బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MBA)పూర్తి చేసి.. 2012లో 10టీవీ ప్రారంభంతో తెలుగు మీడియా రంగంలోకి అడుగు పెట్టాను. మొదట్లో హైదరాబాద్లో క్రైమ్ రిపోర్టింగ్లో ఉన్న నేను 2013 చివర్లో ఢిల్లీ బ్యూరోకు బదిలీపై వచ్చాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, భారతదేశం వేదికగా జరిగిన G-20 శిఖరాగ్ర సదస్సు సహా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఢిల్లీ నుంచి కవర్ చేశాను.
సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సహా లీగల్ అంశాలు, పార్లమెంట్ వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. PIB అక్రెడిటెడ్ జర్నలిస్ట్గా కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల వార్తలతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సహా రాజకీయ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేశాను. ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమం, భూకంపాలు, వరదలు, వడగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వార్తలు సహా అనేకాంశాలపై వార్తలు అందిస్తూ వస్తున్నాను. 2025లో TV9లో ‘బ్యూరో చీఫ్’గా బాధ్యతలు చేపట్టి, ఢిల్లీ బ్యూరో బాధ్యతల్లో కొనసాగుతున్నాను.
డీకే శివకుమార్ అండ ఉన్నా దక్కని సీటు.. షర్మిల రాజ్యసభ ఆశలపై నీళ్లు చల్లిన కర్ణాటక కాంగ్రెస్!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. కాంగ్రెస్ పార్టీలో అది ఇంకా కష్టం. దానికి ఇదే నిదర్శనం. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తో మంచి సంబంధాలు ఉన్నా వైఎస్ఆర్ కూతురు, పార్టీ విలీన హామీ ఇవేవీ షర్మిలకు రాజ్యసభ స్థానం ఇప్పించలేక పోయాయి. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిననాటి నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షురాలు వైఎస్ షర్మిల కర్ణాటక రాజ్యసభ రేసులో ఉన్నారు.
- Gopikrishna Meka
- Updated on: Jun 5, 2026
- 4:41 pm
మళ్లీ నీట్ ఎగ్జామ్ రాసే ధైర్యం లేదంటూ విద్యార్థిని ఆత్మహత్య! స్పందించిన రాహుల్ గాంధీ
నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దు కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన మధ్యప్రదేశ్కు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆవేదన కలిగించగా, విద్యా వ్యవస్థ వైఫల్యంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
- Gopikrishna Meka
- Updated on: Jun 4, 2026
- 12:54 pm
పూర్తి అధికారం వారిదే.. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ నిషేధంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఆన్లైన్ బెట్టింగ్, జూదం నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. డబ్బు పందెంతో ఆడే ఆన్లైన్ గేమ్లను నిషేధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని స్పష్టం చేసింది. నైపుణ్యానికి సంబంధించిన ఆటలైనా, వాటిపై డబ్బు పందేలు కాస్తే అవి ‘బెట్టింగ్, గ్యాంబ్లింగ్’ పరిధిలోకే వస్తాయని పేర్కొంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ నిషేధ చట్టాలను సమర్థిస్తూ, బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ నిర్వహించడం మౌలిక హక్కు కాదని తేల్చిచెప్పింది.
- Gopikrishna Meka
- Updated on: Jun 3, 2026
- 7:00 pm
NEET UG 2026 re-exam: నీట్ రీ-ఎగ్జామ్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. ఆన్లైన్ విధానానికి నో..!
ప్రస్తుతం ఉన్న పెన్-పేపర్ విధానానికి బదులుగా నీట్ యూజీ 2026 రీ-టెస్ట్ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను స్వీకరించడానికి భారత సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి అభ్యర్థనలను ఇదివరకే కొట్టివేసినట్లు పేర్కొంది. పరీక్షను పునఃనిర్వహించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్న దశలో పరీక్షా విధానాన్ని ఎలా మార్చుతారంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది..
- Gopikrishna Meka
- Updated on: Jun 1, 2026
- 5:58 pm
Delhi: ఢిల్లీలో బయటపడ్డ ఐఎస్ఐ టెర్రర్ నెట్వర్క్.. 9 మంది అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్
Delhi: ఈ అరెస్టులు భారత్లో ఉగ్రవాద నిరోధక చర్యలపై జరుగుతున్న కఠిన చర్యల్లో భాగమని అధికారులు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా బందోబస్తు మరింత బలోపేతం చేశారు. మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడికావాల్సి ఉంది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు..
