బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MBA)పూర్తి చేసి.. 2012లో 10టీవీ ప్రారంభంతో తెలుగు మీడియా రంగంలోకి అడుగు పెట్టాను. మొదట్లో హైదరాబాద్లో క్రైమ్ రిపోర్టింగ్లో ఉన్న నేను 2013 చివర్లో ఢిల్లీ బ్యూరోకు బదిలీపై వచ్చాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, భారతదేశం వేదికగా జరిగిన G-20 శిఖరాగ్ర సదస్సు సహా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఢిల్లీ నుంచి కవర్ చేశాను.
సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సహా లీగల్ అంశాలు, పార్లమెంట్ వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. PIB అక్రెడిటెడ్ జర్నలిస్ట్గా కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల వార్తలతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సహా రాజకీయ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేశాను. ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమం, భూకంపాలు, వరదలు, వడగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వార్తలు సహా అనేకాంశాలపై వార్తలు అందిస్తూ వస్తున్నాను. 2025లో TV9లో ‘బ్యూరో చీఫ్’గా బాధ్యతలు చేపట్టి, ఢిల్లీ బ్యూరో బాధ్యతల్లో కొనసాగుతున్నాను.
సునీతక్కా.. ఆ లేఖను ఎందుకు దాచారు.. ఇదేనా మీ పోరాటం.. ఎంపీ అవినాష్ ఫైర్..
వివేకా హత్య కేసు విచారణ వెనుక అసలు నిజాలను తొక్కిపెట్టి, రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. సీబీఐ దర్యాప్తులో లొసుగులు ఉన్నాయన్నారు. ఢిల్లీ వేదికగా వివేకా కుమార్తె సునీతారెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఆయన, ఈ కేసును కేవలం చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే వాడుకుంటున్నారని మండిపడ్డారు. హత్య చేసినట్లు స్వయంగా ఒప్పుకున్న నిందితుడికి సునీత అండగా నిలబడటం వెనుక మర్మమేంటని ఆయన నిలదీశారు.
- Gopikrishna Meka
- Updated on: Mar 17, 2026
- 8:04 am
Rain Alert: ఇక వర్షాలే వర్షాలు.. చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
మార్చి నెలలోనే ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. పశ్చిమ హిమాలయాలను సమీపిస్తున్న పశ్చిమ అల్పపీడనం కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో తుఫాను పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ, హర్యానా, యుపి, రాజస్థాన్, హిమాచల్, పంజాబ్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.
- Gopikrishna Meka
- Updated on: Mar 15, 2026
- 10:57 am
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు కేంద్రం అదిరిపోయే గుడ్న్యూస్.. ఇక ప్రయాణం మరింత సులభం!
Hyderabad Regional Ring Rail: హైదరాబాద్ శివారు ప్రాంత ప్రజలకు ఇదో గుడ్న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీకి సర్వే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
- Gopikrishna Meka
- Updated on: Mar 14, 2026
- 4:39 pm
నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక.. కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన సీతక్క
నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలోని ములుగు జిల్లాను కేంద్రం ఎంపిక చేసింది. ములుగు జిల్లాను ఎంపిక చేయడం పట్ల తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.
- Gopikrishna Meka
- Updated on: Mar 14, 2026
- 12:16 pm
Cinema : తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టులో విచారణ….ఏం జరిగిందంటే ?
సినిమా టికెట్ ధరల పెంపుపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించింది సుప్రీంకోర్టు . ఈ కేసుపై విచారణ జరిపింది జస్టిస్లు జెకె మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం. టికెట్ రేట్లు పెంచుతున్నట్లు సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని జనవరిలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు. దీనిపై సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసిన మైత్రీ మూవీ మేకర్స్.
- Gopikrishna Meka
- Updated on: Mar 13, 2026
- 6:47 pm
Parliament Budget Session: స్పీకర్పై అవిశ్వాసం.. ఎన్డీయే Vs విపక్షాలు.. ఎవరి బలం ఎంతంటే..?
దేశంలో ఎండలు ముదురుతున్న వేళ.. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు రాజకీయ వేడిని పతాక స్థాయికి చేర్చనున్నాయి. మార్చి 9 నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో అందరి దృష్టి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపైనే ఉంది. స్పీకర్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ 118 మంది విపక్ష ఎంపీలు ఇచ్చిన ఈ నోటీసు, సభలో తీవ్ర చర్చకు దారితీయనుంది.
- Gopikrishna Meka
- Updated on: Mar 8, 2026
- 11:38 pm
Telangana: తెలంగాణ పల్లెలకు కేంద్రం ఎన్ని వేల కోట్లు ఇచ్చిందో తెలుసా..? పూర్తి లెక్కలు ఇవే..
గ్రామ పంచాయతీల బలోపేతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధుల ఇస్తుంది. కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా అవి సకాలంలో పల్లెలకు చేరేలా కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది. కేంద్రం పంపిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల్లోపు పంచాయతీల ఖాతాల్లో వేయకపోతే, వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
- Gopikrishna Meka
- Updated on: Mar 6, 2026
- 8:11 am
Kishan Reddy: రాష్ట్ర ఆర్థికస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి- సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థికస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన కోరారు. కేంద్రం ఇప్పటివరకు రూ.12లక్షలకోట్ల నిధులు ఇచ్చిందని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఖజానా నిల్.. కాంగ్రెస్ నేతల జేబులు ఫుల్ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి కిషన్ఎడ్డి అన్నారు.
- Gopikrishna Meka
- Updated on: Mar 3, 2026
- 12:32 pm
Alert: ఇరాన్కు మద్దతుగా ఆందోళనలు.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మూడో రోజుకు చేరింది. బాంబులు మోతతో ఇరాన్, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలు అట్టుడుకుతున్నాయి. ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేని మరణంతో అనేక దేశాల్లో షియా ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
- Gopikrishna Meka
- Updated on: Mar 2, 2026
- 11:32 am
మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల నడుమ ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. ఎందుకో తెలుసా..?
సైనిక, కీలక ఆయుధ వ్యవస్థలను భారత్ కు సరఫరా చేస్తున్న ఇజ్రాయెల్ తో సంబంధాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులపాటు ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు.
- Gopikrishna Meka
- Updated on: Feb 25, 2026
- 10:02 am
దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో మార్పులు.. కసరత్తు మొదలు పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం..!
భారత ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇందుకోసం ఢిల్లీ భారత మండపంలో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం జరగనుంది. ఇది 27 ఏళ్ల తర్వాత కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు మధ్య జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం.
- Gopikrishna Meka
- Updated on: Feb 25, 2026
- 12:29 pm
Fastest Metro: గుడ్న్యూస్.. అందుబాటులోకి దేశంలోనే తొలి హై స్పీడ్ మెట్రో ట్రైన్! రేపే ప్రారంభం!
PM Modi Meerut Visit: ఆదివారం యూపీలోని మీరట్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ. 12,930 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. ఇందులో ఢిల్లీ-మీరట్ నమో భారత్ RRTS కారిడార్, మీరట్ మెట్రో కీలకమైనవి. గంటకు 120 కి.మీ వేగంతో నడిచే ఈ మెట్రో, దేశంలోనే అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థగా మారనుంది. ఆధునిక, సుస్థిర ప్రజా రవాణా ద్వారా పట్టణ ట్రాఫిక్ను తగ్గించి, పౌరుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశ్యం.
- Gopikrishna Meka
- Updated on: Feb 21, 2026
- 7:21 pm