వైసీపీ
వైఎస్సార్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)ని నెలకొల్పారు. కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా 2010 నవంబరు 29న ఎంపీ పదవికి రాజీనామా చేసిన జగన్.. 2010 డిసెంబరు 7న కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు పులివెందులలో ప్రకటించారు. 2011 మార్చిలో తన పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా ప్రకటించారు. సమైక్యవాద నినాదంతో ఏపీలో పట్టు సాధించారు. 2014 ఎన్నికల్లో 67 స్థానాలకు పరిమితమై అధికారాన్ని కోల్పోయినప్పటికీ ప్రత్యేక హోదా కోసం ప్రజా ఉద్యమాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా ఆవిర్భవించింది. 2019 ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 స్థానాలు సాధించి వైఎస్ జగన్ నవ్యాంధ్రప్రదేశ్కు రెండో ముఖ్యమంత్రి అయ్యారు. నాటి ఎన్ని్కల్లో మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఏకంగా 22 స్థానాల్లో విజయం సాధించి వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్ ప్రకటించిన జనాకర్షక పథకాలు ఆ పార్టీ విజయానికి దోహదపడ్డాయి. 2014 ఎన్నికల్లో 44.47 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్సీపీ.. 2019లో తన ఓటింగ్ శాతాన్ని 49.95 శాతానికి పెంచుకుంది. సమైక్యవాద నినాదం కారణంగా 2014లో తెలంగాణలో వైఎస్సార్సీపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
విజయ్ ఈవీఎంల ద్వారానే గెలిచారా? మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..!
టీవీ9 'క్రాస్ఫైర్'లో మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్తో మాజీ మంత్రి రోజా జరిపిన సంభాషణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఏపీలో వైసీపీ ఓటమికి ఈవీఎంల గోల్ మాల్ కారణమని ఆరోపిస్తూనే, తమిళనాడులో విజయ్ గెలుపును సమర్థించారు. కేంద్రంపై వైసీపీకి ప్రత్యేక వైరం లేదని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక ఇంటర్య్వూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- Balaraju Goud
- Updated on: May 9, 2026
- 8:42 pm
సొంత పార్టీలో రోజాను తొక్కేస్తున్నది ఎవరు? పదవులు రాకుండా అడ్డుకుంది ఎవరు..?
టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ నిర్వహించిన 'క్రాస్ఫైర్' ప్రోగ్రామ్లో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ఎదుగుదలను సొంత పార్టీలోనే కొందరు అడ్డుకున్నారనే చర్చపై ఆమె స్పందించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి, రోజాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుందని ప్రచారం జరిగేది.
- Balaraju Goud
- Updated on: May 9, 2026
- 8:12 pm
Roja: వైసీపీ ఓటమికి కారణం ఏంటి.. రాజకీయాల్లో రోజా ఫైర్ తగ్గిపోయిందా..?
వైఎస్ జగన్ను టీవీకే అధినేత విజయ్ ఫాలో అయ్యారని.. మాజీమంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ను గెలిపించడమంటే జగన్ను అశీర్వదించడమే అన్నారు. విజయ్ను సీఎంగా తమిళనాడు ప్రజలు కోరుకున్నారని.. అవకాశం ఇస్తే అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటారని తెలిపారు. టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో రోజా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: May 9, 2026
- 7:46 pm
బెదిరింపులకు భయపడను.. వైఎస్సార్ ఘాట్ వద్ద అంబటి రాంబాబు భావోద్వేగంగా ప్రతిజ్ఞ..!
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద భావోద్వేగంగా ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్పై విమర్శలు చేసినందుకు గాను కడప జిల్లా వేంపల్లి, పులివెందుల పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణకు హాజరయ్యేందుకు ఆయన వేంపల్లి చేరుకున్నారు.
- Sudhir Chappidi
- Updated on: Apr 30, 2026
- 12:50 pm
Special Parliament Session: డీలిమిటేషన్.. మహిళా రిజర్వేషన్ల బిల్లు.. మ్యాజిక్ ఫిగర్ను మార్చే టైమ్ వచ్చేసింది..
మ్యాజిక్ ఫిగర్ను మార్చే టైమ్ వచ్చేసింది. దానికి సంబంధించిన తొలి అడుగు మరికొన్ని గంటల్లో పడబోతోంది. బట్.. రాగల 72 గంటల పాటు ఇదే అంశం దేశవ్యాప్తంగా మంటలు పుట్టించబోతోంది. ముఖ్యంగా దక్షిణాదిన. తాము వద్దంటున్న 'ఫార్ములా'నే కేంద్రం ఫైనలైజ్ చేయడంతో ఫుల్ గరం మీదున్నాయి దక్షిణాది రాష్ట్రాలు.
