Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopikrishna Meka

Gopikrishna Meka

Delhi Bureau chief - TV9 Telugu

gopikrishna.meka@tv9.com

బిజినెస్ మేనేజ్మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MBA)పూర్తి చేసి.. 2012లో 10టీవీ ప్రారంభంతో తెలుగు మీడియా రంగంలోకి అడుగు పెట్టాను. మొదట్లో హైదరాబాద్‌లో క్రైమ్ రిపోర్టింగ్‌లో ఉన్న నేను 2013 చివర్లో ఢిల్లీ బ్యూరోకు బదిలీపై వచ్చాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, భారతదేశం వేదికగా జరిగిన G-20 శిఖరాగ్ర సదస్సు సహా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఢిల్లీ నుంచి కవర్ చేశాను.

సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సహా లీగల్ అంశాలు, పార్లమెంట్ వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. PIB అక్రెడిటెడ్ జర్నలిస్ట్‌గా కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల వార్తలతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సహా రాజకీయ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేశాను. ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమం, భూకంపాలు, వరదలు, వడగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వార్తలు సహా అనేకాంశాలపై వార్తలు అందిస్తూ వస్తున్నాను. 2025లో TV9లో ‘బ్యూరో చీఫ్‌’గా బాధ్యతలు చేపట్టి, ఢిల్లీ బ్యూరో బాధ్యతల్లో కొనసాగుతున్నాను.

Read More
Nara Lokesh: ఆయనతో భేటీ నా జీవితంలో కీలక మలుపు.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Nara Lokesh: ఆయనతో భేటీ నా జీవితంలో కీలక మలుపు.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రతి మనిషికి జీవితంలో కొన్ని కీలక మలుపులు ఉంటాయి. అలాగే ప్రధాని మోదీతో జరిగిన సమావేశం తన జీవితంలోనూ కీలక మలుపుల్లో ఒకటిగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లొకేష్‌ తెలిపారు. ఆయనతో జరిగిన సమావేశం మాటలతో వర్ణించలేనిదని లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్‌ కేంద్రమంత్రులతో సమావేశం తర్వాత మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా ప్రధానితో సమావేశమైన భేటీని ఆయన గుర్తుచేసుకున్నారు.

Nara Lokesh: టోనీ బ్లెయిర్‌తో లోకేష్ భేటీ.. ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్ష

Nara Lokesh: టోనీ బ్లెయిర్‌తో లోకేష్ భేటీ.. ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్ష

బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్(టిబిఐ) వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూడిల్లీలో భేటీ అయ్యారు. న్యూడిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో టోనీ బ్లెయిర్‌ను మంత్రి లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు.

Nara Lokesh: ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా మంత్రి లోకేష్.. రాష్ట్ర సమస్యలపై కేంద్రమంత్రులతో భేటీ!

Nara Lokesh: ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా మంత్రి లోకేష్.. రాష్ట్ర సమస్యలపై కేంద్రమంత్రులతో భేటీ!

ఇదీ ఏడాదిలో జరిగిన డెవలప్‌మెంట్... అదీ రాబోవు నాలుగేళ్లలో మా కమిట్‌మెంట్ అంటూ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌. వరుసబెట్టి కేంద్రమంత్రులను కలుస్తూ ఏడాదిలో కూడి ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని వివరించారు. దీనితో పాటు రాష్ట్రంలోని పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు.

Nara Lokesh: ఉపరాష్ట్రపతితో మంత్రి నారా లోకేష్ కీలక భేటి.. ఎందుకంటే.?

Nara Lokesh: ఉపరాష్ట్రపతితో మంత్రి నారా లోకేష్ కీలక భేటి.. ఎందుకంటే.?

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాదిపాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు

ఫాస్టాగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం..! ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమలు

ఫాస్టాగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం..! ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమలు

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 3 వేలు చెల్లించి ఏడాది పాటు 200 ట్రిపులు జాతీయ రహదారులపై ప్రయాణించే అవకాశం కల్పించే కొత్త ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌ను ప్రవేశపెట్టింది. ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుంది. ఇది 200 ట్రిప్పులు లేదా ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది.

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. కీలక ఆపరేషన్‌ మొదలుపెట్టిన భారత్‌! ఇప్పటికే 100 మందికి పైగా..

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. కీలక ఆపరేషన్‌ మొదలుపెట్టిన భారత్‌! ఇప్పటికే 100 మందికి పైగా..

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడంతో, ఇరాన్‌లో చిక్కుకున్న 10,000 మంది భారతీయులను రక్షించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. గగనతలం మూసివేయబడటంతో, భూమార్గాల ద్వారా అర్మేనియా చేరుకుని, అక్కడి నుండి విమానాల ద్వారా భారతదేశానికి తరలించే ప్రణాళికను రూపొందించింది. భారత రాయబార కార్యాలయం, సురక్షిత ప్రదేశాలకు తరలింపు, హెల్ప్‌లైన్ నంబర్లను అందించడం ద్వారా సహాయం అందిస్తోంది.

