AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జనసేన పార్టీ

జనసేన పార్టీ

జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణకు చెందిన ఓ రాజకీయ పార్టీ. ఈ పార్టీని తెలుగు సినీ నటుడు పవన్ కల్యాణ్ 2014 మార్చి 14న స్థాపించారు. 2014 ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉన్నప్పటికీ ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్‌లో పోటీ చేసినా.. కేవలం ఒక్క స్థానంలో మాత్రం గెలిచింది. నాటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి రెండుచోట్లా ఓడిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఒక్కరే విజయం సాధించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్, సభ్యుడికి నాగబాబు ఉన్నారు. సమ సమాజ స్థాపన, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి ప్రశ్నించడం, ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ జనసేన పార్టీ సిద్ధాంతాలుగా ఉంది.

2014 జమిలి ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి జనసేన పార్టీ మద్ధతు ప్రకటించింది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని విమర్శిస్తూ ఆ తర్వాత బీజేపీకి దూరం జరిగారు. 2020 జనవరిలో మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ-బీజేపీ కూటమితో జనసేన చేతులు కలిపింది. పొత్తులో భాగంగా జనసేన ఏపీలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

ఇంకా చదవండి

బద్దలైన అస్తిత్వ అగ్నిపర్వతం.. రెండు రాష్ట్రాలను కుదిపేస్తున్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ డైనమైట్లు!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఊహించని అగ్గి రాజుకుంది. పదేళ్ల ఆవిర్భావ వేడుకల వేళ, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ అస్తిత్వ రాజకీయాల తేనెతుట్టె ఒక్కసారిగా కదిలింది. అస్తిత్వ అగ్నిపర్వతం భళ్లున బద్దలై, రెండు రాష్ట్రాల నేతల మధ్య డైలాగ్ డైనమైట్లు పేలేలా చేస్తోంది. తెలంగాణ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? ఇక్కడికి వచ్చి రాజకీయం చేసే హక్కు ఎవరికి ఉంది? అనే యక్ష ప్రశ్నలతో 'తెంగాణం' మరోసారి భగభగా మండుతోంది.

పవన్ తిరిగితే జనాలు వస్తారు కానీ ఓట్లేయరు! ‘జనసేనాని’కి మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "తెలంగాణ ఎవరి అయ్యా జాగీరు కాదు, ఇది నాలుగు కోట్ల ప్రజల జాగీరు" అంటూ ఆయన ఘాటుగా కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్, ఇక్కడికి వచ్చి చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు.

“ఇప్పుడు డిసైడ్ అయ్యా.. ఇకపై తెలంగాణలో నేనే తిరుగుతా.. ప్రజా సమస్యలపై పోరాడుతా”: పవన్

తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి. "తెలంగాణలో నన్ను అడుగుపెట్టనివ్వమని బెదిరిస్తున్నారు.. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?" అంటూ ఆయన కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు జన సైనికులం భయపడేవాళ్లం కాదన్నారు.

Pawan Kayan: మీ అయ్య జాగీరా..? తెలంగాణ నడిబొడ్డున జనసేన పుట్టింది.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించాలనుకున్న జనసేన సమావేశానికి అనుమతి లభించకపోవడంతో పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై తనకు ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమని పేర్కొన్న ఆయన, జనసేన తెలంగాణలోనే పుట్టిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో తన ప్రవేశాన్ని ప్రశ్నిస్తున్న వారిపై తీవ్రంగా స్పందించిన పవన్, తెలంగాణ ఎవరి జాగీరు కాదని అన్నారు. రేవంత్ రెడ్డిపై కూడా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ పలు రాజకీయ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణపై టీడీపీ, జనసేన ఫోకస్.. జూన్ 2న హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ కీలక సమావేశం

ఏపీలో పాగా వేసిన టీడీపీ, జనసేన పార్టీలు తమ తర్వాత టార్గెట్‌ తెలంగాణే అంటున్నాయి. గ్రామస్థాయి నుంచే టీడీపీని బలోపేతం చేసేదిశగా చర్యలు తీసుకుంటామని మహానాడు వేదికగా ఆ పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్‌ ప్రకటిస్తే.... జూన్ 2న హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ మీటింగ్ పెట్టడం చర్చనీయాంశమవుతోంది.

