తెలుగు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడాలో 15 ఏళ్ళ అనుభవం ఉంది . ప్రజాశక్తి విలేకరిగా కెరయర్ ప్రారంభం అయింది .. 2012 లో 10టివి స్టాఫ్ రిపోర్టర్ గా ఎలక్ట్రానిక్ మీడియా కెరియర్ ప్రారంభం . 2016 లో HMTV , 2017లో TV5, 2019 లో AP24X7 లో పనిచేసి 2021 లో TV9 లో అడుగుపెట్టాను .. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధిగా భాద్యతలు నిర్వహిస్తున్నాను.
Andhra: పొట్టకూటి కోసం వచ్చి ఇదేం పని.. ప్రాణం తీసిన పల్సర్ బైక్ దొంగతనం.. అసలేం జరిగిందంటే..
కడప జిల్లా రాజంపేట మండలం చెయ్యేరు వంతెన వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. పల్సర్ బైక్ దొంగతనం కేసులో యజమానికి చిక్కిన వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంలో వంతెనపై నుంచి దూకి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Sudhir Chappidi
- Updated on: Jul 30, 2026
- 4:43 pm
భక్తుల మొక్కులు తీర్చే సౌమ్యనాథ స్వామి.. 108 ప్రదక్షిణల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం!
108 ప్రదక్షణలతో కోరిన కోర్కెలు తీర్చి అభయహస్తం ఇస్తూ వీరాజీలుతున్న సోమనాథుడు శ్రీ మహా విష్ణుమూర్తి సౌమ్యనాథ స్వామిగా అవతరించి భక్తులకు అభయహస్తం ఇస్తూ.. కోరిన కోరికలు తీరుస్తూ పూజలు అందుకుంటున్నారు నందలూరులో 108 స్తంభాలపై భాగవతం చిత్రీకరించిన ఈ ఆలయంలో త్రికరణ శుద్ధిగా 108 ప్రదక్షణులు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల అచంచల విశ్వాసం.
- Sudhir Chappidi
- Updated on: Jul 29, 2026
- 5:22 pm
Proddatur: బాబోయ్.. చూస్తేనే కడుపులో దేవుతుంది.. పాపం వాళ్ల పరిస్థితి ఊహిస్తేనే..
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ టిఫిన్ సెంటర్లో పూరి కుర్మాలో బల్లి కనిపించడం కలకలం రేపింది. పార్సిల్ తీసుకెళ్లిన కస్టమర్ ఇంటికి వెళ్లి తినే సమయంలో ఈ విషయం గుర్తించి హోటల్ యజమానిని ప్రశ్నించగా, ఆయన నిర్లక్ష్యంగా స్పందించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి హోటల్ను మూసివేశారు.
- Sudhir Chappidi
- Updated on: Jul 24, 2026
- 1:16 pm
Andhra: మహిళ మృతదేహాన్ని తరలిస్తూ ఈ అంబులెన్స్ డ్రైవర్ ఏం పని చేశాడో తెలుసా..?
మృతదేహాన్ని ఇంటికి తరలించే బాధ్యతలో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ మానవత్వాన్ని మరిచి దారుణానికి పాల్పడ్డాడు. మార్గమధ్యలో మృతురాలి కుమారుడిని నీళ్లు తీసుకురావాలని పంపించి, ఆమె చేతికి ఉన్న బంగారు గాజును అపహరించాడు. పోలీసుల విచారణలో నిందితుడు పట్టుబడగా, సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు గాజును స్వాధీనం చేసుకున్నారు.
- Sudhir Chappidi
- Updated on: Jul 22, 2026
- 12:20 pm
Andhra: ఇంటి ముందు డైలీ కళ్లాపి చల్లుతున్నారా..? అలా అయితే మీ ప్రాణాలకే ముప్పు..
ఇంటి ముందు చల్లుకునే కళ్లాపి పొడిలో ప్రమాదకర రసాయనం ఉన్నట్లు కడప జిల్లా పోలీసులు వెల్లడించారు. ప్రొద్దుటూరులో తయారవుతున్న కొన్ని కళ్లాపి పొడుల్లో అరోమైన్-ఓ అనే రసాయనం ఉన్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో తేలిందని తెలిపారు. ఈ రసాయనం ఆరోగ్యానికి హానికరమని, దీనిపై చర్యగా ఏడు తయారీ పరిశ్రమలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
- Sudhir Chappidi
- Updated on: Jul 9, 2026
- 9:19 am
రన్నింగ్లోనే ఊడిపోయిన స్కూల్ బస్సు రెండు టైర్లు.. ఊపిరి బిగపట్టిన 30 మంది విద్యార్థులు!
కడప జిల్లా పులివెందుల పరిధిలోని ముదునూరు రింగ్ రోడ్డు వద్ద సోమవారం (జూలై 06) ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 30 మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రన్నింగ్లో ఉండగానే వెనుక వైపు ఉన్న రెండు టైర్లు ఒక్కొక్కటిగా ఊడిపోయాయి. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే స్థానికుల అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పింది.
