![జనసేన పార్టీ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/03/janasena-party.jpg)
జనసేన పార్టీ
జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు చెందిన ఓ రాజకీయ పార్టీ. ఈ పార్టీని తెలుగు సినీ నటుడు పవన్ కల్యాణ్ 2014 మార్చి 14న స్థాపించారు. 2014 ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉన్నప్పటికీ ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్లో పోటీ చేసినా.. కేవలం ఒక్క స్థానంలో మాత్రం గెలిచింది. నాటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి రెండుచోట్లా ఓడిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఒక్కరే విజయం సాధించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్గా నాదెండ్ల మనోహర్, సభ్యుడికి నాగబాబు ఉన్నారు. సమ సమాజ స్థాపన, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి ప్రశ్నించడం, ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ జనసేన పార్టీ సిద్ధాంతాలుగా ఉంది.
2014 జమిలి ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి జనసేన పార్టీ మద్ధతు ప్రకటించింది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని విమర్శిస్తూ ఆ తర్వాత బీజేపీకి దూరం జరిగారు. 2020 జనవరిలో మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ-బీజేపీ కూటమితో జనసేన చేతులు కలిపింది. పొత్తులో భాగంగా జనసేన ఏపీలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్సభ స్థానాల నుంచి పోటీ చేయనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
Pawan Kalyan: కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధుల వరద.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన ఇదే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరద.. కేంద్ర బడ్జెట్లో వరాల జల్లు.. ఏపీ విభజన సమస్యల క్లియరెన్స్ దిశగా కేంద్ర అడుగులు వేస్తోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్.. బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేసింది.
- Balaraju Goud
- Updated on: Jul 24, 2024
- 8:53 am
CM Chandrababu: అప్పటి వరకూ కూటమి కలిసే ఉంటుంది.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు..
అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించేవరకు కూటమి కలిసే ముందుకు సాగుతుందన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం ఐదు రోజులు సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. సభకు వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నికల ఫలితాలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
- Srikar T
- Updated on: Jul 23, 2024
- 3:21 pm
AP Assembly Sessions 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులంటే.. బీఏసీలో కీలక నిర్ణయం..
అసెంబ్లీ కమిటీ హాలులో బీఏసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలతోపాటూ ఎన్ని రోజులు సభ నిర్వహించాలన్నదానిపై కూడా చర్చించారు. ఈ సమావేశానికి స్పీకర్ తోపాటూ సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఏపీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందకు సిద్దమయ్యారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో జూలై 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది.
- Srikar T
- Updated on: Jul 22, 2024
- 3:53 pm
తిరుపతిలో ఆ స్థానంపై కన్నేసిన టీడీపీ.. ఆయోమయంలో లోకల్ లీడర్లు..
తిరుపతి కార్పొరేషన్. ఎన్నికల ముందు దాకా ఒకే పార్టీది ఆధిపత్యం. తిరుగులేని నాయకత్వం. ఇప్పుడు సీన్ మారింది. 50 డివిజన్లు ఉన్న తిరుపతి కార్పొరేషన్కు 3 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో పూర్తి మెజారిటీని వైసీపీ సొంతం చేసుకుంది. 49 డివిజన్లకు ఎన్నికలు జరిగితే 48 స్థానాలను వైసీపీ, ఒక్క డివిజన్ లోనే టిడిపి జెండా ఎగుర వేసింది. మేయర్గా శిరీష, డిప్యూటీ మేయర్లుగా భూమన అభినయ్, ముద్దుల నారాయణ ఎన్నిక అయ్యారు.
- Raju M P R
- Updated on: Jul 22, 2024
- 7:34 am
Pawan Kalyan: ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు.. ఎవరినీ కించపరచొద్దు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ నేతలు తమకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎవరిపైనా కక్షసాధింపు చర్యలకు పాల్పడొద్దని పార్టీ నేతలకు సూచించారు. అవినీతికి పాల్పడిన వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. పార్టీ నేతలెవరూ ప్రభుత్వ కార్యక్రమాల్లో కుటుంబాలను ప్రొత్సహించవద్దని పవన్ కల్యాణ్ సూచించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 15, 2024
- 2:46 pm
ముద్రగడపై ఫ్లెక్సీలు.. గోదావరి జిల్లాల్లో తెరపైకి సరికొత్త రాజకీయం..
ముద్రగడను తూర్పుగోదావరి నేతలు ఇప్పట్లో వదిలేలా లేరు. మొన్నటివరకు జనసేన కార్యకర్తలు, ఇప్పుడు కాపు సంఘం నేతలు తోడయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కాపు రిజర్వేషన్లు, స్పెషల్ స్టేటస్ సాధించాలన్న ముద్రగడ కామెంట్లపై విరుచుకుపడుతున్నారు. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడకు కాపు రిజర్వేషన్ల సంగతి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు ముగిసినా తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలు ఇంకా హాట్ హాట్గానే ఉన్నాయి.
- Srikar T
- Updated on: Jul 14, 2024
- 1:27 pm
Pawan Kalyan: తనను కలిసేందుకు వచ్చేవారికి పవన్ కల్యాణ్ స్పెషల్ రిక్వెస్ట్…
తనను కలవడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని పవన్ విజ్ఞప్తి చేశారు. వాటికి బదులు పేదలకు సాయపడేవి ఏవైనా తీసుకురావాలని సూచించారు. ఆయనేమన్నారో వీడియోలో విందాం పదండి....
