జనసేన పార్టీ

జనసేన పార్టీ

జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణకు చెందిన ఓ రాజకీయ పార్టీ. ఈ పార్టీని తెలుగు సినీ నటుడు పవన్ కల్యాణ్ 2014 మార్చి 14న స్థాపించారు. 2014 ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉన్నప్పటికీ ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్‌లో పోటీ చేసినా.. కేవలం ఒక్క స్థానంలో మాత్రం గెలిచింది. నాటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి రెండుచోట్లా ఓడిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఒక్కరే విజయం సాధించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్, సభ్యుడికి నాగబాబు ఉన్నారు. సమ సమాజ స్థాపన, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి ప్రశ్నించడం, ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ జనసేన పార్టీ సిద్ధాంతాలుగా ఉంది.

2014 జమిలి ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి జనసేన పార్టీ మద్ధతు ప్రకటించింది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని విమర్శిస్తూ ఆ తర్వాత బీజేపీకి దూరం జరిగారు. 2020 జనవరిలో మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ-బీజేపీ కూటమితో జనసేన చేతులు కలిపింది. పొత్తులో భాగంగా జనసేన ఏపీలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

ఇంకా చదవండి

Andhra Pradesh: కాయ్ రాజా కాయ్‌.. ఏపీలో రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు.. హాట్ సీట్లు ఇవేనంట..!

ఏపీలో బెట్టింగ్ రాయుళ్లకు పండగొచ్చింది. ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని..సొమ్ము చేసుకుంటున్నారు. కోడిపందేలు తరహాలో ఎన్నికల ఫలితాలు, మోజార్టీపై మూడో కోణాల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. 1:5 రేషియోలో పందేలు కాస్తూ జేబులు నింపుకుంటున్నారు.

Pawan Kalyan – Anna: కాశీ విశ్వనాధుని సేవలో పవన్ కల్యాణ్ దంపతులు.. ఫొటోలు చూశారా..?

అనంతరం.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, అనా కొణిదెల కాశీ విశ్వనాధుని ఆలయ ప్రాంగణాన్ని తిలకించారు.

Andhra Pradesh: టెన్షన్.. టెన్షన్.. ఏపీలో ఆగని గొడవలు.. కొనసాగుతున్న ఘర్షణలు.. ఈ ప్రాంతాల్లో..

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది. కానీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ వర్గాల దాడులు, ప్రతిదాడులతో కొన్ని చోట్ల హింసాత్మక వాతావరణం నెలకొంది. పోలింగ్ సందర్భంగా తలెత్తిన గొడవలు, పాత రాజకీయ కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి

Watch Video: పిఠాపురంలో ఎర్ర కండువా రాజకీయం..వంగా గీత వర్సెస్ నాగబాబు

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎర్ర కండువాపై పార్టీల మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది. జన సైనికులు పోలింగ్ కేంద్రాల్లో ఎర్ర కండువాను వేసుకోవడంపై వంగా గీత ఫైర్ అయ్యారు. దీనిపై జనసేన నాయకుడు నాగబాబు సమాధానం ఇచ్చారు. ఇప్పుడు పిఠాపురంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

Watch Video: మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కళ్యాణ్.. సతీమణితో కలిసి వచ్చి..

మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి తన సతీమణితో కలిసి వచ్చారు. అయితే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఓటు వేశారు. ఏపీలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని గిరిజన కోపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పవన్ ఓటు వేశారు.

  • Srikar T
  • Updated on: May 13, 2024
  • 10:53 am

నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు

సుమారు రెండు నెలలు.. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి రాజకీయ పార్టీల ప్రచార హోరు కొనసాగించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మైకులు, డిజే సౌండ్‎లతో సాగిన ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లోనే ఫుల్ స్టాప్ పడనుంది. ఎల్లుండి జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో మరో కీలక ఘట్టం ముగియనుంది. దీంతో అన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీస్ అధికారులు చివరి 48 గంటల్లో, పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరించారు.

  • MP Rao
  • Updated on: May 11, 2024
  • 8:23 am

AP News: కూటమి నేతల్లో వర్గపోరు.. పొలింగ్‎కు ముందు అనూహ్య పరిణామం..

