Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ

టీడీపీ

తెలుగుదేశం పార్టీ లేదా టీడీపీ ఓ జాతీయ పార్టీ. నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు. రాష్ట్రంలో ఏకపక్షంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆయన టీడీపీని ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టిన కేవలం 9 మాసాల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ. అప్పట్లో ఉమ్మడి ఏపీలోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో 35 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కనిపించినా.. ఏపీలో మాత్రం ఇందిరాగాంధీ జోరుకు ఎన్టీఆర్ బ్రేకులు వేశారు. నాటి లోక్‌సభలో కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్షం కావడం విశేషం.

రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలుతో టీడీపీ పేద, బడుగు వర్గాలకు అత్యంత దగ్గరయ్యింది. 1983లో ఆగస్టు సంక్షోభాన్ని అధిగమించిన ఎన్టీ రామారావు.. 1984లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 200లకు పైగా స్థానాల్లో విజయం సాధించి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ కూటమిని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కూటమి నుంచి వి. పి. సింగ్ ప్రధాని కావడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది.

1994 ఎన్నికల్లో విజయంతో ఎన్టీ రామారావు మూడోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరారం చేశారు. 1995లో లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ రామారావును గద్దె దించి, అధికార పగ్గాలు చేపట్టారు నారా చంద్రబాబు నాయుడు. 1995 నుంచి 2004 వరకు 9 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో టీడీపీ పరాజయంపాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 2019లో ఏపీలో వైసీపీ చేతిలో పరాజయం పాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో క్రమంగా టీడీపీ ప్రభను కోల్పోయింది.

ఇంకా చదవండి

CM Chandrababu: అమెరికా వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు.. సీఎం చంద్రబాబు వార్నింగ్‌‌తో సీన్ రివర్స్.. అసలేం జరిగిందంటే..

తానా, ఆటా సంబరాల్లో మునిగి తేలదామని టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు చలో అమెరికా అన్నారు. ఇంతలోనే సీఎం చంద్రబాబు ఇచ్చిన ఝలక్‌తో వాళ్లు తిరుగు టపా కట్టారు. చిల్‌ అవుదామని వెళ్లినవాళ్లకు గుండె ఝల్లుమంది. ఇంతకీ వాళ్లకు చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్‌ ఏంటి?.. ఈ కథనంలో తెలుసుకోండి..

YS Jagan: జడ్‌ ప్లస్‌ ఏది.. మాజీ సీఎంకి ఆ మాత్రం సెక్యూరిటీ ఇవ్వరా?: వైసీపీ చీఫ్ జగన్ సంచలన ప్రకటన

రెంటపాళ్ల పర్యటన సందర్భంగా కారు ప్రమాదంలో వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందిన కేసులో తనను నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో తనకున్న జెడ్ ప్లస్‌ కేటగిరీ భద్రతలో లోపాలున్నాయనే అంశాన్ని మాజీ సీఎం జగన్ మళ్లీ తెరపైకి తెచ్చారు. తన భద్రతపై సీఎం చంద్రబాబుని ప్రశ్నిస్తూ జగన్ ట్వీట్ చేశారు.

Andhra: అట్లాంటి.. ఇట్లాంటి సభ కాదు! రాబోయే నాలుగేళ్లకు రూట్ మ్యాప్.. చంద్రబాబు సర్కార్ నయా స్ట్రాటజీ

సంప్రదాయానికి భిన్నంగా..! వాస్తవానికి దగ్గరగా జూన్‌12న సభ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం. సాధారణ వార్షికోత్సవంలా కాకుండా.. జనం భాగస్వామ్యంతో, అభివృద్ధి ఆశయాలతో జనోత్సవంలా నిర్వహించబోతోంది. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణం దాకా.. కోస్తా నుంచి రాయలసీమ వరకు ఆ రోజు ప్రత్యేకత ప్రతిబింబించేలా సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్‌ పేరుతో వేడుకలు జరిపేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది.

ఏపీ ప్రజలకు తీపికబురు.. ఆ రెండు పథకాలకు డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. త్వరలోనే ఆ రెండు పథకాలను ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జూన్ నెల నుంచి తల్లికి వందనం పథకం అమలులోకి వస్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నాటికి ప్రారంభం కానున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి ఒక పేదవారి ఇంట్లో వంట చేసి, ఆ కుటుంబసభ్యులతో సరదా గడిపారు మంత్రి అనిత.

తెలుగుజాతిని ఉద్దేశిస్తూ, ఆశీర్వదిస్తూ దివంగత నేత ఎన్టీఆర్‌ AI ప్రసంగం..!

టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా మహానాడు వేదికగా నివాళి అర్పించారు చంద్రబాబు. ఎన్టీఆర్‌ జన్మదినం తెలుగు ప్రజలకు పండుగ రోజు అన్నారు. ఇక తెలుగుజాతిని ఉద్దేశిస్తూ,ఆశీర్వదిస్తూ మాట్లాడిన AI ఎన్టీఆర్‌ ప్రసంగం మహానాడులో హైలైట్‌గా నిలిచింది.

