టీడీపీ
తెలుగుదేశం పార్టీ లేదా టీడీపీ ఓ జాతీయ పార్టీ. నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు. రాష్ట్రంలో ఏకపక్షంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆయన టీడీపీని ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టిన కేవలం 9 మాసాల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ. అప్పట్లో ఉమ్మడి ఏపీలోని 42 లోక్సభ నియోజకవర్గాల్లో 35 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కనిపించినా.. ఏపీలో మాత్రం ఇందిరాగాంధీ జోరుకు ఎన్టీఆర్ బ్రేకులు వేశారు. నాటి లోక్సభలో కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్షం కావడం విశేషం.
రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలుతో టీడీపీ పేద, బడుగు వర్గాలకు అత్యంత దగ్గరయ్యింది. 1983లో ఆగస్టు సంక్షోభాన్ని అధిగమించిన ఎన్టీ రామారావు.. 1984లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 200లకు పైగా స్థానాల్లో విజయం సాధించి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ కూటమిని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కూటమి నుంచి వి. పి. సింగ్ ప్రధాని కావడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది.
1994 ఎన్నికల్లో విజయంతో ఎన్టీ రామారావు మూడోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరారం చేశారు. 1995లో లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ రామారావును గద్దె దించి, అధికార పగ్గాలు చేపట్టారు నారా చంద్రబాబు నాయుడు. 1995 నుంచి 2004 వరకు 9 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో టీడీపీ పరాజయంపాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 2019లో ఏపీలో వైసీపీ చేతిలో పరాజయం పాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో క్రమంగా టీడీపీ ప్రభను కోల్పోయింది.
Chandrababu – Tummala: ఆ ఐదు గ్రామాల కోసం.. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ..
ఆ ఐదు గ్రామాల అంశంతో పాటు పలు సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబును కలిసి చర్చించారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వీటితో పాటు పలు ఇతర అంశాలను ఏపీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పెద్దవాగు ప్రాజెక్టు, రైల్వేలైన్లు, నేషనల్ హైవేలపై ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 16, 2026
- 9:22 pm
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. వైసీపీ నిరసన, వాకౌట్.. లైవ్ వీడియో
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. మొదటి రోజు.. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. సభ పనిదినాలు, బడ్జెట్ తేదీలపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి మొదటి వారం వరకు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
- Shaik Madar Saheb
- Updated on: Feb 12, 2026
- 10:38 am
దేశ యువత, పిల్లల భవిష్యత్తు కోసం తెలుగు దేశం పార్టీ కీలక నిర్ణయం..! చట్టంగా మారేనా..?
అరచేతిలో ప్రపంచం ప్రజలకు అందుబాటులోకి ఉన్న ఈరోజుల్లో ఇంటర్నెట్ సామాజిక మాధ్యమాలతో ప్రజలకు కలిగే లాభాలు ఉన్నట్లుగానే నష్టాలు అధికమవుతున్నాయి. పుట్టిన నెలల చిన్నారి మొదలు మొబైల్ ఫోన్లో వీడియోలు చూస్తూ ఆహారం తినే నేటి జనరేషన్లో ప్రధానంగా 16 ఏళ్ల లోపు ఎదుగుతున్న పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం చాలా ప్రమాదకరంగా మారింది.
- Gopikrishna Meka
- Updated on: Feb 11, 2026
- 10:05 am
Andhra Pradesh: హెల్దీ-వెల్దీ-హ్యాపీ.. అడుగులు పడుతున్నాయా..? ఏపీ డేటా కంప్లీట్ పిక్చర్ ఏం చెబుతోంది..
'స్వర్ణాంధ్ర-2047'కి పది సూత్రాలు. ఇదే అంశంపై మంత్రులు, అధికారులతో పెద్ద డిస్కషనే జరిగింది. ఆ సుదీర్ఘ సమావేశంలో ఎన్నో అంశాలు వచ్చినా.. కొన్ని టాపిక్స్ ఇంట్రస్టింగ్గా అనిపించాయి. అందులో ఒకటి పాప్యులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. మొన్నామధ్య ఆర్బీఐ ఓ రిపోర్ట్ ఇచ్చింది. అందులో అత్యంత చర్చనీయాంశమైన విషయం.. జనాభా సంక్షోభం..
- Shaik Madar Saheb
- Updated on: Feb 10, 2026
- 9:50 pm
సీఎం చంద్రబాబు చొరవతో స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్ళకు ‘వెలుగు’లోకి వచ్చిన గ్రామం..!
స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిన తరువాత నల్లమల అటవీ ప్రాంతం మారుమూల పల్లె పాలుట్ల గిరిజన తండాలో సోలార్ విద్యుత్ కాంతులు విరజిమ్మాయి... దశాబ్దాలుగా చీకట్లోనే మగ్గుతున్న అడవిపుత్రుల కోసం 3 కోట్లతో ప్రతి ఇంటికీ సోలార్ ప్యానెల్స్ అమర్చడంతో గ్రామంలో విద్యుత్ సౌకర్యం ఏర్పడింది..
- Fairoz Baig
- Updated on: Feb 7, 2026
- 8:36 pm
పంచ్కి పంచ్.. సవాల్కి ప్రతిసవాల్..! ఉప్పెనై విరుచుకుపడ్డ నారీ శక్తి !
