తెలుగు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడాలో 15 ఏళ్ళ అనుభవం ఉంది . ప్రజాశక్తి విలేకరిగా కెరయర్ ప్రారంభం అయింది .. 2012 లో 10టివి స్టాఫ్ రిపోర్టర్ గా ఎలక్ట్రానిక్ మీడియా కెరియర్ ప్రారంభం . 2016 లో HMTV , 2017లో TV5, 2019 లో AP24X7 లో పనిచేసి 2021 లో TV9 లో అడుగుపెట్టాను .. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధిగా భాద్యతలు నిర్వహిస్తున్నాను.
నడిరోడ్డుపై చిరుత ప్రత్యక్షం.. వాహనదారులు పరుగులు
కడప జిల్లా లంకమల అటవీ ప్రాంతంలో ఓ చిరుత పులి రహదారిపై కనిపించి వాహనదారులను భయపెట్టింది. ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. సిద్ధవటం రేంజ్లో వన్యప్రాణుల సంచారం పెరిగిన నేపథ్యంలో, అటవీ శాఖ రాత్రి 9 గంటల తర్వాత ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ప్రయాణికులు తమ భద్రత దృష్ట్యా రాత్రిపూట ప్రయాణాలు మానుకోవాలని, నిబంధనలు పాటించాలని హెచ్చరించింది.
- Sudhir Chappidi
- Updated on: May 8, 2026
- 11:43 am
అభయారణ్యంలో అపురూప కట్టడం! బయటపడ్డ శంకువు ఆకారపు బావి.. అసలు రహస్యం ఇదే!
ప్రకృతి ఒడిలో దాగి ఉన్న అద్భుత కట్టడాలు అప్పటి పాలకుల దూరదృష్టికి, కళా హృదయానికి నిదర్శనాలు. అటువంటిదే కడప జిల్లా సిద్ధవటం అటవీ ప్రాంతంలోని లంకమల అభయారణ్యంలో వెలుగుచూసిన పురాతన బావి. మద్దూరు బీట్ పరిధిలోని వరికుంట-చండువాయి మార్గంలో ఉన్న ఈ బావి, తన విశిష్టమైన శంకువు ఆకారంతో చూపరులను ఆకట్టుకుంటోంది.
- Sudhir Chappidi
- Updated on: May 7, 2026
- 6:18 pm
Andhra: మహిళతో హోటల్కు.. శృతిమించిన యవ్వారం.. కట్ చేస్తే, ఆసుపత్రికి పరుగులు
కడప జిల్లా ఒంటిమిట్ట హరిత హోటల్లో పత్రికా విలేకరి నాలుకను మహిళా కొరికిన ఘటన సంచలనం రేపింది. మద్యం మత్తులో రొమాన్స్ అదుపు తప్పడంతో ఈ అఘాయిత్యం జరిగింది. అక్రమాలకు నిలయంగా మారిన ఈ హోటల్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
- Sudhir Chappidi
- Updated on: May 7, 2026
- 6:14 pm
ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే
దేశవ్యాప్తంగా ఎండలు మండుతుండగా, వేడి నుండి ఉపశమనం పొందేందుకు కోతులు నీటి గిన్నెలో జలకాలు ఆడుతున్న వీడియో వైరల్ అవుతోంది. మనుషులు ఏసీల్లో ఉంటే, ఈ వానరాలు నీటిలో మునిగి సేదతీరాయి. ఈ వీడియో నెటిజన్లను అలరిస్తోంది. వేసవిలో మూగజీవాలకు నీటిని అందించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఈ వైరల్ దృశ్యం వేసవి తాపానికి జంతువుల పాట్లను గుర్తు చేస్తుంది.
- Sudhir Chappidi
- Updated on: May 7, 2026
- 12:52 pm
ఏం మనిషివి రా.. లావుగా ఉందని భార్యను హతమార్చిన సాఫ్ట్వేర్ మైండ్! గూగుల్లో సెర్చ్ చేసి స్కెచ్
కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ఈ ఘటన నాగరిక సమాజం తలదించుకునేలా ఉంది. కేవలం లావుగా ఉంది అనే చిన్న కారణంతో ఎనిమిదేళ్ల బంధాన్ని, కన్న బిడ్డను కూడా మర్చిపోయి ఒక భర్త ఇంతటి కిరాతకానికి ఒడిగట్టడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. పదిమందిలో అవమానమని భావించి ఆమె ప్రాణమే తీశాడు. ఇందుకోసం గూగుల్లో సెర్చ్ చేసి మరీ పక్కా స్కెచ్ వేశాడు. పోలీసుల వివరణ మేరకు పూర్తి వివరాల్లోకి వెళితే..
- Sudhir Chappidi
- Updated on: May 6, 2026
- 11:51 am
రాత్రి బాయ్ఫ్రెండ్.. ఉదయం గర్ల్ఫ్రెండ్ సూసైడ్.. ఒక్క ఫోన్కాల్ ఎంత పని చేసిందో..!
