Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ

టీడీపీ

తెలుగుదేశం పార్టీ లేదా టీడీపీ ఓ జాతీయ పార్టీ. నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు. రాష్ట్రంలో ఏకపక్షంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆయన టీడీపీని ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టిన కేవలం 9 మాసాల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ. అప్పట్లో ఉమ్మడి ఏపీలోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో 35 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కనిపించినా.. ఏపీలో మాత్రం ఇందిరాగాంధీ జోరుకు ఎన్టీఆర్ బ్రేకులు వేశారు. నాటి లోక్‌సభలో కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్షం కావడం విశేషం.

రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలుతో టీడీపీ పేద, బడుగు వర్గాలకు అత్యంత దగ్గరయ్యింది. 1983లో ఆగస్టు సంక్షోభాన్ని అధిగమించిన ఎన్టీ రామారావు.. 1984లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 200లకు పైగా స్థానాల్లో విజయం సాధించి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ కూటమిని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కూటమి నుంచి వి. పి. సింగ్ ప్రధాని కావడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది.

1994 ఎన్నికల్లో విజయంతో ఎన్టీ రామారావు మూడోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరారం చేశారు. 1995లో లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ రామారావును గద్దె దించి, అధికార పగ్గాలు చేపట్టారు నారా చంద్రబాబు నాయుడు. 1995 నుంచి 2004 వరకు 9 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో టీడీపీ పరాజయంపాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 2019లో ఏపీలో వైసీపీ చేతిలో పరాజయం పాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో క్రమంగా టీడీపీ ప్రభను కోల్పోయింది.

ఇంకా చదవండి

AP-Telangana Politics: బుక్‌ చేస్తాం ఖబడ్దార్‌.. ఆ రెండిటి చుట్టూ ఏపీ, తెలంగాణలో రసవత్తర రాజకీయాలు..

తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. బుక్స్‌ మెయింటెయిన్ చేస్తున్నాం బుక్‌ చేస్తాం జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తున్నారు విపక్షనేతలు. ఏపీలో రెడ్‌బుక్‌ పాలనకు జగనన్న 2.0 సర్కార్‌లో రివేంజ్‌ ఉంటుందని వైసీపీ అధినేత ప్రకటించారు. అయితే ఈ బుక్కుల గోల తెలంగాణకు కూడా పాకింది. తమ కార్యకర్తలను వేధిస్తున్నవారి పేర్లను పింక్‌ బుక్‌లో ఎక్కిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది.

Vallabhaneni Vamsi: ప్రత్యర్ధి ఎంతటోడైనా సరే.. మాటకు నో సెన్సార్.. ఎగొట్టిదిగ్గొట్టడమే..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్టు చేశారు. ఈ కేసుతో పాటు మరికొన్ని కేసుల్లోనూ ఆయన నిందితుడుగా ఉన్నారు. వంశీ అరెస్టుపై వైసీపీ, టీడీపీ పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి.

YS Jagan: కూటమి నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు: వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

రాష్ట్రంలో స్కామ్‌లు తప్ప ఏమీ జరగడంలేదని ఆరోపించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి... చట్టవిరుద్ధంగా, అన్యాయాలు చేసేవారెవ్వరినీ తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా వస్తుందని.. నేతలంతా ధైర్యంగా ఉండాలన్నారు. కొన్నాళ్లుగా వేర్వేరు జిల్లాల నేతలతో సమావేశమవుతూ వస్తున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులతో సమావేశమయ్యారు.

Chandrababu: ఈ వేగం సరిపోదు, ఇంకా స్పీడ్ పెంచాలి.. అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాట్సాప్ గవర్నెన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. వారం రోజుల వాట్సాప్ గవర్నెస్ పనితీరుపై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. వారం రోజుల్లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా 2.64 ల‌క్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. త్వరలో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లోకి టీటీడీ, రైల్వే సేవలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. యూజ‌ర్ ఫ్రెండ్లీగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.

CM Chandrababu: ఢిల్లీలో బీజేపీ విజయం చరిత్రాత్మకం.. ప్రతిపక్షహోదా కావాలంటే 10శాతం సీట్లు దక్కాల్సిందే

ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశ ప్రజలందరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారని.. తాజాగా ఢిల్లీ ప్రజలు కూడా మోదీ నాయకత్వాన్ని బలపరిచారని చెప్పారు. ప్యాలెస్‌ల విషయంలోనూ ఏపీ, ఢిల్లీకి పోలికలు ఉన్నాయని.. రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నా.. ఢిల్లీలో శీష్ మహల్‌ కట్టుకున్నా.. వాటిలోకి అడుగుపెట్టలేకపోయారన్నారు.

AP Politics: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏపీ మంత్రులకు ఇచ్చిన ర్యాంకులపై పొలిటికల్ ఫైట్..

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ర్యాంకులపై పొలిటికల్ ఫైట్ కొనసాగుతోంది. ఏపీ మంత్రులకు ఇచ్చిన ర్యాంకింగ్స్‌పై వైసీపీ నేత కామెంట్స్‌ రాజకీయ రగడకు తెరలేపాయి. విపక్షంపై టీడీపీ నేతలు పొలిటికల్ ఎటాక్ మొదలుపెట్టారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.

