
జనసేన పార్టీ
జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు చెందిన ఓ రాజకీయ పార్టీ. ఈ పార్టీని తెలుగు సినీ నటుడు పవన్ కల్యాణ్ 2014 మార్చి 14న స్థాపించారు. 2014 ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉన్నప్పటికీ ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్లో పోటీ చేసినా.. కేవలం ఒక్క స్థానంలో మాత్రం గెలిచింది. నాటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి రెండుచోట్లా ఓడిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఒక్కరే విజయం సాధించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్గా నాదెండ్ల మనోహర్, సభ్యుడికి నాగబాబు ఉన్నారు. సమ సమాజ స్థాపన, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి ప్రశ్నించడం, ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ జనసేన పార్టీ సిద్ధాంతాలుగా ఉంది.
2014 జమిలి ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి జనసేన పార్టీ మద్ధతు ప్రకటించింది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని విమర్శిస్తూ ఆ తర్వాత బీజేపీకి దూరం జరిగారు. 2020 జనవరిలో మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ-బీజేపీ కూటమితో జనసేన చేతులు కలిపింది. పొత్తులో భాగంగా జనసేన ఏపీలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్సభ స్థానాల నుంచి పోటీ చేయనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
Andhra: అట్లాంటి.. ఇట్లాంటి సభ కాదు! రాబోయే నాలుగేళ్లకు రూట్ మ్యాప్.. చంద్రబాబు సర్కార్ నయా స్ట్రాటజీ
సంప్రదాయానికి భిన్నంగా..! వాస్తవానికి దగ్గరగా జూన్12న సభ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం. సాధారణ వార్షికోత్సవంలా కాకుండా.. జనం భాగస్వామ్యంతో, అభివృద్ధి ఆశయాలతో జనోత్సవంలా నిర్వహించబోతోంది. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణం దాకా.. కోస్తా నుంచి రాయలసీమ వరకు ఆ రోజు ప్రత్యేకత ప్రతిబింబించేలా సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో వేడుకలు జరిపేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది.
- Shaik Madar Saheb
- Updated on: Jun 11, 2025
- 9:42 am
మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక.. చంద్రబాబు, లోకేశ్కు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్
తెలుగు దేశం పార్టీ నేతలు, శ్రేణులు పెద్ద పండగగా భావించే మహానాడు కడప గడపలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆ తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపనతో మహానాడు వేడుక లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల నుంచి టీడీపీ శ్రేణులు హాజరయ్యారు.
- Balaraju Goud
- Updated on: May 27, 2025
- 8:50 pm
Pawan Kalyan: నా వాళ్లు అనుకుంటే ఇలా చేస్తారా..? ఫిల్మ్ ఇండస్ట్రీకి పవన్ డైరెక్ట్ వార్నింగ్
మిమ్మల్ని నావాళ్లు అనుకున్నా.. నన్ను మాత్రం పరాయివాడిగా చూస్తారా..? తెలుగు సినిమా నాది అనుకుంటే నా సినిమాకే ఎసరు పెడతారా..? ఇండస్ట్రీ నాకిచ్చిన రిటర్న్గిఫ్ట్కు చాలాచాలా థ్యాంక్స్. నా ఒరిజినల్ సినిమా ఎలా ఉంటుందో ఇకపై చూద్దురుగాని అంటూ చూపుడువేలితో హెచ్చరించారు ఏపీ డిప్యూటీ సీఎం ఉరఫ్ టాలీవుడ్ పవర్స్టార్. గాడితప్పిన ఇండస్ట్రీకి రిపేర్లు చెయ్యడానికి ప్రణాళికలు కూడా సిద్ధంగా ఉన్నట్టు చెప్పేశారు. టోటల్గా తెలుగు సినీ పరిశ్రమలో పవనిజమ్ కమింగ్సూన్.. అని సాలిడ్గా సంకేతాలే వచ్చేశాయ్.