- Shaik Madar Saheb
- Updated on: Apr 16, 2026
- 8:44 am
వైసీపీ అధినేత జగన్ పార్టీలో ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వరా? ఎవరైనా తలాడించడమేనా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్రెడ్డి జగన్మోహన్ రెడ్డితో తన బంధం నమ్మకం, కృతజ్ఞతపై ఆధారపడిందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు, ఈవీఎంలలో అక్రమాలు, బీజేపీతో పార్టీ సంబంధాలు, అంతర్గత ప్రజాస్వామ్యం వంటి కీలక అంశాలపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్కు ఇచ్చిన క్రాస్ఫైర్లో మిథున్ రెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 9:05 pm
నారా కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా?
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నారా కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా? అమరరాజా కంపెనీ కొద్దిరోజులు మూసివేయడానికి, అదనపు పెట్టుబడులు పారపోవడానికి కూడా పెద్దిరెడ్డి కుటుంబమే కారణమా? రోజా, నారాయణస్వామి వంటి నాయకులపై వచ్చిన ఆరోపణలను నిజమేనా? దీనిపై సంచలన విషయాలు బయటపెట్టారు మిథున్రెడ్డి.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 8:44 pm
లిక్కర్స్కామ్లో మిథున్ రెడ్డి కుటుంబాన్ని ఇరికించింది విజయసాయిరెడ్డినా? మాస్టర్ మైండ్ ఎవరు?
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇది రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకున్న కక్ష సాధింపేనని ఆయన అన్నారు. తనపై వేల కోట్ల రూపాయల స్కామ్ ఆరోపణలకు ఒక్క రూపాయి సాక్ష్యమైనా చూపాలని సిట్కు, ఈడీకి సవాల్ విసిరారు. ఎలాంటి అక్రమ లావాదేవీలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 8:21 pm
పార్లమెంటులో పార్టీ ఎంపీల తీరుతో వైసీపీకి మైనస్గా మారిందా.. మిథున్ రెడ్డి క్లారిటీ ఇదే..!
వైసీపీ విధానపరంగానే అమరావతిని వ్యతిరేకిస్తుందా.. అందుకే పార్లమెంట్లో వాకౌట్ చేసిందా? ఎంపీల వ్యవహరించిన తీరుతో వైసీపీకి ఇది మైనస్గా మారిందా.. ఇదే అంశంపై ఆ పార్టీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మూడు రాజధానుల విషయంలో వైసీపీ నిర్ణయం వెనక్కు తీసుకుందా?
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 8:05 pm
మావిగన్ నినాదం తెరమీదకు ఎందుకు వచ్చింది? టీవీ9 క్రాస్ఫైర్లో మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యల
మూడు రాజధానుల విషయంలో వైసీపీ నిర్ణయం వెనక్కు తీసుకుందా? మరి సొంత పార్టీ నేతలకు జగన్ సమాధానం చెప్పగలరా.. ధర్మాన, రోజా వంటి నేతలు ప్రాంతీయవాదాలు తెరమీదకు తీసుకువస్తున్నారా? వైసీపీని ప్రజలు కూడా నమ్మడం లేదా.. అందుకే మావిగన్ నినాదం తెరమీదకు వచ్చిందా? టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్కు ఇచ్చిన క్రాస్ఫైర్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజధాని అమరావతిపై ఆసక్తికర అంశాలు వెల్లడించారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 6:50 pm
టెంపుల్ సిటీ తిరుపతిలో మరో వివాదం.. వన్ ప్రాజెక్టుకు భూ కేటాయింపులపై రాజకీయ రచ్చ!
టెంపుల్ సిటీ తిరుపతిలో ఇప్పుడు మరో వివాదంపై రచ్చ నడుస్తోంది. తిరుపతి వన్ ప్రాజెక్టుకు కేటాయించిన 22 ఎకరాల ప్రభుత్వ భూముల వివాదంపై సర్కార్తో వైసీపీ ఢీ అంటే ఢీ అంటోంది. విలువైన భూములను అనుభవం లేని సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టారని, దీని వెనుక వందల కోట్ల అవినీతి దాగి ఉందని వైసీపీ ఆరోపిస్తుంటే, ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని టీడీపీ అంతే బలంగా తిప్పికొడుతోంది
- Balaraju Goud
- Updated on: Apr 3, 2026
- 10:42 am
లోక్సభ ముందుకు ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లు.. మద్దతు పలికిన కాంగ్రెస్, వైసీపీ వాకౌంట్!
అమరావతి చట్టబద్ధతకు మరో కీలక అడుగు పడింది. ఇవాళ బుధవారం (ఏప్రిల్ 01, 2026 ) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత లోక్సభ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు తీసుకువచ్చారు. అయితే లోక్సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.
- Balaraju Goud
- Updated on: Apr 1, 2026
- 1:07 pm