తెలుగు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడాలో 15 ఏళ్ళ అనుభవం ఉంది . ప్రజాశక్తి విలేకరిగా కెరయర్ ప్రారంభం అయింది .. 2012 లో 10టివి స్టాఫ్ రిపోర్టర్ గా ఎలక్ట్రానిక్ మీడియా కెరియర్ ప్రారంభం . 2016 లో HMTV , 2017లో TV5, 2019 లో AP24X7 లో పనిచేసి 2021 లో TV9 లో అడుగుపెట్టాను .. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధిగా భాద్యతలు నిర్వహిస్తున్నాను.
మానవత్వం చాటుకున్న నేస్తం.. వాహనం ఢీకొని చనిపోయిన కోతికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు
ఈ సృష్టిలో కేవలం మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా గౌరవంగా వీడ్కోలు పొందే హక్కు ఉందని నిరూపించారు కొందరు యువకులు. సమాజంలో మనుషుల మధ్యే మానవత్వం మృగ్యమవుతున్న ఈ రోజుల్లో.. నోరు లేని జీవాల పట్ల అపారమైన ప్రేమను కనబరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కడప జిల్లాకు చెందిన నేస్తం సేవా సంస్థ సభ్యులు. పూర్తి వివరాల్లోకి వెళితే...
- Sudhir Chappidi
- Updated on: May 30, 2026
- 4:04 pm
ఆ ఊళ్లో ప్రతి ఇంట్లో నాగుపాము.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా షెట్పాల్ గ్రామంలో ఎక్కడ చూసినా విషసర్పాలే కనిపిస్తాయి. కానీ అక్కడ ఇప్పటివరకు ఒక్క పాముకాటు మరణం కూడా నమోదు కాలేదు. పాము పేరు చెబితేనే ఎవరైనా భయంతో వణికిపోతారు. కానీ ఆ గ్రామస్తులు మాత్రం పాములతో సహజీవనం చేస్తుంటారు. చిన్న పిల్లలు సైతం వాటితో ఆడుకుంటూ కనిపిస్తారు. పాములు కూడా ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా తమ మానాన తాము తిరుగుతుంటాయి. దశాబ్దాలుగా మనుషులు, పాములు ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్నారు.
- Sudhir Chappidi
- Updated on: May 29, 2026
- 5:25 pm
Video: బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతుందా.. చెన్నకేశవుడి పాదాల నుంచి రక్తం..! వీడియో చూడండి..
కలియుగ అంతంపై పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయా? లోకంలో పాపాలు పెరిగిపోయినప్పుడు దేవుడే ప్రత్యక్షంగా హెచ్చరికలు పంపుతాడా? అంటే అవుననే అంటున్నారు తిరుపతి జిల్లా నాగవరం గ్రామస్తులు. అక్కడ వెలసిన పురాతన ఆలయంలో స్వామివారి పాదాల నుంచి ఎర్రటి ద్రవం బయటకు వస్తుండటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు ఆ ఆలయంలో ఏం జరుగుతోంది? తెలుసుకుందాం..
- Sudhir Chappidi
- Updated on: May 28, 2026
- 4:54 pm
Andhra News: ఉరుములు, మెరుపులతో జోరు వర్షం.. ఒక్కసారిగా ఇంటిపై పడిన పిడుగు.. ఇదిగో వీడియో
ఓవైపు తెలుగురాష్ట్రాలపై సూర్యుడు నిప్పులు కక్కుతుంటే.. మరోవైపు ఆకాల వర్షాలు ప్రజలను ఆగమాగం చేస్తున్నాయి. తాజాగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో పిడుగుపాటులో కూడిన వర్షాలు జనాల మనుగడను దెబ్బతీశాయి. ఓ ఇంటిపై పిడుగు పడడంతో ఇల్లు మొత్తం కాలిపోయింది. కానీ అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
- Sudhir Chappidi
- Updated on: May 27, 2026
- 5:33 pm
క్రేన్నే బోల్తా కొట్టించిన గ్యాస్ ట్యాంకర్.. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే?.. ఇదిగో వీడియో
కడప జిల్లా గువ్వలచెరువు ఘాట్ వద్ద వరుస ప్రమాదాలకు స్థానికులకు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గడిచిన 48 గంటల్లో అదే ప్రాంతంలో రెండు గ్యాస్ ట్యాంకర్లు బోల్తా పడడం తీవ్ర కలకలం రేపింది. ప్రమాదం కారణంగా గ్యాస్ లీక్ అవ్వడంతో జనాలు భయంతో పరుగులు పెట్టారు. సమాచారంతో ఘటనా స్థానికి చేరుకున్న పోలీసుల.. లీకేజ్ను ఆపేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
- Sudhir Chappidi
- Updated on: May 27, 2026
- 4:30 pm
భక్తుడిలా గుడిలోకి వచ్చాడు.. గంట కొట్టి దేవుడిని మొక్కాడు.. ఆ తర్వాతే అసలు పని స్టార్ట్ చేశాడు..
