తెలుగు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడాలో 15 ఏళ్ళ అనుభవం ఉంది . ప్రజాశక్తి విలేకరిగా కెరయర్ ప్రారంభం అయింది .. 2012 లో 10టివి స్టాఫ్ రిపోర్టర్ గా ఎలక్ట్రానిక్ మీడియా కెరియర్ ప్రారంభం . 2016 లో HMTV , 2017లో TV5, 2019 లో AP24X7 లో పనిచేసి 2021 లో TV9 లో అడుగుపెట్టాను .. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధిగా భాద్యతలు నిర్వహిస్తున్నాను.
Andhra Pradesh: ఇంత క్రూరంగా ఉన్నవేంట్రా.. చికెన్ పకోడి కోసం లొల్లి.. తమ్ముడే అన్నను దారుణంగా..
మద్యం మత్తు మానవత్వాన్ని చంపేస్తోంది.. క్షణికావేశం రక్త సంబంధాలను బలితీసుకుంటుంది. కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో కేవలం చికెన్ పకోడీ తెచ్చిన వివాదం చివరకు ప్రాణం తీసే స్థాయికి చేరింది. శనివారం పూట మాంసాహారం తెచ్చావని అన్న మందలించడమే తమ్ముడికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ తర్వాత అతడు దారుణానికి ఒడికట్టాడు.
- Sudhir Chappidi
- Updated on: Aug 16, 2026
- 2:10 pm
Andhra News: కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి.. ఎందుకో తెలిస్తే..
క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలనే తలకిందులు చేస్తాయనడానికి తాజాగా కడప జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటనే నిదర్శనం. ప్రేమ వ్యవహారం కారణంగా తన సొంత కూతురితో పాటు, తన తల్లిని కూడా ఓ వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడనే ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
- Sudhir Chappidi
- Updated on: Aug 4, 2026
- 6:55 pm
‘IIT చదివి కలెక్టర్ అవుతానన్నావ్ కదా తల్లీ.. ఎందుకిలా ఒంటరి వాడిని చేశావ్..’ ఓ తండ్రి గుండె కోత
జమ్మలమడుగు తహసీల్దార్ సాయినాథ్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అస్సాంలోని ఐఐటీ గువాహటిలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఆయన కుమార్తె చేతన (20) బ్రహ్మపుత్ర నది వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. సివిల్స్ రాసి కలెక్టర్ కావాలన్న ఆమె కల మధ్యలోనే ముగియడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు..
- Sudhir Chappidi
- Updated on: Aug 4, 2026
- 3:27 pm
Andhra News: ఏం కష్టం వచ్చిందో పాపం.. పాఠాలు చెప్పిన స్కూల్ ముందే ప్రాణాలు వదిలిన పంతులు!
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యార్థులకు భవిష్యత్తును ప్రసాదించాల్సిన ఒక ఉపాధ్యాయుడు, తాను పాఠాలు చెప్పే పాఠశాల ఎదుటే దారుణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయుడు కళ్ళముందే మంటల్లో కాలిపోవడం చూసి విద్యార్థులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
- Sudhir Chappidi
- Updated on: Aug 3, 2026
- 10:12 pm
Massive Scam: 70 మందికి టోకరా పెట్టిన రిటైర్డ్ టీచర్.. ఏకంగా ఏడు కోట్లు స్వాహా
Andhra Pradesh: కడప జిల్లా పులివెందుల నగరంలోని ముద్దనూరు రోడ్డులో శివకాశి అనే విశ్రాంత ఉపాధ్యాయుడు చిట్టీలు నిర్వహించడం, వడ్డీ వ్యాపారం చేస్తూ తన మంచి తనంతో అందరినీ ఆక్టుకున్నాడు. స్థానికంగా ఉన్నవారు కూడా ఉపాధ్యాయ వృత్తి చేశాడు కాబట్టి వారు..
- Sudhir Chappidi
- Updated on: Aug 3, 2026
- 10:40 am
వృద్ధురాలి ఇంట్లో భారీగా బంగారం, వెండి చోరీ.. నిందితుడు ఎవరో తెలిసి అవాక్కయిన స్థానికులు
కడపలో సీనియర్ సిటిజన్ ఇంట్లో జరిగిన రూ.75 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాల చోరీ కేసును తాలూకా పోలీసులు కేవలం 48 గంటల్లో ఛేదించారు. అయితే చోరీకి పాల్పడింది బాధితురాలి సొంత మనవడేనని దర్యాప్తులో తేలడంతో స్థానికంగా సంచలనం రేగింది.
