AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జనసేన పార్టీ

జనసేన పార్టీ

జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణకు చెందిన ఓ రాజకీయ పార్టీ. ఈ పార్టీని తెలుగు సినీ నటుడు పవన్ కల్యాణ్ 2014 మార్చి 14న స్థాపించారు. 2014 ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉన్నప్పటికీ ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్‌లో పోటీ చేసినా.. కేవలం ఒక్క స్థానంలో మాత్రం గెలిచింది. నాటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి రెండుచోట్లా ఓడిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఒక్కరే విజయం సాధించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్, సభ్యుడికి నాగబాబు ఉన్నారు. సమ సమాజ స్థాపన, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి ప్రశ్నించడం, ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ జనసేన పార్టీ సిద్ధాంతాలుగా ఉంది.

2014 జమిలి ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి జనసేన పార్టీ మద్ధతు ప్రకటించింది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని విమర్శిస్తూ ఆ తర్వాత బీజేపీకి దూరం జరిగారు. 2020 జనవరిలో మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ-బీజేపీ కూటమితో జనసేన చేతులు కలిపింది. పొత్తులో భాగంగా జనసేన ఏపీలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

ఇంకా చదవండి

పాదయాత్రల నుంచి పబ్లిక్ సర్వీస్ వరకు… మారుతున్న రాజకీయాల కొత్త ఫార్ములా!

ఒకప్పుడు రాజకీయాల్లో ప్రజల మనసు గెలవాలంటే పాదయాత్రే ప్రధాన ఆయుధంగా ఉండేది. వేల కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకోవడం ద్వారా నాయకులు తమ రాజకీయ ప్రస్థానాన్ని బలోపేతం చేసుకునేవారు. కానీ కాలం మారుతోంది... రాజకీయ కమ్యూనికేషన్ కూడా మారుతోంది. ఇప్పుడు జాబ్ మేళాలు, మెడికల్ క్యాంపులు, మహిళా సమావేశాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ కావడం వంటి కొత్త పద్ధతులు రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. మరి నిజంగానే పాదయాత్రల యుగానికి ప్రత్యామ్నాయం వచ్చిందా?

Andhra Politics: గోదావరి టు కృష్ణా.. ఏపీలో మళ్లీ కాపు చిచ్చు.. ఏ పార్టీకి బిగుస్తుంది ఉచ్చు..?

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కాపు రాజకీయాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో టీడీపీ నేత బొండా ఉమ చేసిన వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపాయి. కాపు ఓటు బ్యాంక్‌పై అన్ని ప్రధాన పార్టీలు దృష్టి సారించిన వేళ, ఈ పరిణామం ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి, వ్యవసాయం, విద్య తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్, ప్రజలకు ఉపయోగపడే అనేక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించి, పనులను వేగంగా పూర్తి చేసి నిర్ణీత గడువులో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స ఎంతసేపు జరిగిందంటే..? ప్రధాని నుంచి ఫోన్

పదేళ్లుగా భుజాల నొప్పిని భరిస్తూనే ప్రజా జీవితాన్ని కొనసాగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఎట్టకేలకు శస్త్రచికిత్స జరిగింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ వైద్య నిపుణుల బృందం కుడి భుజానికి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీపై మూడున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది. రెండు భుజాల్లోనూ తీవ్ర గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించగా... మరో భుజానికి రెండు నెలల తర్వాత శస్త్రచికిత్స చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Andhra Politics: తగ్గేదే లే..! చినుకుల్లేకపోయినా.. జోరుగా చిటపటలు.. పక్కా లోకల్‌ పాలిటిక్స్‌

రాప్తాడు నుంచి చంద్రగిరి వరకు, ఆళ్లగడ్డ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఏపీలో స్థానిక రాజకీయాలు హీటెక్కుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ సమరం కొత్త మలుపులు తిరుగుతోంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరుగాంచిన రాయలసీమలో ఇప్పుడు మాటల యుద్ధమే ప్రధాన ఆయుధంగా మారింది. స్థానిక స్థాయిలో చెలరేగుతున్న ఈ రాజకీయ వేడి రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రభావం చూపిస్తోంది.

