బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MBA)పూర్తి చేసి.. 2012లో 10టీవీ ప్రారంభంతో తెలుగు మీడియా రంగంలోకి అడుగు పెట్టాను. మొదట్లో హైదరాబాద్లో క్రైమ్ రిపోర్టింగ్లో ఉన్న నేను 2013 చివర్లో ఢిల్లీ బ్యూరోకు బదిలీపై వచ్చాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, భారతదేశం వేదికగా జరిగిన G-20 శిఖరాగ్ర సదస్సు సహా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఢిల్లీ నుంచి కవర్ చేశాను.
సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సహా లీగల్ అంశాలు, పార్లమెంట్ వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. PIB అక్రెడిటెడ్ జర్నలిస్ట్గా కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల వార్తలతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సహా రాజకీయ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేశాను. ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమం, భూకంపాలు, వరదలు, వడగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వార్తలు సహా అనేకాంశాలపై వార్తలు అందిస్తూ వస్తున్నాను. 2025లో TV9లో ‘బ్యూరో చీఫ్’గా బాధ్యతలు చేపట్టి, ఢిల్లీ బ్యూరో బాధ్యతల్లో కొనసాగుతున్నాను.
Ayodhya: అయోధ్య టెంపుల్లో ఉద్యోగం.. ఒక్కటే పోస్ట్.. 5వేలకు పైగా అప్లికేషన్స్.. వీళ్లు మాత్రమే అర్హులు!
శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య రామాలయం గురించి అందరికి తెలిసిందే.. అయితే తాజాగా ఆలయం నుంచి ఓ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. అది కూడా ఒక్క పోస్టుకే.. కానీ వచ్చిన దరఖాస్తులు మాత్రం 5 వేలకు పైగా. ఇంతకూ ఆ పోస్ట్ ఏంటి.. ఆ పోస్ట్కు ఎందుకు అంత డిమాండ్ ఉంది. ఆ పోస్ట్కు అర్హతలు ఏంటి.. అర్హులు ఎవరనేది తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- Gopikrishna Meka
- Updated on: Jul 19, 2026
- 8:25 am
ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్.. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..
ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖకు 45 కిలోమీటర్ల దూరంలో 2,200 ఎకరాల్లో నిర్మించిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు గేమ్ ఛేంజర్గా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
- Gopikrishna Meka
- Updated on: Jul 19, 2026
- 7:36 am
Sonam Wangchuk: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు! ఇదిగో వీడియో!
నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, గత 20 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ దీక్ష భగ్నమైంది. ఆయన ఆరోగ్యం క్షిణంచడంతో అతన్ను బలవంతంగా హాస్పిటల్కు తరలించారు ఢిల్లీ పోలీసులు.
- Gopikrishna Meka
- Updated on: Jul 18, 2026
- 9:59 am
ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం కోల్పోయినట్లేనా..? క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు!
ఓటరు జాబితాలో పేరు లేకపోవడం వల్ల ఎవరూ పౌరసత్వాన్ని కోల్పోరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సంబంధించి దాఖలైన పిటిషన్ను విచారించిన సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వాన్ని నిర్ధారించే అంతిమ అధికారం భారత ఎన్నికల సంఘానికి లేదని తేల్చి చెప్పింది.
- Gopikrishna Meka
- Updated on: Jul 17, 2026
- 5:32 pm
Hyderabad: హిందూ విద్యార్థికి కల్కా హోమ్ వర్క్.. సీన్లోకి NHRC.. పోలీసులకు కీలక ఆదేశాలు!
హైదరాబాద్లోని సక్సెస్ ది స్కూల్లో విద్యార్థులకు ఇస్లామిక్ పాఠాలను హోంవర్క్గా ఇవ్వడంపై NHRC సీరియస్ అయ్యింది. దీనిని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించి ఘటనపై కేసు నమోదు చేసింది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ, కలెక్టర్, పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసి, రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
- Gopikrishna Meka
- Updated on: Jul 17, 2026
- 12:17 pm
Train Accident: స్కూల్కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు.. ఇద్దరు విద్యార్థులు మృతి!
