తెలుగు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడాలో 15 ఏళ్ళ అనుభవం ఉంది . ప్రజాశక్తి విలేకరిగా కెరయర్ ప్రారంభం అయింది .. 2012 లో 10టివి స్టాఫ్ రిపోర్టర్ గా ఎలక్ట్రానిక్ మీడియా కెరియర్ ప్రారంభం . 2016 లో HMTV , 2017లో TV5, 2019 లో AP24X7 లో పనిచేసి 2021 లో TV9 లో అడుగుపెట్టాను .. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధిగా భాద్యతలు నిర్వహిస్తున్నాను.
కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న పుష్ప ఫేమ్ కేశవ
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కడప అమీన్ పీర్ దర్గాను సెలబ్రిటీలు నిత్యం దర్శించుకుంటూ ఉంటారు. వారి సినిమా విడుదల సమయాలలో, అలాగే ఏదన్నా కొత్త సినిమా ప్రారంభిస్తున్న సమయంలో చాలామంది సినీ తారలు దర్గాను దర్శించు కోవడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఈరోజు పుష్ప సినిమా ఫేమ్ కేశవ ఈరోజు దర్గాను దర్శించుకున్నాడు.
- Sudhir Chappidi
- Updated on: Apr 16, 2026
- 10:10 pm
భార్య కాపురానికి రాలేదని ఫ్రస్టేషన్లో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంత పని చేశాడో..
భార్య కాపురానికి రాలేదనే ఆవేదనతో అదుపు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి… కారుతో రోడ్డుపై భీభత్సం సృష్టించాడు. ఒకేరోజు రెండు చోట్ల ప్రమాదాలకు కారణమై… ఒకరి ప్రాణం తీసి, మరికొందరిని తీవ్రంగా గాయపరిచిన ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది. .. ..
- Sudhir Chappidi
- Updated on: Apr 16, 2026
- 9:16 pm
Andhra Pradesh: ఉపాధి హామీ పనులకు ట్రాక్టర్లో బయలుదేరిన కూలీలు.. కాసేపటికే.. అయ్యో భగవంతుడా..
రెక్కాడితే గాని డొక్కాడని ఆ కూలీలు, ఉపాధి పనుల కోసం ఆశగా బయలుదేరారు. కానీ విధి మరోలా తలచింది. అతివేగం రూపంలో వచ్చిన మృత్యువు ఒకరిని బలితీసుకోగా, మరెంతో మందిని ఆసుపత్రి పాలు చేసింది. తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలో జరిగిన ఈ భయానక ట్రాక్టర్ ప్రమాదంలో ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
- Sudhir Chappidi
- Updated on: Apr 16, 2026
- 2:15 pm
Watch Video: రాత్రంతా సైకిల్ తొక్కుతూ 100 కిలో మీటర్లు వెళ్లిన బాలుడు.. ఎందుకో తెలిస్తే..
ఈ మధ్య కాలంలో చిన్నారు పేరెంట్స్ మాటలను ఏమాత్రం లెక్కచేయట్లేదు. చిన్న మాట అన్న సరే అలక చూపిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కడప జిల్లాలో వెలుగు చూసింది. తండ్రి తిట్టాడని ఓ పిల్లోడు ఏకంగా సైకిల్ వేసుకొని స్కూల్ బ్యాగ్తో రాత్రంతా సైకిల్ తొక్కుకుంటూ దాదాపు 100 కిలోమీటర్లు వెళ్లిపోయాడు. ఆ బాలుడిని వెతికి పట్టుకొని తల్లిదండ్రులకు అప్పజెప్పడానికి పోలీసులకు తలప్రాణం తోకకు వచ్చింది. ఇంతకు ఆ బాలుడు ఎక్కడికి వెళ్లాడో చూద్దాం పదండి.
- Sudhir Chappidi
- Updated on: Apr 15, 2026
- 6:41 pm
వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చిన తండ్రి.. రక్తపుమడుగులో పడి ఉన్న మైనర్ కూతురు..!
ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ బాలికను ఇద్దరు యువకులు అత్యంత పాశవికంగా హతమార్చారు. కడప జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇంట్లో ఒక్కతే ఉన్న సమయంలో ఇద్దరు యువకులు ఆమె వద్దకు వచ్చారు. ఆమె గొంతు కోసి హత్య చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Sudhir Chappidi
- Updated on: Apr 10, 2026
- 5:03 pm
ఏ కాలంలో ఉన్నాం మనం ఇంకా.. ఎటు పోతుంది సమాజం.. తాగుడు కోసం ఇంత దారుణమా?
తండ్రి తాగుడు ఖర్చుల కోసం బిడ్డను విక్రయించాడు. ఈ హృదయవిదారక ఘటన కడప జిల్లా మైదుకూరులో చోటు చేసుకుంది. మైదుకూరు పట్టణం రెవెన్యూ కాలనీలో ఉంటున్న బాల కుమార్ తన రెండు నెలలు బాలుడిని అమ్ముకున్నాడు. తాగుడుకు బానిసై మూడో సంతానమైన రెండు నెలల కుమారుడిని 50 వేల రూపాయలకు విక్రయించాడు.
