జనసేన పార్టీ

జనసేన పార్టీ

జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణకు చెందిన ఓ రాజకీయ పార్టీ. ఈ పార్టీని తెలుగు సినీ నటుడు పవన్ కల్యాణ్ 2014 మార్చి 14న స్థాపించారు. 2014 ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉన్నప్పటికీ ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్‌లో పోటీ చేసినా.. కేవలం ఒక్క స్థానంలో మాత్రం గెలిచింది. నాటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి రెండుచోట్లా ఓడిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఒక్కరే విజయం సాధించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్, సభ్యుడికి నాగబాబు ఉన్నారు. సమ సమాజ స్థాపన, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి ప్రశ్నించడం, ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ జనసేన పార్టీ సిద్ధాంతాలుగా ఉంది.

2014 జమిలి ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి జనసేన పార్టీ మద్ధతు ప్రకటించింది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని విమర్శిస్తూ ఆ తర్వాత బీజేపీకి దూరం జరిగారు. 2020 జనవరిలో మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ-బీజేపీ కూటమితో జనసేన చేతులు కలిపింది. పొత్తులో భాగంగా జనసేన ఏపీలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

ఇంకా చదవండి

Pawan Kalyan: ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?

మరో పదేళ్ల పాటు ఏపీకి చంద్రబాబే సీఎంగా ఉండాలని పదేపదే చెబుతున్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. తాజాగా అల్లూరి ఏజెన్సీలో పర్యటించిన పవన్‌...మరోసారి సీఎం పోస్టుపై ఆసక్తికర కామెంట్లు చేశారు. సీఎం ఎవరని కాదు, ఎవరు బాగా పనిచేశారన్నది ముఖ్యమన్నారు.

Pawan Kalyan: చంపేస్తాం.. పవన్‌ కల్యాణ్‌ పేషీకి బెదిరింపు కాల్స్‌.. డీజీపీతో మాట్లాడిన హోంమంత్రి అనిత..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేషీకి బెదిరింపు కాల్స్‌ రావడం సంచలనంగా మారింది.. ఉప ముఖ్యమంత్రిని చంపేస్తామంటూ హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడు ఫోన్ చేయడం.. అభ్యంతరకర భాషతో సందేశాలు పంపించడం కలకలం రేపింది..

Chandrababu – Pawan Kalyan: సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. చర్చంతా వాటిపైనే..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో వీరిద్దరి మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

Andhra Pradesh: రాజ్యసభకు నాగబాబు..? రేసులో కీలక నేతలు.. సీఎం చంద్రబాబు నిర్ణయంపై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్ కూటమి నేతల్లో రాజ్యసభ రేస్‌ మొదలైంది. ఈ పంపకం ఎలా జరగబోతోంది..? తెలుగుదేశం పార్టీయే ఈ మూడు స్థానాలనూ తీసుకుంటుందా..? లేక జనసేన, బీజేపీలతో షేర్‌ చేసుకుంటుందా..? గతంలో 2014 ఎన్నికల తర్వాత ఏపీలో బీజేపీతో కలిసి అధికారం పంచుకున్నప్పుడు ఆ పార్టీకి రెండు రాజ్యసభ సీట్లను ఇచ్చింది.. అనే చర్చ నడుస్తోంది.

Rajya Sabha By-Elections: ఏపీలో మరో పోరు.. రాజ్యసభ ఉపఎన్నికలకు నోటిఫికేషన్‌.. రేసులో ఉన్నది ఎవరో తెలుసా..?

వైసీపీ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఉపఎన్నికలకు..నోటిఫికేషన్‌ జారీ చేసింది ఎన్నికల సంఘం. అయితే కేవలం 11 మంది ఎమ్మెల్యేల బలమున్న వైసీపీ..ఈ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టే అవకాశమే లేదు. మరి అనుకోకుండా వచ్చిన ఈ మూడు రాజ్యసభ స్థానాల పంపకంలో.. కూటమి పార్టీలు ఏ ఫార్ములాను ఫాలో అవుతాయి..? ముగ్గురు మిత్రుల మధ్య మూడు సీట్ల పంపకం ఎలా ఉండబోతోంది..?

PAC chairman: పీఏసీ చైర్మన్‌ పదవిపై తొలగిన ఉత్కంఠ.. మరోసారి ప్రతిపక్ష వైసీపీ షాక్‌!

అవసరమైన 20 మంది సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో లేని నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏసీ ఎన్నికయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

Andhra Pradesh: పోస్ట్‌ ఎప్పటిదని కాదు.. బుల్లెట్‌ దిగిందా లేదా..! తెరపై గ్రేడ్-2 నేతలే.. మున్ముందు ఇంకెవరో..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సోషల్ మీడియా పోస్టింగ్స్‌, అరెస్టులు షేక్ చేస్తున్నాయి. నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ఏపీ పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్‌ సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డికి లుకౌట్ నోటీసులు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంలోని ముఖ్య నేతలతో సహా గతంలో షర్మిల, సునీత, విజయమ్మపై పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డిని కడప పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

Andhra Pradesh: 24 గంటల్లోనే చర్యలు.. ఇక మురికి పోస్టులు పెడితే దంచుడే.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

మురికి పోస్టులు పెడితే ఊరుకునేది లేదంటూ పోలీసులు కొరడా ఝుళిపిస్తుంటే.. రాజకీయ కక్షతో కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ వైసీపీ గగ్గోలు పెడుతోంది. సీఎం, డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్.. ఇలా ప్రభుత్వ పెద్దలందర్నీ టార్గెట్ చేస్తూ జరిగే ట్రోలింగ్‌కి చెక్ పెట్టాలన్నది సర్కారీ లక్ష్యం. అందుకే.. రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టినవారిని వేటాడుతోంది ఏపీ ఖాకీ శాఖ..

Andhra Pradesh: మరో నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు.. తెలుగు తమ్ముళ్ల సంచలన నిర్ణయం..!

నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చనీయాంశంగా మారింది. జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తీరుతో టీడీపీ నాయకులు అసంతృప్తి చెందుతున్నారు. టీడీపీ నాయకులకు ఎమ్మెల్యేను కలవడం కష్టంగా మారడంతో నాలుగు మండలాల నాయకులు ఆమెకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం పార్టీ అధిష్టానాల దృష్టికి వెళ్ళడంతో సమన్వయ కమిటీ జోక్యం చేసుకుంది.

Pawan Kalyan – Amit Shah: హస్తిన పర్యటన వెనుక ఇంత పెద్ద కథ ఉందా..? ఆసక్తి రేపుతున్న అమిత్ షా – పవన్ కల్యాణ్ భేటీ

డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి అమిత్‌ షాతో భేటీ అయ్యారు పవన్ కల్యాణ్. ఏపీలో లా ఆండ్ ఆర్డర్ పరిస్థితి బాలేదని కామెంట్ చేసిన రెండో రోజున సమావేశం కావడం రాజకీయంగా హీట్ పెంచింది. అయితే భేటీలో ప్రస్తావించిన అంశాలపై మాత్రం క్లారిటీ రాలేదు. మొత్తంగా అమిత్ షా-పవన్ భేటీ రాజకీయంగా ఆసక్తి రేపింది..