![వైసీపీ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/02/ysrcp-1.jpg)
వైసీపీ
వైఎస్సార్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)ని నెలకొల్పారు. కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా 2010 నవంబరు 29న ఎంపీ పదవికి రాజీనామా చేసిన జగన్.. 2010 డిసెంబరు 7న కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు పులివెందులలో ప్రకటించారు. 2011 మార్చిలో తన పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా ప్రకటించారు. సమైక్యవాద నినాదంతో ఏపీలో పట్టు సాధించారు. 2014 ఎన్నికల్లో 67 స్థానాలకు పరిమితమై అధికారాన్ని కోల్పోయినప్పటికీ ప్రత్యేక హోదా కోసం ప్రజా ఉద్యమాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా ఆవిర్భవించింది. 2019 ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 స్థానాలు సాధించి వైఎస్ జగన్ నవ్యాంధ్రప్రదేశ్కు రెండో ముఖ్యమంత్రి అయ్యారు. నాటి ఎన్ని్కల్లో మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఏకంగా 22 స్థానాల్లో విజయం సాధించి వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్ ప్రకటించిన జనాకర్షక పథకాలు ఆ పార్టీ విజయానికి దోహదపడ్డాయి. 2014 ఎన్నికల్లో 44.47 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్సీపీ.. 2019లో తన ఓటింగ్ శాతాన్ని 49.95 శాతానికి పెంచుకుంది. సమైక్యవాద నినాదం కారణంగా 2014లో తెలంగాణలో వైఎస్సార్సీపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
YS Jagan: ఇండి కూటమిలో వైసీపీ చేరబోతోందా.. ? జగన్ ఆన్సర్ ఇదే
ఇండి కూటమిలో వైసీపీ చేరబోతోందా.. ? జగన్ అందుకే ఢిల్లీకి వెళ్లారని టీడీపీ నేతలు చేస్తోన్న విమర్శలపై వైసీపీ అధినేత ఇచ్చిన క్లారిటీ ఏంటి..? కలిసొచ్చే పార్టీలతో భవిష్యత్లోనూ పోరాటం చేయడానికి జగన్ రెడీ అయ్యారా..? తెలంగాణ సీఎం రేవంత్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారా..?
- Ram Naramaneni
- Updated on: Jul 26, 2024
- 8:16 pm
AP Enquiry Times: గత అక్రమాలపై ఫోకస్.. వరుస శ్వేతపత్రాలతో విచారణకు సిద్ధమవుతున్న ఏపీ సర్కార్!
గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి మాటున అవినీతి జరిగిందా? అక్రమాలు, దోపిడీలు.. అంతకుమించి అనేలా పెరిగిపోయాయా? ప్రభుత్వం మారాక దస్త్రాల దగ్ధం ఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి? మ్యాటర్ ఏదైనా మర్మమేంటోనన్న చర్చ నడుస్తోంది. ఇటు చంద్రబాబు ప్రభుత్వం మాత్రం.. నిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణకు ఆదేశిస్తోంది. ఏపీ గట్టుపై ఇప్పుడు ఎంక్వైరీల టైమ్ హీట్ పుట్టిస్తోంది
- Balaraju Goud
- Updated on: Jul 26, 2024
- 8:24 am
ఐఏఎస్ సంతకం ఫోర్జరీ.. కష్టాల్లో నగర మేయర్.. ఏం జరిగిందంటే..
నెల్లూరు మేయర్ స్రవంతిని కష్టాలు వెంటాడుతున్నాయి. మేయర్ భర్త ఐఏఎస్ సంతకం ఫోర్జరీ కేసులో నిండాతుడిగా ఉన్నారు. నేడో, రేపో అరెస్టు అన్నట్లుగా ఉంది పరిస్థితి. కష్టాల నుంచి బయటపడేందుకు మేయర్ టీడీపీ ముఖ్యనేతలను కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంతకీ నెల్లూరు మేయర్ను అంతలా వెంటాడుతున్న ఆ సమస్యలు ఏంటి.? నెల్లూరు కార్పొరేషన్ గత ఎన్నికల్లో వైసిపి వశమైంది మొత్తం 54 డివిజన్లో క్లీన్ స్వీప్ చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకునే అదృష్టం స్రవంతిని వరించింది.
