Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ

టీడీపీ

తెలుగుదేశం పార్టీ లేదా టీడీపీ ఓ జాతీయ పార్టీ. నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు. రాష్ట్రంలో ఏకపక్షంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆయన టీడీపీని ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టిన కేవలం 9 మాసాల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ. అప్పట్లో ఉమ్మడి ఏపీలోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో 35 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కనిపించినా.. ఏపీలో మాత్రం ఇందిరాగాంధీ జోరుకు ఎన్టీఆర్ బ్రేకులు వేశారు. నాటి లోక్‌సభలో కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్షం కావడం విశేషం.

రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలుతో టీడీపీ పేద, బడుగు వర్గాలకు అత్యంత దగ్గరయ్యింది. 1983లో ఆగస్టు సంక్షోభాన్ని అధిగమించిన ఎన్టీ రామారావు.. 1984లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 200లకు పైగా స్థానాల్లో విజయం సాధించి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ కూటమిని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కూటమి నుంచి వి. పి. సింగ్ ప్రధాని కావడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది.

1994 ఎన్నికల్లో విజయంతో ఎన్టీ రామారావు మూడోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరారం చేశారు. 1995లో లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ రామారావును గద్దె దించి, అధికార పగ్గాలు చేపట్టారు నారా చంద్రబాబు నాయుడు. 1995 నుంచి 2004 వరకు 9 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో టీడీపీ పరాజయంపాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 2019లో ఏపీలో వైసీపీ చేతిలో పరాజయం పాలయ్యింది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో క్రమంగా టీడీపీ ప్రభను కోల్పోయింది.

ఇంకా చదవండి

CM Chandrababu: 1995 సీఎం మాదిరిగానే ఉంటా.. తాట తీస్తా: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 1995లో సీఎం మాదిరిగానే ఉంటా.. ఎవరైనా చెడు చేసి తప్పించుకోవాలంటే తాటతీస్తానంటూ హెచ్చరించారు. తప్పు చేసిన వాళ్లను శిక్షిస్తే ప్రజలు కూడా హర్షిస్తారన్నారు. కార్యకర్తలే పార్టీకి ముఖ్యమని పేర్కొన్నారు.

Andhra Politics: తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..

ఎలక్షన్‌ ఏదైనా ఎలక్షనే అంటున్నాయి..ఏపీలో అధికార, విపక్ష పార్టీలు.. అది జడ్పీ చైర్మన్‌ ఎన్నికైనా.. ఉపసర్పంచ్‌ ఎన్నికైనా తగ్గేదేలేదంటూ పోటాపోటీగా క్యాంప్‌ రాజకీయాలకు తెరతీశాయి.. దీంతో నేడు కడపసహా పలు జిల్లాల్లో జరగనున్న లోకల్ బాడీ బై ఎలక్షన్స్..హీట్‌ పుటిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ 9 చోట్ల లోకల్‌బాడీ ఉప ఎన్నికలు జరగనున్నాయి..

Chandrababu: వారికి 30 ఏళ్లు పట్టింది.. తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..

తానొక్కడనే పరుగెత్తడం కాదు.. ఇకపై మిమ్మల్నీ పరుగెత్తిస్తా.. బీ క్లియర్‌.. ఇవీ.. రెండోరోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కామెంట్స్‌.. ఎస్‌.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి వేదికగా జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సు ముగిసింది. పలు కీలక అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.. చివరి రోజు సమావేశంలో ఏపీ అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Lokesh – Ravindra Reddy: లోకేష్‌తో మీటింగ్‌కు రవీంద్రారెడ్డి.. తెలుగు తమ్ముళ్ల ఫైర్.. ఇంతకీ ఆయనెవరో తెలుసా..?

