టీడీపీ

టీడీపీ

తెలుగుదేశం పార్టీ లేదా టీడీపీ ఓ జాతీయ పార్టీ. నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు. రాష్ట్రంలో ఏకపక్షంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆయన టీడీపీని ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టిన కేవలం 9 మాసాల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ. అప్పట్లో ఉమ్మడి ఏపీలోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో 35 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కనిపించినా.. ఏపీలో మాత్రం ఇందిరాగాంధీ జోరుకు ఎన్టీఆర్ బ్రేకులు వేశారు. నాటి లోక్‌సభలో కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్షం కావడం విశేషం.

రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలుతో టీడీపీ పేద, బడుగు వర్గాలకు అత్యంత దగ్గరయ్యింది. 1983లో ఆగస్టు సంక్షోభాన్ని అధిగమించిన ఎన్టీ రామారావు.. 1984లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 200లకు పైగా స్థానాల్లో విజయం సాధించి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ కూటమిని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కూటమి నుంచి వి. పి. సింగ్ ప్రధాని కావడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది.

1994 ఎన్నికల్లో విజయంతో ఎన్టీ రామారావు మూడోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరారం చేశారు. 1995లో లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ రామారావును గద్దె దించి, అధికార పగ్గాలు చేపట్టారు నారా చంద్రబాబు నాయుడు. 1995 నుంచి 2004 వరకు 9 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో టీడీపీ పరాజయంపాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 2019లో ఏపీలో వైసీపీ చేతిలో పరాజయం పాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో క్రమంగా టీడీపీ ప్రభను కోల్పోయింది.

ఇంకా చదవండి

Watch Video: ‘ఏపీలో సంక్షేమ పథకాలు అడ్డుకోవడం దారుణం’.. వల్లభనేని వంశీ

గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాల విషయంలో ఈసీ పక్షపాత ధోరణి అవలంభిస్తోందన్నారు. గత ఎన్నికలకు ముందు పసుపు-కుంకమ పంపిణీకి అనుమతిచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు నాలుగేళ్లుగా నడుస్తున్న స్కీమ్స్‌ నిలిపివేశారని వివరించారు. పేదలను బాధపెట్టడమే చంద్రబాబు లక్ష్యం అని మండిపడ్డారు. ఓటు అనే ఆయుధంతో చంద్రబాబుకు సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో రైతుబంధు పంపిణీకి అనుమతిచ్చారని గుర్తుచేశారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 11:58 am

PM Modi: తెలుగు రాష్ట్రాల్లో మోదీ టూర్.. రోడ్ షోలు, సభలతో ప్రధాని బిజీ షెడ్యూల్

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. పలు ఆంక్షలు విధించారు. నిన్న రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేసిన ప్రధాని మోదీ.. కాసేపట్లో వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కి మద్దతుగా వేములవాడ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. అక్కడి నుంచి వరంగల్‌కు చేరుకుంటారు. లక్ష్మీపూర్‌లో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జన సభలో ప్రధాన మంత్రి మోదీ పాల్గొంటారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 8:09 am

‘తనను ఉండకుండా చేయాలన్నది కూటమి లక్ష్యం..’ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..

ఎన్నికలు సరిగా జరుగుతాయన్న నమ్మకం తగ్గుతోందని, కూటమి నేతలు తనపై కుట్ర చేస్తున్నారంటూ సీఎం జగన్‌ సంచలన కామెంట్లు చేశారు. పథకాల నిధులు పేదలకు చేరకుండా ఆపుతున్నారని ఆయన ఆరోపించారు. ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తున్నారని, తనను ఉండకుండా చేయాలన్నదే కూటమి లక్ష్యమన్నారు సీఎం.

AP Politics: ఏపీలో పొలిటికల్‌ బీపీ పెరుగుతోందా? మోదీ సభలపై వైసీపీ రియాక్షన్‌ ఏంటి?

ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీలో అజెండాలు మారిపోతున్నాయి.. అధికారులపై ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. ఇక ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షాలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజధానుల నుంచి పోలవరం దాకా మళ్లీ ఎన్నికల అంశాలుగా మారాయి.

AP Elections 2024: ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్ ఇదే..

కూటమి కోసం సారొస్తున్నారు. ఇవాళ రాజమండ్రి, అనకాపల్లికి మోదీ వస్తున్నారు. ఆయన రాకతో క్లైమాక్స్‌లో కాక పెంచాలని కూటమి ప్లాన్‌ చేసింది. ఏపీలో మోదీ సభలు, రోడ్‌ షోలకు భారీగా ప్లాన్‌ చేసింది. మే 6, 8 తేదీల్లో కూటమి తరపున ప్రచారంలో మోదీ పాల్గొంటారు. ఏపీపై బీజేపీ ఫోకస్‌ పెంచింది. ఏపీ ఎన్నికల ప్రచారం చివరి చరణంలో మోదీ రాక వేడి పుట్టిస్తోంది. కూటమి కోసం ప్రచారం చేయడానికి ఏపీ వస్తున్నారు మోదీ. ఇవాళ రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. 8వ తేదీన రాజంపేట పార్లమెంట్‌ స్థానం పరిధిలోని పీలేరులో సభకు మోదీ హాజరవుతారు.

  • Srikar T
  • Updated on: May 6, 2024
  • 6:35 am

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌‎ దుష్ప్రచారంపై కేసు నమోదు.. ఏ1గా చంద్రబాబు, ఏ2గా లోకేష్..

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌‎పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదైంది. చంద్రబాబును ఏ1గా, లోకేష్‌ను ఏ2గా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది సీఐడీ. వీరిద్దరితో పాటు ఐవీఆర్ఎస్‌ కాల్స్‌ చేసిన ఏజెన్సీలపై కూడా కేసు నమోదైంది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై..తక్షణం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది.

  • Srikar T
  • Updated on: May 5, 2024
  • 8:05 pm

‘చంద్రబాబు అవినీతి చూసే జనం తిరస్కరించారు’.. సజ్జల రామమకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు..

అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణల్లో పస లేదన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చెప్పిందే అమిత్ షా చెప్పారన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామన్నారు. డీబీటీ ద్వారా 2 లక్షల 70 వేల కోట్లు ప్రజలకు అందజేశామన్నారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశామన్నారు. ఏ బ్యాంకు లెక్కలు తీసినా అర్థమవుతుందని అన్నారు.

  • Srikar T
  • Updated on: May 5, 2024
  • 5:44 pm

Watch Video: ‘చంద్రబాబు – లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయం’.. లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైసిపి నేత నందమూరి లక్ష్మీపార్వతి. తాడేపల్లి నులకపేట, ప్రకాష్ నగర్ కాలనీలో మంగళగిరి వైసిపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా నారా లోకేష్ పై మండిపడ్డారు. మంగళగిరిలో లోకేష్ ఎంట్రీ తోనే హత్యా రాజకీయాలు మొదలయ్యాయని ఆరోపించారు. దీనికి ఉదాహరణే వెంకటరెడ్డి హత్య అని ఉదాహరించారు. చంద్రబాబు, నారా లోకేష్ హింసా రాజకీయాలకు పాల్పడే వ్యక్తులు అని విమర్శించారు. ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ పాత్ర కీలకం అన్నారు.

  • Srikar T
  • Updated on: May 5, 2024
  • 4:29 pm

‘లేని చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు చంద్రబాబు’.. ల్యాండ్ టైటిలింగ్‎ దుష్ప్రచారంపై ఏపీ మంత్రి స్పష్టత..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. ఏపీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సీఎం జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన నియోజకవర్గ పార్ట ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ రూల్స్ ఇంకా ఫ్రేమ్ కాలేదన్నారు. లేని చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు చెప్తున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను 2019లో నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందని వివరించారు.

