బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MBA)పూర్తి చేసి.. 2012లో 10టీవీ ప్రారంభంతో తెలుగు మీడియా రంగంలోకి అడుగు పెట్టాను. మొదట్లో హైదరాబాద్లో క్రైమ్ రిపోర్టింగ్లో ఉన్న నేను 2013 చివర్లో ఢిల్లీ బ్యూరోకు బదిలీపై వచ్చాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, భారతదేశం వేదికగా జరిగిన G-20 శిఖరాగ్ర సదస్సు సహా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఢిల్లీ నుంచి కవర్ చేశాను.
సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సహా లీగల్ అంశాలు, పార్లమెంట్ వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. PIB అక్రెడిటెడ్ జర్నలిస్ట్గా కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల వార్తలతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సహా రాజకీయ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేశాను. ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమం, భూకంపాలు, వరదలు, వడగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వార్తలు సహా అనేకాంశాలపై వార్తలు అందిస్తూ వస్తున్నాను. 2025లో TV9లో ‘బ్యూరో చీఫ్’గా బాధ్యతలు చేపట్టి, ఢిల్లీ బ్యూరో బాధ్యతల్లో కొనసాగుతున్నాను.
కడప రైతు వరదరాజ్కు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా..?
PM Modi Mann Ki Baat Telugu: 137వ మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన రైతు వరదరాజ్ను ప్రస్తావించారు. అవకాడో సాగుతో అదనపు ఆదాయం పొందుతున్న వరదరాజ్ గురించి ప్రశంసిస్తూ, వ్యవసాయంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని రైతులకు సూచించారు.
- Gopikrishna Meka
- Updated on: Aug 30, 2026
- 3:39 pm
Nepal Floods: ఒక్కొక్కరిది ఒక్కో కథ.. 700 మంది మృతి.. తెలియరాని 3 వేల మంది ఆచూకీ!
నేపాల్ను కుదిపేస్తున్న జల ప్రళయంలో మృతుల సంఖ్య 700కు చేరగా.. మరో 3 వేల మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. బోటేకోషి నదీ పరివాహక ప్రాంతాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వరదల్లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం నేపాల్, చైనా అధికారులతో సమన్వయం చేస్తోంది. NDRF, భారత సైన్యం, వైద్య, ఫోరెన్సిక్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. నేపాల్కు భారత్ భారీగా అత్యవసర సహాయ సామగ్రిని పంపిస్తోంది.
- Gopikrishna Meka
- Updated on: Aug 30, 2026
- 9:28 am
NTA Director: ఎన్టీఏ డైరెక్టర్గా ఏపీ కేడర్ ఐఏఎస్ వి. ప్రసన్న వెంకటేష్
NTA Director: ప్రసన్న వెంకటేష్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం (కోయంబత్తూరు) నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన ప్రసన్న వెంకటేష్ 2012లో ఐఏఎస్లో చేరారు. పాడేరు సబ్-కలెక్టర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్, పార్వతీపురం..
- Gopikrishna Meka
- Updated on: Aug 28, 2026
- 2:31 pm
నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరులు.. ఆచూకీ కోసం సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులు రక్షణ కోసం తెలంగాణ సర్మార్ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, హైదరాబాద్ సచివాలయ హెల్ప్లైన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, బాధితులకు అవసరమైన సహాయం అందిస్తోంది. వంద కాల్స్కు పైగా స్వీకరించి, సీఎం ఆదేశాల మేరకు విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రజల క్షేమాన్ని నిర్ధారిస్తోంది.
- Gopikrishna Meka
- Updated on: Aug 28, 2026
- 7:09 am
PM Modi: మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమైన ప్రధాని మోదీ.. ఇదిగో పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో ఆయన పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశాలతో భారత్ వ్యూహాత్మక సంబంధాలను బలోపేతమే లక్ష్యంగా ప్రధాని ఈ పర్యటనకు వెళ్లనున్నారు.
- Gopikrishna Meka
- Updated on: Aug 27, 2026
- 7:42 pm
నేపాల్ వరదల్లో 33 దేశాల పర్యాటకులు అదృశ్యం.. ఏయే దేశాల వారు ఎంతమంది అంటే..?
