AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopikrishna Meka

Gopikrishna Meka

Delhi Bureau chief - TV9 Telugu

gopikrishna.meka@tv9.com

బిజినెస్ మేనేజ్మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MBA)పూర్తి చేసి.. 2012లో 10టీవీ ప్రారంభంతో తెలుగు మీడియా రంగంలోకి అడుగు పెట్టాను. మొదట్లో హైదరాబాద్‌లో క్రైమ్ రిపోర్టింగ్‌లో ఉన్న నేను 2013 చివర్లో ఢిల్లీ బ్యూరోకు బదిలీపై వచ్చాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, భారతదేశం వేదికగా జరిగిన G-20 శిఖరాగ్ర సదస్సు సహా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఢిల్లీ నుంచి కవర్ చేశాను.

సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సహా లీగల్ అంశాలు, పార్లమెంట్ వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. PIB అక్రెడిటెడ్ జర్నలిస్ట్‌గా కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల వార్తలతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సహా రాజకీయ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేశాను. ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమం, భూకంపాలు, వరదలు, వడగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వార్తలు సహా అనేకాంశాలపై వార్తలు అందిస్తూ వస్తున్నాను. 2025లో TV9లో ‘బ్యూరో చీఫ్‌’గా బాధ్యతలు చేపట్టి, ఢిల్లీ బ్యూరో బాధ్యతల్లో కొనసాగుతున్నాను.

Read More
Telangana: హైదరాబాద్ టూ బెంగళూరు.. ఇక 2 గంటల్లోనే.. రయ్ రయ్‌మంటూ హాయిగా వెళ్లిపోవచ్చు..

Telangana: హైదరాబాద్ టూ బెంగళూరు.. ఇక 2 గంటల్లోనే.. రయ్ రయ్‌మంటూ హాయిగా వెళ్లిపోవచ్చు..

ప్రస్తుతం 8 వందేభారత్ సర్వీసులు ,8 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. 2014 నుంచి, దాదాపు 1,700 కి.మీ రైల్వే ట్రాక్‌లు నిర్మించారు. ఇది శ్రీలంక మొత్తం రైలు నెట్‌వర్క్ కంటే ఎక్కువ. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ వ్యక్తిత్వ హక్కుల రక్షణపై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ వ్యక్తిత్వ హక్కుల రక్షణపై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు

పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ వ్యక్తిత్వ హక్కుల రక్షణ పై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జరీ చేసింది. అకీరా నందన్ పై రూపొందించిన AI సినిమా కంటెంట్ ను ప్రసారం చేయోద్దని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఏఐ చిత్రం ,డీప్‌ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టు నిషేధం విధించింది.

ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట జంతు ప్రేమికుల ఆందోళన..రోడ్డుపై పడుకుని నిరసన

ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట జంతు ప్రేమికుల ఆందోళన..రోడ్డుపై పడుకుని నిరసన

తెలంగాణలో కుక్కలు,కోతులను చంపేస్తున్నారని, మూగ జీవాలను చంపొద్దంటూ జంతు ప్రేమికులు ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. పీపుల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో జంతు ప్రేమికులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Amaravati: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. అన్ని సిద్ధం చేసిన కేంద్ర సర్కార్..!

Amaravati: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. అన్ని సిద్ధం చేసిన కేంద్ర సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దతకు రంగం సిద్దమవుతుంది. వచ్చే వారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తర్వాత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతుంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్ర రాజధానిగా ఏ ప్రాంతం ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికారంగా ఉంది.

వరి సాగులో చైనాను అధిగమించిన భారత్.. కొత్తగా 184 పంట రకాలు ఆవిష్కరణ.. త్వరలోనే..

వరి సాగులో చైనాను అధిగమించిన భారత్.. కొత్తగా 184 పంట రకాలు ఆవిష్కరణ.. త్వరలోనే..

ప్రపంచంలో అత్యధికంగా బియ్యం ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ నంబర్ 1 స్థానానికి చేరింది. భారత్ ప్రపంచానికి బియ్యం ఇచ్చే స్థితిలో ఉంది. వ్యవసాయ రంగంలో శక్తి వంతమైన భారత్ గా రూపుదిద్దుకుంటుంది.. ప్రధాని మోదీ నేతృత్వంలో వికసిత భారత మహా యజ్ఞం జరుగుతుంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ఒక విత్తనంగా ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్..

