AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ

టీడీపీ

తెలుగుదేశం పార్టీ లేదా టీడీపీ ఓ జాతీయ పార్టీ. నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు. రాష్ట్రంలో ఏకపక్షంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆయన టీడీపీని ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టిన కేవలం 9 మాసాల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ. అప్పట్లో ఉమ్మడి ఏపీలోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో 35 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కనిపించినా.. ఏపీలో మాత్రం ఇందిరాగాంధీ జోరుకు ఎన్టీఆర్ బ్రేకులు వేశారు. నాటి లోక్‌సభలో కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్షం కావడం విశేషం.

రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలుతో టీడీపీ పేద, బడుగు వర్గాలకు అత్యంత దగ్గరయ్యింది. 1983లో ఆగస్టు సంక్షోభాన్ని అధిగమించిన ఎన్టీ రామారావు.. 1984లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 200లకు పైగా స్థానాల్లో విజయం సాధించి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ కూటమిని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కూటమి నుంచి వి. పి. సింగ్ ప్రధాని కావడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది.

1994 ఎన్నికల్లో విజయంతో ఎన్టీ రామారావు మూడోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరారం చేశారు. 1995లో లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ రామారావును గద్దె దించి, అధికార పగ్గాలు చేపట్టారు నారా చంద్రబాబు నాయుడు. 1995 నుంచి 2004 వరకు 9 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో టీడీపీ పరాజయంపాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 2019లో ఏపీలో వైసీపీ చేతిలో పరాజయం పాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో క్రమంగా టీడీపీ ప్రభను కోల్పోయింది.

ఇంకా చదవండి

Andhra: స్వర్ణాంధ్ర దిశగా పన్నెండో అడుగు.. పడుతూ లేస్తూనే ప్రగతి వైపు..!

రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంపై విస్తృత చర్చ జరుగుతోంది. రాజధాని లేకుండా ప్రారంభమైన రాష్ట్ర ప్రయాణం రాజకీయ మార్పులు, పాలనా విధానాల ప్రభావంతో ఎన్నో మలుపులు తిరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అమరావతి పునర్నిర్మాణం, భారీ పెట్టుబడుల ఆకర్షణ, పోలవరం ప్రాజెక్టు పురోగతి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రభుత్వం విజయాలుగా చెబుతోంది.

తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం (జూన్ 12) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. "2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం" పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది.

Nara Lokesh  Diet Plan: నారా లోకేష్ వెయిట్ లాస్ సీక్రెట్: ఏకంగా 30 కిలోలు తగ్గించిన ఆ డైట్ ప్లాన్ మీ కోసం

Nara Lokesh Weight Loss Secret: ఈ రోజుల్లో బరువు తగ్గడం, ఫిట్‌గా మారడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది. మారుతున్న జీవనశైలి, జంక్ ఫుడ్ సంస్కృతి వల్ల ఊబకాయం బారిన పడుతున్న యువత సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సాధించిన శారీరక మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తూ, సరికొత్త ఫిట్‌నెస్ లక్ష్యాలను నిర్దేశిస్తోంది.

  • Phani CH
  • Updated on: Jun 10, 2026
  • 1:33 pm

‘కేటీఆర్‌తో లోకేష్ సరితూగలేరు.. నాయకుడిగా మరింత ఎదగాల్సి ఉంది’: కడియం

టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌ నిర్వహించిన ‘క్రాస్‌ఫైర్’ ఇంటర్వ్యూలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏపీ రాజకీయాలు, తెలుగు దేశం పార్టీ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, నేతలపై స్పందిస్తూ.. నారా లోకేష్ ఇంకా తండ్రి చాటు కుమారుడిగానే ప్రొజెక్ట్ అవుతున్నారని, నాయకుడిగా ఆయన మరింత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

అనుకున్న చోట ఆత్మగౌరవం తగ్గితే.. కటీఫ్ కొట్టి బైటికొస్తేనే.. కింగ్‌సైజ్ లైఫ్..!