- Gopikrishna Meka
- Updated on: May 30, 2026
- 4:31 pm
ఆ టీచర్లకు సుప్రీంకోర్టు షాక్.. 2028 వరకు మాత్రమే గడువు..!
Teacher Eligibility Test Mandatory: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా TET అర్హత తప్పనిసరేనని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. 2025 తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన ధర్మాసనం, ఉపాధ్యాయులు TET అర్హత సాధించేందుకు ఆగస్టు 31, 2028 వరకు గడువు పొడిగించింది. పిల్లల నాణ్యమైన విద్యా హక్కు కోసం TET అవసరమని, అర్హత సాధించని వారికి సర్వీసు కొనసాగింపు ఉండదని స్పష్టం చేసింది.
- Gopikrishna Meka
- Updated on: May 30, 2026
- 12:15 pm
YS Sharmila: ఢిల్లీలో షర్మిల.. రాహుల్ గాంధీతో భేటీ వెనక అసలు కథ అదేనా..?
ఏపీ కాంగ్రెస్ పునర్వైభవం కోసమా.. లేక రాజ్యసభ బెర్త్ కోసమా? ఢిల్లీ వేదికగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జరిపిన తాజా భేటీ ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు కర్ణాటక సీఎం పీఠాన్ని డీకే శివకుమార్ అధిరోహించబోతున్న తరుణంలో కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లాలని షర్మిల గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీతో భేటీ వెనక అసలు కథ ఏంటీ..? అనేది తెలుసుకుందాం..
- Gopikrishna Meka
- Updated on: May 29, 2026
- 5:44 pm
Naga Chaitanya : అనుమతి లేకుండా నాగ చైతన్య పేరు, ఫోటో వాడకూడదు.. వ్యక్తిత్వ హక్కులకి మధ్యంతర రక్షణ కల్పించిన హైకోర్టు..
అనుమతి లేకుండా తన పేరు, ఫోటోస్ దుర్వినియోగం చేస్తున్నారని.. వాటిని అడ్డుకోవాలని ఇటీవల హీరో నాగ చైతన్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. నాగ చైతన్య వ్యక్తిత్వ హక్కులకి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే.
- Gopikrishna Meka
- Updated on: May 29, 2026
- 2:33 pm
PM Modi: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..? ఏపీ, తెలంగాణ నేతలకు జాక్పాట్..!
కేంద్రంలో మోదీ సర్కార్ 12 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి చేరుకుంటున్న వేళ.. అటు కేబినెట్ ప్రక్షాళన, ఇటు దేశవ్యాప్తంగా భారీ ఉత్సవాలకు బీజేపీ అధిష్ఠానం పక్కా ప్లాన్ రెడీ చేసింది. ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీనియర్లకు, అలాగే ఏపీ, బీహార్లోని మిత్రపక్షాలకు ఈ పునర్వ్యవస్థీకరణలో సముచిత స్థానం దక్కబోతున్నట్లు సమాచారం.
- Gopikrishna Meka
- Updated on: May 24, 2026
- 7:23 pm
Watch Video: సూట్కేస్తో ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ ఇచ్చారు.. అనుమానం వచ్చి ఆపి చెక్ చేయగా..
ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీ మొత్తం డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వచ్చిన ఇద్దరు థాయ్ జాతీయుల నుంచి సుమారు 47.805 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ మాదక ద్రవ్యాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 48 కోట్ల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
- Gopikrishna Meka
- Updated on: May 23, 2026
- 12:25 pm
Heatwave: అగ్నిగుండంలా మండుతున్న భారత్.. 50 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు.. ఏపీ, తెలంగాణలో
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, తెలంగాణ-ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
- Gopikrishna Meka
- Updated on: May 21, 2026
- 8:07 am
పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి.. ప్రైవేట్ ఆసుపత్రులకు సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక!
దేశ రాజధాని ఢిల్లీలో పేదల ఆరోగ్య హక్కును కాపాడటంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన మైలురాయి లాంటి ఆదేశాలను జారీ చేసింది. సామాన్యులకు వైద్యం అందని ద్రాక్ష కావొద్దని గట్టిగా చెప్పిన న్యాయస్థానం.. ప్రభుత్వ రాయితీలు, తక్కువ ధరల భూములపై నిర్మించిన ప్రైవేట్ ఆసుపత్రులు పేద రోగులకు ఉచిత సేవలు అందించాల్సిందేనని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన తీర్పులను బేఖాతరు చేస్తున్న యాజమాన్యాలపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
- Gopikrishna Meka
- Updated on: May 20, 2026
- 7:29 pm