టీడీపీ

టీడీపీ

తెలుగుదేశం పార్టీ లేదా టీడీపీ ఓ జాతీయ పార్టీ. నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు. రాష్ట్రంలో ఏకపక్షంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆయన టీడీపీని ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టిన కేవలం 9 మాసాల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ. అప్పట్లో ఉమ్మడి ఏపీలోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో 35 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కనిపించినా.. ఏపీలో మాత్రం ఇందిరాగాంధీ జోరుకు ఎన్టీఆర్ బ్రేకులు వేశారు. నాటి లోక్‌సభలో కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్షం కావడం విశేషం.

రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలుతో టీడీపీ పేద, బడుగు వర్గాలకు అత్యంత దగ్గరయ్యింది. 1983లో ఆగస్టు సంక్షోభాన్ని అధిగమించిన ఎన్టీ రామారావు.. 1984లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 200లకు పైగా స్థానాల్లో విజయం సాధించి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ కూటమిని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కూటమి నుంచి వి. పి. సింగ్ ప్రధాని కావడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది.

1994 ఎన్నికల్లో విజయంతో ఎన్టీ రామారావు మూడోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరారం చేశారు. 1995లో లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ రామారావును గద్దె దించి, అధికార పగ్గాలు చేపట్టారు నారా చంద్రబాబు నాయుడు. 1995 నుంచి 2004 వరకు 9 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో టీడీపీ పరాజయంపాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 2019లో ఏపీలో వైసీపీ చేతిలో పరాజయం పాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో క్రమంగా టీడీపీ ప్రభను కోల్పోయింది.

ఇంకా చదవండి

CM Chandrababu: రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం..

ఏపీ అసెంబ్లీ నిరవదికంగా వాయిదా పడింది. మొత్తం అయిదు రోజుల పాటూ నిర్వహించిన సమావేశాల్లో భాగంగా అనేక అంశాలపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీ నోటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర విభజనతో సమస్యలు వచ్చాయన్నారు. గతంలో రూ. 200 పెన్షన్ రూ. 2000కు పెంచామని చెప్పారు. ఈసారి రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పాం.. ఇస్తున్నామని వివరించారు.

  • Srikar T
  • Updated on: Jul 26, 2024
  • 9:53 pm

ఐఏఎస్ సంతకం ఫోర్జరీ.. కష్టాల్లో నగర మేయర్.. ఏం జరిగిందంటే..

నెల్లూరు మేయర్ స్రవంతిని కష్టాలు వెంటాడుతున్నాయి. మేయర్ భర్త ఐఏఎస్ సంతకం ఫోర్జరీ కేసులో నిండాతుడిగా ఉన్నారు. నేడో, రేపో అరెస్టు అన్నట్లుగా ఉంది పరిస్థితి. కష్టాల నుంచి బయటపడేందుకు మేయర్ టీడీపీ ముఖ్యనేతలను కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంతకీ నెల్లూరు మేయర్‎ను అంతలా వెంటాడుతున్న ఆ సమస్యలు ఏంటి.? నెల్లూరు కార్పొరేషన్ గత ఎన్నికల్లో వైసిపి వశమైంది మొత్తం 54 డివిజన్లో క్లీన్ స్వీప్ చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకునే అదృష్టం స్రవంతిని వరించింది.

CM Chandrababu: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరపరిణామం.. నవ్వులు పూయించిన సీఎం చంద్రబాబు..

ఏపీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబునాయుడు..గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై పెట్టిన కేసులను అసెంబ్లీ సాక్షిగా వివరించారు. ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గతప్రభుత్వం పనితీరును సీఎం చంద్రబాబు ఎండగడుతున్నారు. లిక్కర్ పాలసీ విధానంపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ తరువాత రాష్ట్రంలో 2014-2019 మధ్య లా అండ్ ఆర్ఢర్ సజావుగా సాగేదన్నారు. గతం ఐదేళ్లలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదన్నారు.

  • Srikar T
  • Updated on: Jul 25, 2024
  • 3:53 pm

Nara Lokesh: తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ క్లారిటీ.. ఎంతమందికి ఇస్తారంటే..

తల్లికి వందనంపై మంత్రిలోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళ్తుంటే అంతమందికీ ఇస్తామన్నారు.

  • Srikar T
  • Updated on: Jul 24, 2024
  • 3:19 pm

MLA Madhavi Reddy: కడప జిల్లా పోలీసులకే ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. ఏం చేశారంటే..?

కడప జిల్లా పోలీసుల తీరుపై కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మండిపడుతున్నారు. విత్‌ అవుట్ ఇన్ఫర్మెషన్‌ తో గన్‌మెన్లను కుదించడంపై మనస్తాపం చెందారు. అసలు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదంటూ ఉన్న గన్‌మెన్‌లను సైతం వెనక్కి పంపారు ఎమ్మెల్యే మాధవి.

CM Chandrababu: అప్పటి వరకూ కూటమి కలిసే ఉంటుంది.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు..

అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించేవరకు కూటమి కలిసే ముందుకు సాగుతుందన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం ఐదు రోజులు సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. సభకు వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నికల ఫలితాలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Srikar T
  • Updated on: Jul 23, 2024
  • 3:21 pm

ఏపీలో ఫైళ్ల దగ్ధం ఘటనలపై దుమారం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. రంగంలోకి డీజీపీ..

మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో స్పష్టంగా కుట్రకోణం కనిపిస్తోందన్నారు డీజీపీ తిరుమలరావు. ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించడంతో.. క్లూస్‌టీమ్‌, డాగ్‌స్క్వాడ్ సాయంతో ఆధారాల సేకరిస్తున్నారు పోలీసులు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్ కారణం కాదని ప్రాథమికంగా నిర్ధారించారు. కుట్ర కోణంపై డీజీపీ, సీఐడీ చీఫ్‌ ఆరా తీస్తున్నారు. నిన్న అర్ధరాత్రి మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడంతో.. విలువైన రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు, సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి.

  • Srikar T
  • Updated on: Jul 22, 2024
  • 7:40 pm

AP Assembly Sessions 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులంటే.. బీఏసీలో కీలక నిర్ణయం..

అసెంబ్లీ కమిటీ హాలులో బీఏసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలతోపాటూ ఎన్ని రోజులు సభ నిర్వహించాలన్నదానిపై కూడా చర్చించారు. ఈ సమావేశానికి స్పీకర్ తోపాటూ సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఏపీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందకు సిద్దమయ్యారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో జూలై 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది.

  • Srikar T
  • Updated on: Jul 22, 2024
  • 3:53 pm

తిరుపతిలో ఆ స్థానంపై కన్నేసిన టీడీపీ.. ఆయోమయంలో లోకల్ లీడర్లు..

తిరుపతి కార్పొరేషన్. ఎన్నికల ముందు దాకా ఒకే పార్టీది ఆధిపత్యం. తిరుగులేని నాయకత్వం. ఇప్పుడు సీన్ మారింది. 50 డివిజన్‎లు ఉన్న తిరుపతి కార్పొరేషన్‎కు 3 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో పూర్తి మెజారిటీని వైసీపీ సొంతం చేసుకుంది. 49 డివిజన్లకు ఎన్నికలు జరిగితే 48 స్థానాలను వైసీపీ, ఒక్క డివిజన్ లోనే టిడిపి జెండా ఎగుర వేసింది. మేయర్‎గా శిరీష, డిప్యూటీ మేయర్లు‎గా భూమన అభినయ్, ముద్దుల నారాయణ ఎన్నిక అయ్యారు.

AP Assembly: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అసెంబ్లీ వేదికగా అల్లకల్లోలం

ఏపీకి మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. అమరావతిలో ఏర్పడ్డ ఈ వాయుగుండం.. సోమవారం అసెంబ్లీలో తీరం దాటనుంది. దీంతో అటు అధికార పక్షం.. ఇటు విపక్షం పూర్తిగా అలర్ట్‌ అయ్యాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు..వారి బలాబలాలను పూర్తిగా మోహరించాయి. మరి ఈ వాయుగుండం తీవ్రరూపం దాల్చి..తుఫానుగా మారుతుందా..? లేక అల్పపీడనంగా బలహీనపడి తుస్సుమంటుందా..?

AP Politics: ఢిల్లీకి చేరిన గల్లీ రాజకీయం.. పార్లమెంటు వేదికగా టీడీపీ, వైసీపీ బిగ్‌ వార్‌..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుతోంది. కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టేందుకు కొత్త ఫార్ములాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. దీనిపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఇక ఏపీలో వైసీపీ లీడర్లు, కేడర్‌పై జరుగుతున్న దాడులను పార్లమెంటులో ఎండగట్టేందుకు పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్‌ వ్యూహం సిద్ధం చేశారు.

YS Jagan: ఢిల్లీలో నిరాహార దీక్షకు సిద్దమైన వైఎస్ జగన్.. ఈ అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం..

ఏపీలో అధికార ఎన్డీయే కూటమి, విపక్ష వైసీపీల మధ్య పీక్స్‌కు చేరిన పొలిటికల్‌ ఫైట్‌లో ఢిల్లీ ట్విస్ట్‌ ఆసక్తికరంగా మారింది. ఏపీలో అధికార కూటమి వర్సెస్ విపక్ష వైసీపీ పంచాయితీ.. ఇక ఢిల్లీకి చేరనుంది. పార్లమెంటు సమావేశాల కోసం టీడీపీ, వైసీపీ వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి.

  • Srikar T
  • Updated on: Jul 20, 2024
  • 11:15 pm

Watch Video: ఏపీలో ఎడతెరపిలేని వర్షాలు.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

ఏపీలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ అలెర్ట్ అయింది. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

  • Srikar T
  • Updated on: Jul 19, 2024
  • 10:01 pm

Watch Video: తాడిపత్రిలో తనకు శత్రువులే లేరన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. పెద్దారెడ్డిపై కీలక వ్యాఖ్యలు..

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి. పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే.. అసలు సినిమా చూపిస్తానంటూ ఫైర్‌ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్యాక్షన్‌ చేస్తా అంటున్నారు.. ఆయన నుంచి మాకు ప్రాణహాని ఉందంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి.

  • Srikar T
  • Updated on: Jul 19, 2024
  • 8:37 pm

YS Jagan: ఏపీలో రాష్ట్రపతిపాలన పెట్టాలన్న వైఎస్ జగన్.. ఢిల్లీ వేదికగా ధర్నాకు పిలుపు..

వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. బుధవారం ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలతోపాటూ ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనాయకులతో కలిసి ధర్నా చేయనున్నట్లు తెలిపారు.

  • Srikar T
  • Updated on: Jul 19, 2024
  • 6:52 pm
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!