ఇద్దరు ప్రేమికుల మధ్య తలెత్తిన వివాదమే కాస్తా వారి మృత్యువును వెంటాడింది. మొదట ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుని చనిపోగా.. ప్రియుడి మరణం తట్టుకోలేక ఆ ప్రేమికురాలు సైతం ఆత్మహత్యకు పాల్పడింది. కలిసి నూరెళ్లు బతకాలనుకున్న వారి కల కలగానే మిగిలిపోయింది. ఇంతకూ ప్రాణాలు తీసుకునేంత వివాదం వారిద్దరి మధ్య ఏంటో చూద్దాం పదండి.
- Sudhir Chappidi
- Updated on: May 4, 2026
- 10:03 pm
Andhra Pradesh: వారెవ్వా.. సొంత స్థలంలో నరసింహ స్వామి గుడి కట్టిన ముస్లిం వ్యక్తి..
మన దేశం విభిన్న సంప్రదాయాల సమాహారం. ఇక్కడ మతాలు వేరైనా, మనసులన్నీ ఒక్కటే అని నిరూపించారు కడప జిల్లాకు చెందిన మహబూబ్ బాషా. హిందూ-ముస్లింల మధ్య ఉన్న విడదీయరాని అనుబంధానికి ప్రతీకగా తన సొంత స్థలంలోనే లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని నిర్మించి, కల్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- Sudhir Chappidi
- Updated on: May 2, 2026
- 10:38 pm
Watch Video: ఆ ఊరి VRO మూతి పళ్ళు రాలగొట్టిన ఆకతాయిలు.. మద్యం మత్తులో బరితెగింపు!
మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు ఓ ప్రభుత్వ ఉద్యోగిని మూతి పళ్ళు రాలగొట్టిన ఘటన పుల్లంపేటలో చోటు చేసుకుంది. పుల్లంపేటలో మద్యం సేవించి ఆటోతో స్కూటర్ ను ఢీకొన్న ముగ్గురు యువకులను మందలించిన వీఆర్వో సుబ్బరాయుడు పై ముగ్గురు యువకులు దాడి చేసి విచక్షణ రహితంగా మూతి పళ్ళు రాల గొట్టి గాయపరిచారు. వివరాల్లోకి వెళితే..
- Sudhir Chappidi
- Updated on: Apr 30, 2026
- 4:21 pm
బెదిరింపులకు భయపడను.. వైఎస్సార్ ఘాట్ వద్ద అంబటి రాంబాబు భావోద్వేగంగా ప్రతిజ్ఞ..!
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద భావోద్వేగంగా ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్పై విమర్శలు చేసినందుకు గాను కడప జిల్లా వేంపల్లి, పులివెందుల పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణకు హాజరయ్యేందుకు ఆయన వేంపల్లి చేరుకున్నారు.
- Sudhir Chappidi
- Updated on: Apr 30, 2026
- 12:50 pm
Andhra: తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి.. ఎందుకంటే..
కడప జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. మద్యం తాగి వచ్చి ప్రతిరోజు తల్లిని వేధిస్తున్న తండ్రిని, ఓ పదో తరగతి విద్యార్థి ఆవేశంలో పదునైన ఆయుధంతో కొట్టి హత్య చేశాడు. తల్లి పడుతున్న బాధను చూడలేక, ఆమెకు రక్షణగా నిలవాలనుకున్న క్రమంలో.. ఆవేశంతో చేసిన ఈ పనితో తండ్రి ప్రాణాలు కోల్పోగా, కొడుకు జైలు పాలయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
- Sudhir Chappidi
- Updated on: Apr 29, 2026
- 1:59 pm
Andhra: ఎంతపని చేశావ్ మానస.. బాయ్ఫ్రెండ్ చెప్పినట్లు చేసింది.. చివరకు
ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ హనీ ట్రాప్కు గురై రూ. 81 లక్షలు పోగొట్టుకున్నాడు. మూడేళ్లుగా ఫోన్లో పరిచయమైన అమ్మాయిని గుడ్డిగా నమ్మి, ఆమె అడిగినప్పుడల్లా డబ్బులిచ్చాడు. తీరా చూస్తే, తన ఊరిలో ఉండే స్నేహితుడు, అతని గర్ల్ఫ్రెండ్తో కలిసి ఇదంతా ప్లాన్ చేశాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
- Sudhir Chappidi
- Updated on: Apr 29, 2026
- 1:51 pm
Kadapa: శిల్పా ఏమన్నా స్కెచ్ వేశావా..? భర్త మహా జాతకుడు బతికిపోయిండు..
పెళ్ళై 15 ఏళ్లు గడిచినా ప్రియుడి మోజులో పడి ఓ ఇల్లాలు తన భర్త హత్యకు ప్లాన్ వేసింది. రౌడీషీటర్తో చేతులు కలిపి కిరాయి ముఠాను మాట్లాడి సుపారి కూడా ఇచ్చింది .. తీరా ప్లాన్ బయటికి పొక్కడంతో పోలీసులు ఆ హత్య ప్లాన్ను భగ్నం చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ప్లాన్ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పిందట.
- Sudhir Chappidi
- Updated on: Apr 24, 2026
- 12:23 pm