BSNL: న్యూయర్ వేళ BSNL నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఏంటో తెలుసా?

BSNL: న్యూయర్ వేళ BSNL నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఏంటో తెలుసా?

BSNL Wi-Fi Calling service: నూతన సంవత్సరం వేళ తమ కస్టమర్లకు BSNL గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా వైఫై కాలింగ్ సేవలనను అందుబాబులోకి తీసుకొచ్చింది. ఈ సేవ BSNL కస్టమర్లకు ఇప్పుడు అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉంది. ఈ వైఫై కాలింగ్‌తో నెట్‌వర్క్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లోనూ స్పష్టమైన, అధిక నాణ్యత కలిగిన కాల్స్ చేసుకోవచ్చు.

శత్రువుల గుండెల్లో వణుకు.. ఆర్మీ చేతికి అత్యాధునిక అస్త్రాలు.. కేంద్రం సంచలన నిర్ణయం..

శత్రువుల గుండెల్లో వణుకు.. ఆర్మీ చేతికి అత్యాధునిక అస్త్రాలు.. కేంద్రం సంచలన నిర్ణయం..

రక్షణ శాఖ రూ. 79 వేల కోట్ల విలువైన ఆయుధ సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇది భారత త్రివిధ దళాల ఆధునికీకరణకు, స్వయం సమృద్ధి సాధనకు కీలక అడుగుగా చెప్పొచ్చు. పినాకా రాకెట్లు, డ్రోన్ డిటెక్షన్ సిస్టమ్స్, అస్త్ర మిస్సైల్స్ వంటి అధునాతన వ్యవస్థల సేకరణతో సైన్యం, నావికాదళం, వాయుసేన సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయి. దేశ రక్షణ పటిష్టం చేయడమే లక్ష్యం.

Rahul Gandhi: నేడు హైదరాబాద్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ!

Rahul Gandhi: నేడు హైదరాబాద్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ!

గోట్ ఇండియాల టూర్‌లో భాగంగా శనివారం ప్రపంచ ఫుడ్‌బాల్‌ లెజెండ్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈవెంట్‌లో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డితో మెస్సీ ఫుడ్‌బాల్ మ్యాచ్ కూడా ఆడనున్నారు. అయితే ఈ కాక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రానున్నట్టు తెలుస్తోంది.

కొబ్బరి రైతులకు గుడ్‌న్యూస్ .. మద్దతు ధర పెంపునకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్.. క్వింటాల్‌పై ఎంతంటే?

కొబ్బరి రైతులకు గుడ్‌న్యూస్ .. మద్దతు ధర పెంపునకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్.. క్వింటాల్‌పై ఎంతంటే?

MSP Hike 2026: కొబ్బరి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2026 సీజన్‌కు కొబ్బరి కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కొబ్బరి కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Telangana: తెలంగాణలో లక్ష రేషన్ కార్డులు రద్దు చేసిన కేంద్రం.. ఎందుకంటే..?

Telangana: తెలంగాణలో లక్ష రేషన్ కార్డులు రద్దు చేసిన కేంద్రం.. ఎందుకంటే..?

తెలంగాణలో రేషన్ కార్డుల దుర్వినియోగం పెరగడంతో గత 10 నెలల్లో 1.4 లక్షలకు పైగా కార్డులు రద్దయ్యాయి. ఆర్థికంగా స్థిరపడినవారు కూడా పథకాల లబ్ధి కోసం కార్డులు పొందడం దీనికి కారణం. మరోవైపు రేషన్ షాపులన్నీ ఆహార భద్రత చట్టం కింద FSSAI లైసెన్స్ పొందడం తప్పనిసరి. నాణ్యత, పరిశుభ్రత పాటించని షాపులపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.

CM Revanth Reddy: ఢిల్లీలో NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ఢిల్లీలో NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటను వెళ్లారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విందుకు హాజరయ్యారు. గురువారం శరద్‌ పవార్ 85 వసంతాలను పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయనకు ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం

అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 3,258 మంది భారతీయుల‌ను అమెరికా (యూఎస్‌) బహిష్కరించినట్లు కేంద్రం పార్లమెంట్ లో వెల్లడించింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. 2009 నుంచి ఇప్పటి వరకూ మొత్తం..