తెలుగు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడాలో 15 ఏళ్ళ అనుభవం ఉంది . ప్రజాశక్తి విలేకరిగా కెరయర్ ప్రారంభం అయింది .. 2012 లో 10టివి స్టాఫ్ రిపోర్టర్ గా ఎలక్ట్రానిక్ మీడియా కెరియర్ ప్రారంభం . 2016 లో HMTV , 2017లో TV5, 2019 లో AP24X7 లో పనిచేసి 2021 లో TV9 లో అడుగుపెట్టాను .. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధిగా భాద్యతలు నిర్వహిస్తున్నాను.
Andhra News: అయ్యో దేవుడా..! ఆడుకుంటూ బయటకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు.. చివరకు..
ముగ్గురు చిన్నారులు.. అల్లారుముద్దుగా మాట్లాడుతూ.. ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ అప్పటివరకు కళ్లముందు కనిపించారు. సడెన్గా.. కనిపించకుండా పోయారు.. ఆడుకుంటూ ఆడుకుంటూ.. ఓ నీటి గుంత దగ్గరకు వెళ్లారు.. అలా వెళ్లిన ముగ్గురు చిన్నారులు కూడా నీటి గుంటలో పడి మృత్యువాత పడ్డారు.. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన చిన్నారులు..
- Sudhir Chappidi
- Updated on: Apr 12, 2025
- 8:45 am
నడి రోడ్డులో స్కూటీపై యువకుల స్టంట్స్.. చివరికి ట్విస్ట్ అదిరింది..!
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో అల్లరి మూకల చేష్టలు పేట్రేగిపోతున్నాయి. వాహనాలతో విన్యాసం.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ప్రస్తుత యువత.. ఆకతాయిగా వ్యవహరించి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. భయంకరమైన స్టంట్లు చేస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా తల్లిదండ్రులకు కొరకరాని కొయ్యగా తయారవుతున్నారు. భయం భక్తి లేకుండా విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు.
- Sudhir Chappidi
- Updated on: Apr 4, 2025
- 9:37 pm
Andhra News: పాపం పెద్దావిడ తిరుపతి వెళ్లేందుకు బస్సు ఎక్కింది.. లీలగా మాయ చేసి..
దొంగతనాలు రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నాయి.. మెడలో చైను లాక్కెళ్ళేది ఒకరైకే.. మాటు వేసి దొంగతనాలు చేసేది మరొకరు.. అయితే ఇక్కడ కొందరు గ్రూపుగా దొంగతనాలు చేస్తూ మహిళలు.. మహిళలనే టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు ... బస్సులో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులా బిల్డప్పులు ఇస్తూ మత్తుమందు వారికి వాసన చూపించి మెడలోని బంగారం అంతా దోచేస్తున్నారు.. ఇలాంటి సంఘటన ఒకటి అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగింది.
- Sudhir Chappidi
- Updated on: Mar 12, 2025
- 3:15 pm
Posani Krishna Murali : పోసాని కృష్ణమురళీకి అస్వస్థత అంతా నాటకమే.. పోలీసుల రియాక్షన్ ఇదే..
తెల్లవారుజామున 5:30 గంటలకు మేజిస్ట్రేట్ పోసాని కృష్ణ మురళిని రిమాండ్కు తరలించవలసిందిగా తీర్పు ఇచ్చారు.. దీంతో పోసానిని రాజంపేట సబ్ జైలుకు తీసుకొని వచ్చారు.. అప్పటినుంచి పోసానికి మోషన్స్ అవుతున్నాయని ఆయనను ములాకత్తులో కలిసిన తన స్నేహితులు మీడియా ముందు తెలిపారు..
- Sudhir Chappidi
- Updated on: Mar 1, 2025
- 9:21 pm
AP News: పొలం పనులు చేస్తుండగా కనిపించిన నల్లటి గుర్తులు.. చెక్ చేయగా ఫ్యూజులౌట్
ఇప్పుడు ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రాంతంలో చిరుత కలకలం అనే వార్తలు వింటూనే ఉన్నాం .. అయితే ఇక్కడ కూడా పులి కనిపించింది కానీ అయితే అది పొలంలో మృతి చెంది కనిపించింది.. ఏమి చేయాలో తెలియని రైతు దానిని గుట్టు చప్పుడు కాకుండా పూడ్చిపెట్టాడు.
- Sudhir Chappidi
- Updated on: Feb 5, 2025
- 9:50 pm
Kadapa: రోజూ సమాధుల దగ్గర గోతులు తవ్వుతున్న ఇద్దరు వ్యక్తులు.. ఏంటని చెక్ చేయగా
గుప్తనిధులు అంటే చాలామందికి పిచ్చి ఉంది. దాని కోసం కోట్ల రూపాయలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దాని మీద ఆశ చావక ఇప్పటికీ గుప్తనిధుల కోసం వెతుకుతున్న వాళ్ళు ఉన్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది కేటుగాళ్లు గుప్త నిధులు ఉన్నాయి అని నమ్మించి లక్షలకు లక్షలకు కాజేసే పనిలో పడ్డారు.