ఈజీ మనీకోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు ఏం చేస్తున్నారో కూడా అర్థంగాని స్థితిలో దొంగతనాలకు అలవాటు పడుతున్నారు. తాజాగా దండం పెట్టి దీవించమని కోరాల్సిన దేవుడి గుడిలోనే చోరికి యత్నించారు. గుడిలో హుండీని ఎత్తుకెళ్లేందు ప్రయత్నించి విఫలమయ్యారు. ఎంతప్రయత్నించినా హుండీ రాకపోవడంతో అక్కడి నుంచి పారిపోయారు.
- Sudhir Chappidi
- Updated on: May 25, 2026
- 12:02 pm
కడప పోలీసులా మజాకా..! ఇక గంజాయి బాబుల ఆటలు సాగవు..!
వాహనాల తనిఖీ అంటే కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా డాక్యుమెంట్ల వెరిఫికేషన్ మాత్రమే అనుకుంటే ఇకపై పొరపాటే. మత్తు పదార్థాలు, ముఖ్యంగా గంజాయి సేవించి రోడ్లపైకి వస్తే స్పాట్లోనే తాట తీసేందుకు కడప పోలీసులు సరికొత్త అస్త్రాన్ని రంగంలోకి దించారు. సరికొత్త 'రాపిడ్ డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ కిట్ల'తో రంగంలోకి దిగిన పోలీసులు.. గంజాయి బాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.
- Sudhir Chappidi
- Updated on: May 23, 2026
- 12:03 pm
Andhra: రాజ్యలక్ష్మీ నేను నీతోనే.. భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..
భార్యపై ఉన్న అపారమైన ప్రేమతో కడపకు చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అరుదైన నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్తో భార్య మరణించడంతో ఆమె సమాధి పక్కనే తనకు కూడా ముందుగానే సమాధి నిర్మించించుకున్నారు. మరణానంతరం తనను అదే ప్రదేశంలో ఖననం చేయాలని కుమార్తెలకు చెప్పడమే కాకుండా, అంత్యక్రియల కోసం ముందుగానే డబ్బులు కూడా ఏర్పాటు చేశారు. ఈ దంపతుల అన్యోన్య దాంపత్యం స్థానికంగా అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.
- Sudhir Chappidi
- Updated on: May 19, 2026
- 6:12 pm
నడిరోడ్డుపై చిరుత ప్రత్యక్షం.. వాహనదారులు పరుగులు
కడప జిల్లా లంకమల అటవీ ప్రాంతంలో ఓ చిరుత పులి రహదారిపై కనిపించి వాహనదారులను భయపెట్టింది. ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. సిద్ధవటం రేంజ్లో వన్యప్రాణుల సంచారం పెరిగిన నేపథ్యంలో, అటవీ శాఖ రాత్రి 9 గంటల తర్వాత ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ప్రయాణికులు తమ భద్రత దృష్ట్యా రాత్రిపూట ప్రయాణాలు మానుకోవాలని, నిబంధనలు పాటించాలని హెచ్చరించింది.
- Sudhir Chappidi
- Updated on: May 8, 2026
- 11:43 am
అభయారణ్యంలో అపురూప కట్టడం! బయటపడ్డ శంకువు ఆకారపు బావి.. అసలు రహస్యం ఇదే!
ప్రకృతి ఒడిలో దాగి ఉన్న అద్భుత కట్టడాలు అప్పటి పాలకుల దూరదృష్టికి, కళా హృదయానికి నిదర్శనాలు. అటువంటిదే కడప జిల్లా సిద్ధవటం అటవీ ప్రాంతంలోని లంకమల అభయారణ్యంలో వెలుగుచూసిన పురాతన బావి. మద్దూరు బీట్ పరిధిలోని వరికుంట-చండువాయి మార్గంలో ఉన్న ఈ బావి, తన విశిష్టమైన శంకువు ఆకారంతో చూపరులను ఆకట్టుకుంటోంది.
- Sudhir Chappidi
- Updated on: May 7, 2026
- 6:18 pm
Andhra: మహిళతో హోటల్కు.. శృతిమించిన యవ్వారం.. కట్ చేస్తే, ఆసుపత్రికి పరుగులు
కడప జిల్లా ఒంటిమిట్ట హరిత హోటల్లో పత్రికా విలేకరి నాలుకను మహిళా కొరికిన ఘటన సంచలనం రేపింది. మద్యం మత్తులో రొమాన్స్ అదుపు తప్పడంతో ఈ అఘాయిత్యం జరిగింది. అక్రమాలకు నిలయంగా మారిన ఈ హోటల్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
- Sudhir Chappidi
- Updated on: May 7, 2026
- 6:14 pm
ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే
దేశవ్యాప్తంగా ఎండలు మండుతుండగా, వేడి నుండి ఉపశమనం పొందేందుకు కోతులు నీటి గిన్నెలో జలకాలు ఆడుతున్న వీడియో వైరల్ అవుతోంది. మనుషులు ఏసీల్లో ఉంటే, ఈ వానరాలు నీటిలో మునిగి సేదతీరాయి. ఈ వీడియో నెటిజన్లను అలరిస్తోంది. వేసవిలో మూగజీవాలకు నీటిని అందించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఈ వైరల్ దృశ్యం వేసవి తాపానికి జంతువుల పాట్లను గుర్తు చేస్తుంది.
- Sudhir Chappidi
- Updated on: May 7, 2026
- 12:52 pm