బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MBA)పూర్తి చేసి.. 2012లో 10టీవీ ప్రారంభంతో తెలుగు మీడియా రంగంలోకి అడుగు పెట్టాను. మొదట్లో హైదరాబాద్లో క్రైమ్ రిపోర్టింగ్లో ఉన్న నేను 2013 చివర్లో ఢిల్లీ బ్యూరోకు బదిలీపై వచ్చాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, భారతదేశం వేదికగా జరిగిన G-20 శిఖరాగ్ర సదస్సు సహా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఢిల్లీ నుంచి కవర్ చేశాను.
సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సహా లీగల్ అంశాలు, పార్లమెంట్ వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. PIB అక్రెడిటెడ్ జర్నలిస్ట్గా కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల వార్తలతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సహా రాజకీయ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేశాను. ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమం, భూకంపాలు, వరదలు, వడగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వార్తలు సహా అనేకాంశాలపై వార్తలు అందిస్తూ వస్తున్నాను. 2025లో TV9లో ‘బ్యూరో చీఫ్’గా బాధ్యతలు చేపట్టి, ఢిల్లీ బ్యూరో బాధ్యతల్లో కొనసాగుతున్నాను.
కైలాస్-మానస్ సరోవర్ యాత్రికులకు కేంద్రం కీలక హెచ్చరిక.. ఆ పత్రాలు లేకుంటే వెళ్లొద్దు!
ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా కైలాస్-మానస్ సరోవర్ యాత్రకు వెళ్లే భారతీయ పౌరుల కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. ప్రయాణానికి సంబంధించిన అన్ని పత్రాలు లేకుండా టూర్ ప్లాన్ చేసుకోవద్దని కేంద్రం స్పష్టం చేసింది.
- Gopikrishna Meka
- Updated on: Jun 28, 2026
- 8:09 pm
PM Modi: ప్రధాని మోదీకి మరో అరుదైన ఘనత.. సెషెల్స్ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కారం..
పర్యావరణ పరిరక్షణలో విశేష కృషికి గాను ప్రధాని నరేంద్ర మోదీకి సెషెల్స్ దేశ అత్యున్నత అధ్యక్ష పురస్కారం 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్' లభించింది. ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా మోదీ నిలిచారు. బ్లూ ఎకానమీ, వాతావరణ మార్పులపై పోరాటం, పర్యావరణ హిత కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని సెషెల్స్ ప్రభుత్వం ప్రదానం చేసింది.
- Gopikrishna Meka
- Updated on: Jun 28, 2026
- 4:34 pm
భూకంప ప్రళయంతో కృంగిపోయిన వెనుజులాకు ఆపన్న హస్తం.. ‘ఆపరేషన్ అమిస్టాడ్’ ప్రారంభించిన భారత్!”
సరిగ్గా రెండు రోజుల క్రితం జూన్ 24న సంభవించిన వరుస భూకంపాలు దక్షిణ అమెరికా దేశమైన వెనుజులాను పూర్తిగా కుదేలు చేశాయి. రిక్టర్ స్కేల్పై 7.2, 7.5 తీవ్రతతో వచ్చిన ఈ రెండు శక్తివంతమైన భూకంపాలు ఆ దేశాన్ని అక్షరాలా శ్మశానంగా మార్చాయి. ఇది వెనుజులా చరిత్రలోనే గత 100 ఏళ్లలో సంభవించిన అతిపెద్ద విపత్తుగా నమోదైంది. ఈ విపత్కర పరిస్థితుల్లో వెనుజులా ప్రభుత్వం దేశంలో అత్యవసర స్థితిని ప్రకటించింది.
- Gopikrishna Meka
- Updated on: Jun 26, 2026
- 5:19 pm
PM Modi: ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి.. యువతకు ఉద్యోగాలపై కీలక చర్చలు..
గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఊహించని రేంజ్లో విస్తరించడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. 2026 నుంచి 2030 మధ్యకాలంలో ఏకంగా 4.03 లక్షల కోట్ల రూపాయల రికార్డు స్థాయి పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
- Gopikrishna Meka
- Updated on: Jun 25, 2026
- 8:09 pm
Nitin Gadkari: తెలంగాణ వాసులకు గుడ్న్యూస్.. రహదారుల నిర్మాణంపై కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!
