తెలుగు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడాలో 15 ఏళ్ళ అనుభవం ఉంది . ప్రజాశక్తి విలేకరిగా కెరయర్ ప్రారంభం అయింది .. 2012 లో 10టివి స్టాఫ్ రిపోర్టర్ గా ఎలక్ట్రానిక్ మీడియా కెరియర్ ప్రారంభం . 2016 లో HMTV , 2017లో TV5, 2019 లో AP24X7 లో పనిచేసి 2021 లో TV9 లో అడుగుపెట్టాను .. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధిగా భాద్యతలు నిర్వహిస్తున్నాను.
Andhra News: ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. రూ.1000కే సినిమా థియేటర్..! ఆ జిల్లాలో హాట్ టాపిక్ మారిన పోస్టర్లు!
కొత్త కొత్త ఆలోచనలు.. కొత్త కొత్త పోకడలు .. మాయా లేదు మంత్రం లేదు .. వెయ్యు రూపాయలతో టిక్కెట్ కొనండి.. ఏసీ ధియేటర్ సొంతం చేసుకోండి అంటూ పట్టణంలో వెలసిన బ్యానర్లు ఇప్పుడు సర్వత్రా చర్చగా మారాయి. ఇంతకీ ఈ పోస్టర్ల ఆంతర్యం ఏమిటి.. కోట్ల రూపాయల స్దలాన్ని ఎందుకు ఇలా రోడ్టున పెట్టారు .. ఇంతకూ ఈ లక్కీ డిప్ ఎక్కడో తెలుసుకుందాం పదండి.
- Sudhir Chappidi
- Updated on: Dec 9, 2025
- 7:58 pm
Watch Video: అర్థరాత్రి ఇంటికెళ్తుండగా వెంటపడ్డ కుక్కలు.. తప్పించుకునేందుకు ఏం చేశాడంటే..
ఈ మధ్యకాలంలో కుక్కలు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఉన్నట్లుండి నడిచి వెళ్లే వారిని కరవడం, వారిపై దాడి చేయడం, సడన్ గా బండిమీద వెళ్ళే వారి వెంట పడడం ఇలా ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రవ్యాప్తంగా అనేక సంఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అలాంటి సంఘటన ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో కూడా జరిగింది. ఓ వ్యక్తి అర్ధరాత్రి బైక్పై వెళ్తుండగా.. కొన్ని కుక్కలు అతన్ని వెంబడించాయి.. దీంతో వాటి నుంచి తప్పించుకునేందు బైక్ను వేగంగా నడిపిన వ్యక్తి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు.
- Sudhir Chappidi
- Updated on: Dec 8, 2025
- 7:42 pm
Kadapa: త్రేతాయుగంలో జాంబవంతుడు నిర్మించిన రామాలయం.. కానీ హనుమంతుడి విగ్రహం ఉండదు..
ఏ రామాలయం చూసినా సీతారామ లక్ష్మణుల విగ్రహాలతో పాటు హనుమంతుడి విగ్రహం తప్పనిసరిగా ఉంటుంది.. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ రామాలయంలో ఏకశిలపై చెక్కబడిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి కానీ హనుమంతుల వారి విగ్రహం మాత్రం ఉండదు.. ఏకశిలా నగరంగా పిలవబడే ఈ ప్రాంతంలో ఉన్న దేవాలయంలో హనుమంతుడి విగ్రహం లేకపోవడానికి కారణం ఏమిటి అనుకుంటున్నారా..?
- Sudhir Chappidi
- Updated on: Dec 6, 2025
- 9:59 pm
Andhra Pradesh: 600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం ఏంటో తెలుసా..?