- Sudhir Chappidi
- Updated on: Jul 6, 2026
- 3:33 pm
Proddatur: ‘లక్కీ’ అలియాస్ ‘టమాటా’.. ఆస్పత్రిలో ఏందీ గలాటా..
కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సిబ్బందితో సంబంధం లేని వ్యక్తి గత ఐదు నెలలుగా నర్సుగా వ్యవహరించినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పేషెంట్లకు ఇంజక్షన్లు ఇవ్వడం, ఆసుపత్రిలో రీల్స్ చిత్రీకరించడం వంటి ఆరోపణల నేపథ్యంలో అధికారులు మెమోలు జారీ చేయగా, నకిలీ నర్సుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Sudhir Chappidi
- Updated on: Jul 4, 2026
- 12:59 pm
గుండెల్ని పిండేసే విషాదం.. నీళ్ల డ్రమ్ములో ముంచి చిన్నారి హత్య.. సీసీ కెమెరాలో షాకింగ్ నిజం..!
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళల మధ్య వచ్చిన గొడవ, ఒక నిష్కల్మషమైన పసిప్రాణాన్ని బలితీసుకుంది. ఆడుకుంటూ కనిపించిన నిత్విక అనే చిన్నారిని బాత్రూంలోని నీళ్ల డ్రమ్ములో ముంచి దారుణంగా హత్య చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- Sudhir Chappidi
- Updated on: Jun 26, 2026
- 3:09 pm
Sricharani: ఐసీసీ ర్యాంకింగ్స్లో కడప అమ్మాయి సత్తా.. ప్రపంచ నంబర్ వన్ బౌలర్గా శ్రీచరణి రికార్డు!
తెలుగింటి ఆడ బిడ్డ.. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి మరో కీలక మైలు రాయిని అందుకుంది. కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్లే ప్రపంచ క్రికెట్లో కీర్త పతాకం ఎగురవేసింది. తాజాగా ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్లో శ్రీచరణి.. ప్రపంచ నెంబర్ వన్ బౌలర్గా అవతరించి, సరికొత్త చరిత్ర సృష్టించింది.
- Sudhir Chappidi
- Updated on: Jun 24, 2026
- 12:32 pm
రీల్స్ పిచ్చి తెచ్చిన ఘోర ప్రమాదం.. వీడియో తీస్తుండగా కరెంట్ షాక్.. స్పాట్లోనే ఇద్దరు..!
Kadapa Crime News: మరికొద్ది సేపట్లో పని ముగించుకుని రూముకు వెళ్లి ప్రశాంతంగా నిద్రపోవాల్సిన ఆ యువకులను, క్షణకాలం పాటు పట్టిన రీల్స్ పిచ్చి తిరిగిరాని లోకాలకు పంపించేసింది. ఈ సంఘటనతో ఆటో నగర్ కాలనీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. లైకులు, కామెంట్ల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, సామాజిక మాధ్యమాల వ్యామోహంలో పడి కన్నవారికి కడుపుకోత మిగల్చవద్దని పోలీసులు, పెద్దలు నెటిజన్లను హెచ్చరిస్తున్నారు. యువత ఇప్పటికైనా ఇటువంటి ప్రమాదకరమైన స్టంట్లు, వీడియోలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- Sudhir Chappidi
- Updated on: Jun 23, 2026
- 10:53 pm
కడపలో సందడి చేసిన నాగభంధం చిత్ర యూనిట్.. ఆకట్టుకున్న భారీ సెటప్
‘నాగబంధం’ చిత్ర యూనిట్ కడపలో వినూత్న ప్రచార కార్యక్రమంతో సందడి చేసింది. హీరో Virat Karna, హీరోయిన్ Nabha Natesh, దర్శక నిర్మాతలు పాల్గొన్న ఈ ఈవెంట్లో భారీ లారీపై విష్ణుమూర్తి శయనిస్తున్న సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హీరోగా విరాట్ కర్ణకు ఇది తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.
- Sudhir Chappidi
- Updated on: Jun 17, 2026
- 3:32 pm
భర్త కువైట్లో.. భార్య కడపలో.. డ్రైవర్తో అలా కనిపించే సరికి..
కడపలో మూడు రోజులుగా అదృశ్యమైన యువకుడు వంశీ శవమై కనిపించడం కలకలం రేపింది. ఒంటిమిట్ట మండలం కోటపాడు సమీపంలో మృతదేహం లభించగా, ఒంటిపై కత్తిపోట్లు ఉండటంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. వంశీ తన యజమాని రామసుబ్బారెడ్డి ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తుండగా, యజమాని భార్యతో సన్నిహితంగా ఉన్నాడన్న అనుమానాలు ఉన్నట్లు సమాచారం.
- Sudhir Chappidi
- Updated on: Jun 13, 2026
- 9:23 am