తెలుగు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడాలో 15 ఏళ్ళ అనుభవం ఉంది . ప్రజాశక్తి విలేకరిగా కెరయర్ ప్రారంభం అయింది .. 2012 లో 10టివి స్టాఫ్ రిపోర్టర్ గా ఎలక్ట్రానిక్ మీడియా కెరియర్ ప్రారంభం . 2016 లో HMTV , 2017లో TV5, 2019 లో AP24X7 లో పనిచేసి 2021 లో TV9 లో అడుగుపెట్టాను .. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధిగా భాద్యతలు నిర్వహిస్తున్నాను.
ఈ చిత్రం వెనక ఉన్న చరిత్ర గురించి మీకు తెలుసా? .. ఇది ఎక్కడుందంటే?
రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిన తర్వాత రామేశ్వరం దగ్గర నుంచి శ్రీలంక వెళ్లేందుకు శ్రీరాముడు సముద్రాన్ని దాటాల్సి వచ్చింది. అయితే అప్పుడు శ్రీరాముడు సముద్రుడిని దారి ఇవ్వాలని కోరగా అక్కడికి వచ్చింది శ్రీరాముడు అని తెలియక సముద్రుడు శ్రీరాముడిని హేళన చేస్తాడంట. అప్పుడు శ్రీరాముడు సముద్రునికి గర్వభంగాన్ని కలిగిస్తాడు అనేది పురాణాలలో చెబుతుంది. ఇప్పుడు అందుకు సంబంధించిన ఓ శిల్పం వైరల్గా మారింది. ఇంతకు అదెక్కడుందో తెలుసుకుందాం పదండి.
- Sudhir Chappidi
- Updated on: Feb 17, 2026
- 9:59 pm
రూ.33 లక్షలకు రూ.50 లక్షల ట్రాన్సాక్షన్.. అబ్బ.. పంట పండిందిలే అనుకున్నాడు.. కట్ చేస్తే..
ఇచ్చిన అమౌంట్కి డబుల్ మనీ అంటూ కేటుగాళ్లు ఓ వ్యక్తిని బురిడీ కొట్టించారు.. తీరా 33 లక్షలకి టోకరా వేశారు.. తీరా ఆన్లైన్లో డబ్బులు జమ కావడం లే..దు అంటూ ఖాళీ పేపర్ బండిల్స్ ఇచ్చి అక్కడ నుంచి ఉడాయించారు.. తీరా బ్యాగ్ చూసి మోసపోయానని గమనించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు..
- Sudhir Chappidi
- Updated on: Feb 11, 2026
- 1:33 pm
Andhra: అందుకే పవన్ను కలవాలనుకుంటున్నా.. ఎమ్మెల్యే శ్రీధర్-వీణ ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్..
రైల్వే కోడురు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు.. హర్ష వీణ మరో వీడియో విడుదల చేసి.. ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన విషయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేసింది.. వ్యక్తిగత అంశాన్ని కావాలనే కొందరు రాజకీయాలు చేస్తున్నారంటూ వీడియోలో చెప్పింది.
- Sudhir Chappidi
- Updated on: Feb 8, 2026
- 7:09 pm
Watch: రాత్రికి రాత్రే అమ్మవారి టెంపుల్ను కూల్చేసిన అటవీశాఖ అధికారులు.. స్థానికులు ఏం చేశారంటే?
ప్రొద్దుటూరులో అడవి శాఖ అధికారులు రాత్రికి రాత్రి వారాహి అమ్మవారి దేవాలయాన్ని కూల్చడం తీవ్ర కలకలం రేపింది. ఇది స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం రేకెత్తించింది. అంతేకాకుండా విగ్రహాలను ఎలా పడితే అలా జెసిబితో నెట్టి వేయడంతో అవి చెల్లాచెదురుగా పడడిపోయాయి. దీంతో వారు మరింత ఆగ్రహించి నిరసనకు దిగారు. దీంతో అటవీశాఖ, రెవెన్యూ అధికారులు వారికి నచ్చజెప్పి ధర్నాను విరమింపచేశారు.
- Sudhir Chappidi
- Updated on: Feb 6, 2026
- 7:40 pm
మరో ఇద్దరమ్మాయిలతో ఆ యవ్వారం.. 1000 వీడియోలున్నాయ్.. MLA శ్రీధర్పై మరో బాంబ్ పేల్చిన వీణ
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది.. రోజుకో ఎపిసోడ్ బయటికి వస్తుంది నిన్నటి వరకు తనను లైంగికంగా వేధించాడు అని ఆరోపించిన హర్ష వీణ.. ఈరోజు అరవ శ్రీధర్ వ్యవహారంలో ఒక అడుగు ముందుకేసింది. మరో ఇద్దరు అమ్మాయిలతో సంబంధం ఉంది అని చెబుతూ వారితో చేసిన చాటింగ్ లను బయటపెట్టింది.