- Ram Naramaneni
- Updated on: May 24, 2025
- 8:05 pm
GVMC: వ్యూహం ఫలించింది.. జీవీఎంసీపై కూటమి జెండా.. మేయర్ హరివెంకటకుమారిపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం..
పక్కా వ్యూహంతో ముందుకెళ్లిన కూటమి.. అనుకున్నట్టుగానే గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి 74 మంది మద్దతును కూడ గట్టుకుని.. మేయర్ హరి వెంకటకుమారిపై అవిశ్వాసాన్ని నెగ్గింది కూటమి.. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడారన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. త్వరలోనే కొత్త మేయర్ను ఎన్నుకుని విశాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Apr 19, 2025
- 12:05 pm
Visakhapatnam GVMC: విశాఖ జీవీఎంసీ పీఠం కైవసం చేసుకున్న కూటమి.. ప్రత్యక్ష ప్రసారం
విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి పార్టీ కైవసం చేసుకుంది. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేసిన 74మంది ఓటేశారు. కోరమ్ సరిపోవడంతో కలెక్టర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది.. అయితే.. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. కాగా.. రేపు కూటమి కార్పొరేటర్లు మేయర్ను ఎన్నుకోనున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Apr 19, 2025
- 11:36 am
Andhra News: ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర.. జనసేన, బీజేపీకి ఎన్నంటే..
ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇటీవల 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించగా, లేటెస్టుగా మరో 38 మార్కెట్ కమిటీలకు నియామకాలను ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 38 మార్కెట్ కమిటీలకు కొత్త ఛైర్మన్లను నియమిస్తూ గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం.
- Shaik Madar Saheb
- Updated on: Apr 4, 2025
- 8:09 pm
Pawan Kalyan: ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వండి.. పిఠాపురంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్
పిఠాపురంలోని పోలీసు వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పిఠాపురం పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ల వ్యవహారాలపై ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోరడం ఆసక్తిగా మారుతోంది. ఇంతకీ.. పిఠాపురం పోలీసులకు సంబంధించి పవన్ రిపోర్ట్ ఎందుకు కోరారు?... రిపోర్ట్ రిక్వెస్ట్ వెనకున్న కారణాలేంటి?..
- Shaik Madar Saheb
- Updated on: Mar 28, 2025
- 7:38 am
Pawan Kalyan: సభలో ఓజీ ఓజీ అంటూ అభిమానుల అరుపులు.. పవన్ రెస్పాన్స్ ఇదే
మీకో దండం నాయనా.. మీకు నమస్కారం పెట్టడం తప్ప ఏం చేయలేకపోతున్నా అంటూ అభిమానులకు నవ్వుతూనే చురకలంటిచారు డిప్యూటీ సీఎం పవన్. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచర్ల గ్రామంలో ఈ సీన్ జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..
- Ram Naramaneni
- Updated on: Mar 22, 2025
- 8:20 pm
Andhra Politics: పేరు మారింది.. పంచాయితీ మొదలయింది.. ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్..
మొన్న హెల్త్ యూనివర్సిటీ ..నిన్న కడప జిల్లా..తాజాగా విశాఖ క్రికెట్ స్టేడియం..ఇలా ప్రతిచోటా వైఎస్ఆర్ పేరును తొలగిస్తోంది..ఏపీ ప్రభుత్వం. అటు పథకాలకు..ఇటు కట్టడాలకు దివంగత సీఎం పేరు తొలగించడంపై మండిపడుతోంది..వైసీపీ. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖలో నేడు ఆందోళనకు పిలుపునిచ్చింది..ఆ పార్టీ.
- Shaik Madar Saheb
- Updated on: Mar 20, 2025
- 7:28 am
Megastar Chiranjeevi: నా మనసు ఉప్పొంగిపోయింది.. పవన్ స్పీచ్ పై చిరంజీవి రియాక్షన్ ఇదే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా సినీరంగానికి దూరంగా ఉంటూ రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్.. తాజాగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
- Rajitha Chanti
- Updated on: Mar 15, 2025
- 9:22 am