్సిందే..!
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతోంది.. ఈ తరుణంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
- Shaik Madar Saheb
- Updated on: Jun 4, 2026
- 9:46 pm
ఎన్డీఏ పక్షాల కీలక నిర్ణయం.. టీడీపీకి 3, జనసేనకు 1 రాజ్యసభ సీటు ఖరారు!
ఆంధ్రప్రదేశ్లో అధికార ఎన్డీఏ కూటమి పక్షాల కీలక సమావేశం గురువారం (జూన్ 04)న అమరావతిలో జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ, సభల నిర్వహణతో పాటు రాజ్యసభ స్థానాల కేటాయింపుపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 4, 2026
- 8:42 pm
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలపై నా స్టాండ్ ఎప్పుడూ ఒక్కటేః పవన్ కల్యాణ్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యల చుట్టూ తిరుగుతున్న రాజకీయ మంట ఇంకా చల్లారలేదు. తాను తెలంగాణ ప్రజలను కించపరచలేదని పవన్ క్లారిటీ ఇచ్చినప్పటికీ, ఆయనపై విమర్శల దాడి మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఎక్స్ (X) వేదికగా పవన్ కల్యాణ్ తెలంగాణపై తన స్థిరమైన వైఖరిని స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: Jun 4, 2026
- 7:16 pm
బద్దలైన అస్తిత్వ అగ్నిపర్వతం.. రెండు రాష్ట్రాలను కుదిపేస్తున్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ డైనమైట్లు!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఊహించని అగ్గి రాజుకుంది. పదేళ్ల ఆవిర్భావ వేడుకల వేళ, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ అస్తిత్వ రాజకీయాల తేనెతుట్టె ఒక్కసారిగా కదిలింది. అస్తిత్వ అగ్నిపర్వతం భళ్లున బద్దలై, రెండు రాష్ట్రాల నేతల మధ్య డైలాగ్ డైనమైట్లు పేలేలా చేస్తోంది. తెలంగాణ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? ఇక్కడికి వచ్చి రాజకీయం చేసే హక్కు ఎవరికి ఉంది? అనే యక్ష ప్రశ్నలతో 'తెంగాణం' మరోసారి భగభగా మండుతోంది.
- Balaraju Goud
- Updated on: Jun 2, 2026
- 9:49 pm
పవన్ తిరిగితే జనాలు వస్తారు కానీ ఓట్లేయరు! ‘జనసేనాని’కి మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "తెలంగాణ ఎవరి అయ్యా జాగీరు కాదు, ఇది నాలుగు కోట్ల ప్రజల జాగీరు" అంటూ ఆయన ఘాటుగా కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్, ఇక్కడికి వచ్చి చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు.
- Balaraju Goud
- Updated on: Jun 2, 2026
- 7:09 pm
“ఇప్పుడు డిసైడ్ అయ్యా.. ఇకపై తెలంగాణలో నేనే తిరుగుతా.. ప్రజా సమస్యలపై పోరాడుతా”: పవన్
తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి. "తెలంగాణలో నన్ను అడుగుపెట్టనివ్వమని బెదిరిస్తున్నారు.. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?" అంటూ ఆయన కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు జన సైనికులం భయపడేవాళ్లం కాదన్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 2, 2026
- 5:36 pm
Pawan Kayan: మీ అయ్య జాగీరా..? తెలంగాణ నడిబొడ్డున జనసేన పుట్టింది.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించాలనుకున్న జనసేన సమావేశానికి అనుమతి లభించకపోవడంతో పవన్ కల్యాణ్ హైదరాబాద్లోని తన నివాసం నుంచి మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై తనకు ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమని పేర్కొన్న ఆయన, జనసేన తెలంగాణలోనే పుట్టిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో తన ప్రవేశాన్ని ప్రశ్నిస్తున్న వారిపై తీవ్రంగా స్పందించిన పవన్, తెలంగాణ ఎవరి జాగీరు కాదని అన్నారు. రేవంత్ రెడ్డిపై కూడా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ పలు రాజకీయ వ్యాఖ్యలు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Jun 2, 2026
- 5:07 pm
తెలంగాణపై టీడీపీ, జనసేన ఫోకస్.. జూన్ 2న హైదరాబాద్లో పవన్ కల్యాణ్ కీలక సమావేశం
ఏపీలో పాగా వేసిన టీడీపీ, జనసేన పార్టీలు తమ తర్వాత టార్గెట్ తెలంగాణే అంటున్నాయి. గ్రామస్థాయి నుంచే టీడీపీని బలోపేతం చేసేదిశగా చర్యలు తీసుకుంటామని మహానాడు వేదికగా ఆ పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ప్రకటిస్తే.... జూన్ 2న హైదరాబాద్లో జనసేన అధినేత పవన్ మీటింగ్ పెట్టడం చర్చనీయాంశమవుతోంది.
- Shaik Madar Saheb
- Updated on: May 31, 2026
- 11:00 am
Pawan Kalyan: పవన్కు ఆ ఫుడ్ అంటే చాలా ఇష్టం.. ఎంతో ప్రేమతో తింటాడు.. తల్లి అంజనమ్మ కామెంట్స్..
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఇష్టమైన ఆహారం ఏంటో ఆయన తల్లి అంజనా దేవి పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇంట్లో చేసిన అన్ని వంటకాలను పవన్ కల్యాణ్ తింటారని.. చిన్నప్పటి నుంచే పవన్ ఎంతో సాధాసీదాగా ఉండేవారని.. ఏదీ అడిగి కోరుకునే అలవాటు లేదని అంజనాదేవి గుర్తుచేసుకున్నారు. అయితే.. ఓ ఫుడ్ మాత్రం మంచిగా ఇష్టంగా తింటారని చెప్పుకొచ్చారు.. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
- Shaik Madar Saheb
- Updated on: May 14, 2026
- 4:57 pm