దేశవ్యాప్తంగా రహదారుల అనుసంధానాన్ని పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ, జమ్మూ-కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
- Gopikrishna Meka
- Updated on: Jun 25, 2026
- 3:11 pm
Operation Chakra: 16 రాష్ట్రాలు.. 60 టీమ్లు.. సీబీఐ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు!
డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్న సైబర్ మోసగాళ్ల నెట్వర్క్ను ఛేదించేందుకు సీబీఐ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఆపరేషన్ చక్ర-VI కింద దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 80కి పైగా ప్రాంతాల్లో ఏకకాల సోదాలు నిర్వహించింది. చెన్నై, కోల్కతాలో ఇద్దరు నిందితుల అరెస్టు చేసింది.
- Gopikrishna Meka
- Updated on: Jun 25, 2026
- 1:07 pm
సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన సక్సెస్.. HYD మెట్రో విస్తరణపై కీలక ముందడుగు.. రంగంలోకి SBICAPS!
ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. తెలంగాణలో మెట్రో ఫేజ్-2కు ఎట్టకేలకు లైన్ క్రియర్ అయింది. తాజాగా జరిగిన సమావేశంలో మెట్రోపై ఏకాభిప్రాయానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు. మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 అంశాలపై అధ్యయనానికి కన్సల్టెంట్ గా SBICAPS నియమించారు. కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు.
- Gopikrishna Meka
- Updated on: Jun 23, 2026
- 3:06 pm
‘దేశమే ఫస్ట్.. మిగతావన్నీ నెక్స్ట్’.. ఢిల్లీ వేదికగా జనసేన కొత్త నినాదం ప్రకటించిన పవన్ కల్యాణ్
జనసేన పార్టీకి దేశ సమగ్రత, జాతీయ సమైక్యతే అత్యున్నత ప్రాధాన్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. "దేశమే ఫస్ట్.. మిగతావన్నీ నెక్స్ట్" అనేది ఇకపై జనసేన పార్టీ విధానం మాత్రమే కాకుండా అధికారిక నినాదంగా కూడా కొనసాగుతుందని ప్రకటించారు. దేశ విభజన భావజాలం, ప్రాంతీయ విద్వేషాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టే శక్తులపై జనసేన రాజీలేని పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు.
- Gopikrishna Meka
- Updated on: Jun 15, 2026
- 5:25 pm
ల్యాండింగ్ సమయంలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన AN-32 విమానం.. ఫైలట్ సహా ఐదుగురు మృతి!
అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం కూలిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. శనివారం (జూన్ 13) ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం నియంత్రణ కోల్పోయి ఎయిర్ఫీల్డ్ పరిధిలోనే కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ, విమానంలో ఉన్న ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
- Gopikrishna Meka
- Updated on: Jun 13, 2026
- 1:22 pm
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై రేవంత్ ఫోకస్.. అనుమతుల కోసం కేంద్రమంత్రి ఖట్టర్తో కీలక భేటీ!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కీలక ప్రాజెక్టులకు కేంద్ర అనుమతుల అంశాలపై వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను కలిసి హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్టుకు తక్షణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
- Gopikrishna Meka
- Updated on: Jun 12, 2026
- 1:28 pm
CM Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఆ ప్రాజెక్టులపైనే మెయిన్ ఫోకస్
తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత ముఖ్యమని తాజాగా ఢిల్లీలో జరిగిన భేటీ సందర్భంగా ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
- Gopikrishna Meka
- Updated on: Jun 11, 2026
- 9:54 pm
అమరావతికి మోదీ మెగా గిఫ్ట్.. రూ. 2,534 కోట్ల రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్!
ప్రధానిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు మోదీ. ఇదే రోజు అమరావతిపై మరోసారి వరాల జల్లు కురిపించారు. 2 వేల 500 కోట్ల వ్యయంతో అమరావతిలో చేపట్టిన రెండు కీలక ప్రాజెక్టులకు మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఒకటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయ కాంప్లెక్స్ నిర్మాణం కాగా మరొకటి కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయ నిర్మాణం.
- Gopikrishna Meka
- Updated on: Jun 10, 2026
- 4:52 pm