Census: రెండు విడతల్లో కుల-జనగణన.. గెజిట్ విడుదల.. ఎప్పటివరకు వరకు పూర్తవుతుందంటే..

Census: రెండు విడతల్లో కుల-జనగణన.. గెజిట్ విడుదల.. ఎప్పటివరకు వరకు పూర్తవుతుందంటే..

దేశంలో 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు జన గణన జరగనుంది. రెండు దశల్లో పూర్తి కానున్న జన, కుల గణన పూర్తి చేయాలని హోం మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జనగణనపై గెజిట్ విడుదల చేసింది. దేశంలో రెండు విడతల్లో జనగణన జరగనుంది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్‌లో.. 2026 అక్టోబర్ 1 నాటికి కుల జనగణన ముగియనుంది. మిగతా రాష్ట్రాల్లో 2027మార్చి 1నాటికి జనగణన పూర్తికానుంది.

విమాన ప్రమాదాలపై దర్యాప్తుకు ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ.. ఎవరెవరున్నారు, వారు ఏం చేస్తారు?

విమాన ప్రమాదాలపై దర్యాప్తుకు ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ.. ఎవరెవరున్నారు, వారు ఏం చేస్తారు?

ఏదైనా ప్రమాదం, తప్పు, సంఘటన జరిగితేనే దానిపై ఎవరైనా దృష్టి పెడతారు. ఇప్పుడు అదే జరిగింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా AI 171 బోయింగ్ విమాన ప్రమాదంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మేల్కొంది. విమాన ప్రమాదం ఏ విధంగా జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని అంశంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృతంలో ఈ కమిటీ పనిచేయనుంది.

Black Box: ఢిల్లీకి ఎయిర్ ఇండియా AI 171 విమాన బ్లాక్ బాక్స్ .. 24 నుంచి 48 గంటల్లో డేటా రికవరీ!

Black Box: ఢిల్లీకి ఎయిర్ ఇండియా AI 171 విమాన బ్లాక్ బాక్స్ .. 24 నుంచి 48 గంటల్లో డేటా రికవరీ!

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభమైంది. ప్రమాదం జరిగిన 27 గంటల తర్వాత విమానంలోని బ్లాక్‌ బాక్స్‌ను అధికారులు గుర్తించారు. ఈ బ్లాక్‌ బ్లాక్స్‌ను విశ్లేషిస్తే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ బ్లాక్‌ బ్లాక్స్‌ డేటాను విశ్లేషించడానికి సుమారు 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

వామ్మో ఇదేం ఎండరా నాయనా – ఉదయం 8.30 గంటలకే 45 డిగ్రీలు నమోదు

వామ్మో ఇదేం ఎండరా నాయనా – ఉదయం 8.30 గంటలకే 45 డిగ్రీలు నమోదు

నైరుతి రుతుపవనాల రాకతో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు, చల్లటి వాతావారణం నెలకొంటే ఉత్తరాది రాష్ట్రాలు ఎండ వేడిమితో భగ్గుమంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 -50 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి.. మరో రెండు రోజులపాటు ఢిల్లీ, యుపి, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.. ప్రస్తుతం ఢిల్లీలో రెడ్ అలెర్ట్ కొనసాగుతుంది.

Telangana’s SLBC Tunnel: జులై చివరి నుంచి SLBC టన్నెల్ పనుల పునరుద్ధరణ..12 నుంచి ప్రత్యేక సర్వే..!

Telangana’s SLBC Tunnel: జులై చివరి నుంచి SLBC టన్నెల్ పనుల పునరుద్ధరణ..12 నుంచి ప్రత్యేక సర్వే..!

టన్నెల్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం వచ్చే రెండేళ్లలో మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ మార్గం పూర్తి చేయడానికి రక్షణ శాఖ సహకారం కోరింది తెలంగాణ ప్రభుత్వం..ఈమేరకు ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులను తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ,అధికారులు కలిశారు..SLBC సొరంగం పూర్తి చేయడానికి ఆర్మీ,ఎయిర్ ఫోర్స్ సహకారం ఇవ్వాలని రక్షణ శాఖ అధికారులను కోరారు..దీనికి అంగీకరించిన రక్షణ శాఖ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు.

పాక్ సైన్యం కాల్పుల్లో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం ప్రకటించిన కేంద్ర హోంశాఖ..ఎంతంటే..

పాక్ సైన్యం కాల్పుల్లో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం ప్రకటించిన కేంద్ర హోంశాఖ..ఎంతంటే..

సరిహద్దు జిల్లాల నుంచి మొత్తం 3.25 లక్షల మందిని సరక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆహారం, నీరు, ఆరోగ్య సంరక్షణ, విద్యుత్ సదుపాయంతో కూడిన దాదాపు 397 రక్షణ, వసతి కేంద్రాలలో 15,000 మందిని ఉంచారు.రోగులను చికిత్స కోసం ఆసుపత్రులకు తీసుకెళ్లేందకు సరిహద్దు జిల్లాలన్నింటిలో కలిపి మొత్తం 394 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో 62 అంబులెన్సులు కేవలం పూంచ్ జిల్లాలోనే సేవలందించాయి.

అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది