AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopikrishna Meka

Gopikrishna Meka

Delhi Bureau chief - TV9 Telugu

gopikrishna.meka@tv9.com

బిజినెస్ మేనేజ్మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MBA)పూర్తి చేసి.. 2012లో 10టీవీ ప్రారంభంతో తెలుగు మీడియా రంగంలోకి అడుగు పెట్టాను. మొదట్లో హైదరాబాద్‌లో క్రైమ్ రిపోర్టింగ్‌లో ఉన్న నేను 2013 చివర్లో ఢిల్లీ బ్యూరోకు బదిలీపై వచ్చాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, భారతదేశం వేదికగా జరిగిన G-20 శిఖరాగ్ర సదస్సు సహా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఢిల్లీ నుంచి కవర్ చేశాను.

సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సహా లీగల్ అంశాలు, పార్లమెంట్ వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. PIB అక్రెడిటెడ్ జర్నలిస్ట్‌గా కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల వార్తలతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సహా రాజకీయ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేశాను. ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమం, భూకంపాలు, వరదలు, వడగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వార్తలు సహా అనేకాంశాలపై వార్తలు అందిస్తూ వస్తున్నాను. 2025లో TV9లో ‘బ్యూరో చీఫ్‌’గా బాధ్యతలు చేపట్టి, ఢిల్లీ బ్యూరో బాధ్యతల్లో కొనసాగుతున్నాను.

Read More
దానం నాగేందర్ అనర్హతపై కీలక ట్విస్ట్.. సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు!

దానం నాగేందర్ అనర్హతపై కీలక ట్విస్ట్.. సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు!

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. హైకోర్టు అనర్హత తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ముందుగానే కెవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పు, ఖైరతాబాద్ ఉప ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఫిరాయింపుల కేసులో ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

బర్త్ అండ్, డెత్‌ సర్టిఫికెట్‌ జారీలో కీలక మార్పులు.. ఆ రోజు నుంచే అమల్లోకి.. ఇదిగో కొత్త రూల్స్!

బర్త్ అండ్, డెత్‌ సర్టిఫికెట్‌ జారీలో కీలక మార్పులు.. ఆ రోజు నుంచే అమల్లోకి.. ఇదిగో కొత్త రూల్స్!

జనన, మరణాల రిపోర్ట్ తీసుకునే వారికి ఇదో బిగ్‌ అలర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇకపై బర్త్, డెత్‌ సర్టిఫికెట్‌ల జారీలో రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ (సవరణ) చట్టం కింద ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ రూల్స్‌ 2026 అక్టోబర్ 1 నుండి అమల్లోకి రానున్నట్టు పేర్కొంది. మరి కొత్తగా వచ్చిన రూల్స్‌ ఏమిటి.. ఇకపై బర్త్‌ అండ్ డెత్‌ సర్టిఫికెట్‌లో పొందాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

ఔలిలో భారత్-అమెరికా ‘యుద్ధ అభ్యాస్ 2026’.. రోబోటిక్ డాగ్స్‌తో ఉగ్రవాద నిరోధక డ్రిల్స్

ఔలిలో భారత్-అమెరికా ‘యుద్ధ అభ్యాస్ 2026’.. రోబోటిక్ డాగ్స్‌తో ఉగ్రవాద నిరోధక డ్రిల్స్

భారత్, అమెరికా సైన్యాల మధ్య 22వ సంయుక్త సైనిక విన్యాసాలు ఉత్తరాఖండ్‌లోని ఔలిలో ప్రారంభమయ్యాయి. ‘యుద్ధ అభ్యాస్ 2026’ పేరుతో జరుగుతున్న ఈ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందిన సుమారు 600 మంది సైనికులు పాల్గొంటున్నారు. ఇదే సమయంలో రాజస్థాన్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లోనూ ఈ సంయుక్త శిక్షణ కొనసాగుతోంది. సెప్టెంబర్ 28 వరకు విన్యాసాలు నిర్వహించనున్నారు.

UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు లేవు.. కేంద్రం కీలక ప్రకటన

UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు లేవు.. కేంద్రం కీలక ప్రకటన

UPI Payments: ఈ నిబంధన చెల్లింపు చేసేవారికి , అందుకునే వారికి రెండు వైపులా వర్తిస్తుంది. ఇది 2007 పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 10ఏ సవరణ తర్వాత వచ్చిన మొదటి నోటిఫికేషన్. గతంలో అన్ని యూపీఐ లావాదేవీలపై జీరో..