జనసేన గ్యారేజ్‌.. ఇచ్చట నాయకులు తయారు చేయబడును.. దరఖాస్తులకు ఆహ్వానం..

జనసేన కార్యకర్తల నుంచే భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దే లక్ష్యంతో పార్టీ కొత్త నాయకత్వ ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అసెంబ్లీ, పార్లమెంట్, మండల, గ్రామ స్థాయి నాయకత్వ బాధ్యతల కోసం జనసైనికులు, వీర మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థుల నాయకత్వ లక్షణాలను పరిశీలించి శిక్షణ ఇచ్చి, తుది ఎంపికపై పవన్ కల్యాణ్ నిర్ణయమే అమలవుతుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

Pawan Kalyan: పానకాల స్వామి సాక్షిగా దీక్షలోకి పవన్ కళ్యాణ్.. డైలీ ఎలాంటి నియమాలు పాటిస్తారో తెలుసా..?

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా వార్షిక దీక్షను ప్రారంభించారు. జ్యేష్ఠ మాసం నుంచి కార్తీక మాసం వరకు కొనసాగే ఈ దీక్షలో సాత్విక ఆహారం, నిత్య పూజలు, ధ్యానం, మంత్ర పారాయణం వంటి కఠిన నియమాలను పాటిస్తారు. రాజకీయ బాధ్యతలతో పాటు ఆధ్యాత్మిక సాధనకు సమాన ప్రాధాన్యం ఇస్తూ పవన్ కళ్యాణ్ ఈ దీక్షను ఆచరిస్తారు.

‘దేశమే ఫస్ట్.. మిగతావన్నీ నెక్స్ట్’.. ఢిల్లీ వేదికగా జనసేన కొత్త నినాదం ప్రకటించిన పవన్ కల్యాణ్

జనసేన పార్టీకి దేశ సమగ్రత, జాతీయ సమైక్యతే అత్యున్నత ప్రాధాన్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. "దేశమే ఫస్ట్.. మిగతావన్నీ నెక్స్ట్" అనేది ఇకపై జనసేన పార్టీ విధానం మాత్రమే కాకుండా అధికారిక నినాదంగా కూడా కొనసాగుతుందని ప్రకటించారు. దేశ విభజన భావజాలం, ప్రాంతీయ విద్వేషాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టే శక్తులపై జనసేన రాజీలేని పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు.

Andhra: స్వర్ణాంధ్ర దిశగా పన్నెండో అడుగు.. పడుతూ లేస్తూనే ప్రగతి వైపు..!

రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంపై విస్తృత చర్చ జరుగుతోంది. రాజధాని లేకుండా ప్రారంభమైన రాష్ట్ర ప్రయాణం రాజకీయ మార్పులు, పాలనా విధానాల ప్రభావంతో ఎన్నో మలుపులు తిరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అమరావతి పునర్నిర్మాణం, భారీ పెట్టుబడుల ఆకర్షణ, పోలవరం ప్రాజెక్టు పురోగతి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రభుత్వం విజయాలుగా చెబుతోంది.

తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం (జూన్ 12) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. "2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం" పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది.

Andhra Politics: ఆంధ్రా పాలిటిక్స్‌ గురూ.. టాపిక్ ఏదైనా టాప్ లేచిపోవాల్సిందే..!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతోంది.. ఈ తరుణంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.

ఎన్డీఏ పక్షాల కీలక నిర్ణయం.. టీడీపీకి 3, జనసేనకు 1 రాజ్యసభ సీటు ఖరారు!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార ఎన్డీఏ కూటమి పక్షాల కీలక సమావేశం గురువారం (జూన్ 04)న అమరావతిలో జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ, సభల నిర్వహణతో పాటు రాజ్యసభ స్థానాల కేటాయింపుపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.