నేపాల్లో భోటేకోషి, త్రిశూలి నదుల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటివరకు 33 దేశాలకు చెందిన 644 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ జాతీయ పర్యాటక బోర్డు వెల్లడించింది. వీరిలో 178 మంది భారతీయులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతుండగా, ఇప్పటివరకు 177 మృతదేహాలు వెలికితీశారు.
- Gopikrishna Meka
- Updated on: Aug 27, 2026
- 4:52 pm
Khelo India: తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగబోతున్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ వేదికగా ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ ఎడిషన్లో మొత్తం 25 క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా సుమారు 6వేల మంద క్రీడాకారులు పాల్గొననున్నారు.
- Gopikrishna Meka
- Updated on: Aug 26, 2026
- 9:04 pm
భారత రైల్వే నెట్వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు
దేశ రైల్వే నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. అత్యంత రద్దీగా ఉండే ఏడు హై-డెన్సిటీ రైల్వే మార్గాలను నాలుగు లైన్లుగా విస్తరించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దాదాపు 11,000 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ మార్గాలు దేశ రైల్వే నెట్వర్క్లో కేవలం 16 శాతం ఉన్నప్పటికీ.. మొత్తం రైల్వే ట్రాఫిక్లో 41 శాతం రాకపోకలను ఇవే నిర్వహిస్తున్నాయి.
- Gopikrishna Meka
- Updated on: Aug 26, 2026
- 7:37 pm
దేశ యువతకు ప్రధాని మోదీ కీలక సందేశం.. ఖేలో ఇండియా డైలాగ్లో దిశానిర్దేశం..!
జాతీయ క్రీడా దినోత్సవం-2026 సందర్భంగా దేశ యువతతో మాట్లాడనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. .గురువారం (ఆగస్టు 27) ఖేలో ఇండియా డైలాగ్ - ఖేల్ కీ బాత్ ప్రధాని మోదీ కే సాథ్ కార్యక్రమంలో యువతతో వర్చువల్గా మాట్లాడనున్నారు. దేశవ్యాప్తంగా 1,500కు పైగా విద్యా సంస్థల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి జిల్లాలోని రెండు కళాశాలల్లో యువ సంవాద్ నిర్వహిస్తారు.
- Gopikrishna Meka
- Updated on: Aug 26, 2026
- 11:54 am
పైలట్స్ బీ అలర్ట్.. ఇకపై ప్రతి ఏటా డోపింగ్ పరీక్ష !
ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం ఘటన నేపథ్యంలో ప్రతి వాణిజ్య పైలట్కు ఏటా తప్పనిసరి రాండమ్ డోపింగ్ టెస్ట్ నిర్వహించే ప్రతిపాదనను కేంద్ర పరిశీలిస్తోంది. ప్రస్తుతం 10 శాతం మందికే టెస్టులు జరుగుతుండగా దీనిని100 శాతానికి పెంచాలని డీజీసీఏ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
- Gopikrishna Meka
- Updated on: Aug 25, 2026
- 10:16 pm
Konda Surekha: మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కీలక పరిణామం.. అధిష్టానం కీలక నిర్ణయం!
తెలంగాణ కాంగ్రెస్లో గత వారం రోజులుగా మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె పార్టీ నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన క్రమశిక్షణా కమిటీ విచారణ జరిపి పూర్తి నివేదికలను అధిష్టానంకు సమర్పించింది. అయితే దీనిని సీరియస్గా తీసుకున్న AICC కొండా సురేఖపై చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
- Gopikrishna Meka
- Updated on: Aug 25, 2026
- 10:01 pm
India Post: పోస్టాఫీస్కు వెళ్లే పనిలేదు.. ఇకపై ఇంటి నుంచే ఇండియా పోస్ట్ సర్వీసులు..
పోస్టల్ వినియోగదారులకు ఇదో గుడ్న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా పోస్ట్ సేవలు అరచేతిలోకి వచ్చేశాయి. డాక్ సేవతో ప్రజలకు, డాక్ మిత్రతో పోస్టల్ సిబ్బందికి డిజిటల్ అప్లికేషన్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై పోస్టాఫీస్ కి వెళ్లకుండా నేరుగా ఇంటి నుంచే ఇండియా పోస్ట్ సేవలు పొందేలా ఇండియన్ పోస్ట్ అత్యాధునిక సేవలను ప్రారంభించింది.
- Gopikrishna Meka
- Updated on: Aug 24, 2026
- 10:05 pm