Ravindra Reddy - Lokesh Meeting Controversy: విద్యార్ధుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రముఖ టెక్‌ కంపెనీ సిస్కోతో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి లోకేష్‌ సమక్షంలో అధికారులు ఎంవోయూ చేసుకున్నారు. దీని ద్వారా 50 వేల మంది యువతకు డిజిటల్, ఐటీ స్కిల్‌ డెవలెప్‌మెంట్‌లో సిస్కో సంస్థ శిక్షణ ఇవ్వనుంది. ఇంతవరకూ భాగానే ఉన్నా.. సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి అనే వ్యక్తి కనిపించడంపై టీడీపీ సోషల్‌మీడియాలో తీవ్ర దుమారం రేగింది.

KCR: పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు.. ప్రతి ఒక్కడూ కేసీఆరే..! బీఆర్ఎస్‌లో నయా జోష్‌

తెలంగాణ ఉద్యమాన్ని నడపడంలోనైనా.. రాష్ట్రం ఏర్పాడ్డాక ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని నడపడంలోపైనా బీఆర్ఎస్‌ది వినూత్న శైలి. పదేళ్ల తర్వాత అధికారానికి దూరమై పార్టీ పరిస్థితి అగమ్యగోరంగా ఉన్న తరుణంలో అటు పార్టీ ప్రెసిడెంట్.. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ సేమ్‌ డైలాగ్స్‌తో మళ్లీ గులాబీ కేడర్‌ పార్టీని అధికారంలోకి తెచ్చేలా పనిచేసేందుకు ప్రేరేపిస్తున్నారు.

Andhra Politics: పేరు మారింది.. పంచాయితీ మొదలయింది.. ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్..

మొన్న హెల్త్‌ యూనివర్సిటీ ..నిన్న కడప జిల్లా..తాజాగా విశాఖ క్రికెట్‌ స్టేడియం..ఇలా ప్రతిచోటా వైఎస్‌ఆర్‌ పేరును తొలగిస్తోంది..ఏపీ ప్రభుత్వం. అటు పథకాలకు..ఇటు కట్టడాలకు దివంగత సీఎం పేరు తొలగించడంపై మండిపడుతోంది..వైసీపీ. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖలో నేడు ఆందోళనకు పిలుపునిచ్చింది..ఆ పార్టీ.

కర్నూలులో భగ్గుమన్న పాత పగలు.. టీడీపీ నేత దారుణ హత్య

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో సంజన్న నివసిస్తున్న షరీఫ్ నగర్‌లోని గూడేకల్లు అల్లిపీర స్వామి మందిరానికి ప్రార్థన చేసుకోవడం కోసం వెళ్లేవాడు. బైక్ మందిరం ముందర ఆపి లోపలికి వెళ్తుండగా హఠాత్తుగా కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేశారు.

AP Nominated Posts: ఒక కుర్చీ.. 46 కర్చీఫులు.. నామినేటెడ్‌ పోస్టుల కోసం పోటీ మామూలుగా లేదుగా..

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. నామినేటెడ్‌ పదవుల కోసం ఆశావహులు వేయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే కాంపిటీషన్‌ మాత్రం 1:46 ఉంది. అంటే 1 పోస్టుకు 46మంది పోటీ పడుతున్నారు. చంద్రబాబు, షరతులు, వార్నింగుల మధ్య పదవులు దక్కించుకునే అదృష్టవంతులెవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Araku Coffee: అరకు కాఫీకి అరుదైన గౌరవం.. లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గిరిజన ప్రాంతమైన అరకు వ్యాలీ ఈ కాఫీ పంటకు ప్రసిద్ధి చెందింది. అరకు కాఫీ త్వరలో పార్లమెంట్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఏపీ పార్లమెంటు సభ్యుల విజ్ఞప్తి మేరకు పార్లమెంట్‌ ఆవరణలో అరకు కాఫీ ప్రచార కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

Andhra News: ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. అనూహ్యంగా ఆమె పేరు..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరో తేల్చేసింది టీడీపీ. సోమవారంతో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించింది. కావలి గ్రీష్మ(ఎస్సీ), బీద రవిచంద్ర (బీసీ), బీటీ నాయుడు(బీసీ)కు అవకాశం కల్పించారు. వాస్తవానికి ఎమ్మెల్సీ పోస్టుల కోసం చాలామంది ఆశావహులు గట్టి ప్రయత్నాలు చేశారు.