క్యాడర్‌ ఎదురుచూస్తున్న సందర్భం రానే వచ్చేసిందా.. కడప నుంచే భవిష్యత్‌కు బాటలు?

శక్తి మార్పిడికి ముందు పెద్ద రాజకీయ యుద్ధమే జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. ఆనాటి రణరంగానికి యువగళం అని పేరు పెట్టి ఉండొచ్చు కొందరు. లేదా.. పార్టీ అధినేత జైల్లో ఉన్నప్పుడు క్యాడర్‌ చెదిరిపోకుండా ఆనాటి ప్రభుత్వంపై చేసిన పోరాటం కావొచ్చు. అదే ఇప్పుడు పవర్‌ ట్రాన్స్‌ఫర్‌కి ఓ కారణం కాబోతోంది అని పార్టీలో జరుగుతున్న చర్చ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటారో.. లేదా ఇప్పుడే ఎందుకు అని అంటారో తెలీదు గానీ.. ఈ మహానాడులో ఏదో ఒక నిర్ణయం అయితే రాబోతోందని చెబుతున్నారు.

మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక.. చంద్రబాబు, లోకేశ్‌కు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్

తెలుగు దేశం పార్టీ నేతలు, శ్రేణులు పెద్ద పండగగా భావించే మహానాడు కడప గడపలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆ తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపనతో మహానాడు వేడుక లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల నుంచి టీడీపీ శ్రేణులు హాజరయ్యారు.

TDP Mahanadu 2025: వారికి శిక్షలు తప్పవు.. ఏపీ అభివృద్ధికి సైనికుడిలా పోరాటం చేస్తా: సీఎం చంద్రబాబు పవర్‌ఫుల్ స్పీచ్

కడప గడపలో అంగరంగ వైభవంగా మహానాడు 2025 ఆరంభమైంది.. ముందుగా.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి పుష్పమాలతో ఘన నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఏపీ ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

TDP Mahanadu: పసుపు పండుగకు వేళాయే..! నారా లోకేష్‌కు కీలక పదవి..? మహానాడు తీర్మానంపై సస్పెన్స్‌..

ఈసారి మహానాడులో 6 తీర్మానాలపై చర్చించనుంది టీడీపీ. దీంతోపాటు మరో సంచలన తీర్మానం కూడా చేయనున్నారా? పార్టీ నేతలు హింట్‌ ఇస్తోంది దాన్ని గురించేనా? మహానాడులో తీసుకోబోయే ఆ మహా నిర్ణయం ఏంటి? చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు.. అనేది ఉత్కంఠగా మారింది.

CM Chandrababu: జూన్ 21న ఏపీలో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని.. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందన్నారు. జూన్ 21న విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారు.

  • Anand T
  • Updated on: May 21, 2025
  • 5:16 pm
100 ఏళ్ల తర్వాత అద్భుతం.. అదృష్టకలగనున్న రాశులివే!
100 ఏళ్ల తర్వాత అద్భుతం.. అదృష్టకలగనున్న రాశులివే!
పాలు పొంగిపోవడం మంచిదికాదా.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే?
పాలు పొంగిపోవడం మంచిదికాదా.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే?
Jioలో దిమ్మదిరిగే ప్లాన్‌..రూ.1958 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ
Jioలో దిమ్మదిరిగే ప్లాన్‌..రూ.1958 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ
ప్రపంచ వింతల వెనక విస్తుపోయే రహస్యాలు.. అపార నిధులన్ని అక్కడే..
ప్రపంచ వింతల వెనక విస్తుపోయే రహస్యాలు.. అపార నిధులన్ని అక్కడే..
ఓ ఇంటి సమీపాన గుప్పుమన్న ఘాటైన వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా..
ఓ ఇంటి సమీపాన గుప్పుమన్న ఘాటైన వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా..
రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ జెట్‌.. పైలట్‌ మృతి!
రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ జెట్‌.. పైలట్‌ మృతి!
రేపే గురుపౌర్ణమి : ఈ నాలుగు రాశుల వారికి అపారమైన ధనప్రాప్తి!
రేపే గురుపౌర్ణమి : ఈ నాలుగు రాశుల వారికి అపారమైన ధనప్రాప్తి!
Terrorists Arrest: బెంగళూరులో ఉగ్ర కుట్ర భగ్నం...
Terrorists Arrest: బెంగళూరులో ఉగ్ర కుట్ర భగ్నం...
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. విద్యా సంస్థలకు సెలవు..
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. విద్యా సంస్థలకు సెలవు..
సగం అటు.. మరోసగం ఇటు.. రెండు రాష్ట్రాలను కలిపే రైల్వేస్టేషన్స్‌!
సగం అటు.. మరోసగం ఇటు.. రెండు రాష్ట్రాలను కలిపే రైల్వేస్టేషన్స్‌!