AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudhir Chappidi

Sudhir Chappidi

Senior Correspondent - TV9 Telugu

sudhir.chappidi@tv9.com

తెలుగు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడాలో 15 ఏళ్ళ అనుభవం ఉంది . ప్రజాశక్తి విలేకరిగా కెరయర్ ప్రారంభం అయింది .. 2012 లో 10టివి స్టాఫ్ రిపోర్టర్ గా ఎలక్ట్రానిక్ మీడియా కెరియర్ ప్రారంభం . 2016 లో HMTV , 2017లో TV5, 2019 లో AP24X7 లో పనిచేసి 2021 లో TV9 లో అడుగుపెట్టాను .. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధిగా భాద్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
ఘాట్‌ రోడ్డులో దడ పుట్టిస్తున్న చిరుత.. భయాందోళనలో వాహనదారులు..!

ఘాట్‌ రోడ్డులో దడ పుట్టిస్తున్న చిరుత.. భయాందోళనలో వాహనదారులు..!

కడప జిల్లాలోని చిట్వేలు-రాపూరు ఘాట్ రోడ్డులో చిరుతపులి సంచారం వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. రాత్రి వేళల్లో రోడ్డుపై మళ్ళీ మళ్ళీ చిరుత ప్రత్యక్షమవడంతో ప్రయాణికులు జంకుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ తక్షణమే స్పందించి పెట్రోలింగ్ పెంచాలని, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

పసిడిపురి.. తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ధరకు బంగారం ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

పసిడిపురి.. తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ధరకు బంగారం ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలుకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాల్లో ప్రొద్దుటూరుకు ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతో పోలిస్తే ఇక్కడ బంగారం ధర, తరుగు, మేకింగ్ ఛార్జీల్లో వ్యత్యాసం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. భారీ మొత్తంలో ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రొద్దుటూరుకు వస్తుంటారు.

బ్రేకులు ఫెయిల్.. లోయలోకి దూసుకెళ్లిన లారీ! రెప్పపాటులో ఇద్దరు సజీవ దహనం..

బ్రేకులు ఫెయిల్.. లోయలోకి దూసుకెళ్లిన లారీ! రెప్పపాటులో ఇద్దరు సజీవ దహనం..

గువ్వలచెరువు ఘాట్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాయచోటి నుంచి కడపకు వస్తున్న సిమెంట్ లారీ లోయలోకి దూసుకెళ్లి మంటలు చెలరేగడంతో డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ సజీవ దహనమయ్యారు. ఘాట్‌లో సరైన ప్రమాద సూచికలు, మలుపుల హెచ్చరిక బోర్డులు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

నీటిని నమ్ముకునే కంటే సూర్యుడిని నమ్మడం బెస్ట్ అంటున్న అక్కడి రైతులు

నీటిని నమ్ముకునే కంటే సూర్యుడిని నమ్మడం బెస్ట్ అంటున్న అక్కడి రైతులు

రాష్ట్రవ్యాప్తంగా ఎల్ నీనో ప్రభావంతో రైతులంతా క్రాప్ హాలిడే ప్రకటిస్తుంటే రాయలసీమలోని జమ్మలమడుగు నియోజకవర్గ రైతులు మాత్రం వినూత్నంగా ఆలోచించి నీటిని నమ్ముకునే కన్నా సూర్యుని నమ్ముకుంటే మేలని వారి భూములను సోలార్ విద్యుత్ సంస్థలకు లీజుకు ఇస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గంలోని సగం మంది రైతులు ఇదే బాట పట్టారు.

తండ్రిని పట్టించుకోని కొడుకులకు కోర్టు షాక్.. అదిరిపోయే తీర్పు ఇదే!

తండ్రిని పట్టించుకోని కొడుకులకు కోర్టు షాక్.. అదిరిపోయే తీర్పు ఇదే!

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే కుమారులకు కోర్టు గుణపాఠం చెప్పింది. కడప జిల్లాకు చెందిన 88 ఏళ్ల వృద్ధుడు తన ఆస్తిని కొడుకులకు రాసివ్వగా, వారు పట్టించుకోలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించగా, కుమారుల పేరిట ఉన్న ఆస్తి హక్కులను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. సీనియర్ సిటిజన్ల ఆస్తి హక్కుల పరిరక్షణకు ఇది ఒక మంచి ఉదాహరణ.

Andhra: కరువు నేలలో ‘కాస్ట్లీ’ పంట.. రైతు సక్సెస్‌ఫుల్ ప్రయోగం!

Andhra: కరువు నేలలో ‘కాస్ట్లీ’ పంట.. రైతు సక్సెస్‌ఫుల్ ప్రయోగం!

కరువు ప్రాంతంగా పేరున్న పులివెందులలో ఓ రైతు వినూత్న ప్రయోగంతో సత్తా చాటారు. 39 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య డ్రిప్ ఇరిగేషన్‌తో అవకాడో పంటను సాగు చేసి తొలి దిగుబడిలోనే నాలుగు టన్నుల పంటను పండించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ రైతు ప్రయోగాన్ని ప్రశంసించడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.

