బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MBA)పూర్తి చేసి.. 2012లో 10టీవీ ప్రారంభంతో తెలుగు మీడియా రంగంలోకి అడుగు పెట్టాను. మొదట్లో హైదరాబాద్లో క్రైమ్ రిపోర్టింగ్లో ఉన్న నేను 2013 చివర్లో ఢిల్లీ బ్యూరోకు బదిలీపై వచ్చాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, భారతదేశం వేదికగా జరిగిన G-20 శిఖరాగ్ర సదస్సు సహా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఢిల్లీ నుంచి కవర్ చేశాను.
సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సహా లీగల్ అంశాలు, పార్లమెంట్ వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. PIB అక్రెడిటెడ్ జర్నలిస్ట్గా కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల వార్తలతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సహా రాజకీయ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేశాను. ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమం, భూకంపాలు, వరదలు, వడగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వార్తలు సహా అనేకాంశాలపై వార్తలు అందిస్తూ వస్తున్నాను. 2025లో TV9లో ‘బ్యూరో చీఫ్’గా బాధ్యతలు చేపట్టి, ఢిల్లీ బ్యూరో బాధ్యతల్లో కొనసాగుతున్నాను.
ప్రధాని మోదీతో బండి సంజయ్ భేటీ.. కరీంనగర్ మున్సిపల్ విజయంపై ప్రశంసలు!
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ పరిణామాలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకోవడంపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, అభివృద్ధి నినాదంతోనే తాము ప్రజల్లోకి వెళ్లామని, ప్రజలు బీజేపీ నాయకత్వంపై నమ్మకం ఉంచారని బండి సంజయ్ ప్రధానికి వివరించారు.
- Gopikrishna Meka
- Updated on: Apr 2, 2026
- 10:12 pm
పశ్చిమ ఆసియా సంక్షోభంపై అప్రమత్తమైన కేంద్రం.. మంత్రుల సాధికార బృందం కీలక భేటీ
పశ్చిమ ఆసియాలో క్షీణిస్తున్న పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అనధికారిక మంత్రుల సాధికార బృందం (ఐజీఓఎం) తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి, దాని ప్రభావం భారతదేశంపై ఎలా ఉండవచ్చనే దానిపై వివరంగా చర్చించారు.
- Gopikrishna Meka
- Updated on: Mar 29, 2026
- 8:03 am
వావ్.. అందుబాటులోకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. ఫోటోలు ఇవిగో
Noida International Airport inauguration: నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా నిలవనుంది. మొత్తం ప్రాజెక్ట్ నాలుగు దశల్లో ఫేజ్-1 నుంచి ఫేజ్-4 అభివృద్ధి చేయబడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 28న అధికారికంగా ప్రారంభించనున్నారు.
- Gopikrishna Meka
- Updated on: Mar 27, 2026
- 5:04 pm
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వస్తుందా..? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ షార్టేజ్ సంగతేమోగానీ.. అన్ని సరుకుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే భయంతో తెగ కొనేస్తున్నారు జనం. నూనెలు, పప్పులు, ఇతర నిత్యావసర సామానును ముందస్తుగా కొని నిల్వ చేసుకుంటున్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లకు జనం బారులు తీరుతున్నారు.
- Gopikrishna Meka
- Updated on: Mar 27, 2026
- 11:37 am
NHRC: తూర్పు గోదావరి జిల్లా కల్తీపాల ఘటనను సుమోటోగా స్వీకరించిన NHRC, నోటీసులు జారీ!
తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాల వల్ల 16 మంది మరణించిన ఘటనపై NHRC సుమోటాగా విచారణకు స్వీకరించింది. పాలలో ఇథిలీన్ గ్లైకాల్ వంటి విష పదార్థం ఉన్నట్లు అనుమానాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశాల జారీ చేసింది. బాధితుల ఆరోగ్య పరిస్థితి, దర్యాప్తు పురోగతి, మృతుల కుటుంబాలకు అందించిన పరిహారం వివరాలను నివేదికలో పొందుపరచాలని తెలిపింది.
