AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopikrishna Meka

Gopikrishna Meka

Delhi Bureau chief - TV9 Telugu

gopikrishna.meka@tv9.com

బిజినెస్ మేనేజ్మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MBA)పూర్తి చేసి.. 2012లో 10టీవీ ప్రారంభంతో తెలుగు మీడియా రంగంలోకి అడుగు పెట్టాను. మొదట్లో హైదరాబాద్‌లో క్రైమ్ రిపోర్టింగ్‌లో ఉన్న నేను 2013 చివర్లో ఢిల్లీ బ్యూరోకు బదిలీపై వచ్చాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, భారతదేశం వేదికగా జరిగిన G-20 శిఖరాగ్ర సదస్సు సహా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఢిల్లీ నుంచి కవర్ చేశాను.

సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సహా లీగల్ అంశాలు, పార్లమెంట్ వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. PIB అక్రెడిటెడ్ జర్నలిస్ట్‌గా కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల వార్తలతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సహా రాజకీయ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేశాను. ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమం, భూకంపాలు, వరదలు, వడగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వార్తలు సహా అనేకాంశాలపై వార్తలు అందిస్తూ వస్తున్నాను. 2025లో TV9లో ‘బ్యూరో చీఫ్‌’గా బాధ్యతలు చేపట్టి, ఢిల్లీ బ్యూరో బాధ్యతల్లో కొనసాగుతున్నాను.

Read More
మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల నడుమ ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. ఎందుకో తెలుసా..?

మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల నడుమ ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. ఎందుకో తెలుసా..?

సైనిక, కీలక ఆయుధ వ్యవస్థలను భారత్ కు సరఫరా చేస్తున్న ఇజ్రాయెల్ తో సంబంధాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులపాటు ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో మార్పులు.. కసరత్తు మొదలు పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం..!

దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో మార్పులు.. కసరత్తు మొదలు పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం..!

భారత ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇందుకోసం ఢిల్లీ భారత మండపంలో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం జరగనుంది. ఇది 27 ఏళ్ల తర్వాత కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు మధ్య జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం.

Fastest Metro: గుడ్‌న్యూస్.. అందుబాటులోకి దేశంలోనే తొలి హై స్పీడ్ మెట్రో ట్రైన్! రేపే ప్రారంభం!

Fastest Metro: గుడ్‌న్యూస్.. అందుబాటులోకి దేశంలోనే తొలి హై స్పీడ్ మెట్రో ట్రైన్! రేపే ప్రారంభం!

PM Modi Meerut Visit: ఆదివారం యూపీలోని మీరట్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ. 12,930 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. ఇందులో ఢిల్లీ-మీరట్ నమో భారత్ RRTS కారిడార్, మీరట్ మెట్రో కీలకమైనవి. గంటకు 120 కి.మీ వేగంతో నడిచే ఈ మెట్రో, దేశంలోనే అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థగా మారనుంది. ఆధునిక, సుస్థిర ప్రజా రవాణా ద్వారా పట్టణ ట్రాఫిక్‌ను తగ్గించి, పౌరుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశ్యం.

అస్సాం పర్యటనకు ప్రధాని మోదీ..రూ.5,450కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభం..

అస్సాం పర్యటనకు ప్రధాని మోదీ..రూ.5,450కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభం..

అస్సాం పర్యటనలో ప్రధాని మోదీ పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF), బ్రహ్మపుత్రపై కుమార్ భాస్కర్ వర్మ సేతు, జాతీయ డేటా సెంటర్, ఐఐఎం-గౌహతి, పీఎమ్-ఈబస్ సేవ పథకంలో భాగంగా 225 ఎలక్ట్రిక్ బస్సులను మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు ఈశాన్య భారతదేశంలో మౌలిక సదుపాయాలు, రవాణా, డిజిటల్ సేవలు, ఉన్నత విద్యను గణనీయంగా బలోపేతం చేస్తాయి, ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిస్తాయి.

మారిన ‘వందేమాతరం’ నియమాలు.. కీలక ఉత్తర్వులు జారీ.. ఎప్పుడు, ఎక్కడ, ఎంతసేపు పాడాలి..?

మారిన ‘వందేమాతరం’ నియమాలు.. కీలక ఉత్తర్వులు జారీ.. ఎప్పుడు, ఎక్కడ, ఎంతసేపు పాడాలి..?

వందేమాతరానికి ఉన్న చారిత్రక, జాతీయ ప్రామూఖ్యతను గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఈ గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించే ప్రతిపాదనకు 2025 అక్టోబర్ 1న ఆమోదం తెలిపింది. 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పొడవునా ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.

