AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopikrishna Meka

Gopikrishna Meka

Delhi Bureau chief - TV9 Telugu

gopikrishna.meka@tv9.com

బిజినెస్ మేనేజ్మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MBA)పూర్తి చేసి.. 2012లో 10టీవీ ప్రారంభంతో తెలుగు మీడియా రంగంలోకి అడుగు పెట్టాను. మొదట్లో హైదరాబాద్‌లో క్రైమ్ రిపోర్టింగ్‌లో ఉన్న నేను 2013 చివర్లో ఢిల్లీ బ్యూరోకు బదిలీపై వచ్చాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, భారతదేశం వేదికగా జరిగిన G-20 శిఖరాగ్ర సదస్సు సహా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఢిల్లీ నుంచి కవర్ చేశాను.

సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సహా లీగల్ అంశాలు, పార్లమెంట్ వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. PIB అక్రెడిటెడ్ జర్నలిస్ట్‌గా కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల వార్తలతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సహా రాజకీయ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేశాను. ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమం, భూకంపాలు, వరదలు, వడగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వార్తలు సహా అనేకాంశాలపై వార్తలు అందిస్తూ వస్తున్నాను. 2025లో TV9లో ‘బ్యూరో చీఫ్‌’గా బాధ్యతలు చేపట్టి, ఢిల్లీ బ్యూరో బాధ్యతల్లో కొనసాగుతున్నాను.

Read More
“జో ఖేలేగా వో ఖిలేగా”.. కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ సందడి.. 2030 శతాబ్ది గేమ్స్‌కు భారత్ గ్రాండ్ వెల్‌కమ్!

“జో ఖేలేగా వో ఖిలేగా”.. కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ సందడి.. 2030 శతాబ్ది గేమ్స్‌కు భారత్ గ్రాండ్ వెల్‌కమ్!

PM Narendra Modi, CWG 2026 Medallists: గ్లాస్గోలో సాధించిన ఈ విజయం భారత క్రీడారంగంలో ఒక నూతన శకానికి నాంది పలికింది. ప్రధాని మోదీ అందించిన ప్రోత్సాహం రాబోయే ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లో మన అథ్లెట్లు మరింతగా రాణించేందుకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది. 2030లో స్వదేశంలో జరగబోయే శతాబ్ది క్రీడల నాటికి భారత్ ప్రపంచ క్రీడా సూపర్ పవర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

కలిసొస్తున్న కమలం నేతలు.. తెలంగాణలో అధికారం కోసం బీజేపీ వ్యూహం మారిందా?

కలిసొస్తున్న కమలం నేతలు.. తెలంగాణలో అధికారం కోసం బీజేపీ వ్యూహం మారిందా?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణపై అధిష్టానం ఫోకస్ చేసింది..అందులో భాగంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ నాయకుల అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి పటిష్టత, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది.

గోబర్ధన్ బయోఎనర్జీ పథకం, అస్సాం హైవేకు మోక్షం.. రూ.32,701 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

గోబర్ధన్ బయోఎనర్జీ పథకం, అస్సాం హైవేకు మోక్షం.. రూ.32,701 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

గోబర్ధన్ – నేషనల్ సర్క్యులర్ బయోఎనర్జీ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ఈ పథకం 2026-27 నుంచి 2035-36 వరకు అమలు కానుంది. వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, సేంద్రియ వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడమే లక్ష్యంగా ఈ పథకం అమలుకానుంది. దీనివల్ల దిగుమతి సహజవాయువుపై ఆధారపడటం తగ్గి ఇంధన భద్రత బలపడుతుంది..

13 ఏళ్ల నాటి తెహల్కా కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ ఎడిటర్‌ తరుణ్ తేజ్‌పాల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష!

13 ఏళ్ల నాటి తెహల్కా కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ ఎడిటర్‌ తరుణ్ తేజ్‌పాల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష!

బాంబే హైకోర్టు గోవా బెంచ్ 2013 అత్యాచారం కేసులో తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చింది. జస్టిస్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్‌సాండేకర్‌లతో కూడిన ధర్మాసనం ఆయనకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. అలాగే రెండు వారాల్లోగా పోలీసులకు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది..