- Ch Murali
- Updated on: Jul 25, 2024
- 9:15 pm
Watch Video: అసలు, వడ్డీ ఏపీ ప్రజలే కట్టాలి.. కేంద్ర బడ్జెట్పై విజయసాయి కీలక వ్యాఖ్యలు
కేంద్ర బడ్జెట్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యసభలో ఎన్డీయే, ఇండియా కూటమిపై ఆయన మండిపడ్డారు. బడ్జెట్లో మొత్తం రూ. 48 లక్షల కోట్లు ఏపీకే ఇచ్చారా ? అంటూ ప్రశ్నించారు.
- Janardhan Veluru
- Updated on: Jul 25, 2024
- 6:18 pm
CM Chandrababu: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరపరిణామం.. నవ్వులు పూయించిన సీఎం చంద్రబాబు..
ఏపీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబునాయుడు..గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై పెట్టిన కేసులను అసెంబ్లీ సాక్షిగా వివరించారు. ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గతప్రభుత్వం పనితీరును సీఎం చంద్రబాబు ఎండగడుతున్నారు. లిక్కర్ పాలసీ విధానంపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ తరువాత రాష్ట్రంలో 2014-2019 మధ్య లా అండ్ ఆర్ఢర్ సజావుగా సాగేదన్నారు. గతం ఐదేళ్లలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదన్నారు.
- Srikar T
- Updated on: Jul 25, 2024
- 3:53 pm
YS Jagan: ఢిల్లీలో ముగిసిన వైఎస్ జగన్ దీక్ష.. ఈ జాతీయ పార్టీ నేతల మద్దతు..
ఢిల్లీలో వైఎస్ జగన్ నిరసన దీక్ష ముగిసింది. దేశ వ్యాప్తంగా 8పార్టీల నేతల మద్దతు లభించింది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మహారాష్ట్ర నుంచి ఉద్ధవ్ శివసేన, వెస్ట్ బెంగాల్ నుంచి టీఎంసీ, తమిళనాడు నుంచి ఏఐడీఎంకే, ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్ వాదీ పార్టీ, ఢిల్లీ, పంజాబ్ నుంచి ఆమ్ఆద్మీ పార్టీ ఇలా పలు పార్టీల నేతలు మద్దతు పలికారు.
- Srikar T
- Updated on: Jul 24, 2024
- 4:43 pm
YS Jagan Dharna: ఏపీలో శాంతిభద్రతలు లోపించాయంటూ నిరసన.. ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆరోపిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. శాంతి, భద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ పోరు బాట పడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిరసన గళం వినిపించారు. జంతర్ మంతర్ దగ్గర వైఎస్ జగన్ ధర్నా చేపట్టారు.
- Balaraju Goud
- Updated on: Jul 24, 2024
- 12:14 pm
AP News: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఢిల్లీకి జగన్…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ బయల్దేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి జగన్ వెంట పార్టీ నేతలు కూడా వెళ్తున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న జగన్.. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి సహా పలువురి అపాయింట్మెంట్ కోరారు.
- Ram Naramaneni
- Updated on: Jul 23, 2024
- 10:12 am
AP Assembly Sessions 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులంటే.. బీఏసీలో కీలక నిర్ణయం..
అసెంబ్లీ కమిటీ హాలులో బీఏసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలతోపాటూ ఎన్ని రోజులు సభ నిర్వహించాలన్నదానిపై కూడా చర్చించారు. ఈ సమావేశానికి స్పీకర్ తోపాటూ సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఏపీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందకు సిద్దమయ్యారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో జూలై 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది.
- Srikar T
- Updated on: Jul 22, 2024
- 3:53 pm
YS Jagan: ఢిల్లీ వేదికగా ఏపీ సమరం.. భాగస్వామ్యం కావాలంటూ అన్ని పార్టీలను ఆహ్వానించిన వైసీపీ అధినేత జగన్..