- Sudhir Chappidi
- Updated on: Feb 6, 2026
- 6:49 pm
Andhra: మరీ ఇలా ఉన్నారేంటప్పా.. 1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్కు జేసీబీతో వెళ్లిన అధికారి.. కట్చేస్తే..
ఒక టీ షాపులో వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని ఓ మున్సిపల్ అధికారి ఆవేశంతో ఊగిపోయారు. అరగంటలో ప్రోక్లైన్తో అక్కడికి వచ్చారు. షాపు ముందు ఉన్న ర్యాంపు తొలగించడానికి ప్రయత్నం చేశారు. అంతే సీన్ అంతా ఒక్కసారిగా రివర్స్ అయింది. అసలు ఏం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం..
- Sudhir Chappidi
- Updated on: Feb 6, 2026
- 5:59 pm
Andhra: ఓరి పిచ్చోడా.. చేతులారా ప్రాణాలు పోగుట్టుకున్నావ్.. రీల్స్ చేస్తుంటే యముడే షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. వీడియో
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి రీల్స్ పిచ్చి పెరిగిపోయింది. ముఖ్యంగా యువత రీల్స్ చేసే పనిలో పడి వారి ప్రాణాలు కోల్పోతున్నారు.. బైక్ లను నడిపి భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి కుటుంబానికి చేదు జ్ఞాపకాలు మిగుల్చుతున్నారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి.. ఏపీలో కలకలం రేపింది..
- Sudhir Chappidi
- Updated on: Feb 5, 2026
- 12:14 pm
Kadapa: సచ్చినోడు.. రిటైర్మెంట్కు దగ్గరపడ్డాడు.. పాపం ఆ పాప ఇంటికి వెళ్లి ఏడుస్తూ..
కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో నాలుగో తరగతి విద్యార్థినిపై మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. బాధిత చిన్నారి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ..
- Sudhir Chappidi
- Updated on: Feb 2, 2026
- 7:45 pm
బయటపడ్డ ట్రావెల్ ఏజన్సీ మోసం .. టీవీ 9 చొరవతో స్వదేశానికి శ్రీలంకలో చిక్కుకున్న కడప జిల్లావాసులు..!
ప్రశాంతంగా ఆహ్లాదాన్ని ఆస్వాదించేందుకు టూర్లకు వెళుతూ ఉంటారు. అందులోనూ కొంచెం సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారింది. అలాంటిది దీనిని అలుసుగా తీసుకుంటున్న కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు టూరిస్టులను మోసం చేసే పనిలో పడ్డాయి.
- Sudhir Chappidi
- Updated on: Feb 2, 2026
- 7:37 pm
Viral: మలంతో లక్షల్లో సంపాదన.. దేనికి వాడుతారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
కొత్తగా ఆలోచిస్తే డబ్బు సంపాదనకు మార్గాలు అపారం. కెనడాకు చెందిన 20 ఏళ్ల యువకుడు తన మల నమూనాలను విక్రయించి గతేడాది రూ. 3.4 లక్షలు సంపాదించాడు. సరదాల కోసం కాక, ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వందల మంది ప్రాణాలను కాపాడాడు. ఈ ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియలో దాత ఎంపిక చాలా కఠినం.
- Sudhir Chappidi
- Updated on: Jan 31, 2026
- 5:53 pm
Kadapa: పొట్టలోకి దూసుకెళ్లిన తారాజువ్వ.. బయటకొచ్చిన పేగులు..
కడప నగరంలో శ్రీరాముని శోభాయాత్ర సందర్భంగా జరిగిన బాణాసంచా ప్రమాదం కలకలం రేపింది. సెవెన్ రోడ్స్ సర్కిల్ వద్ద కాల్చిన బాణాసంచా పక్కనే విధులు నిర్వహిస్తున్న హోటల్ సెక్యూరిటీ గార్డ్ హరీకి తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. కడుపు భాగంలో తీవ్రంగా గాయపడిన హరిని వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స నిర్వహించారు.
- Sudhir Chappidi
- Updated on: Jan 23, 2026
- 10:43 pm
కనుమరుగవుతున్న ప్రపంచంలోనే అతి పెద్ద ముగ్గురాయి నిక్షేపాలు.. మంగంపేట బెరైటీస్ మైన్స్ ఇక లేనట్టేనా..?
ప్రపంచంలోనే అత్యంత పెద్ద ముగ్గు రాయి నిక్షేపాలు కలిగిన మంగంపేట బెరైటీస్ మైన్స్ ఇక లేనట్టేనా... దాదాపు 5 దశాబ్దాల కాలం భారతదేశానికి బెరైటీస్ ఘనులలో వెన్ను దన్నుగా నిలిచిన ఈ గనుల ప్రాంతం మరో రెండేళ్లలో కనుమరుగైపోతుందా..? ఎన్నో వేలాది మందికి ఉపాధి కల్పించిన ఈ ప్రాంతం కాలగర్భంలో కలిసిపోనుందా..?
- Sudhir Chappidi
- Updated on: Jan 22, 2026
- 6:13 pm