మరో 48గంటల్లో ఏపీ పోలింగ్‌కి అంతా సిద్దమవుతున్నా.. కూటమి నేతల్లో మాత్రం లొల్లి కంటిన్యూ అవుతోంది. పి.గన్నవరంలో టీడీపీ, జనసేన నేతలు బాహబాహీకి దిగారు. ఏపీలో ప్రచారం పర్వం నేటితో ముగుస్తోంది. మరి కొద్ది గంటల్లో మైకులు ముగబోనున్నాయి. ఏపీ ఎన్నికల సంగ్రామంలో మరో 48గంటల్లో ఓట్ల పండుగ జరగనుంది. ప్రచారంపర్వం ముగుస్తున్నా.. కూటమి కార్యకర్తల్లో మాత్రం ఇంకా లొల్లి కొనసాగుతోంది. ముఖ్యంగా పి.గన్నవరంలో నియోజకవర్గంలో మొదటినుంచి కూటమి కార్యకర్తల్లో సమన్వయం లోపించింది.

  • Srikar T
  • Updated on: May 11, 2024
  • 6:42 am

Pawan Kalyan: పిఠాపురంలో నిర్మాత ఎస్కేఎన్, డైరెక్టర్ సుజిత్ .. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం

ఏపీ ఎలక్షన్లలో ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం పిఠాపురం. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తుండడమే దీనికి కారణం. ఈనేపథ్యంలో పవన్ విజయాన్ని ఆకాంక్షిస్తూ సినీ పరిశ్రమ నుంచి పెద్ద సంఖ్యలో స్టార్ సెలబ్రిటీలు ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొంటున్నారు. తాజాగా బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్, అలాగే ఓజీ డైరెక్టర్ సుజిత్ పిఠాపురంలో పర్యటించారు.

Watch Video: ‘ఆస్తుల కోసమే పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టారు’.. పోతిన మహేష్ సంచలన ఆరోపణలు..

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్యాకేజీ స్టార్ అంటూ ఆరోపించారు వైసీపీ నేత పోతిన మహేష్‌. ఆస్తుల కోసమే పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టారన్నారు. ఒకప్పుడు కారుకు EMI కట్టలేని పవన్‌.. ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారాయన. నమ్ముకున్న వాళ్లను అమ్ముకొని తన ఆస్తులను పెంచుకున్నారని విమర్శించారు. పార్టీ ఆఫీసులను కూడా పవన్‌ తన పేరిట రిజిస్టర్‌ చేయించుకున్నారన్నారు పోతిన మహేష్‌. మంగళగిరిలో వందకోట్లు పెట్టి బినామీల పేరిట ఆస్తులు కూడా పెట్టుకున్నారంటూ డాక్యుమెంట్లను చూపించారు పోతిన మహేష్‌.

  • Srikar T
  • Updated on: May 9, 2024
  • 1:50 pm

PM Modi: తెలుగు రాష్ట్రాల్లో మోదీ టూర్.. రోడ్ షోలు, సభలతో ప్రధాని బిజీ షెడ్యూల్

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. పలు ఆంక్షలు విధించారు. నిన్న రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేసిన ప్రధాని మోదీ.. కాసేపట్లో వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కి మద్దతుగా వేములవాడ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. అక్కడి నుంచి వరంగల్‌కు చేరుకుంటారు. లక్ష్మీపూర్‌లో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జన సభలో ప్రధాన మంత్రి మోదీ పాల్గొంటారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 8:09 am

‘తనను ఉండకుండా చేయాలన్నది కూటమి లక్ష్యం..’ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..

ఎన్నికలు సరిగా జరుగుతాయన్న నమ్మకం తగ్గుతోందని, కూటమి నేతలు తనపై కుట్ర చేస్తున్నారంటూ సీఎం జగన్‌ సంచలన కామెంట్లు చేశారు. పథకాల నిధులు పేదలకు చేరకుండా ఆపుతున్నారని ఆయన ఆరోపించారు. ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తున్నారని, తనను ఉండకుండా చేయాలన్నదే కూటమి లక్ష్యమన్నారు సీఎం.