మార్క్ జుకర్‌బర్గ్ బహిరంగ క్షమాపణలు

మార్క్ జుకర్‌బర్గ్ బహిరంగ క్షమాపణలు

ప్రధాని మోదీ వీడియో తొలగించడంపై ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటాకే పార్లమెంటరీ కమిటీ డెడ్ లైన్ విధించింది. మూడు రోజుల్లోగా మెటా సీఈఓ మార్క్ జూకర్ బర్గ్‌ క్షమాపణలు చెప్పాలని పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం జారీ చేసింది. అయితే వెంటనే మెటా అధినేత నుంచి ఒక ప్రకటన వెలువడింది.

అక్రమ చొరబాటుదారులకు ఇక చుక్కలే..! బంగ్లా బోర్డర్‌లో కేంద్రం కీలక నిర్ణయం..!

అక్రమ చొరబాటుదారులకు ఇక చుక్కలే..! బంగ్లా బోర్డర్‌లో కేంద్రం కీలక నిర్ణయం..!

భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ, మాదకద్రవ్యాల రవాణా, విదేశీ గూఢచర్య కార్యకలాపాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాల్లో 40 కొత్త సబ్‌సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) యూనిట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.

విదేశాల్లో దాక్కున్నా వదలం.. 36 దేశాల నుంచి 274 మంది పరారీ నేరస్థులను లాక్కొచ్చిన మోదీ సర్కార్

విదేశాల్లో దాక్కున్నా వదలం.. 36 దేశాల నుంచి 274 మంది పరారీ నేరస్థులను లాక్కొచ్చిన మోదీ సర్కార్

దేశం సంపదను కొల్లగొట్టి విదేశాల్లో వెళ్లి తలదాచుకుంటున్న వారిని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే విషయంలో భారత ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాలతో కేవలం ఐదేళ్లలోనే సుమారు 36 దేశాలకు పరిపోయిన 274 మంది పరారీ నేరస్థులను కేంద్ర సర్కార్ తిరిగి భారత్‌కు తీసుకొచ్చింది.

Kishan Reddy: ఫలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషి.. సింగరేణికి దక్కిన మరో కోల్ బ్లాక్!

Kishan Reddy: ఫలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషి.. సింగరేణికి దక్కిన మరో కోల్ బ్లాక్!

సింగరేణి సంస్థ ఆర్థికాభివృద్ధి దిశగా మరో కీలకమైన ముందడుగు పడింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఎన్నో ఏళ్ల కల అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని PKOC-2 (ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్) డిప్‌సైడ్ బ్లాక్ ఎట్టకేలకు సింగరేణికి వశమైంది.

బ్రిజ్ భూషణ్‌కు బిగ్ రిలీఫ్.. లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు..

బ్రిజ్ భూషణ్‌కు బిగ్ రిలీఫ్.. లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు..

మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల పోరాటం ఊహించని మలుపు తిరిగింది. లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. రెజ్లర్లు చేసిన ఆరోపణల్లో ప్రాసిక్యూషన్ తగిన ఆధారాలు చూపడంలో విఫలమయ్యారంటూ.. ఈ కేసులో బ్రిజ్ భూషణ్‌తో పాటు సహ నిందితుడు వినోద్ తోమర్‌ను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

Viral Video: పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..

Viral Video: పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. థాయ్‌లాండ్‌ నుంచి ఇండియాకు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్.. అతని నుంచి సుమారు రెండు కోట్లకు పైగా విలువైన సుమారు 2.759 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకన్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Coal Production: దేశంలో పెరిగిన బొగ్గు ఉత్పత్తి.. రవాణా సామర్థ్యం.. కీలక పాత్ర పోషిస్తున్న కోల్‌ రంగం

Coal Production: దేశంలో పెరిగిన బొగ్గు ఉత్పత్తి.. రవాణా సామర్థ్యం.. కీలక పాత్ర పోషిస్తున్న కోల్‌ రంగం

Coal Production: బొగ్గు ఉత్పత్తి, రవాణాలో చోటు చేసుకుంటున్న వృద్ధి, బొగ్గు రంగంలో స్థిరమైన సరఫరా కార్యాచరణ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ నిరంతర నిబద్ధత ప్రయత్నాలను స్పష్టం చేస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జూలై వరకు బొగ్గు ఉత్పత్తి 302.24 మెట్రిక్..

ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భారీ సహాయక ప్యాకేజీ

ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భారీ సహాయక ప్యాకేజీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌సివి (FCV) పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సహాయక ప్యాకేజీ ప్రకటించాయి. ఒక్కో బార్న్‌కు రూ.50 వేల వడ్డీలేని రుణంతో పాటు, తక్కువ గ్రేడ్ పొగాకుకు కిలోకు రూ.10 ఆర్థిక సాయం అందించనున్నాయి. .. ..