దేశ యువత, పిల్లల భవిష్యత్తు కోసం తెలుగు దేశం పార్టీ కీలక నిర్ణయం..! చట్టంగా మారేనా..?

దేశ యువత, పిల్లల భవిష్యత్తు కోసం తెలుగు దేశం పార్టీ కీలక నిర్ణయం..! చట్టంగా మారేనా..?

అరచేతిలో ప్రపంచం ప్రజలకు అందుబాటులోకి ఉన్న ఈరోజుల్లో ఇంటర్నెట్ సామాజిక మాధ్యమాలతో ప్రజలకు కలిగే లాభాలు ఉన్నట్లుగానే నష్టాలు అధికమవుతున్నాయి. పుట్టిన నెలల చిన్నారి మొదలు మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూస్తూ ఆహారం తినే నేటి జనరేషన్‌లో ప్రధానంగా 16 ఏళ్ల లోపు ఎదుగుతున్న పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం చాలా ప్రమాదకరంగా మారింది.

టెండూల్కర్ ఇంట పెళ్ళి వేడుక.. రాష్ట్రపతి, ప్రధాని మోదీ, రాహుల్‌ను కలిసిన సచిన్.. వివాహానికి ఆహ్వానం

టెండూల్కర్ ఇంట పెళ్ళి వేడుక.. రాష్ట్రపతి, ప్రధాని మోదీ, రాహుల్‌ను కలిసిన సచిన్.. వివాహానికి ఆహ్వానం

భారత రత్న, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి సందడి జోరందుకుంది. ముంబైలో మార్చి 3వ తేదీ నుంచి మూడు రోజులపాటు అత్యంత వైభవంగా సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కి సానియా చందోక్ తో వివాహం జరగనుంది. ఈ వివాహ వేడుకకు రాజకీయ, క్రీడా, పారిశ్రామిక, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

Telangana: హైదరాబాద్ టూ బెంగళూరు.. ఇక 2 గంటల్లోనే.. రయ్ రయ్‌మంటూ హాయిగా వెళ్లిపోవచ్చు..

Telangana: హైదరాబాద్ టూ బెంగళూరు.. ఇక 2 గంటల్లోనే.. రయ్ రయ్‌మంటూ హాయిగా వెళ్లిపోవచ్చు..

ప్రస్తుతం 8 వందేభారత్ సర్వీసులు ,8 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. 2014 నుంచి, దాదాపు 1,700 కి.మీ రైల్వే ట్రాక్‌లు నిర్మించారు. ఇది శ్రీలంక మొత్తం రైలు నెట్‌వర్క్ కంటే ఎక్కువ. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ వ్యక్తిత్వ హక్కుల రక్షణపై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ వ్యక్తిత్వ హక్కుల రక్షణపై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు

పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ వ్యక్తిత్వ హక్కుల రక్షణ పై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జరీ చేసింది. అకీరా నందన్ పై రూపొందించిన AI సినిమా కంటెంట్ ను ప్రసారం చేయోద్దని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఏఐ చిత్రం ,డీప్‌ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టు నిషేధం విధించింది.

ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట జంతు ప్రేమికుల ఆందోళన..రోడ్డుపై పడుకుని నిరసన

ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట జంతు ప్రేమికుల ఆందోళన..రోడ్డుపై పడుకుని నిరసన

తెలంగాణలో కుక్కలు,కోతులను చంపేస్తున్నారని, మూగ జీవాలను చంపొద్దంటూ జంతు ప్రేమికులు ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. పీపుల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో జంతు ప్రేమికులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Amaravati: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. అన్ని సిద్ధం చేసిన కేంద్ర సర్కార్..!

Amaravati: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. అన్ని సిద్ధం చేసిన కేంద్ర సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దతకు రంగం సిద్దమవుతుంది. వచ్చే వారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తర్వాత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతుంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్ర రాజధానిగా ఏ ప్రాంతం ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికారంగా ఉంది.

వరి సాగులో చైనాను అధిగమించిన భారత్.. కొత్తగా 184 పంట రకాలు ఆవిష్కరణ.. త్వరలోనే..

వరి సాగులో చైనాను అధిగమించిన భారత్.. కొత్తగా 184 పంట రకాలు ఆవిష్కరణ.. త్వరలోనే..

ప్రపంచంలో అత్యధికంగా బియ్యం ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ నంబర్ 1 స్థానానికి చేరింది. భారత్ ప్రపంచానికి బియ్యం ఇచ్చే స్థితిలో ఉంది. వ్యవసాయ రంగంలో శక్తి వంతమైన భారత్ గా రూపుదిద్దుకుంటుంది.. ప్రధాని మోదీ నేతృత్వంలో వికసిత భారత మహా యజ్ఞం జరుగుతుంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ఒక విత్తనంగా ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్..