AP Politics: ఏపీలో పొలిటికల్‌ బీపీ పెరుగుతోందా? మోదీ సభలపై వైసీపీ రియాక్షన్‌ ఏంటి?

ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీలో అజెండాలు మారిపోతున్నాయి.. అధికారులపై ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. ఇక ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షాలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజధానుల నుంచి పోలవరం దాకా మళ్లీ ఎన్నికల అంశాలుగా మారాయి.

AP Elections 2024: ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్ ఇదే..

కూటమి కోసం సారొస్తున్నారు. ఇవాళ రాజమండ్రి, అనకాపల్లికి మోదీ వస్తున్నారు. ఆయన రాకతో క్లైమాక్స్‌లో కాక పెంచాలని కూటమి ప్లాన్‌ చేసింది. ఏపీలో మోదీ సభలు, రోడ్‌ షోలకు భారీగా ప్లాన్‌ చేసింది. మే 6, 8 తేదీల్లో కూటమి తరపున ప్రచారంలో మోదీ పాల్గొంటారు. ఏపీపై బీజేపీ ఫోకస్‌ పెంచింది. ఏపీ ఎన్నికల ప్రచారం చివరి చరణంలో మోదీ రాక వేడి పుట్టిస్తోంది. కూటమి కోసం ప్రచారం చేయడానికి ఏపీ వస్తున్నారు మోదీ. ఇవాళ రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. 8వ తేదీన రాజంపేట పార్లమెంట్‌ స్థానం పరిధిలోని పీలేరులో సభకు మోదీ హాజరవుతారు.

  • Srikar T
  • Updated on: May 6, 2024
  • 6:35 am

PM Modi tour: ఈనెల 6, 8న రాష్ట్రానికి ప్రధాని మోదీ.. కూటమి తరపున ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని హెరెత్తిస్తున్నారు అభ్యర్థులు. ఏపీలో కూటమి తరపున మరోసారి ప్రచారం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. మే 6, 8 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటిస్తారని.. కూటమి ప్రధాని మోదీ ప్రచారం చేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు.

PM Modi: ఏపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ విడుదల..

ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మూడో సారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం దేశ వ్యాప్తంగా చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో 10 రోజుల్లో ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

  • Srikar T
  • Updated on: May 3, 2024
  • 5:31 pm
వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునే వారికి మంచి ఆప్షన్‌ ఇవే..
వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునే వారికి మంచి ఆప్షన్‌ ఇవే..
అయ్యో అక్కయ్యా.. ఎంతకష్టం వచ్చింది నీకు.! వీడియో వైరల్..
అయ్యో అక్కయ్యా.. ఎంతకష్టం వచ్చింది నీకు.! వీడియో వైరల్..
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
పెరుగుతో కాన్సర్‌కు చెక్‌.. 14 లక్షలమందిపై పరిశోధనలు.
పెరుగుతో కాన్సర్‌కు చెక్‌.. 14 లక్షలమందిపై పరిశోధనలు.
పురుషుల సంతానలేమికి తల్లే కారణమా.? CCMB అధ్యయనం..
పురుషుల సంతానలేమికి తల్లే కారణమా.? CCMB అధ్యయనం..
భారత్‌కు పాఠాలు చెప్పొద్దు.! దేశీస్‌ డిసైడ్‌ సదస్సులో వ్యాఖ్యలు..
భారత్‌కు పాఠాలు చెప్పొద్దు.! దేశీస్‌ డిసైడ్‌ సదస్సులో వ్యాఖ్యలు..
టిష్యూ పేపర్‌ కలకలం.. విమానం నుంచి దిగిపోయిన ప్రయాణీకులు.!
టిష్యూ పేపర్‌ కలకలం.. విమానం నుంచి దిగిపోయిన ప్రయాణీకులు.!
ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా ?? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ
ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా ?? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ
ఆడుకుంటూ ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. ఆ డాక్టర్‌ ఏం చేసిందంటే ?
ఆడుకుంటూ ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. ఆ డాక్టర్‌ ఏం చేసిందంటే ?