అన్నమాచార్యులు నడచిన తిరుమల కాలిబాట ప్రస్తుతం మూసివేయబడింది. 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మార్గం అభివృద్ధికి గతంలో ప్రయత్నాలు జరిగినా.. కుక్కలదొడ్డి సమీపంలో ఏనుగుల సంచారం, ప్రాణహాని కారణంగా అటవీ శాఖ మూసివేసింది. భక్తులు, రాజకీయ నాయకులు ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
- Sudhir Chappidi
- Updated on: Dec 6, 2025
- 5:57 pm
Andhra Pradesh: అప్పు చేసి ప్రైవేట్ స్కూల్కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్ స్పీచ్కు తల్లిదండ్రులు ఫిదా.. టీచర్ పనికి చప్పట్లు..
ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నాయి. కడప జిల్లాలో ఒక ఉపాధ్యాయురాలు తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించి, అదనపు ఖర్చు లేకుండా పిల్లలకు ఉత్తమ విద్యను అందించవచ్చని రుజువు చేశారు. ఇంగ్లీషులో స్టూడెంట్ స్పీచ్తో పేరెంట్స్ అవాక్కయ్యారు.
- Sudhir Chappidi
- Updated on: Dec 6, 2025
- 5:28 pm
Andhra: వీడు అమాయకుడేం కాదు.. రైలులో బాలిక ఒంటరిగా దొరికిందని.. టాయిలెట్లోకి తీసుకెళ్లి.!
2019 జనవరి 27న సాయంత్రం 6 గంటలకు బాధితురాలు తన తల్లితో కలిసి తిరుపతి నుంచి సికింద్రాబాద్కు బయల్దేరిన రాయలసీమ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒంటరిగా టాయిలెట్కు వెళ్ళింది. అదే రైలులో ప్రయాణిస్తున్న ప్రసాద్ రెడ్డి అనే నిందితుడు ఆ బాలికను వెంబడించి టాయిలెట్ లోపలికి..
- Sudhir Chappidi
- Updated on: Dec 4, 2025
- 12:40 pm
పుష్పగిరిలోని వెలసిన అరుదైన బ్రహ్మసూత్ర శివలింగాలు…ఒక్కసారి చూసిన చాలు.. ఆ ఫలితం వెయ్యి..
కడప జిల్లా పుష్పగిరిలో వెలసిన బ్రహ్మసూత్ర శివలింగాలు అత్యంత అరుదైనవి. ఇవి 1000 శివాలయాలు దర్శించిన ఫలితాన్నిస్తాయి. శివలింగాలపై నిలువు గీతలు కలిగి ఉండే ఈ అద్భుత లింగాలు అంతర్గత జ్ఞానాన్ని, దుఃఖ విముక్తిని ప్రసాదిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. వ్యాస మహర్షి, ఆదిశంకరాచార్యులు సైతం వీటిని ప్రస్తావించారు. వీటి చరిత్ర, మహిమలు తెలుసుకోండి.
- Sudhir Chappidi
- Updated on: Dec 3, 2025
- 9:20 pm
ఇక్కడి ఓళిగ బలే ఫేమస్ .. విదేశాలలో వాటికి భలే డిమాండ్.. ఇంతకీ అవెక్కడంటే
స్వీట్స్ అంటే అందరికీ నోరు ఊరి పోతుంది .. అలాంటిది ఇక్కడ చేసే ఓళిగలు అంటే అందరూ లొట్టలేసుకొని తినాల్సిందే .. అంత బాగుంటాయి మరి, ఇక్కడ తయారైన ఓళిగకు ప్రత్యేక స్థానం ఉంది ఆ ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాలు, జిల్లాలు దాటి రాష్ట్రాలు, రాష్ట్రాలు దాటి విదేశాలకు కూడా ఇక్కడ ఓళిగ వెళ్లి చేరుతుందంటే అది ఎంత ఫేమసో దానికి ఉన్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు,ఇంతకీ ఏమిటా ఓళిగ ఎక్కడ తయారుచేస్తారు అనే కదా.. రీడ్ దిస్.