Pawan Kalyan: పవన్‏కు ఆ ఫుడ్ అంటే చాలా ఇష్టం.. ఎంతో ప్రేమతో తింటాడు.. తల్లి అంజనమ్మ కామెంట్స్..

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఇష్టమైన ఆహారం ఏంటో ఆయన తల్లి అంజనా దేవి పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇంట్లో చేసిన అన్ని వంటకాలను పవన్ కల్యాణ్ తింటారని.. చిన్నప్పటి నుంచే పవన్ ఎంతో సాధాసీదాగా ఉండేవారని.. ఏదీ అడిగి కోరుకునే అలవాటు లేదని అంజనాదేవి గుర్తుచేసుకున్నారు. అయితే.. ఓ ఫుడ్ మాత్రం మంచిగా ఇష్టంగా తింటారని చెప్పుకొచ్చారు.. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

హైదరాబాద్ వేదికగా ఏపీ రాజకీయం.. ప్రోటోకాల్ దాటిన స్నేహం.. మిత్రుల ఇళ్లకు మోదీ!

హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన రాజకీయంగా విస్తృత చర్చకు దారి తీసింది. సాధారణంగా ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్లినా అధికారిక కార్యక్రమాలకే పరిమితం కావడం ఆనవాయితీ. కానీ ఈసారి తెలంగాణ పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలకు మోదీ వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Special Parliament Session: డీలిమిటేషన్‌.. మహిళా రిజర్వేషన్ల బిల్లు.. మ్యాజిక్ ఫిగర్‌ను మార్చే టైమ్ వచ్చేసింది..

మ్యాజిక్ ఫిగర్‌ను మార్చే టైమ్ వచ్చేసింది. దానికి సంబంధించిన తొలి అడుగు మరికొన్ని గంటల్లో పడబోతోంది. బట్.. రాగల 72 గంటల పాటు ఇదే అంశం దేశవ్యాప్తంగా మంటలు పుట్టించబోతోంది. ముఖ్యంగా దక్షిణాదిన. తాము వద్దంటున్న 'ఫార్ములా'నే కేంద్రం ఫైనలైజ్ చేయడంతో ఫుల్ గరం మీదున్నాయి దక్షిణాది రాష్ట్రాలు.

Telangana Municipal Elections Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణి.. ఎక్కడో తెలుసా..?

Telangana Municipal Poll Results: తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది.. పలు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గట్టిపోటీనిస్తుండగా.. బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా ఖాతా

కన్నూమిన్నూ కానడం లేదు.. పరువు తీస్తున్నారు.. అరవ శ్రీధర్ తీరుపై జనసేన ఎమ్మెల్యేలు ఏమన్నారో తెలుసా..?

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తీరుపై జనసేన ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యవహారశైలి వల్ల పార్టీకి, పవన్ కల్యాణ్‌కు చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన అసెంబ్లీ సమావేశాలకు అరవ శ్రీధర్ రాకపోవడంపై జనసేన ఎమ్మెల్యేలు చిట్‌చాట్‌లో అసహనం వ్యక్తం చేశారు.

Telangana Municipal Elections 2026 Live: తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

Telangana Municipal Corporation Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఓటింగ్ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగానే జరుగింది. ఉదయం నుంచి కొనసాగుతున్న పోలింగ్ సరళిని 100 శాతం వెబ్ కాస్టింగ్‌తో ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 62.5 శాతం పోలింగ్ నమోదు అయింది. మున్సిపల్ కార్పొరేషన్లతో పోలిస్తే మున్సిపాలిటీలలో ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతుంది. కాగా సాయంత్రం 5గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాగా శుక్రవారం ఉదయం 8గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ రోజు సాయంత్రంలోపు ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.

Tollywood: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో.. జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా..

కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా ప్రేమ కథలతో మెప్పించాడీ ట్యాలెంటెడ్ హీరో. యూత్ లో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మధ్యలో కొన్ని యాక్షన్ సినిమాలు కూడా చేసినప్పటికీ సక్సెస్ అవ్వలేకపోయాడు. అయితే ఇప్పుడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో ఉన్నట్లుండి ఎన్నికల ప్రచారంలో కనిపించాడు.