నాక్కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది.. ఇది తెలుగునాట పవర్‌స్టార్ సినిమా డైలాగైతే కావొచ్చు. సేమ్‌టైమ్ తమిళనాట అన్నామలై మేనరిజమ్ కూడా అదే. శాలువాలు కప్పించుకోడానికో, ఏదో ఒక కుర్చీ కోసం కుస్తీ పట్టడానికో, ఎమ్మెల్యే ఎంపీ అని కారుకి స్టిక్కర్ అతికించుకోడానికో నేను రాజకీయాల్లోకి రాలేదు.. యంగ్ తమిళనాడును ఆవిష్కరించడానికి, ద్రవిడ బిడ్డలకు బెటర్ లైఫ్ ఇవ్వడానికే వచ్చా..! తనకు టిక్కెట్ నిరాకరించడంపై తన మీదొస్తున్న ఊహాగానాలకు జవాబిస్తూ ఆరునెలల కిందట అన్నామలై ఇచ్చిన ప్రకటన ఇది. పొలిటికల్‌గా ఎదగాలంటే ఏం చేయాలో ఎలా ఉండాలో నాకు తెలుసు, ఎలా మాట్లాడితే జనానికి దగ్గరౌతామన్న క్లారిటీ కూడా ఉంది. ఏ ఒక్క శక్తీ నన్ను, నా పొలిటికల్ మేనరిజాన్నీ మార్చలేరు అన్నప్పుడు అన్నామలై తెగింపును చూసి టోటల్ తమిళనాడుకే ముచ్చటేసింది. ఇప్పటికే గ్రౌండ్‌వర్క్ ప్రిపేర్ చేసుకున్నా.. కొత్త పార్టీ పెట్టుడు పక్కా, పోటీ చేయుడూ పక్కా.. పవర్‌లోకి వచ్చుడూ పక్కా అనే రేంజ్‌లో ఉంది అన్నామలై కటీఫ్ స్టేట్‌మెంట్. తన పొలిటికల్ ఫ్యూచర్‌పై దేశమంతా జరుగుతున్న డిబేట్లకు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు అభినవ ఫైర్‌బ్రాండ్ అన్నామలై. కమలం పార్టీకి రామ్‌రామ్‌ చెప్పి, ఎర్రజెండా ఎగరేసిన ఈ చిచ్చరపిడుక్కి ఇన్‌స్పిరేషన్ ఎవరు? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కూడా ధిక్కరించి ఏం చెయ్యదల్చుకున్నాడు? కొత్త కుంపటిని దిగ్విజయంగా వెలిగించుకునే సత్తా అన్నామలైకు ఉందా?

Andhra Politics: ఆంధ్రా పాలిటిక్స్‌ గురూ.. టాపిక్ ఏదైనా టాప్ లేచిపోవాల్సిందే..!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతోంది.. ఈ తరుణంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.

ఎన్డీఏ పక్షాల కీలక నిర్ణయం.. టీడీపీకి 3, జనసేనకు 1 రాజ్యసభ సీటు ఖరారు!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార ఎన్డీఏ కూటమి పక్షాల కీలక సమావేశం గురువారం (జూన్ 04)న అమరావతిలో జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ, సభల నిర్వహణతో పాటు రాజ్యసభ స్థానాల కేటాయింపుపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తెలంగాణపై టీడీపీ, జనసేన ఫోకస్.. జూన్ 2న హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ కీలక సమావేశం

ఏపీలో పాగా వేసిన టీడీపీ, జనసేన పార్టీలు తమ తర్వాత టార్గెట్‌ తెలంగాణే అంటున్నాయి. గ్రామస్థాయి నుంచే టీడీపీని బలోపేతం చేసేదిశగా చర్యలు తీసుకుంటామని మహానాడు వేదికగా ఆ పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్‌ ప్రకటిస్తే.... జూన్ 2న హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ మీటింగ్ పెట్టడం చర్చనీయాంశమవుతోంది.

తెలుగుజాతి గౌరవం NTRకు ‘భారతరత్న’ ఇవ్వాలి.. మహానాడులో టీడీపీ ఏకగ్రీవ తీర్మానం!

తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (NTR) 103వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నెల్లూరులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకల్లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు.

ఇది మా సంకల్పం.. ఇకపై మహిళలకు 33శాతం సీట్లు ఇస్తాం: మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన

టీడీపీ మహానాడు వేదికగా నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించిన లోకేష్.. మహిళా నాయకత్వమే భారత రాజకీయాల భవిష్యత్తు అని స్పష్టం చేశారు. “ఇది మా సంకల్పం.. ఇది మా కమిట్‌మెంట్” అంటూ చేసిన వ్యాఖ్యలు మహానాడు వేదికను మారుమోగించాయి.

TDP Mahanadu 2026: పసుపు పండగ.. టీడీపీ మహానాడు ప్రత్యక్ష ప్రసారం..

టీడీపీ మహానాడు 2026 మంగళగిరిలో ఘనంగా ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌కు నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1848 క్లస్టర్లలో ఎల్ఈడీ స్క్రీన్లతో మహానాడు ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. రెండు రోజుల మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టనుంది టీడీపీ.

CM Chandrababu: అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఇదిగో వీడియో

కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఆగింది. భార్య భువనేశ్వరితో కలిసి కారు దిగి తాటి ముంజలు అమ్ముతున్న ఓ వ్యాపారి వద్దకు వెళ్లిన చంద్రబాబు.. ముంజలు రుచి చూస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సీఎం దంపతుల సరళత, సామాన్య ప్రజలతో మమేకమైన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.