తెలుగు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడాలో 15 ఏళ్ళ అనుభవం ఉంది . ప్రజాశక్తి విలేకరిగా కెరయర్ ప్రారంభం అయింది .. 2012 లో 10టివి స్టాఫ్ రిపోర్టర్ గా ఎలక్ట్రానిక్ మీడియా కెరియర్ ప్రారంభం . 2016 లో HMTV , 2017లో TV5, 2019 లో AP24X7 లో పనిచేసి 2021 లో TV9 లో అడుగుపెట్టాను .. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధిగా భాద్యతలు నిర్వహిస్తున్నాను.
Andhra: ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా..? ఆ పరశురాముడికే ఆశ్రయమిచ్చిన వ్యక్తి..
కడప జిల్లా అత్యరాల పేరుకి వెనుక పురాణం, జానపద విశ్వాసం ముడిపడి ఉంది. పరశురాముడి కథతో అనుసంధానమైన ఈ ప్రాంతంలో ఏకా తాతయ్య గ్రామ రక్షకుడిగా, ధర్మానికి ప్రతీకగా ప్రజల నమ్మకాల్లో నిలిచిపోయారు. పురాణ గ్రంథాల్లో ప్రస్తావన లేకపోయినా, తరతరాలుగా కొనసాగుతున్న విశ్వాసమే ఏకా తాతయ్య క్షేత్రానికి ప్రాణంగా మారింది.
- Sudhir Chappidi
- Updated on: Jan 5, 2026
- 8:22 pm
ఎక్కడా లేదు మన దగ్గరే.. పుష్పగిరిలో అరుదైన కుడ్య శిల్పం.. అంత స్పెషల్ ఏంటంటే..
సాధారణంగా భగవద్గీతకు సంబంధించి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఏ విగ్రహం అయినా కృష్ణుడు నిలబడి అర్జునుడు కూర్చొని ఉన్న విగ్రహాలే దర్శనమిస్తాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కుడ్య శిల్పంలో మాత్రం శ్రీకృష్ణుడు కూర్చుని అర్జునుడు నిలబడి ఉన్నప్పుడు.. అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తున్న సన్నివేశం కనబడుతుంది. ఇది చాలా అరుదుగా కనిపించే శిల్పం ఏపీలో ఆకట్టుకుంటోంది.
- Sudhir Chappidi
- Updated on: Jan 5, 2026
- 9:27 am
Andhra: కలివికోడి కోసం రూ.కోట్లు ఖర్చు చేశారు.. కానీ, పెద్ద స్కామే జరిగింది..
అదో అరుదైన పక్షి.. ఆ పక్షి జాడ అంతరించిపోయిందని పక్షి ప్రేమికులు భావిస్తున్న తరుణంలో.. మళ్ళీ ఆ పక్షి జాడ కనిపించింది.. పక్షి ప్రేమికుల్లో ఆశలు చిగురించాయి.. ఆ పక్షి సంరక్షణ కోసం వందల కోట్లు నిధులు విడుదల చేసింది.. దీన్ని అదునుగా భావించి కోట్లు కాజేసేందుకు ప్లాన్ వేశారు.. అదే ప్రాజెక్ట్ పేరిట మళ్ళీ ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయారు కొందరు నేతలు.. ఈ న్యాయవాదినే బెదిరింపులకు దిగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించడంతో సంచలన వాస్తవాలు వెలుగు చూశాయి..
- Sudhir Chappidi
- Updated on: Dec 28, 2025
- 8:19 pm
ఎంత దారుణం.. అద్దెదారుడి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని యజమాని.. పోలీసుల ఎంట్రీతో..
మానవత్వం మంట కలిసింది.. కనీసం మానవ ధర్మాన్ని పాటించని ఒక ఇంటి ఓనర్ తన ఇంట్లో అడ్డుకుంటున్న వ్యక్తి చనిపోతే అతని మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని సంఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. మనిషి చనిపోయి మృతదేహాన్ని ఇంటికి తీసుకొని వస్తే.. నా ఇంట్లోకి రావద్దు అంటూ అడ్డగించిన ఆ ఇంటి యజమానిపై స్థానికులు మండిపడ్డారు.
- Sudhir Chappidi
- Updated on: Dec 28, 2025
- 6:27 pm
రాయలసీమ గడ్డపై సిద్ధమవుతున్న పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్..!
పులివెందుల ప్రాంతం సంక్రాంతి నాటు కోళ్ల ఎగుమతికి ప్రధాన కేంద్రంగా మారింది. కోడి పందాల కోసం ప్రత్యేకంగా పెంచే ఈ కోళ్లకు భారీ డిమాండ్ ఉంది. సెలమ్, భీమవరం జాతి కోళ్లను ప్రత్యేక ఆహారంతో (మాంసం, గుడ్లు, బాదం) పోషిస్తున్నారు. ఒక్కో కోడి లక్ష రూపాయల వరకు పలుకుతూ, రైతులు, పెంపకందారులకు లక్షల రూపాయల ఆదాయం అందిస్తోంది. ఇది సంక్రాంతి ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది.