  • Srikar T
  • Updated on: May 5, 2024
  • 4:17 pm

Amit Shah: అవినీతి, అక్రమార్కులపై పోరాడేందుకు ఏకమైన బీజేపీ, టీడీపీ, జనసేనః అమిత్ షా

త్వరలోనే అవినీతి, అరాచక ప్రభుత్వం అంతమై ఆంధ్రప్రదేశ్‌లో ఏన్డీయే ప్రభుత్వం కొలువు తీరుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. టీడీపీ, జనసేనతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుందో ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు షా. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో నిర్వహించిన ప్రజాగళం సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ పాల్గొన్నారు.

PM Modi tour: ఈనెల 6, 8న రాష్ట్రానికి ప్రధాని మోదీ.. కూటమి తరపున ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని హెరెత్తిస్తున్నారు అభ్యర్థులు. ఏపీలో కూటమి తరపున మరోసారి ప్రచారం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. మే 6, 8 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటిస్తారని.. కూటమి ప్రధాని మోదీ ప్రచారం చేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు.

Kodali Nani: అప్పుడే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ చేతికి టీడీపీ పగ్గాలు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

'బాబు రావాలి.. జాబు కావాలి'.. ఇది టీడీపీ డైలాగ్. ''బాబు ఓడాలి.. జూనియర్ ఎన్టీఆర్ రావాలి'' ఇది తారక్‌ ఫ్యాన్స్‌ డైలాగ్. గుడివాడ నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఆత్మీయ సమావేశంలో కొడాలి నాని కూడా పాల్గొన్నారు. చంద్రబాబును ఓడిస్తేనే జూనియర్‌ ఎన్టీఆర్‌ చేతికి టీడీపీ పగ్గాలు వస్తాయని సంచలన కామెంట్స్‌ చేశారు. జగన్‌, జూనియర్‌ ఎన్టీఆర్ తనకు రెండు కళ్లన్నారు.

ల్యాండ్ టైటలింగ్‎పై టీడీపీ అసత్య ప్రచారం.. చంద్రబాబుకు సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్..

సజ్జల రామకృష్ణా రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ల్యాండ్ టైటలింగ్‎పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ టీడీపీ ఆరోపణల్ని తిప్పి కొట్టారు. వ్యవస్థల మీద నమ్మకం పోయేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారు అని చెప్పడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు చేయాల్సిన విమర్శలు ఇవేనా అని నిలదీశారు.14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అని విమర్శించారు.

  • Srikar T
  • Updated on: May 4, 2024
  • 7:32 pm

ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంలో టీడీపీపై ఈసీ సీరియస్.. సీఐడీ విచారణకు ఆదేశం..

సీఎం జగన్‎పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీ, సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ భూములు లాక్కుంటారని అబద్ధాలు చెబుతున్నారంటూ వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డితో పాటు విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ స్పందించన ఈసీ టీడీపీపై చర్యలు తీసుకునేందుకు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‎లో ఎన్నికల ప్రచారం రోజు రోజుకు పుంజుకుంటోంది. ఒక వైపు అధికార వైసీపీ తాను చేసిన సంక్షేమం, అభివృద్దిని చూసి ఓటు వేయమని చెబుతోంది.

  • Srikar T
  • Updated on: May 4, 2024
  • 7:01 pm

‘చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం’.. సింహపురి ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్..

నెల్లూరులో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరో 9 రోజుల్లో కురుక్షేత్రం యుద్దం జరగబోతోందన్నారు సీఎం జగన్. ఇవి పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అన్నారు. తనకు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగిస్తానన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపే అన్నారు. చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే అని విమర్శించారు. విలువలు, విశ్వసనీయతకు మరోసారి ఓటేయడానికి సిద్ధమా అని ప్రజలను అడిగారు. చంద్రబాబు హయాంలో చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు.

  • Srikar T
  • Updated on: May 6, 2024
  • 9:59 am