ఐదునదుల సంగమం .. దక్షిణ కాశీ పుష్పగిరి విశిష్టత ఇదే

ఐదునదుల సంగమం .. దక్షిణ కాశీ పుష్పగిరి విశిష్టత ఇదే

దక్షిణ కాశీగా పిలవబడే పుష్పగిరి పుణ్యక్షేత్రం విశిష్టత ఎంతో అమోఘమైనది .. ఇక్కడ శైవులు వైష్ణవులు ఇద్దరూ కలిసి పూజించే ఏకైక దేవాలయం పుష్పగిరి పుణ్యక్షేత్రం. ఇక్కడ పెద్దలకు పిండ ప్రదానం చేస్తే ఎంతో పుణ్యం , అంతేకాక కాశీకి వెళ్లి పిండ ప్రదానం చేసినంత పుణ్యం ఇక్కడ వస్తుందని నమ్మకం అందుకే దీనిని దక్షిణ కాశీగా పిలుస్తారు.

స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. విద్యార్థులు పేరెంట్స్ ఏం చేశారంటే?

స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. విద్యార్థులు పేరెంట్స్ ఏం చేశారంటే?

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు వారిపై దుర్భాషలాడుతూ, అసభ్యంగా ప్రవర్తిస్తుండటం స్టార్ట్ చేసింది. ఈ విషయం తెలిసిన విద్యార్థుల పేరెంట్స్.. ఇదేంటని ప్రశ్నించడానికి వస్తే వారిపై కూడా దాడికి ప్రయత్నించింది. దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి నిరసనకు దిగిన ఘటన కడప జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

కూత ఘనం.. ఖర్చు మరింత ఘనం! దశాబ్దాలుగా కలివి కోడి కోసం సాగుతున్న వేట

కూత ఘనం.. ఖర్చు మరింత ఘనం! దశాబ్దాలుగా కలివి కోడి కోసం సాగుతున్న వేట

కడప జిల్లా లంకమల అభయారణ్యంలో అరుదైన కలివికోడి (Jerdon’s Courser) కోసం దశాబ్దాలుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. రాత్రివేళల్లో ఎక్కువగా సంచరించే ఈ పక్షి ఆచూకీ కోసం కెమెరా ట్రాప్‌లు, శబ్ద రికార్డింగ్‌లు, ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తున్నా స్పష్టమైన ఆధారాలు మాత్రం దొరకడం లేదు. ఈ అరుదైన పక్షి సంరక్షణ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుండటంతో.. అసలు కలివికోడి మళ్లీ కనిపిస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది.

పులివెందుల బొరుగుల మిక్చర్.. రాయలసీమ రుచికి విదేశాల్లోనూ ఫిదా!

పులివెందుల బొరుగుల మిక్చర్.. రాయలసీమ రుచికి విదేశాల్లోనూ ఫిదా!

పులివెందులలో గత 75 ఏళ్లుగా తయారవుతున్న మిక్చర్ కొండయ్య బొరుగుల మిక్చర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాయలసీమ రుచిని అందించే ఈ మిక్చర్‌కు స్థానికులతో పాటు హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. విదేశాలకు, ముఖ్యంగా అమెరికాకు వెళ్లేవారు ప్రత్యేకంగా ప్యాక్ చేయించుకుని తీసుకెళ్తుండటంతో పులివెందుల బొరుగుల మిక్చర్ అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు తెచ్చుకుంటోంది.

పాపం పెళ్లిపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో ప్రసాదు.. తాళి కట్టే టైంకి సినిమాను మించిన ట్విస్ట్..

పాపం పెళ్లిపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో ప్రసాదు.. తాళి కట్టే టైంకి సినిమాను మించిన ట్విస్ట్..

సాధారణంగా పెళ్లి ఆగిపోవడం సీన్‌లు మనం సినిమాల్లో చూస్తుంటాం. ఎవరో మధ్యలో వచ్చి వివాహాన్ని ఆపేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. పెళ్లిపై ఎన్నో కలలు పెట్టుకున్న వరుడికి చివరి క్షణంలో పెళ్లికూతురు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆంతకూ ఆ పెళ్లిలో ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

బస్సులో పేలిన యాసిడ్ క్యాన్.. కళ్ల మంటలతో ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే!?

బస్సులో పేలిన యాసిడ్ క్యాన్.. కళ్ల మంటలతో ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే!?

కడప ఆర్టీసీ బస్సులో యాసిడ్ క్యాన్ పగలడంతో ప్రయాణికులు తీవ్ర కంటి మంటలతో బాధపడ్డారు. తక్షణమే డ్రైవర్ బస్సు ఆపి, ప్రయాణికులను దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతపురం నుండి కడపకు తరలిస్తున్న ఈ యాసిడ్, ప్రయాణీకుల బస్సులలో ప్రమాదకర పదార్థాల రవాణా ఎంత అపాయకరమో స్పష్టం చేస్తుంది. భద్రతా ప్రమాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.