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఇళ్లను కేటాయించింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారిగా ఈ స్థాయిలో ఇళ్ల కేటాయింపు జరిగిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. దేశవ్యాప్తంగా పేదలకు 2 కోట్ల ఇళ్ల నిర్మాణ లక్ష్యంలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించగా..

నవరాత్రుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..! మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కీలక కసరత్తు..

నవరాత్రుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..! మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కీలక కసరత్తు..

దేశ రాజకీయాల్లో పెను మార్పులకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోందా? చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియకు లైన్ క్లియర్ చేసేందుకు మోదీ సర్కార్ సరికొత్త వ్యూహం రచిస్తోందా? వర్షాకాల సమావేశాలు ముగిసినా సెషన్‌ను ప్రోరోగ్ చేయకపోవడం వెనుక ఉన్న అసలు మర్మమేంటి? నవరాత్రుల వేళ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల దిశగా ఢిల్లీలో సాగుతున్న కీలక పరిణామాల గురించి తెలుసుకుందాం..

బ్రిక్స్‌లో ప్రధాని మోదీ దౌత్య విజయం.. ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం!

బ్రిక్స్‌లో ప్రధాని మోదీ దౌత్య విజయం.. ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం!

భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సభ్య దేశాలన్నీ న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అంతర్జాతీయంగా పలు కీలక సంక్షోభాలు కొనసాగుతున్న వేళ.. యుద్ధాల కంటే చర్చలు, దౌత్యం ద్వారానే వివాదాలకు పరిష్కారం కనుగొనాలనే సందేశాన్ని బ్రిక్స్ దేశాలు మరోసారి స్పష్టం చేశాయి.

BRICS 2026: భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.. ప్రత్యేక ఆకర్షణగా తామర లోగో!

BRICS 2026: భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.. ప్రత్యేక ఆకర్షణగా తామర లోగో!

దేశ రాజధాని ఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సజరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేవాశానికి ఏఏ దేశాల అధ్యక్షులు వస్తున్నారు, వారికి భారత్ ఎలాంటి ఆథిత్యం ఇవ్వబోతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాబట్టి వాటి గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

జస్ట్ రూ.32కే కిలో ఉల్లిపాయలు.. ప్రజలకు డబుల్ ధమాకా..

జస్ట్ రూ.32కే కిలో ఉల్లిపాయలు.. ప్రజలకు డబుల్ ధమాకా..

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ ప్రకటించింది. వచ్చే వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 115 రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ.32కే అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్‌తో పాటు సబ్సిడీపై కందిపప్పు అందించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మార్కెట్ ధర కంటే 25–30 శాతం తక్కువకు కందిపప్పు పంపిణీ చేయనున్నారు. త్వరలో పామాయిల్‌ను కూడా రేషన్ ద్వారా అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.

ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తోంది.. ఎస్ఆర్సీసీ వేడుకల్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!

ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తోంది.. ఎస్ఆర్సీసీ వేడుకల్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!

పాలసీ పక్షవాతం నుండి గతిశీలత వైపు భారత్ వేగంగా దూసుకుపోతోందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికసిత్, ఆత్మనిర్భర్ భారత్‌గా దేశాన్ని మారుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్ఆర్సీసీ వలను, పూర్వ విద్యార్థులను ప్రశంసించారు. ఈ సందర్భంగా రూ.100 ప్రత్యేక నాణెం విడుదల చేశారు.

తెలంగాణ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర నిర్ణయం!

తెలంగాణ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర నిర్ణయం!

తెలంగాణ వాసులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మరో గుడ్‌న్యూస్ చెప్పారు. తెలంగాణలో మరో ఎయిర్‌ నిర్మాణానికి సిద్దమవుతున్నట్టు స్పష్టం చేశారు. శ్రీ సీతారామచంద్రస్వామి కొలువై ఉన్న భద్రాద్రి జిల్లాల్లో త్వరలో కొత్త ఎయిర్‌ పోర్టు నిర్మించాలను ఇందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

PM Modi: దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని మోదీ

PM Modi: దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని మోదీ

PM Modi: భారత వృద్ధిని చూసి కొందరు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని అయినా వాటిని పటాపంచలు చేస్తూ దేశాన్ని ప్రజలు వృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారు. భవిష్యత్తులో దేశ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అందుకోసం ఆత్మనిర్భర భారత్‌గా మారడం అత్యవసరం అన్నారుస్వదేశీ ఉత్పత్తులను..