- Gopikrishna Meka
- Updated on: Mar 26, 2026
- 6:23 pm
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజాగ్రహాన్ని అణిచివేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ చేపట్టిన 'చలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని అడ్డుకోవడం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు సీనియర్ నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆయన ఖండించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం ప్రభుత్వ అభద్రతాభావానికి నిదర్శనమని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా పోలీస్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని,
- Gopikrishna Meka
- Updated on: Mar 23, 2026
- 3:13 pm
మారుతున్న భారత రక్షణ వ్యూహం.. సైన్యంలో చేరిన మరో ‘ఈగిల్’ టీమ్.. ఇక శత్రువులకు చుక్కలే!
ఆధునిక యుద్ధంలో సరికొత్త గేమ్ ఛేంజర్గా డ్రోన్లు ఆవిర్భవిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుంచి పశ్చిమ ఆసియా ఘర్షణల వరకు, యుద్ధంలో డ్రోన్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. ఈ మారుతున్న యుద్ధ స్వరూపాన్ని గుర్తించిన భారత సైన్యం, తన సైనికులందరినీ డ్రోన్ యోధులుగా తయారు చేస్తోంది.
- Gopikrishna Meka
- Updated on: Mar 22, 2026
- 10:46 am
సునీతక్కా.. ఆ లేఖను ఎందుకు దాచారు.. ఇదేనా మీ పోరాటం.. ఎంపీ అవినాష్ ఫైర్..
వివేకా హత్య కేసు విచారణ వెనుక అసలు నిజాలను తొక్కిపెట్టి, రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. సీబీఐ దర్యాప్తులో లొసుగులు ఉన్నాయన్నారు. ఢిల్లీ వేదికగా వివేకా కుమార్తె సునీతారెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఆయన, ఈ కేసును కేవలం చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే వాడుకుంటున్నారని మండిపడ్డారు. హత్య చేసినట్లు స్వయంగా ఒప్పుకున్న నిందితుడికి సునీత అండగా నిలబడటం వెనుక మర్మమేంటని ఆయన నిలదీశారు.
- Gopikrishna Meka
- Updated on: Mar 17, 2026
- 8:04 am
Rain Alert: ఇక వర్షాలే వర్షాలు.. చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
మార్చి నెలలోనే ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. పశ్చిమ హిమాలయాలను సమీపిస్తున్న పశ్చిమ అల్పపీడనం కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో తుఫాను పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ, హర్యానా, యుపి, రాజస్థాన్, హిమాచల్, పంజాబ్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.
- Gopikrishna Meka
- Updated on: Mar 15, 2026
- 10:57 am
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు కేంద్రం అదిరిపోయే గుడ్న్యూస్.. ఇక ప్రయాణం మరింత సులభం!
Hyderabad Regional Ring Rail: హైదరాబాద్ శివారు ప్రాంత ప్రజలకు ఇదో గుడ్న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీకి సర్వే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
- Gopikrishna Meka
- Updated on: Mar 14, 2026
- 4:39 pm
నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక.. కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన సీతక్క
నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలోని ములుగు జిల్లాను కేంద్రం ఎంపిక చేసింది. ములుగు జిల్లాను ఎంపిక చేయడం పట్ల తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.
- Gopikrishna Meka
- Updated on: Mar 14, 2026
- 12:16 pm
Cinema : తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టులో విచారణ….ఏం జరిగిందంటే ?
సినిమా టికెట్ ధరల పెంపుపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించింది సుప్రీంకోర్టు . ఈ కేసుపై విచారణ జరిపింది జస్టిస్లు జెకె మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం. టికెట్ రేట్లు పెంచుతున్నట్లు సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని జనవరిలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు. దీనిపై సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసిన మైత్రీ మూవీ మేకర్స్.
- Gopikrishna Meka
- Updated on: Mar 13, 2026
- 6:47 pm