టీడీపీ
తెలుగుదేశం పార్టీ లేదా టీడీపీ ఓ జాతీయ పార్టీ. నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు. రాష్ట్రంలో ఏకపక్షంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆయన టీడీపీని ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టిన కేవలం 9 మాసాల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ. అప్పట్లో ఉమ్మడి ఏపీలోని 42 లోక్సభ నియోజకవర్గాల్లో 35 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కనిపించినా.. ఏపీలో మాత్రం ఇందిరాగాంధీ జోరుకు ఎన్టీఆర్ బ్రేకులు వేశారు. నాటి లోక్సభలో కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్షం కావడం విశేషం.
రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలుతో టీడీపీ పేద, బడుగు వర్గాలకు అత్యంత దగ్గరయ్యింది. 1983లో ఆగస్టు సంక్షోభాన్ని అధిగమించిన ఎన్టీ రామారావు.. 1984లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 200లకు పైగా స్థానాల్లో విజయం సాధించి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ కూటమిని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కూటమి నుంచి వి. పి. సింగ్ ప్రధాని కావడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది.
1994 ఎన్నికల్లో విజయంతో ఎన్టీ రామారావు మూడోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరారం చేశారు. 1995లో లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ రామారావును గద్దె దించి, అధికార పగ్గాలు చేపట్టారు నారా చంద్రబాబు నాయుడు. 1995 నుంచి 2004 వరకు 9 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో టీడీపీ పరాజయంపాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 2019లో ఏపీలో వైసీపీ చేతిలో పరాజయం పాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో క్రమంగా టీడీపీ ప్రభను కోల్పోయింది.
తెలంగాణపై టీడీపీ, జనసేన ఫోకస్.. జూన్ 2న హైదరాబాద్లో పవన్ కల్యాణ్ కీలక సమావేశం
ఏపీలో పాగా వేసిన టీడీపీ, జనసేన పార్టీలు తమ తర్వాత టార్గెట్ తెలంగాణే అంటున్నాయి. గ్రామస్థాయి నుంచే టీడీపీని బలోపేతం చేసేదిశగా చర్యలు తీసుకుంటామని మహానాడు వేదికగా ఆ పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ప్రకటిస్తే.... జూన్ 2న హైదరాబాద్లో జనసేన అధినేత పవన్ మీటింగ్ పెట్టడం చర్చనీయాంశమవుతోంది.
- Shaik Madar Saheb
- Updated on: May 31, 2026
- 11:00 am
తెలుగుజాతి గౌరవం NTRకు ‘భారతరత్న’ ఇవ్వాలి.. మహానాడులో టీడీపీ ఏకగ్రీవ తీర్మానం!
తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (NTR) 103వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నెల్లూరులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకల్లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు.
- Balaraju Goud
- Updated on: May 28, 2026
- 1:53 pm
ఇది మా సంకల్పం.. ఇకపై మహిళలకు 33శాతం సీట్లు ఇస్తాం: మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన
టీడీపీ మహానాడు వేదికగా నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించిన లోకేష్.. మహిళా నాయకత్వమే భారత రాజకీయాల భవిష్యత్తు అని స్పష్టం చేశారు. “ఇది మా సంకల్పం.. ఇది మా కమిట్మెంట్” అంటూ చేసిన వ్యాఖ్యలు మహానాడు వేదికను మారుమోగించాయి.
- Shaik Madar Saheb
- Updated on: May 27, 2026
- 1:32 pm
TDP Mahanadu 2026: పసుపు పండగ.. టీడీపీ మహానాడు ప్రత్యక్ష ప్రసారం..
టీడీపీ మహానాడు 2026 మంగళగిరిలో ఘనంగా ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కు నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1848 క్లస్టర్లలో ఎల్ఈడీ స్క్రీన్లతో మహానాడు ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. రెండు రోజుల మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టనుంది టీడీపీ.
- Shaik Madar Saheb
- Updated on: May 27, 2026
- 9:43 am
CM Chandrababu: అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఇదిగో వీడియో
కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఆగింది. భార్య భువనేశ్వరితో కలిసి కారు దిగి తాటి ముంజలు అమ్ముతున్న ఓ వ్యాపారి వద్దకు వెళ్లిన చంద్రబాబు.. ముంజలు రుచి చూస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సీఎం దంపతుల సరళత, సామాన్య ప్రజలతో మమేకమైన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Eswar Chennupalli
- Updated on: May 20, 2026
- 5:49 pm
పొదుపు బాటలో టీడీపీ.. ఈసారి ‘డిజిటల్’ మహానాడు.. చంద్రబాబు కీలక నిర్ణయం..!
