జనసేన పార్టీ
జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు చెందిన ఓ రాజకీయ పార్టీ. ఈ పార్టీని తెలుగు సినీ నటుడు పవన్ కల్యాణ్ 2014 మార్చి 14న స్థాపించారు. 2014 ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉన్నప్పటికీ ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్లో పోటీ చేసినా.. కేవలం ఒక్క స్థానంలో మాత్రం గెలిచింది. నాటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి రెండుచోట్లా ఓడిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఒక్కరే విజయం సాధించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్గా నాదెండ్ల మనోహర్, సభ్యుడికి నాగబాబు ఉన్నారు. సమ సమాజ స్థాపన, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి ప్రశ్నించడం, ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ జనసేన పార్టీ సిద్ధాంతాలుగా ఉంది.
2014 జమిలి ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి జనసేన పార్టీ మద్ధతు ప్రకటించింది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని విమర్శిస్తూ ఆ తర్వాత బీజేపీకి దూరం జరిగారు. 2020 జనవరిలో మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ-బీజేపీ కూటమితో జనసేన చేతులు కలిపింది. పొత్తులో భాగంగా జనసేన ఏపీలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్సభ స్థానాల నుంచి పోటీ చేయనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
ఇంకా చదవండిJanasena : తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ.. నకిరేకల్ సభలో క్లారిటీ ఇచ్చిన స్టేట్ ఇంఛార్జ్?
తెలంగాణలో జనసేన పోటీపై క్లారిటీ వచ్చింది. తాజాగా తెలంగాణలో ప్రతీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని.. నకిరేకల్లో జరిగిన సభలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. ఇకపై రాష్ట్రంలోని అన్ని ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని.. పొత్తుల విషయాన్ని అధినేత పవన్ కల్యాణ్ చూసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.
- Anand T
- Updated on: Sep 13, 2026
- 7:10 am
స్థానిక ఎన్నికల్లో 100% స్ట్రైక్రేట్ దిశగా జనసేన అడుగులు.. నెక్స్ట్ ప్లాన్ అదేనా..?
స్థానిక ఎన్నికలను నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్గా భావిస్తున్న జనసేన.. బలం ఉన్న చోట పోటీ చేసి గెలిచే అభ్యర్థులకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 100 శాతం స్ట్రైక్రేట్ లక్ష్యంగా పెట్టుకున్న పార్టీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 నుంచి 60 స్థానాల్లో పోటీ చేసేలా బలం పెంచుకోవడంపై ఫోకస్ పెట్టింది.
- Shaik Madar Saheb
- Updated on: Sep 10, 2026
- 7:56 am
ఆ పేరు వెనుక ఉద్యమ స్ఫూర్తి.. జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..
జనసేన పార్టీ తొలిసారిగా ప్రత్యేక యువజన విభాగాన్ని ఏర్పాటు చేసింది. ‘జై కొట్టు’ పేరుతో రూపొందించిన ఈ యూత్ వింగ్ను పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా పిఠాపురంలో ఆవిష్కరించారు. జెన్జీతో పాటు యువతను పార్టీ కార్యకలాపాలకు మరింత దగ్గర చేయడం, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా ఈ విభాగాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.
- Eswar Chennupalli
- Updated on: Sep 3, 2026
- 7:23 am
పవన్కు చంద్రబాబు స్పెషల్ కాల్..! పుట్టినరోజున ఫోన్ చేసి ఏం చెప్పారంటే..?
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం కేరళలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్యంపై ఆరా తీశారు. పంచాయతీరాజ్, గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో పవన్ కృషిని చంద్రబాబు కొనియాడారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆయన నిబద్ధతను ప్రశంసించారు. మంత్రి నారా లోకేష్ కూడా పవన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
- Eswar Chennupalli
- Updated on: Sep 2, 2026
- 1:12 pm
Andhra Politics: విజయసాయిరెడ్డి Vs బొత్స సత్యనారాయణ.. కేఏ పాల్ సీరియస్ వార్నింగ్..
విజయసాయిరెడ్డి రాసిన లేఖలో ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత పార్టీ మారబోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. పేరు చెప్పకపోయినా ఆ వ్యాఖ్యలు బొత్స సత్యనారాయణను ఉద్దేశించినవేనన్న చర్చ జరుగుతోంది. గతంలో సాయిరెడ్డి, బొత్స మధ్య కోల్డ్వార్ ప్రచారం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. మరోవైపు బొత్స చేసిన ‘కేఏ పాల్-2’ వ్యాఖ్యలపై కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు.