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు రైల్వే క్రాసింగ్ దాటుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన ట్రైన్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ముగ్గురు మరణించగా.. వారిలో ఇద్దరు విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. సామాచారంతో ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
- Gopikrishna Meka
- Updated on: Jul 17, 2026
- 10:53 am
Parliament Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఉభయ సభల్లోకి వచ్చే కీలక బిల్లులు ఇవే!
Parliament Monsoon Session: దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయం ఆసన్నమైంది. ఈ జూలై 20 నుంచి ఆగస్ట్ 13 వరకు ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. అయితే ఈ సేషన్స్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల ముందుకు రానున్న కీలక బిల్లులు ఏవో చూద్దాం పదండి.
- Gopikrishna Meka
- Updated on: Jul 17, 2026
- 7:24 am
PM Modi: దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం హర్యానా, చండీగఢ్ , పంజాబ్ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మొత్తం రూ. 26,800 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేయడంతో పాటు, పూర్తయిన పనులను జాతికి అంకితం చేయనున్నారు. ఈ పర్యటన రవాణా, విద్య, ఆరోగ్య రంగాల్లో ఈ ప్రాంత రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా సాగనుంది.
- Gopikrishna Meka
- Updated on: Jul 16, 2026
- 2:05 pm
Godzilla El Nino: ప్రపంచాన్ని వణికిస్తున్న గాడ్జిల్లా ఎల్ నినో.. భారత్కు పెను ముప్పు తప్పదా..?
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అత్యంత శక్తివంతమైన ‘గాడ్జిల్లా ఎల్ నినో’ ప్రపంచ దేశాలకు కొత్త వాతావరణ సవాళ్లను విసురుతోంది. గత 150 ఏళ్లలోనే అత్యంత బలమైన ఎల్ నినోగా ఇది మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్లో మాన్సూన్ వర్షాలు తగ్గడం, ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం, నీటి కొరత, ఆహార ధరల పెరుగుదల వంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
- Gopikrishna Meka
- Updated on: Jul 15, 2026
- 11:52 am
India-UK FTA: గుడ్న్యూస్.. అమల్లోకి భారత్-యూకే వాణిజ్య ఒప్పందం.. భారీగా తగ్గనున్న వాటి ధరలు!
India-UK Trade Agreement : దేశ ప్రజలకు ఇదో సూపర్ గుడ్న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే నేటి నుంచే భారత్ - యూకే మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయడమే లక్ష్యంగా కుదిరిన ఈ ఒప్పందం.. వ్యాపార, ఉపాధి రంగాల్లో సరికొత్త విప్లవానికి తెరలేపింది. ఈ ఒప్పందంతో చాలా వరకు వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
- Gopikrishna Meka
- Updated on: Jul 15, 2026
- 8:51 am
CBSE కీలక నిర్ణయం.. 9, 10 తరగతుల్లో మూడో భాష తప్పనిసరి.. విధి విధానాలు జారీ!
Central Board: 10వ తరగతి మూడో భాష (R3)కు సంబంధించి బోర్డు పరీక్షలు ఉండవు. దీనిని పాఠశాల స్థాయిలోనే అంతర్గత పరీక్షగా నిర్వహిస్తారు. 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ పొందాలంటే, స్కూల్ నిర్వహించే R3 అంతర్గత పరీక్షల్లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాల్సిందేనని CBSE..
- Gopikrishna Meka
- Updated on: Jul 14, 2026
- 5:07 pm
Telangana: హైదరాబాద్ టు అమరావతి రయ్ రయ్.. జెట్ స్పీడ్తో ఆర్ఆర్ఆర్ పనులు.. నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ..
తెలంగాణ రహదారుల రూపురేఖలను మార్చేలా సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన కీలక హైవే ప్రాజెక్టులపై చర్చించారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు ఏకంగా 12 లైన్ల హైవేతో పాటు ఆర్ఆర్ఆర్ పనులను వేగవంతం చేయాలని కోరారు.
- Gopikrishna Meka
- Updated on: Jul 14, 2026
- 4:08 pm