బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MBA)పూర్తి చేసి.. 2012లో 10టీవీ ప్రారంభంతో తెలుగు మీడియా రంగంలోకి అడుగు పెట్టాను. మొదట్లో హైదరాబాద్లో క్రైమ్ రిపోర్టింగ్లో ఉన్న నేను 2013 చివర్లో ఢిల్లీ బ్యూరోకు బదిలీపై వచ్చాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, భారతదేశం వేదికగా జరిగిన G-20 శిఖరాగ్ర సదస్సు సహా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఢిల్లీ నుంచి కవర్ చేశాను.
సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సహా లీగల్ అంశాలు, పార్లమెంట్ వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. PIB అక్రెడిటెడ్ జర్నలిస్ట్గా కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల వార్తలతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సహా రాజకీయ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేశాను. ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమం, భూకంపాలు, వరదలు, వడగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వార్తలు సహా అనేకాంశాలపై వార్తలు అందిస్తూ వస్తున్నాను. 2025లో TV9లో ‘బ్యూరో చీఫ్’గా బాధ్యతలు చేపట్టి, ఢిల్లీ బ్యూరో బాధ్యతల్లో కొనసాగుతున్నాను.
హైదరాబాద్ KBR నేషనల్ పార్క్ పరిరక్షణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
KBR National Park పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈకో-సెన్సిటివ్ జోన్లో సుమారు 1,300 చెట్లు నరికే ప్రమాదం ఉందన్న పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం, తదుపరి విచారణ వరకు ఎలాంటి చెట్ల నరికివేత జరగకూడదని స్టే విధించింది. ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణాల కోసం చెట్ల తొలగింపుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
- Gopikrishna Meka
- Updated on: May 18, 2026
- 1:51 pm
PM Modi: 6 రోజులు.. 5 దేశాలు.. యుద్ధం వేళ ప్రధాని మోదీ విదేశీ టూర్.. ఎందుకో తెలుసా..?
6 రోజుల్లో 5 దేశాలు.. లక్ష్యం ఒక్కటే..భారత్ ఫస్ట్. పశ్చిమాసియా సంక్షోభం వేళ ప్రధాని మోదీ ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. యూఏఈ చమురు నిల్వల నుంచి.. 43 ఏళ్ల తర్వాత నార్వేతో సరికొత్త బంధం వరకు.. ఈ పర్యటన ఎంతో కీలకం. ముఖ్యంగా ఇటీవల ముగిసిన భారత్ ఈయూ ఎఫ్టీఏ చర్చల తర్వాత జరుగుతున్న ఈ టూర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
- Gopikrishna Meka
- Updated on: May 15, 2026
- 9:27 am
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సంచలనం.. విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ!
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (లిక్కర్) కేసు విచారణలో అత్యంత నాటకీయ, కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేసు విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్లు (Recusal) ఆమె అధికారికంగా ప్రకటించారు.
- Gopikrishna Meka
- Updated on: May 14, 2026
- 10:48 pm
బిగ్ అలర్ట్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో SIR.. ఎప్పటినుంచో తెలుసా..?
కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఫేజ్-3ను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టనుంది. చనిపోయిన, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ జూన్ నుంచి ప్రారంభం కానుంది.
- Gopikrishna Meka
- Updated on: May 14, 2026
- 8:28 pm
కోల్ గ్యాసిఫికేషన్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. రూ.37,500 కోట్లతో భారీ ప్రాజెక్టులు!
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ఇంధన భద్రతను బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రూ.37,500 కోట్ల వ్యయంతో బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు ప్రోత్సాహక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును సంశ్లేషిత వాయువుగా మార్చే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. దీని ద్వారా ఎల్ఎన్జీ, యూరియా, అమోనియా, మిథనాల్ వంటి కీలక ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడటం తగ్గనుంది.
- Gopikrishna Meka
- Updated on: May 13, 2026
- 8:31 pm
PM Modi: ఇంధన ఆదా చర్యల్లో భాగంగా ప్రధాని కాన్వాయ్ 50 శాతానికి తగ్గింపు
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పెరిగిన ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ తన కాన్వాయ్ను 50 శాతం తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రోత్సాహంపై దృష్టి పెట్టిన మోదీ.. ఇంధన ఆదాలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నిర్ణయాన్ని అనుసరిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కాన్వాయ్లను తగ్గించే చర్యలు ప్రారంభించారు.
