వైసీపీ

వైసీపీ

వైఎస్సార్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)ని నెలకొల్పారు. కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా 2010 నవంబరు 29న ఎంపీ పదవికి రాజీనామా చేసిన జగన్.. 2010 డిసెంబరు 7న కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు పులివెందులలో ప్రకటించారు. 2011 మార్చిలో తన పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా ప్రకటించారు. సమైక్యవాద నినాదంతో ఏపీలో పట్టు సాధించారు. 2014 ఎన్నికల్లో 67 స్థానాలకు పరిమితమై అధికారాన్ని కోల్పోయినప్పటికీ ప్రత్యేక హోదా కోసం ప్రజా ఉద్యమాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా ఆవిర్భవించింది. 2019 ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 స్థానాలు సాధించి వైఎస్ జగన్ నవ్యాంధ్రప్రదేశ్‌కు రెండో ముఖ్యమంత్రి అయ్యారు. నాటి ఎన్ని్కల్లో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏకంగా 22 స్థానాల్లో విజయం సాధించి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్ ప్రకటించిన జనాకర్షక పథకాలు ఆ పార్టీ విజయానికి దోహదపడ్డాయి. 2014 ఎన్నికల్లో 44.47 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్‌సీపీ.. 2019లో తన ఓటింగ్ శాతాన్ని 49.95 శాతానికి పెంచుకుంది. సమైక్యవాద నినాదం కారణంగా 2014లో తెలంగాణలో వైఎస్సార్‌సీపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.

ఇంకా చదవండి

Jagan on Sharmila: చెల్లెలు షర్మిల వ్యవహారంపై టీవీ9 ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్

రిలేషన్స్‌లో రాజకీయాలు చొరబడితే కుటుంబాల్లో కల్మషం వస్తుందని సీఎం జగన్‌ అన్నారు. చెల్లెలు షర్మిల వ్యవహారంపై ఆయన స్పందించారు. కుట్ర కోణంలో ఉండే చంద్రబాబు ఆ వివాదాన్ని మరింత రెచ్చగొట్టారని అన్నారు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు సవాళ్లు వస్తాయని స్పష్టం చేశారు.

Jagan on BJP: బీజేపీ విషయంలో తనకు సాఫ్ట్‌ కార్నర్‌ ఏమి లేదు.. ప్రజల కోసం పోరాడుతాంః జగన్

బీజేపీ విషయంలో తనకు సాఫ్ట్‌ కార్నర్‌ ఏమి లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వ్యతిరేకించే విషయాల్లో కచ్చితంగా వ్యతిరేకిస్తామని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో తన వైఖరిని జగన్‌ విస్పష్టంగా టీవీ నైన్‌ వేదికగా వెల్లడించారు.

Jagan on Employeement: గతంలో కంటే 2 లక్షల ఉద్యోగాలు సృష్టించాం.. టీవీ9 ఇంటర్వ్యూలో జగన్ కీలక వ్యాఖ్యలు

తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అదనంగా 2 లక్షల 31 వేల ఉద్యోగాలు సృష్టించామని టీవీ నైన్‌ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడులకు తమ 59 నెలల పాలనలో వచ్చిన పెట్టుబడులను ఆయన వివరించారు.

‘ఏపీలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం..’ లెక్క ఎంతో చెప్పేసిన సీఎం జగన్..

తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అదనంగా 2 లక్షల 31 వేల ఉద్యోగాలు సృష్టించామని టీవీ నైన్‌ ఇంటర్వ్యూలో సీఎం జగన్‌ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడులకు తమ 59 నెలల పాలనలో వచ్చిన పెట్టుబడులను ఆయన వివరించారు. 2019 ఎన్నికలతో..

Jagan on Vizag: వైజాగ్‌ను తమ నెక్ట్స్ ఫిన్-టెక్ క్యాపిటల్‌గా చూస్తున్నారు.. నెక్ట్స్ సీఎంగా ఇక్కడే ప్రమాణస్వీకారంః జగన్

హైదరాబాద్‌లాంటి నగరం ఆంధ్రప్రదేశ్‌లో లేకపోవడం దురదృష్టమని సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి పనుల వల్ల వచ్చే పదేళ్లలో విశాఖ నగరం హైదరాబాద్‌, బెంగళూరుతో పోటీ పడే స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే పదేళ్లలో విశాఖను అభివృద్ధి చేసేందుకు రూ. 1,05,000 కోట్ల పెట్టుబడితో విజన్‌విశాఖను రూపొందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అగ్రగామి పారిశ్రామికవేత్తలంతా వైజాగ్‌ను తమ నెక్ట్స్ ఫిన్-టెక్ క్యాపిటల్‌గా చూస్తున్నారన్నారు. విశాఖ ప్రజల పట్ల ఉన్న నా నిబద్ధతకు […]

Jagan on Development: 14 ఏళ్లలో ఏనాడైనా ఇలాంటి అభివృద్ధి జరిగిందా..? జగన్ సూటి ప్రశ్న

ఏపీలో చేపడుతున్న విధానాలను దేశమంతా అనుసరిస్తుందని సీఎం జగన్ అన్నారు. మనస్సు పెట్టి తాము పరిపాలన చేస్తుండటమే దానికి కారణమని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రస్తావించారు. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో కొనసాగుతున్నామని తెలిపారు. అమరావతిలో మౌలిక సదుపాయాలకే లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు.