రాజకీయాల్లో ఉన్నా.. ఉమెన్ పొలిటీషియన్స్ అంటే కాస్త సాఫ్ట్గానే ఉంటారు, అలాగే కనిపిస్తారు. ఒకరిద్దరు ఫైర్ బ్రాండ్స్ తప్పితే. కానీ, పార్టీల్లో శివంగుల్లాంటి మహిళా నేతలు ఇంత మంది ఉన్నారా అని మొదటిసారి తెలిసింది గుంటూరు ఎపిసోడ్తో..! పార్టీ ఆదేశాలతో పనిలే.. మీరెళ్లి మాట్లాడండి అని ఎవరూ ఆర్డర్స్ ఇవ్వలే.. వచ్చేశారంతే మీడియా ముందుకు. గోరంట్లలో ఫ్లెక్సీ రగడ నుంచి మొదలుపెడితే.. పరామర్శల దాకా స్టోరీ ట్విస్టులతో నడిచింది. అలా మలుపు తిరిగిన ప్రతిసారీ.. ఉమెన్ పొలిటీషియన్సే నోటికి పని చెప్పారు. మల్టీ స్టార్ సినిమాలో సోలో పర్ఫామెన్స్ చూపించారు.
- Balaraju Goud
- Updated on: Feb 6, 2026
- 10:05 pm
Andhra Politics: ఘాటెక్కిన గుంటూరు..! ఉమెన్ సెంటిమెంట్స్.. ఫ్యామిలీ ఎమోషన్స్..
'వాళ్లు చేసిన నేరమేంటి'? సింగిల్ పాయింట్ క్వశ్చన్తో గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రశ్నించారు వైఎస్ జగన్. అసలు ఇదంతా జరిగింది.. తిరుమల నెయ్యి వ్యవహారం నుంచే అంటూ మొదలుపెట్టారు జగన్. నెయ్యిలో జంతువుల కొవ్వే కలవలేదని సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి.. చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారానికి దిగి.. పరిస్థితిని దాడులు, కేసులు, అరెస్టుల దాకా తెచ్చారని ఫైర్ అయ్యారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 4, 2026
- 9:54 pm
ఏపీలో ‘మాటల’ మంటలు! దాడుల్లో కులాల ప్రస్తావనలు.. ఏది అనుచితం.. ఏది సముచితం!
ఒకే సినిమాను మళ్లీమళ్లీ చూస్తున్నట్టుంది ఏపీలో పరిస్థితి. ఏపీలో బూతుల దాడులు, భౌతిక దాడులు, ఇళ్లపై దాడులు, పార్టీ ఆఫీసులపై దాడులు.. ఇకపై వెరీ కామనేమో అని జనం అనుకునేంతగా తయారవుతోంది పరిస్థితి. దిష్టిబొమ్మలు మాత్రమే తగలబెట్టే సంస్కృతి ఉండేది కాస్తా.. ఇళ్లు, పార్టీ ఆఫీసులను తగలబెట్టుకునేదాకా వెళ్లింది. కొన్ని వ్యాఖ్యలు.. దాని కారణంగా చెలరేగిన మంటలు.. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. అసలు.. ఎక్కడ మొదలైందీ రచ్చంతా? తెలుగు ప్రజలంతా కళ్లార్పకుండా చూసేంత స్టోరీ ఈ రెండ్రోజుల్లో ఏం జరిగింది?
- Balaraju Goud
- Updated on: Feb 2, 2026
- 9:47 pm
Andhra Pradesh: బీఅలర్ట్.. వైసీపీ ట్రాప్లో పడొద్దు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.. మొన్న అంబటి రాంబాబు, నిన్న జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని, శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ విరుచుకుపడుతోంది. వైసీపీ విమర్శలతో టీడీపీ అధిష్ఠానం అలర్ట్ అయింది.
- Shaik Madar Saheb
- Updated on: Feb 2, 2026
- 4:46 pm
Chandrababu: వాదన వినిపించండి.. నిధులు తీసుకురండి.. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు కీలక భేటీ..
రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలను పార్లమెంట్లో బలంగా ప్రస్తావించాలని టీడీపీ ఎంపీలకు సూచించారు సీఎం చంద్రబాబు. అమరావతి సహా పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సమాలోచనలు జరిపారు. కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలను వినిపించాలని ఆదేశించారు. అలాగే.. అమరావతి, పోలవరం సహా అనేక అంశాలు ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jan 25, 2026
- 9:05 pm
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్ట్ సక్సెస్.. పీక్స్కు చేరిన పొలిటికల్ క్రెడిట్ గేమ్..
ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్ట్ సాకారానికి మరింత చేరువైంది. భోగాపురం ఎయిర్పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయ్యింది. దీనిపై ఓ వైపు సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంటే.. అదే సమయంలో ప్రాజెక్ట్ క్రెడిట్ గేమ్ కూడా మొదలైంది. భోగాపురం ఎయిర్పోర్టుపై అధికార, ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ మధ్య క్రెడిట్ వార్ మొదలు కావడం చర్చనీయాంశంగా మారింది.
- Shaik Madar Saheb
- Updated on: Jan 4, 2026
- 9:40 pm
పార్టీ పదవుల భర్తీ స్పీడప్.. టీడీపీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు.. ఇదిగో లిస్ట్..!.
పార్టీ పదవుల భర్తీని తెలుగుదేశం పార్టీ స్పీడప్ చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైంది. ఇప్పటికే జాబితాను కూడా రెడీ చేసింది. ఆ సమాచారాన్ని ఎమ్మెల్యేలు, జిల్లా నేతలకు ఇప్పటికే పార్టీ పంపించినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో టీడీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది. ఇంతకీ.. పదవులు దక్కబోతున్న ఆ నేతలెవరు?
- Balaraju Goud
- Updated on: Dec 16, 2025
- 10:09 pm