- Gopikrishna Meka
- Updated on: May 13, 2026
- 10:10 am
సుర్రుమంటున్న సూర్యుడు.. వారి రక్షణకు చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు NHRC కీలక సూచనలు..
జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దేశవ్యాప్తంగా వడగాలను ఎదుర్కొనేందుకు ఢిల్లీ సహా 21 రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్థికంగా బలహీన వర్గాలు, బహిరంగ కార్మికులు, వృద్ధులు, చిన్నారులు వేడి గాలుల బారిన పడకుండా నీరు, ఆశ్రయం, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించింది. ప్రాణనష్టాన్ని నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, హీట్ యాక్షన్ ప్లాన్లను సమర్థవంతంగా అమలు చేయాలని NHRC నొక్కి చెప్పింది.
- Gopikrishna Meka
- Updated on: Apr 28, 2026
- 6:12 pm
ఆ రూట్లో వెళ్లే వారికి గుడ్న్యూస్.. అందుబాటులోకి ఎక్స్ప్రేస్వే.. సగానికి సగం తగ్గనున్న జర్నీ టైమ్!
దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రజా రవాణాకు వెన్నెముకగా నిలిచే జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా ఉత్తరప్రదేశ్ మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రంలోని అతి పొడవైన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేలలో ఒకటైన గంగా ఎక్స్ప్రెస్వే ప్రారంభానికి సిద్దమైంది. ఈ హైవే ఈ నెలాఖరులో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 29న ప్రధాని మోదీ ఈ హైను జాతికి అంకింత చేయనున్నారు.
- Gopikrishna Meka
- Updated on: Apr 25, 2026
- 5:05 pm
భారత్పై భానుడి విశ్వరూపం.. రాబోయే ఐదు రోజుల్లో మాడు పగిలే ఎండలు.. బయటకెళ్లారో అంతే!
దేశవ్యాప్తంగా ఎండల ప్రభావం జన జీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేడి దేశంగా భారత్ మారింది. ఏప్రిల్ నెలలోనే ఎండల తీవ్రత మండిపోతోంది. భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 4 నుంచి 8 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది ఈ సీజన్లో రికార్డు స్థాయి వేడిని సూచిస్తోంది.
- Gopikrishna Meka
- Updated on: Apr 23, 2026
- 7:00 pm
ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్న్యూస్.. ఉచితంగా రూ. కోటిన్నర బీమా
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రతను, సంక్షేమాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కాంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజీ అనే విశిష్టమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ పథకాన్ని అధికారికంగా బలోపేతం చేశారు. ఇది సాధారణ బ్యాంకింగ్ సేవలతో పాటు బీమా, రుణాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను ఒకే చోట అందించే 'వన్-స్టాప్ ఫైనాన్షియల్ సొల్యూషన్గా నిలవనుంది.
- Gopikrishna Meka
- Updated on: Apr 23, 2026
- 1:58 pm
New Trains: హైదరాబాద్ నుంచి ఆ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్తగా మరో 8 రైళ్లు.. ఇదిగో పూర్తి వివరాలు..
భారతీయ రైల్వే తెలంగాణకు 8 కొత్త వీక్లీ రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి ఆంధ్రప్రదేశ్ (తిరుపతి, తిరుచానూరు), ఒడిశా (భువనేశ్వర్), రాజస్థాన్ (శ్రీ గంగానగర్, జైపూర్)లకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.. భక్తులకు, సుదూర ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మే, జూలై 2026 నుంచి ఈ రైళ్లు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
- Gopikrishna Meka
- Updated on: Apr 21, 2026
- 8:10 pm
ప్రధాని మోదీతో బండి సంజయ్ భేటీ.. కరీంనగర్ మున్సిపల్ విజయంపై ప్రశంసలు!
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ పరిణామాలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకోవడంపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, అభివృద్ధి నినాదంతోనే తాము ప్రజల్లోకి వెళ్లామని, ప్రజలు బీజేపీ నాయకత్వంపై నమ్మకం ఉంచారని బండి సంజయ్ ప్రధానికి వివరించారు.
- Gopikrishna Meka
- Updated on: Apr 2, 2026
- 10:12 pm