Andhra Pradesh: మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన కూటమి.. ఐదు టీడీపీ, ఒకటి జనసేన కైవసం..!

తిరుపతి డిప్యూటీ మేయర్‌ సహా పిడుగురాళ్ల , తుని వైస్‌ చైర్మన్‌, నందిగామ, పాలకొండ చైర్‌ పర్సన్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆయా చోట్ల మంగళవారం(ఫిబ్రవరి 4) ఎన్నికలు జరుగుతాయి. జంపింగ్‌లు.. అలకల క్రమంలో ఇక సీన్‌ ఎలా వుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలు మున్సిపాలిటీలను కూటమి కైవసం చేసుకుంది.

Balakrishna: జస్ట్ మిస్.. బాలయ్య చేతి గడియారం ఆగిపోయిందా..? సరిగ్గా అదే సమయంలో..

ప్రతి పనికి మంచి ఘడియలు.. ముహూర్తం.. సమయం చూసుకుని అడుగు బయటకు పెట్టని బాలకృష్ణ చేతి గడియారం ఆగిపోయింది.. ఇది వినడానికి విచిత్రంగానే ఉన్నా.. ఇది మాత్రం కరక్టే.. ఎందుకో ఈ కథనాన్ని ఒక్కసారి చదవండి.. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో ప్రతి నిమిషం ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పిన సమయానికే జరిగింది..

Tirupati: నెగ్గేందుకు కూటమి స్కెచ్.. తగ్గేదీలే అంటున్న వైసీపీ.. ఎవరి ధీమా వారిదే..!

ఒక్కసారిగా తిరుపతిలో వాతావరణం వేడెక్కింది. డిప్యూటీ మేయర్ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కార్పొరేటర్ శేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన భవనాల కూల్చివేత వ్యవహారం చర్చగా మారింది. అనుమతులు లేకుండా, నిషేధిత జాబితాలోని స్థలాల్లో జరిగిన కట్టడాల నిర్మాణాలను అడ్డుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

AP Camp Politics: అటు గుంటూరు.. ఇటు హిందూపురం.. కాకరేపుతోన్న క్యాంపు రాజకీయం!

రాజకీయాలందు ఏపీ రాజకీయాలు వేరయా...! అని మరోసారి రుజువైంది. ఎన్నిక చిన్నదైనా.. రాజకీయం మాత్రం తగ్గేదేలే అన్నట్లుంది. అటు గుంటూరులో మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు.. ఇటు హిందూపురంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక కాక పుట్టిస్తోంది. మరి ఎవరి క్యాంపు పాలిటిక్స్‌ ఫలితాన్నిస్తాయన్నది తెలియాలంటే ఫిబ్రవరి 3వరకు ఆగాల్సిందే..!

ఈ తప్పులు చేస్తే రూ.10 లక్షల జరిమానా.. ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక
ఈ తప్పులు చేస్తే రూ.10 లక్షల జరిమానా.. ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక
హనురాఘవపూడి మూవీలో ఆ పాన్ ఇండియా హీరోయిన్
హనురాఘవపూడి మూవీలో ఆ పాన్ ఇండియా హీరోయిన్
తన అభిమాన హీరోకు రూ.72 కోట్ల ఆస్తిని రాసిచ్చిన వీరాభిమాని వీడియో
తన అభిమాన హీరోకు రూ.72 కోట్ల ఆస్తిని రాసిచ్చిన వీరాభిమాని వీడియో
మహానంది క్షేత్రంలో నాగుపాము ప్రత్యక్షం వీడియో
మహానంది క్షేత్రంలో నాగుపాము ప్రత్యక్షం వీడియో
ఆ ఊళ్లో చెప్పులు అస్సలు వేసుకోరు.. కలెక్టర్‌ వచ్చినా అదే రూల్.. వ
ఆ ఊళ్లో చెప్పులు అస్సలు వేసుకోరు.. కలెక్టర్‌ వచ్చినా అదే రూల్.. వ
ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే రైలుపై రాళ్ల దాడి..అసలేం జరిగిందంటే.. వీడియో
ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే రైలుపై రాళ్ల దాడి..అసలేం జరిగిందంటే.. వీడియో
పెళ్లి ఊరేగింపులో గుండెపోటుతో వరుడు మృతి!
పెళ్లి ఊరేగింపులో గుండెపోటుతో వరుడు మృతి!
హైదరాబాద్ మెట్రో సెకండ్‌ ఫేజ్‌లో సరికొత్త టెక్నాలజీ..!
హైదరాబాద్ మెట్రో సెకండ్‌ ఫేజ్‌లో సరికొత్త టెక్నాలజీ..!
కంగనా కొత్త రెస్టారెంట్‌లో నోరూరించే వంటకాలు..ధరలు ఎలా ఉన్నాయంటే?
కంగనా కొత్త రెస్టారెంట్‌లో నోరూరించే వంటకాలు..ధరలు ఎలా ఉన్నాయంటే?
ఫోర్బ్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న యంగ్ హీరోయిన్
ఫోర్బ్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న యంగ్ హీరోయిన్