- Sudhir Chappidi
- Updated on: Dec 2, 2025
- 9:41 pm
Kadapa: ఈ చిన్ని చేతులు అద్భుతాన్ని చేశాయ్.. పిల్లాడు చేసిన పనికి ప్రొద్దుటూరు మురిసింది
అంతేకాకుండా పట్టణంలోని మురికి కాలువలకు అన్నిచోట్ల కంచెలు ఏర్పాటు చేయాలని కమిషనర్ను ఆ విద్యార్థి కోరడంతో.. స్పందించిన మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకుంటామని ఆ బాలుడికి హామీ ఇచ్చారు. ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలో కాలువలకు పైభాగాన ఎటువంటి కంచె లేకపోవడంతో చాలామంది అనేక సార్లు ఈ మురికి కాలువలో పడిన సంఘటనలు ఉన్నాయి.
- Sudhir Chappidi
- Updated on: Dec 2, 2025
- 1:07 pm
Andhra Pradesh: నేను బతికే ఉన్నా.. నా ఆధార్ కార్డు ఇప్పంచండి మహాప్రభో..!
అన్న చనిపోతే తమ్ముడి ఆధార్ తొలగించారు అధికారులు. అడిగితే ఢిల్లీనో.. హైదరాబాదో వెళ్ళాలంటూ ఉచిత సలహా ఇవ్వడంతో ఓ అభాగ్యుడు తన ఆవేదనను వెళ్ళబుచుకున్నాడు. ఏ పనికైనా ఆధార్ తప్పనిసరి కావడం అతనికి ఆధార్ కార్డు లేక ఏ పని కాకపోవడంతో అధికారుల చుట్టూ కాళ్లు అడిగేలాగా తిరుగుతున్నాడు. తొలగించడమే మా వంతు ఆధార్ కావాలంటే ఢిల్లీలో.. హైదరాబాదో వెళ్ళు అంటూ అధికారులు అతనికి సూచిస్తున్నారు.
- Sudhir Chappidi
- Updated on: Nov 29, 2025
- 6:52 pm
సీతాదేవి దాహం తీర్చిన బావి.. రామయ్య బాణంతో భూమిలో నుంచి పుట్టిన నీటి గొప్పతనమే వేరు!
సీతారామ లక్ష్మణుల గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత విన్నా తక్కువే ఎన్నో కథలు మరెన్నో అనుభూతులు ప్రతి కధకి ఒక కొత్తదనం వస్తుంది అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ చరిత్ర కూడా ఒక ప్రత్యేక అనుభూతిని కలుగజేస్తుంది సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒకచోట సీతాదేవికి దాహం వేస్తే అక్కడ ఎటువంటి కొలను లేకపోతే రాములవారు తన బాణాన్ని భూమిలోకి సంధించి నీటిని పొంగించి సీతాదేవి దాహం తీర్చారంట ఆ తర్వాత ఆమె తన కోసమే కాకుండా ఇక్కడ ఉండే పశుపక్షాదులు కూడా దాహార్తిని తీర్చుకోవాలని కోరడంతో ఇప్పటికీ ఆ కొలను దేదీప్యంగా నీటితో నిండి ఉంటుంది ..ఇంతకీ అది ఎక్కడ అనుకుంటున్నారా ఈ కథ చదవండి మరి.
- Sudhir Chappidi
- Updated on: Nov 29, 2025
- 6:30 pm
Andhra Pradesh: మోసం చేయడానికి వాళ్లే కావాలి.. సైబర్ క్రిమినల్స్ ఇలా గురి పెట్టారేంటి..?
డిజిటల్ కీటుగాళ్లు కడప జిల్లా పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ వారి వద్ద నుంచి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇప్పటికే కడప జిల్లాలో గతంలో ఒక డిజిటల్ కేసు నమోదు కాగా, ఇప్పుడు మరో కేసు వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ ఫోన్ కాల్స్ చేయడం, సిబిఐ అధికారులం అంటూ వారిని బెదిరించడం, వారి వద్ద నుంచి లక్షలకు లక్షల రూపాయలు దండుకుంటున్నారు.
- Sudhir Chappidi
- Updated on: Nov 29, 2025
- 5:20 pm