- Sudhir Chappidi
- Updated on: Apr 1, 2026
- 11:01 am
కొబ్బరి చిప్పతో భిక్షాటన చేసి .. ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధిచేసిన మహానుభావుడు ఎవరో తెలుసా?
అత్యంత ప్రాచుర్యం పొందిన శ్రీ ఒంటిమిట్ట కోదండ రామ స్వామి దేవాలయాన్ని ఓ మహానుభావుడు తన సొంత ఖర్చుతో అది సరిపోక భిక్షాటన చేసిన సొమ్ముతో శిధిలావస్థలో ఉన్న దేవాలయాన్ని మళ్లీ పూర్వ వైభవాన్ని కలిగించేలా మార్చారు... 1920 నుంచి 1922 వ సంవత్సరంలో దాదాపు 3 లక్షల రూపాయల పైచిలుకు డబ్బులు ఖర్చు పెట్టి ఇంగ్లండ్ నుంచి ఇనుప గడ్డర్లను తెప్పించి దేవాలయాన్ని పునర్ నిర్మాణం చేయించాడు, ఆయనే వావిల కొలను సుబ్బారావు.
- Sudhir Chappidi
- Updated on: Mar 31, 2026
- 8:17 pm
Ontimitta Kalyanam: ఒంటిమిట్టలో రేపే సీతారాముల కల్యాణం.. లక్ష మంది భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రసిద్ధి గాంచిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట మళ్లీ ముస్తాబైంది. శతాబ్దాల చరిత్ర, భక్త రామదాసు కీర్తనల పరవశం కలిగిన శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. లోక కల్యాణం కోసం, నిండు పౌర్ణమి నాటి చల్లని వెన్నెల సాక్షిగా జరగనున్న సీతారాముల కల్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య, ముఖ్యమంత్రి దంపతులు సమర్పించే పట్టువస్త్రాల వేదికగా.. రేపు సాయంత్రం ఒంటిమిట్ట ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోనుంది.
- Sudhir Chappidi
- Updated on: Mar 31, 2026
- 8:05 pm
ఈ చిలుకకు ప్రాణం వచ్చి ఎగిరిపోతే యుగాంతమే.. ఎక్కడో తెలుసా
Sangameswara Temple Kadapa Mystery: కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని శ్రీ సంగమేశ్వర దేవాలయంలో ఒక ఆసక్తికరమైన స్థలపురాణం ఉంది.. సంగమేశ్వర దేవాలయానికి ముందు ఉండే ధ్వజస్తంభంపై చిట్ట చివరన ఒక చిలుక ఉంది. అయితే, ఇక్కడే ఓ పురాణ కథ ఉంది అదేంటో ఇక్కడ చూద్దాం..
- Sudhir Chappidi
- Updated on: Mar 30, 2026
- 8:34 pm
ఒంటిమిట్ట రాములవారికి.. భద్రాద్రి రాములవారి తలంబ్రాలు..!
తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం ఒంటిమిట్టలో నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రభుత్వం అధికారిక పండుగగా జరుపుతోంది. అప్పటి నుంచి భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ సమయానికి, అక్కడి నుంచి గోటితో ఒలిచిన తలంబ్రాలు, ముత్యాలను ప్రత్యేకంగా ఒంటిమిట్టకు పంపించే ఆనవాయితీ కొనసాగుతోంది.
- Sudhir Chappidi
- Updated on: Mar 27, 2026
- 10:05 pm
ఎమ్మెల్యే శ్రీధర్ విషయంలో నాకు న్యాయం జరగకపోతే.. మరో వీడియో వదిలిన హర్షవీణ..
Janasena MLA Arava Sridhar Controversy: నాకు న్యాయం జరగకపోతే మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా.. అంటూ రైల్వేకోడూరు ఎమ్మెల్యే లైంగిక వేధింపుల భాధితురాలు హర్ష వీణ మరో సంచలన వీడియో రిలీజ్ చేసింది. అందులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు వార్నింగ్ ఇవ్వడంతోపాటు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు న్యాయం చేయాలని కోరింది.
- Sudhir Chappidi
- Updated on: Mar 27, 2026
- 6:47 pm
Andhra Pradesh: అమ్మ.. కూల్డ్రింక్ ఇచ్చిందని గుటుక్కున తాగేసిన ముగ్గురు పిల్లలు.. కట్ చేస్తే..!
కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ మధ్య ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి సంఘటన ఇప్పుడు కడప జిల్లా ప్రొద్దుటూరులో కూడా జరిగింది. భర్తతో విభేదాల కారణంగా, నిత్యం ఏదో ఒక కుటుంబ కలహం జరుగుతుంది. దీంతో విసిగిపోయిన ఆ మహిళ, తనతో పాటు ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చింది.
- Sudhir Chappidi
- Updated on: Mar 27, 2026
- 11:18 am