- Sudhir Chappidi
- Updated on: Feb 5, 2025
- 9:41 pm
Andhra News: మాస్టారు బెల్డ్ షాపుల్లో మద్యం తాగుతున్నారా.. ఈ విషయం తెలిస్తే మీ బుర్ర బ్లాంక్
మద్యం ప్రియులు తస్మాత్ జాగ్రత్త... ఏ మందు పడితే ఆ ముందు ... ఎక్కడపడితే అక్కడ కొనుక్కొని తాగేస్తున్నారేమో జర జాగ్రత్త... ఎందుకంటే ఆ మద్యం కంపెనీలో తయారయిందా... కేటుగాళ్లు తయారు చేస్తున్నారా అనేది ముందు తెలుసపకోండి.. ముఖ్యంగా మద్యం షాపులలో కాకుండా బెల్టు షాపులలో అమ్మే మద్యం ఎక్కడి నుంచి వస్తుందో ఆరా తీసి మరి తాగండి లేదా అంతే సంగతులు.. ఇప్పుడు ఈ కథంతా ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా... అక్రమార్కులు సొంతగా మద్యం తయారు చేసేసి... బ్రాండ్ మద్యం లేబుల్స్ సీసాలపై అంటించేసి ... ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడేస్తున్నారు... అందుకే ఇదంతా చెబుతున్నాం. అయితే ఈ అక్రమ మద్యం దారులు ఎక్కడ పట్టుబడ్డారు ఏంటి అనే వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- Sudhir Chappidi
- Updated on: Feb 1, 2025
- 9:51 pm
Andhra News: మగాళ్ల పండుగ. పూజల నుంచి పొంగళ్ల వరకు అంతా మగవారే
అది మగాళ్ల పండుగ. పూజల నుంచి పొంగళ్ల వరకు అంతా మగవారే చేయాలి. ఆడవాళ్లకు ఆలయంలో ప్రవేశం లేదు, ఆవరణ బయట నుంచే దండం పెట్టుకోవడం ఆనవాయితీ. ఈ వింత ఆచారం గురించి తెలియాలంటే అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లెకు వెళ్లాల్సిందే. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...
- Sudhir Chappidi
- Updated on: Jan 12, 2025
- 12:23 pm
Veyyi Nootala Kona: ఆ ప్రాంతానికి కాకి అన్నదే రాదు.. రాములవారి శాప ఫలితం…
త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతముగా అరణ్యవాసం చేస్తున్న సమయంలో ... ఒకరోజు దేవతలంతా కలిసి సీతాదేవిని ఏమన్నా అంటే రాములవారికి కోపం వస్తుందా లేదా అని పరీక్షించడం కోసం ఇంద్రుడి కుమారుడు కాకాసురుడిని కాకి రూపంలో సీతాదేవి వద్దకు పంపిస్తారు... అప్పుడు జరిగిన ఈ కథ సారాంశమే ఇది. అప్పుడు కాకాసురుడు కాకి రూపంలో వచ్చి సీతమ్మవారిని తన ముక్కుతో పొడవడంతో రాములు వారు కాకాసురుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ కథ చదవాల్సిందే.
- Sudhir Chappidi
- Updated on: Jan 4, 2025
- 4:50 pm
Andhra News: న్యూ ఇయర్ ఎంజాయ్మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు ఏం జరిగిందంటే..
శ్రీకాళహస్తి నుంచి వచ్చిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు శేషాచలం అడవులలో వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చారు.. వచ్చినవారు అంతటితో ఆగకుండా అటవీ ప్రాంతంలో తిరుగుతూ.. తిరుగుతూ బయటకు వచ్చే దారిని కనుక్కోలేక అటవీ ప్రాంతంలో దారి తప్పిపోయారు. ఈ ఘటన కలకలం రేపింది..
- Sudhir Chappidi
- Updated on: Jan 4, 2025
- 12:35 pm
Andhra Pradesh: సాగు చేస్తున్న పొలంలోనే ఉరి వేసుకున్న రైతు కుటుంబం.. కన్నీరు పెట్టిస్తున్న నలుగురి మృతి!
అప్పుల భారం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. కడప జిల్లా సింహాద్రిపురం మండలంలో జరిగిందీ విషాదం. 15 ఎకరాలు కౌలుకు తీసుకున్న రైతు, 8 ఏళ్లుగా వివిధ రకాల పంటలు సాగు చేశాడు. అయితే అప్పుల బాధ తాళలేక పొలం దగ్గరే ఉరివేసుకుని రైతు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Sudhir Chappidi
- Updated on: Dec 28, 2024
- 9:02 am
Kadapa: పొలంలో సేద్యం చేస్తుండగా కనిపించిన వింత వస్తువు.. ఏంటా అని రైతులు వెళ్లి చూడగా
ఇక్కడ ఉన్న చిత్రాలలో మీరు చూస్తుంది ఏమిటో గుర్తుపట్టారా.? వాటిని తీక్షణంగా చూడండి. అస్తిపంజరం చేయి.. అలాగే కాలులాగ కనిపిస్తున్నాయి కదా. కానీ అవి అస్తిపంజరం చేయి, కాలు కాదు.. కానీ అవి నేలలో నుంచే వచ్చాయి. సేద్యం చేస్తుంటే రైతులకు కనబడటంతో మొదట భయపడ్డారు. ఆ రైతులు తర్వాత వాటిని తీక్షణంగా చూసి హమ్మయ్యా అనుకున్నారు. ఇంతకీ అవేంటంటే.?
- Sudhir Chappidi
- Updated on: Dec 27, 2024
- 5:38 pm