- Ram Naramaneni
- Updated on: Jul 12, 2024
- 3:21 pm
ఆ అంశంపై డిప్యూటీ సీఎం స్పెషల్ ఫోకస్.. అధికారులకు పవన్ కీలక ఆదేశాలు..
గ్రామీణాభివృద్ధికి సహకరించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. 250 జనభా కలిగిన ప్రతీ గ్రామానికి రహదారుల అనుసంధానం చేయాలని చెప్పారు. గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యం అవుతుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అమరావతిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు. 4 వేల 976 కోట్ల రూపాయల నిధులతో 7 వేల 213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు చురుగ్గా కార్యరూపం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.
- Srikar T
- Updated on: Jul 12, 2024
- 9:54 am
Pawan Kalyan: పవన్ కల్యాణ్ సంచలనం.. అధికారుల పనితీరుపై సర్వే..
సినిమాల్లోనే కాదు.. పొలిటికల్గానూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్. పిఠాపురం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆయన.. ఏకంగా.. అధికారుల పనితీరుపైనే సర్వే చేయిస్తుండడం హాట్టాపిక్గా మారింది.
- Ram Naramaneni
- Updated on: Jul 10, 2024
- 7:30 pm
AP News: భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..
భోగాపురం ఎయిర్పోర్ట్.. ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘ కల. దీనిని సాకారం చేసి తీరుతామంటోంది ఎన్డీయే సర్కార్. ఈ ఎయిర్పోర్ట్ ఎప్పటిలోపు పూర్తి చేయాలనే దానిపై డెడ్లైన్ కూడా పెట్టుకున్నారు కేంద్రమంత్రి రామానాయుడు. పౌరవిమానయాన మంత్రిగా కింజారపు రామ్మోహన్ ఉండటంతో భోగాపురం ఎయిర్పోర్ట్పై ఉత్తరాంధ్రవాసులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అతి త్వరలోనే ఈ ఎయిర్పోర్ట్ పూర్తై అందుబాటులోకి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. వారి అంచనాలకు తగినట్టుగానే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.
- Srikar T
- Updated on: Jul 10, 2024
- 8:07 am
AP Congress: ఏపీలో ‘వైఎస్ఆర్’ పొలిటికల్ అస్త్రం.. కాంగ్రెస్ వ్యూహం ఇదేనా..
వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అటు ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా తల్లి విజయమ్మతో కలిసి నివాళి అర్పించారు. ఆమెతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా పాల్గొన్నారు. ఇక తెలంగాణలోనూ వైఎస్ఆర్ 75వ జయంతి సంబరాలు ఘనంగా, అధికారికంగా నిర్వహించారు.
- Srikar T
- Updated on: Jul 8, 2024
- 12:46 pm
Pawan Kalyan: ఎర్ర చందనం స్మగ్లింగ్పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కన్నెర్ర
ఎర్ర చందనం స్మగ్లింగ్పై కన్నెర్ర చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. చిన్న చేపలను వేటాడడం కాదు...పెద్ద పెద్ద తిమింగలాలను లోపల వేసెయ్యాలన్నారు. దుంగల దొంగలను పట్టుకోవడంతో సరిపెట్టొద్దు. రెడ్ శాండల్ దందా వెనుక పెద్ద తలకాయలను పట్టుకోవాలంటూ అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. శేషాచలం అడవులను ఖాళీ చేస్తున్న స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలన్నారు.
- Ram Naramaneni
- Updated on: Jul 6, 2024
- 9:33 am
డిప్యూటీ సీఎం పవన్కు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య లేఖ.. కీలక అంశం ప్రస్తావన..
ఏపీలో లేఖ రాజకీయాలు మొదలయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈ లేఖ రాజకీయంగా చర్చనీయాంశమైంది. పూర్తిస్థాయిలో రాజకీయ విశ్లేషణాత్మక లేఖగా పేర్కొన్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాళ్లల్లో పరుగులు పెట్టిస్తారని భావిస్తున్నానన్నారు.
- Srikar T
- Updated on: Jul 5, 2024
- 12:30 pm
Watch Video: తిరుపతిలో జనసేన నాయకుల ఆందోళన.. అసలు కారణం ఇదే..
తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ఎదుట జనసేన కార్యకర్తలు ఆందోళన చేశారు. జనసేన నేత కిరణ్ రాయల్తో కలిసి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన ఇంటి వాస్తు కోసం గత ప్రభుత్వ హయాంలో బుగ్గమఠం భూములను ఆక్రమిచారని ఆరోపించారు. ఆ భూముల్లో మున్సిపాలిటీ నిధులతో అక్రమంగా రోడ్డు వేసుకున్నారని కిరణ్ అన్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు అక్రమ రోడ్డుతోపాటూ గేట్ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే వాటిని తొలగించాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
- Srikar T
- Updated on: Jul 4, 2024
- 12:09 pm
‘100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు’.. పేదలకు తీపికబురు చెప్పిన ఏపీ మంత్రి..
రాబోయే 100 రోజుల్లో లక్షా 28వేల ఇళ్లు పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు మంత్రి పార్థసారధి. అమరావతిలో గృహనిర్మాణ శాఖపై అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి. పేదవాడికి గృహాలు అందించడమే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. ఏపీలో సంక్షేమం, అభివృద్దితో పాటు అనేక సమస్యలపై దృష్టిపెట్టారు మంత్రులు. ఒకవైపు సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు, ఢిల్లీ పర్యటలతో బిజీగా ఉంటే.. డిప్యూటీ సీఎం పవన్ కూడా వివిధ శాఖల అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
- Srikar T
- Updated on: Jul 4, 2024
- 7:19 am