- Sudhir Chappidi
- Updated on: Aug 2, 2026
- 8:54 am
Andhra: పొట్టకూటి కోసం వచ్చి ఇదేం పని.. ప్రాణం తీసిన పల్సర్ బైక్ దొంగతనం.. అసలేం జరిగిందంటే..
కడప జిల్లా రాజంపేట మండలం చెయ్యేరు వంతెన వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. పల్సర్ బైక్ దొంగతనం కేసులో యజమానికి చిక్కిన వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంలో వంతెనపై నుంచి దూకి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Sudhir Chappidi
- Updated on: Jul 30, 2026
- 4:43 pm
భక్తుల మొక్కులు తీర్చే సౌమ్యనాథ స్వామి.. 108 ప్రదక్షిణల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం!
108 ప్రదక్షణలతో కోరిన కోర్కెలు తీర్చి అభయహస్తం ఇస్తూ వీరాజీలుతున్న సోమనాథుడు శ్రీ మహా విష్ణుమూర్తి సౌమ్యనాథ స్వామిగా అవతరించి భక్తులకు అభయహస్తం ఇస్తూ.. కోరిన కోరికలు తీరుస్తూ పూజలు అందుకుంటున్నారు నందలూరులో 108 స్తంభాలపై భాగవతం చిత్రీకరించిన ఈ ఆలయంలో త్రికరణ శుద్ధిగా 108 ప్రదక్షణులు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల అచంచల విశ్వాసం.
- Sudhir Chappidi
- Updated on: Jul 29, 2026
- 5:22 pm
Proddatur: బాబోయ్.. చూస్తేనే కడుపులో దేవుతుంది.. పాపం వాళ్ల పరిస్థితి ఊహిస్తేనే..
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ టిఫిన్ సెంటర్లో పూరి కుర్మాలో బల్లి కనిపించడం కలకలం రేపింది. పార్సిల్ తీసుకెళ్లిన కస్టమర్ ఇంటికి వెళ్లి తినే సమయంలో ఈ విషయం గుర్తించి హోటల్ యజమానిని ప్రశ్నించగా, ఆయన నిర్లక్ష్యంగా స్పందించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి హోటల్ను మూసివేశారు.
- Sudhir Chappidi
- Updated on: Jul 24, 2026
- 1:16 pm
Andhra: మహిళ మృతదేహాన్ని తరలిస్తూ ఈ అంబులెన్స్ డ్రైవర్ ఏం పని చేశాడో తెలుసా..?
మృతదేహాన్ని ఇంటికి తరలించే బాధ్యతలో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ మానవత్వాన్ని మరిచి దారుణానికి పాల్పడ్డాడు. మార్గమధ్యలో మృతురాలి కుమారుడిని నీళ్లు తీసుకురావాలని పంపించి, ఆమె చేతికి ఉన్న బంగారు గాజును అపహరించాడు. పోలీసుల విచారణలో నిందితుడు పట్టుబడగా, సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు గాజును స్వాధీనం చేసుకున్నారు.
- Sudhir Chappidi
- Updated on: Jul 22, 2026
- 12:20 pm
Andhra: ఇంటి ముందు డైలీ కళ్లాపి చల్లుతున్నారా..? అలా అయితే మీ ప్రాణాలకే ముప్పు..
ఇంటి ముందు చల్లుకునే కళ్లాపి పొడిలో ప్రమాదకర రసాయనం ఉన్నట్లు కడప జిల్లా పోలీసులు వెల్లడించారు. ప్రొద్దుటూరులో తయారవుతున్న కొన్ని కళ్లాపి పొడుల్లో అరోమైన్-ఓ అనే రసాయనం ఉన్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో తేలిందని తెలిపారు. ఈ రసాయనం ఆరోగ్యానికి హానికరమని, దీనిపై చర్యగా ఏడు తయారీ పరిశ్రమలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
- Sudhir Chappidi
- Updated on: Jul 9, 2026
- 9:19 am
రన్నింగ్లోనే ఊడిపోయిన స్కూల్ బస్సు రెండు టైర్లు.. ఊపిరి బిగపట్టిన 30 మంది విద్యార్థులు!
కడప జిల్లా పులివెందుల పరిధిలోని ముదునూరు రింగ్ రోడ్డు వద్ద సోమవారం (జూలై 06) ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 30 మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రన్నింగ్లో ఉండగానే వెనుక వైపు ఉన్న రెండు టైర్లు ఒక్కొక్కటిగా ఊడిపోయాయి. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే స్థానికుల అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పింది.
- Sudhir Chappidi
- Updated on: Jul 6, 2026
- 3:33 pm