- Sudhir Chappidi
- Updated on: Dec 26, 2025
- 12:14 pm
Punugu Pilli: పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి..దీని ప్రత్యేకత ఏంటో తెలిస్తే..
కడప జిల్లా పులివెందులలో అరుదైన పునుగుపిల్లి కనిపించడం సంచలనం సృష్టించింది. తిరుమల శ్రీవారికి జరిగే తైలాభిషేకానికి ఈ పునుగుపిల్లి తైలమే వాడతారని ప్రతీతి. నల్లమల అటవీ ప్రాంతానికే పరిమితమైన ఈ అరుదైన జీవి, రైతు ఏర్పాటు చేసిన బోనులో పడింది. దీనిని అటవీ అధికారులకు అప్పగించగా, పునుగుపిల్లి సంరక్షణపై ఆశలు రేకెత్తుతున్నాయి.
- Sudhir Chappidi
- Updated on: Dec 26, 2025
- 11:38 am
నాగమ్మ తల్లి ఉనికికి నిదర్శనం.. 44 ఏళ్లుగా పూరి గుడిసెలో గుట్టలా పెరిగిన పాముల పుట్ట..
నాగుల చవితికి మినహా మిగిలిన సమయాలలో పాము పుట్టకు ఎవరూ పూజలు చేయరు.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వ్యక్తి 44 సంవత్సరాలుగా తన ఇంటిలో పాము పుట్టకు నిత్యం పూజలు చేస్తూ ఆ పుట్టనే దైవంగా కొలుస్తూ ఉన్నాడు.. 1981లో చిన్న పుట్టగా ఇంటిలో ఏర్పడిందని ఇప్పుడు 10 అడుగుల వరకు ఈ పుట్ట ఉంటుందని ఆ పుట్టకు పూజలు చేసే వెంకయ్య అంటున్నాడు.
- Sudhir Chappidi
- Updated on: Dec 22, 2025
- 2:05 pm
హరిహరులు ఒకేచోట కొలువైన క్షేత్రం.. శతాబ్ధాల చరిత గల ఆధ్యాత్మిక ఝరి.. ప్రత్యేకమేంటంటే..!
శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం విరాజిల్లుతుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని మధ్య అహోబిలం అనీ, శైవులు దీనిని మధ్య కైలాసం అని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.
- Sudhir Chappidi
- Updated on: Dec 21, 2025
- 3:27 pm
పోలీస్ స్టేషన్లో దొంగలు పడ్డారు.. బైక్ మాయం.. ! అసలు విషయం ఏంటో తెలిస్తే..
అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులో పట్టుబడిన ద్విచక్ర వాహనం మాయమైంది. మూడు నెలలైనా బైక్ ఆచూకీ లేదు, పోలీసులు మౌనంగా ఉన్నారు. పోలీసులు దొంగకు సహకరించారా లేదా విక్రయించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల జోక్యం, సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- Sudhir Chappidi
- Updated on: Dec 20, 2025
- 7:57 pm
Andhra: హంతకుడిని పట్టించిన సూపర్ డాగ్ సోను.. క్రైం స్టోరీని మించిన సీన్..
కడప నగర పరిధిలోని స్వరాజ్ నగర్లో ఈ నెల 11వ తేదీన ఒక ఆన్ఐడెంటిఫైడ్ బాడీ.. రిమ్స్ ఆసుపత్రి పరిధిలోని చెరువులో కనబడింది. అయితే అది హత్యా..? లేక ఆత్మహత్యా..? అసలు ఆ వ్యక్తి ఇక్కడ వ్యక్తేనా అనే అనుమానాలతో పోలీసులు ఈ కేసును నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు..
- Sudhir Chappidi
- Updated on: Dec 18, 2025
- 3:22 pm
Andhra: అద్భుతం.! 108 అడుగుల జాంభవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా.?
కడప నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో ఉన్న ఈ ఆలయాన్ని అంగరంగ వైభవం గా తీర్చి దిద్దడానికి టీటీడీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈఏడాది ఏప్రిల్ 11వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో జరిగే కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..
- Sudhir Chappidi
- Updated on: Dec 18, 2025
- 1:22 pm
Watch Video: అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!
కష్టపడి పని చేయలే గాని అనేక ఆలోచనలతో ముందుకు సాగిపోవచ్చు.. మనం చేసే వ్యవసాయ పనుల్లో కూడా కాస్త బుర్రకు పదును పెడితే కష్టమైన పనులను కూడా సాఫీగా సజావుగా కొనసాగించవచ్చు. ఇందుకు నిదర్శనమే మనం ఇప్పుడు తెలుసుకోబోయే విషయం. అదేంటో చూద్దాం పదండి.
- Sudhir Chappidi
- Updated on: Dec 18, 2025
- 1:11 pm