భూమిపై యజమానికే సర్వహక్కులు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

రాజకీయ స్వార్థంతో ల్యాండ్‌ టైటిల్‌ చట్టం గురించి అబద్ధాలు చెప్పడం చాలా దారుణమని సీఎం జగన్‌ అన్నారు. భూయజమానులకు ఎంతో మేలు చేసే చట్టం ఇది అని తెలిపారు. రిజస్ట్రేషన్‌ చేసుకున్న వారికి జిరాక్స్ పేపర్లు ఇస్తారని చెప్పడం అవాస్తవమని స్పష్టం చేశారు. భూములకు..

YS Jagan: పేదలకు ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వాల బాధ్యత.. ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలే మార్చాయిః జగన్

పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడం ప్రభుత్వాల బాధ్యత అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. ప్రజారోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు.

YS Jagan Mohan Reddy: 99శాతం హామీలు నెరవేర్చి మేనిఫెస్టోకు పవిత్రత తెచ్చాం.. – వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీవీ9 ఇంటర్వ్యూపై సూపర్ బజ్‌ క్రియేట్‌ అయింది. ఈ ఇంటర్వ్యూ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఐదేళ్ల తర్వాత తెలుగు మీడియా ముందుకు సీఎం జగన్‌ రావడంతో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. టర్వ్యూ అన్ని అంశాలపై సూటి ప్రశ్నలు.. స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు జగన్.

Jagan Ane Nenu: జనం జీవితాల్లో వెలుగులు నింపుతున్న జననేత‌తో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇంటర్వ్యూ

ఆయన అడుగులు పేదల అభ్యున్నతి వైపు. ఆయన ఆలోచనలు సంక్షేమాభివృద్ధి వైపు. ఒకటో తేదీ తొలిపొద్దుకే పెన్షన్ చేతిలో పెడుతున్న పెద్దకొడుకు. పేదరికంపై యుద్ధానికి చదువనే ఆయుధాన్నిస్తున్న నాయకుడు. నవరత్నాలతో కష్టాలు, కన్నీళ్లు తుడుస్తున్న పేదింటి పెద్దన్న. అక్కాచెల్లి-అవ్వాతాత అంటూ నోరారా పిలిచే ఏకైక ముఖ్యమంత్రి.

Watch Video: ‘ఏపీలో సంక్షేమ పథకాలు అడ్డుకోవడం దారుణం’.. వల్లభనేని వంశీ

గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాల విషయంలో ఈసీ పక్షపాత ధోరణి అవలంభిస్తోందన్నారు. గత ఎన్నికలకు ముందు పసుపు-కుంకమ పంపిణీకి అనుమతిచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు నాలుగేళ్లుగా నడుస్తున్న స్కీమ్స్‌ నిలిపివేశారని వివరించారు. పేదలను బాధపెట్టడమే చంద్రబాబు లక్ష్యం అని మండిపడ్డారు. ఓటు అనే ఆయుధంతో చంద్రబాబుకు సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో రైతుబంధు పంపిణీకి అనుమతిచ్చారని గుర్తుచేశారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 11:58 am

YS Jagan: ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సమాధానాలు.. సీఎం జగన్‌తో టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ సూపర్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.. డోన్ట్‌ మిస్..

TV9 interview with YS Jagan: ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే.. హైస్పీడులో ప్రచారంలో దూసుకెళ్తూ తాను చేసిన అభివృద్ధి.. కూటమి కుట్రలు.. భవిష్యత్తు గురించి చెబుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.

CM Jagan: జూన్ 4న విశాఖలోనే ముఖ్యమత్రిగా ప్రమాణస్వీకారం.. డేట్ ఫిక్స్ చేసిన జగన్!

ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కూటమిపై ఫైర్ అయ్యారు. కొనసాగుతున్న పథకాలను కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఓటు అనే ఆయుధంతో ప్రజలు కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదులుతుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి రాష్ట్రానికి ఇచ్చే హామీ ఏంటని ప్రశ్నించారు.

డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?

ఏపీలో సంక్షేమ పథకాల వ్యవహారం ఉన్నత న్యాయస్థానానికి చేరింది. అటు APలో సంక్షేమ పథకాలకు నిధుల విడుదలను ఎన్నికల కమిషన్‌ అడ్డుకోవడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యాదీవెన, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధుల విడుదలను అడ్డుకోవడంపై విద్యార్థులు, రైతులు..

CM Jagan: ఢిల్లీ వాళ్లతో కలిసి చంద్రబాబు కుట్రలు.. జగన్ సంచలన కామెంట్స్

ఎన్నికలకు రెండు నెలల ముందు అవ్వాతాతలకు ఇంటికి పెన్షన్‌ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని సీఎం జగన్ విమర్శించారు. అలాంటప్పుడు రెట్టించిన ఉత్సాహంతో అవ్వాతాతలు జగన్‌కు ఓటు వేయరా? అని ప్రశ్నించారు. జగన్‌ ఏదైతే బటన్‌లు నొక్కాడో.. ఆ బటన్‌లు నొక్కిన సొమ్ముకూడా రాకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తున్నారని జగన్ ఫైరయ్యారు.