తెలుగుదేశం పార్టీ (TDP) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వార్షిక పండుగ 'మహానాడు'కు సంబంధించి మీరు అందించిన సమాచారం అటు పార్టీ శ్రేణుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చగా మారింది. ప్రభుత్వపరంగా, పార్టీపరంగా అనవసర ఖర్చులను తగ్గించుకోవాలనే పొదుపు చర్యల్లో భాగంగానే అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ-డిజిటల్, ఆన్లైన్ మహానాడు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
- Balaraju Goud
- Updated on: May 15, 2026
- 8:26 pm
ప్రోటోకాల్ పక్కనబెట్టి.. ముఖ్యమంత్రి ఇంటికి ప్రధాని మోదీ.. సీఎం చంద్రబాబు భావోద్వేగం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అరుదైన, మధురమైన ఘట్టం ఆవిష్కృతమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి విచ్చేసి, వారి కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. ఈ ప్రత్యేక సందర్భంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఎంతో భావోద్వేగంగా స్పందించారు.
- Balaraju Goud
- Updated on: May 10, 2026
- 10:14 pm
హైదరాబాద్ వేదికగా ఏపీ రాజకీయం.. ప్రోటోకాల్ దాటిన స్నేహం.. మిత్రుల ఇళ్లకు మోదీ!
హైదరాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన రాజకీయంగా విస్తృత చర్చకు దారి తీసింది. సాధారణంగా ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్లినా అధికారిక కార్యక్రమాలకే పరిమితం కావడం ఆనవాయితీ. కానీ ఈసారి తెలంగాణ పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలకు మోదీ వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
- Eswar Chennupalli
- Updated on: May 10, 2026
- 7:09 pm
Special Parliament Session: డీలిమిటేషన్.. మహిళా రిజర్వేషన్ల బిల్లు.. మ్యాజిక్ ఫిగర్ను మార్చే టైమ్ వచ్చేసింది..
మ్యాజిక్ ఫిగర్ను మార్చే టైమ్ వచ్చేసింది. దానికి సంబంధించిన తొలి అడుగు మరికొన్ని గంటల్లో పడబోతోంది. బట్.. రాగల 72 గంటల పాటు ఇదే అంశం దేశవ్యాప్తంగా మంటలు పుట్టించబోతోంది. ముఖ్యంగా దక్షిణాదిన. తాము వద్దంటున్న 'ఫార్ములా'నే కేంద్రం ఫైనలైజ్ చేయడంతో ఫుల్ గరం మీదున్నాయి దక్షిణాది రాష్ట్రాలు.
- Shaik Madar Saheb
- Updated on: Apr 16, 2026
- 8:44 am
టెంపుల్ సిటీ తిరుపతిలో మరో వివాదం.. వన్ ప్రాజెక్టుకు భూ కేటాయింపులపై రాజకీయ రచ్చ!
టెంపుల్ సిటీ తిరుపతిలో ఇప్పుడు మరో వివాదంపై రచ్చ నడుస్తోంది. తిరుపతి వన్ ప్రాజెక్టుకు కేటాయించిన 22 ఎకరాల ప్రభుత్వ భూముల వివాదంపై సర్కార్తో వైసీపీ ఢీ అంటే ఢీ అంటోంది. విలువైన భూములను అనుభవం లేని సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టారని, దీని వెనుక వందల కోట్ల అవినీతి దాగి ఉందని వైసీపీ ఆరోపిస్తుంటే, ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని టీడీపీ అంతే బలంగా తిప్పికొడుతోంది
- Balaraju Goud
- Updated on: Apr 3, 2026
- 10:42 am
లోక్సభ ముందుకు ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లు.. మద్దతు పలికిన కాంగ్రెస్, వైసీపీ వాకౌంట్!
అమరావతి చట్టబద్ధతకు మరో కీలక అడుగు పడింది. ఇవాళ బుధవారం (ఏప్రిల్ 01, 2026 ) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత లోక్సభ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు తీసుకువచ్చారు. అయితే లోక్సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.
- Balaraju Goud
- Updated on: Apr 1, 2026
- 1:07 pm
Chandrababu – Tummala: ఆ ఐదు గ్రామాల కోసం.. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ..
ఆ ఐదు గ్రామాల అంశంతో పాటు పలు సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబును కలిసి చర్చించారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వీటితో పాటు పలు ఇతర అంశాలను ఏపీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పెద్దవాగు ప్రాజెక్టు, రైల్వేలైన్లు, నేషనల్ హైవేలపై ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 16, 2026
- 9:22 pm