ఏపీలో హింసపై పొలిటికల్ ఫైట్ జరుగుతోంది! ఏ చిన్న దాడి జరిగినా సరే.. అది రాజకీయ రంగు పులుముకుంది. దాడి చేసింది ఫలానా పార్టీ వాళ్లు.. బాధితులు తమ పార్టీ వాళ్లు అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం హత్యా రాజకీయ ఆరోపణలు ఏపీలో దుమారం రేపుతున్నాయి.
- Shaik Madar Saheb
- Updated on: Jul 22, 2024
- 1:21 pm
తిరుపతిలో ఆ స్థానంపై కన్నేసిన టీడీపీ.. ఆయోమయంలో లోకల్ లీడర్లు..
తిరుపతి కార్పొరేషన్. ఎన్నికల ముందు దాకా ఒకే పార్టీది ఆధిపత్యం. తిరుగులేని నాయకత్వం. ఇప్పుడు సీన్ మారింది. 50 డివిజన్లు ఉన్న తిరుపతి కార్పొరేషన్కు 3 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో పూర్తి మెజారిటీని వైసీపీ సొంతం చేసుకుంది. 49 డివిజన్లకు ఎన్నికలు జరిగితే 48 స్థానాలను వైసీపీ, ఒక్క డివిజన్ లోనే టిడిపి జెండా ఎగుర వేసింది. మేయర్గా శిరీష, డిప్యూటీ మేయర్లుగా భూమన అభినయ్, ముద్దుల నారాయణ ఎన్నిక అయ్యారు.
- Raju M P R
- Updated on: Jul 22, 2024
- 7:34 am
YS Jagan: గవర్నర్ను కలిసిన జగన్… రాష్ట్రంలో దాడులపై ఫిర్యాదు
గత 45 రోజులుగా ఏపీలో రాజకీయ హత్యలు, దాడులు జరుగుతున్నాయని గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్. దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
- Ram Naramaneni
- Updated on: Jul 21, 2024
- 8:27 pm
AP Assembly: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అసెంబ్లీ వేదికగా అల్లకల్లోలం
ఏపీకి మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. అమరావతిలో ఏర్పడ్డ ఈ వాయుగుండం.. సోమవారం అసెంబ్లీలో తీరం దాటనుంది. దీంతో అటు అధికార పక్షం.. ఇటు విపక్షం పూర్తిగా అలర్ట్ అయ్యాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు..వారి బలాబలాలను పూర్తిగా మోహరించాయి. మరి ఈ వాయుగుండం తీవ్రరూపం దాల్చి..తుఫానుగా మారుతుందా..? లేక అల్పపీడనంగా బలహీనపడి తుస్సుమంటుందా..?
- Ram Naramaneni
- Updated on: Jul 21, 2024
- 7:28 pm
AP Politics: ఢిల్లీకి చేరిన గల్లీ రాజకీయం.. పార్లమెంటు వేదికగా టీడీపీ, వైసీపీ బిగ్ వార్..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుతోంది. కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టేందుకు కొత్త ఫార్ములాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. దీనిపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఇక ఏపీలో వైసీపీ లీడర్లు, కేడర్పై జరుగుతున్న దాడులను పార్లమెంటులో ఎండగట్టేందుకు పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్ వ్యూహం సిద్ధం చేశారు.
- Balaraju Goud
- Updated on: Jul 21, 2024
- 7:57 am
YS Jagan: ఢిల్లీలో నిరాహార దీక్షకు సిద్దమైన వైఎస్ జగన్.. ఈ అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం..
ఏపీలో అధికార ఎన్డీయే కూటమి, విపక్ష వైసీపీల మధ్య పీక్స్కు చేరిన పొలిటికల్ ఫైట్లో ఢిల్లీ ట్విస్ట్ ఆసక్తికరంగా మారింది. ఏపీలో అధికార కూటమి వర్సెస్ విపక్ష వైసీపీ పంచాయితీ.. ఇక ఢిల్లీకి చేరనుంది. పార్లమెంటు సమావేశాల కోసం టీడీపీ, వైసీపీ వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి.
- Srikar T
- Updated on: Jul 20, 2024
- 11:15 pm