AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ

టీడీపీ

తెలుగుదేశం పార్టీ లేదా టీడీపీ ఓ జాతీయ పార్టీ. నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు. రాష్ట్రంలో ఏకపక్షంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆయన టీడీపీని ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టిన కేవలం 9 మాసాల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ. అప్పట్లో ఉమ్మడి ఏపీలోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో 35 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కనిపించినా.. ఏపీలో మాత్రం ఇందిరాగాంధీ జోరుకు ఎన్టీఆర్ బ్రేకులు వేశారు. నాటి లోక్‌సభలో కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్షం కావడం విశేషం.

రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలుతో టీడీపీ పేద, బడుగు వర్గాలకు అత్యంత దగ్గరయ్యింది. 1983లో ఆగస్టు సంక్షోభాన్ని అధిగమించిన ఎన్టీ రామారావు.. 1984లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 200లకు పైగా స్థానాల్లో విజయం సాధించి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ కూటమిని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కూటమి నుంచి వి. పి. సింగ్ ప్రధాని కావడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది.

1994 ఎన్నికల్లో విజయంతో ఎన్టీ రామారావు మూడోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరారం చేశారు. 1995లో లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ రామారావును గద్దె దించి, అధికార పగ్గాలు చేపట్టారు నారా చంద్రబాబు నాయుడు. 1995 నుంచి 2004 వరకు 9 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో టీడీపీ పరాజయంపాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 2019లో ఏపీలో వైసీపీ చేతిలో పరాజయం పాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో క్రమంగా టీడీపీ ప్రభను కోల్పోయింది.

ఇంకా చదవండి

Chandrababu: ఫోటోలకు ఫోజులిస్తే సరిపోదు..! సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. ఆ 48 మంది ఎమ్మెల్యేలు ఎవరు?

ఇట్స్ హైటైమ్. పార్టీలో ప్రక్షాళనకు ఇదే సరైన సమయం. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు.. డ్యామేజ్ కంట్రోల్ చేసుకోకపోతే దెబ్బైపోతాం.. అని అటెన్షన్‌ మోడ్‌లోకొచ్చినట్టుంది సైకిల్‌పార్టీ. డ్యూటీ మైండెడ్‌గా పనిచేయని 48 మంది అన్యమనస్కులపై ఫోకస్ పెట్టి, దార్లోకి తెచ్చుకోడానికి సిద్ధమైంది టీడీపీ హైకమాండ్. కమిట్‌మెంట్ ఉన్నవాళ్లకే పెద్దపీటలేస్తామని డిసైడైంది.

Nara Lokesh: మధ్యలో అడ్డురావొద్దు.. పక్కకు వెళ్లండి.. పోలీసులపై నారా లోకేష్‌ ఫైర్.. ఎందుకంటే..

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాలెపాటి సుబ్బనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మంత్రి లోకేష్ వెళుతుండగా ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌, ఇతర టిడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

Andhra Politics: జోగి రమేష్‌ అరెస్ట్‌తో ఏపీలో పొలిటికల్ తుఫాన్.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు?

కల్తీమద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్‌తో ఏపీలో పొలిటికల్ తుఫాన్ రేగింది. ఆయన అరెస్ట్ అక్రమం అంటోంది.. వైసీపీ. కక్ష సాధింపేనని వాదిస్తోంది. అయితే.. ఫ్యాన్ పార్టీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది అధికార కూటమి. ఇంతకీ.. ఈ కేసులో నెక్ట్స్ టార్గెట్ ఎవరు?

393 అంబాసిడర్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను మూడు దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కారును పరిశీలించారు. పార్టీ కార్యాలయంలో పార్క్ చేసిన తన 393 నెంబర్ గల అంబాసిడర్‌ను చూసి పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఆ కారుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Chandrababu: సమర్థుడికే పార్టీ పగ్గాలు.. తెలంగాణ టీడీపీపై సీఎం చంద్రబాబు ఫుల్ ఫోకస్.. ఏమన్నారంటే..

సమర్థుడైన నేతకే తెలంగాణలో పార్టీ పగ్గాలు అప్పగిస్తానని పార్టీ నాయకులకు క్లారిటీ ఇచ్చారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు. వీలైనంత త్వరగా కమిటీల నియామకం పూర్తి చేసి, పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని తెలంగాణ నేతలకు చంద్రబాబు సూచించారు.

Andhra Politics: ఆల్మట్టి ప్రాజెక్ట్ అంశంపై ఏపీలో పొలిటికల్ హీట్.. జగన్‌ సంచలన వ్యాఖ్యలు.. మంత్రి నిమ్మల కౌంటర్..

ఆల్మట్టి ప్రాజెక్ట్ అంశంపై ఏపీలో పొలిటికల్ వార్ మొదలైంది. కర్నాటక నిర్ణయంతో ఏపీకి అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వానికి పట్టదా? ప్రాజెక్ట్ ఎత్తు పెంచకుండా అడ్డుకోరా? అని జగన్ ప్రశ్నిస్తోంటే.. వట్టి మాటలు కట్టి పెట్టు అంటూ కౌంటర్ ఇస్తోంది అధికారపక్షం.. దీంతో ఏపీ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి..

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. వెంకటాద్రి నిలయం ప్రారంభం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమాండ్ సెంటర్ ప్రారంభోత్సవం, శ్రీవారి ప్రసాదం తయారీ ప్లాంట్ ప్రారంభం వంటి కార్యక్రమాలు ఈ పర్యటనలో ఉన్నాయి.

  • Phani CH
  • Updated on: Sep 25, 2025
  • 6:44 pm

బుచ్చయ్య తాత.. నారా లోకేష్ సరదా సంభాషణ.. అంకుల్ అంటే బాగుంటుందేమో..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. మండలిలో మాటలు మంటలు రేపితే.. అసెంబ్లీ మాత్రం కాస్త సరదాగా సాగింది. టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్యచౌదరిని తాత అంటూ మంత్రి నారా లోకేష్ ఆప్యాయంగా పిలిచారు. అయితే.. బుచ్చయ్య చౌదరిని అంకుల్ అని పిలిస్తే బాగుంటుందేమోనని సలహా ఇచ్చారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. దీనికి నారా లోకేష్ స్పందించి సరదా వ్యాఖ్యలు చేశారు.

AP Assembly 2025: PPP విధానంపై తగ్గేదే లేదంటున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ అసెంబ్లీలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం అమలు చేస్తున్న PPP విధానంపై చర్చ జరిగింది. వైసీపీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆరోపణలు చేస్తుండగా, సీఎం చంద్రబాబు పారదర్శకతను ప్రతిపాదించి, విధానాన్ని సమర్థించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, PPP ద్వారా వేగవంతమైన నిర్మాణం సాధ్యమవుతుందని వివరించారు.

  • Phani CH
  • Updated on: Sep 24, 2025
  • 12:16 pm

రాజకీయ కక్షపూరిత కేసులపై వాడి వేడి చర్చ.. హోంమంత్రి అనిత రియాక్షన్ ఇదే..

ఏపీ శాసనమండలిలో రాజకీయ కక్షపూరిత కేసులపై వాడి వేడి చర్చ జరిగింది. గత ప్రభుత్వంలో పెట్టిన రాజకీయ కక్షపూరిత కేసులు ఎత్తేయాలని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రభుత్వాన్ని కోరారు. అయితే.. 2019- 24తో పాటు నేటి వరకు ఉన్న తప్పుడు కేసులు కూడా ఎత్తేయాలని వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం అన్నారు.