- Eswar Chennupalli
- Updated on: Aug 31, 2026
- 9:29 am
Andhra Pradesh: వాళ్లది డీఎస్సీ.. వీళ్లది ఏపీపీఎస్సీ.. పరీక్షలను రౌండప్ చేసిన పాలిటిక్స్
ఏ ఫర్ ఆంధ్రా, పీ ఫర్ పాలిటిక్స్. పొలిటికల్లీ మాంచి డెన్సిటీ ఉండే రాష్ట్రంగా ఏపీకి ప్రత్యేక క్రెడిట్టే ఉంది. ఇక్కడ పార్టీలకు బీపీలు రైజవ్వడం ఎప్పుడూ కొత్తకాదు. కానీ, ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది ఏపీలో రాజకీయ చదరంగం. ఏ పార్టీ ఎప్పుడు ఏ పాచిక వేస్తుందో ఏ పార్టీకీ తెలీదు. ఎగస్పార్టీల్ని అనుక్షణం అణువణువూ చదువుతుండాల్సిందే. ఇక్కడ ప్రతీ ఇయరూ ఎలక్షన్ ఇయరే. ఓటుబ్యాంకులకు కన్నమెయ్యడం మీదే పార్టీలకు కన్ను. రాబోయే స్థానిక ఎన్నికలకు నగారా మోగకముందే, మందుగుండు సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు. 2029కి ఇప్పటినుంచే వామప్ మ్యాచ్లకు ప్యాడ్లు కట్టుకుంటున్నాయి టీడీపీ-వైసీపీ. ఎలాగో డీటెయిల్డ్గా చూద్దాం.
- Balaraju Goud
- Updated on: Aug 14, 2026
- 9:53 pm
డీఆర్సీ సమావేశంలో ఆసక్తికర ఘటన..! కప్పు పక్కనపెట్టి గాజు గ్లాసు కోరిన మంత్రి నాదెండ్ల!
ఏలూరు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్ష కమిటీ (DRC) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహరించిన తీరు ఆసక్తికరంగా మారింది. సమావేశం సందర్భంగా అధికారులు మర్యాదపూర్వకంగా ఆయనకు పింగాణీ కప్పులో తేనీరు అందించగా, మంత్రి దానిని స్వీకరించకుండా గాజు గ్లాసులో టీ కావాలని కోరారు.
- B Ravi Kumar
- Updated on: Aug 6, 2026
- 10:28 am
పాదయాత్రల నుంచి పబ్లిక్ సర్వీస్ వరకు… మారుతున్న రాజకీయాల కొత్త ఫార్ములా!
ఒకప్పుడు రాజకీయాల్లో ప్రజల మనసు గెలవాలంటే పాదయాత్రే ప్రధాన ఆయుధంగా ఉండేది. వేల కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకోవడం ద్వారా నాయకులు తమ రాజకీయ ప్రస్థానాన్ని బలోపేతం చేసుకునేవారు. కానీ కాలం మారుతోంది... రాజకీయ కమ్యూనికేషన్ కూడా మారుతోంది. ఇప్పుడు జాబ్ మేళాలు, మెడికల్ క్యాంపులు, మహిళా సమావేశాలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ కావడం వంటి కొత్త పద్ధతులు రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. మరి నిజంగానే పాదయాత్రల యుగానికి ప్రత్యామ్నాయం వచ్చిందా?
- Siva Nagaraju
- Updated on: Aug 2, 2026
- 7:53 am
Andhra Politics: గోదావరి టు కృష్ణా.. ఏపీలో మళ్లీ కాపు చిచ్చు.. ఏ పార్టీకి బిగుస్తుంది ఉచ్చు..?
ఆంధ్రప్రదేశ్లో మరోసారి కాపు రాజకీయాలు హాట్టాపిక్గా మారాయి. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో టీడీపీ నేత బొండా ఉమ చేసిన వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపాయి. కాపు ఓటు బ్యాంక్పై అన్ని ప్రధాన పార్టీలు దృష్టి సారించిన వేళ, ఈ పరిణామం ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
- Shaik Madar Saheb
- Updated on: Jul 27, 2026
- 9:50 pm
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి, వ్యవసాయం, విద్య తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్, ప్రజలకు ఉపయోగపడే అనేక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించి, పనులను వేగంగా పూర్తి చేసి నిర్ణీత గడువులో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.
- Balaraju Goud
- Updated on: Jul 23, 2026
- 4:33 pm
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు శస్త్రచికిత్స ఎంతసేపు జరిగిందంటే..? ప్రధాని నుంచి ఫోన్
పదేళ్లుగా భుజాల నొప్పిని భరిస్తూనే ప్రజా జీవితాన్ని కొనసాగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఎట్టకేలకు శస్త్రచికిత్స జరిగింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ వైద్య నిపుణుల బృందం కుడి భుజానికి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీపై మూడున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది. రెండు భుజాల్లోనూ తీవ్ర గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించగా... మరో భుజానికి రెండు నెలల తర్వాత శస్త్రచికిత్స చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
- Eswar Chennupalli
- Updated on: Jul 11, 2026
- 11:51 am
Andhra Politics: తగ్గేదే లే..! చినుకుల్లేకపోయినా.. జోరుగా చిటపటలు.. పక్కా లోకల్ పాలిటిక్స్
రాప్తాడు నుంచి చంద్రగిరి వరకు, ఆళ్లగడ్డ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఏపీలో స్థానిక రాజకీయాలు హీటెక్కుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ సమరం కొత్త మలుపులు తిరుగుతోంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరుగాంచిన రాయలసీమలో ఇప్పుడు మాటల యుద్ధమే ప్రధాన ఆయుధంగా మారింది. స్థానిక స్థాయిలో చెలరేగుతున్న ఈ రాజకీయ వేడి రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రభావం చూపిస్తోంది.
- Shaik Madar Saheb
- Updated on: Jul 9, 2026
- 9:49 pm