AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీ

వైసీపీ

వైఎస్సార్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)ని నెలకొల్పారు. కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా 2010 నవంబరు 29న ఎంపీ పదవికి రాజీనామా చేసిన జగన్.. 2010 డిసెంబరు 7న కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు పులివెందులలో ప్రకటించారు. 2011 మార్చిలో తన పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా ప్రకటించారు. సమైక్యవాద నినాదంతో ఏపీలో పట్టు సాధించారు. 2014 ఎన్నికల్లో 67 స్థానాలకు పరిమితమై అధికారాన్ని కోల్పోయినప్పటికీ ప్రత్యేక హోదా కోసం ప్రజా ఉద్యమాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా ఆవిర్భవించింది. 2019 ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 స్థానాలు సాధించి వైఎస్ జగన్ నవ్యాంధ్రప్రదేశ్‌కు రెండో ముఖ్యమంత్రి అయ్యారు. నాటి ఎన్ని్కల్లో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏకంగా 22 స్థానాల్లో విజయం సాధించి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్ ప్రకటించిన జనాకర్షక పథకాలు ఆ పార్టీ విజయానికి దోహదపడ్డాయి. 2014 ఎన్నికల్లో 44.47 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్‌సీపీ.. 2019లో తన ఓటింగ్ శాతాన్ని 49.95 శాతానికి పెంచుకుంది. సమైక్యవాద నినాదం కారణంగా 2014లో తెలంగాణలో వైఎస్సార్‌సీపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.

ఇంకా చదవండి

Andhra Politics: జోగి రమేష్‌ అరెస్ట్‌తో ఏపీలో పొలిటికల్ తుఫాన్.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు?

కల్తీమద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్‌తో ఏపీలో పొలిటికల్ తుఫాన్ రేగింది. ఆయన అరెస్ట్ అక్రమం అంటోంది.. వైసీపీ. కక్ష సాధింపేనని వాదిస్తోంది. అయితే.. ఫ్యాన్ పార్టీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది అధికార కూటమి. ఇంతకీ.. ఈ కేసులో నెక్ట్స్ టార్గెట్ ఎవరు?

Andhra Politics: ఆల్మట్టి ప్రాజెక్ట్ అంశంపై ఏపీలో పొలిటికల్ హీట్.. జగన్‌ సంచలన వ్యాఖ్యలు.. మంత్రి నిమ్మల కౌంటర్..

ఆల్మట్టి ప్రాజెక్ట్ అంశంపై ఏపీలో పొలిటికల్ వార్ మొదలైంది. కర్నాటక నిర్ణయంతో ఏపీకి అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వానికి పట్టదా? ప్రాజెక్ట్ ఎత్తు పెంచకుండా అడ్డుకోరా? అని జగన్ ప్రశ్నిస్తోంటే.. వట్టి మాటలు కట్టి పెట్టు అంటూ కౌంటర్ ఇస్తోంది అధికారపక్షం.. దీంతో ఏపీ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి..

YS Jagan: రెడ్ బుక్ అంటున్నవారికి డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తాం: వైసీపీ అధినేత జగన్

ఇప్పుడు రెడ్‌బుక్‌ అంటున్న వాళ్లకు డిజిటల్‌ బుక్‌ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం పార్టీ కీలక నాయకులతో జరిగిన సమావేశంలో మాజీ సీఎం జగన్ డిజిటల్‌ బుక్‌ ప్రారంభించారు. అన్యాయానికి గురైన కార్యకర్తలు డిజిటల్‌ బుక్‌ ఉపయోగించుకోవాలన్నారు.

AP Assembly 2025: PPP విధానంపై తగ్గేదే లేదంటున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ అసెంబ్లీలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం అమలు చేస్తున్న PPP విధానంపై చర్చ జరిగింది. వైసీపీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆరోపణలు చేస్తుండగా, సీఎం చంద్రబాబు పారదర్శకతను ప్రతిపాదించి, విధానాన్ని సమర్థించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, PPP ద్వారా వేగవంతమైన నిర్మాణం సాధ్యమవుతుందని వివరించారు.

  • Phani CH
  • Updated on: Sep 24, 2025
  • 12:16 pm

రాజకీయ కక్షపూరిత కేసులపై వాడి వేడి చర్చ.. హోంమంత్రి అనిత రియాక్షన్ ఇదే..

ఏపీ శాసనమండలిలో రాజకీయ కక్షపూరిత కేసులపై వాడి వేడి చర్చ జరిగింది. గత ప్రభుత్వంలో పెట్టిన రాజకీయ కక్షపూరిత కేసులు ఎత్తేయాలని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రభుత్వాన్ని కోరారు. అయితే.. 2019- 24తో పాటు నేటి వరకు ఉన్న తప్పుడు కేసులు కూడా ఎత్తేయాలని వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం అన్నారు.

Tirumala: పరకామణిలో చోరీపై ఏపీలో దుమ్ముదుమారం.. చంద్రబాబు సర్కార్ సీరియస్.. అమిత్‌షాకు వైసీపీ లేఖ..

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలా.. పరకామణి వ్యవహారం కూడా పాన్‌ ఇండియా లెవల్‌ ఇష్యూలా మారుతోంది. దీనిపై ఇప్పటికే అధికార, విపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా..ఈ చోరీపై సిట్‌ విచారణకు ఆదేశిస్తామని చెప్పారు మంత్రి లోకేష్‌. అటు వైసీపీ మాత్రం సిట్‌తో కాదు సీబీఐను రంగంలోకి దించాలని డిమాండ్‌ చేస్తోంది.

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. వైఎస్ జగన్ హాజరు అయ్యేనా..?

ఇవాళ్టి (సెప్టెంబర్ 18) నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. 16వ శాసనసభ నాలుగో సమావేశం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాలులో మొదలవుతాయి. ఈ సమావేశాలు 7 రోజుల పాటు జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో కొన్ని ముఖ్య బిల్లులు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

YS Jagan: అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా? వైసీపీ చీఫ్ జగన్ కీలక వ్యాఖ్యలు..

ఏపీలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వం ఎరువురులు సరఫరా చేసి ఉండే రైతులు రోడ్డెక్కేవారా? అని మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం కనీస బాధ్యతను కూడా నిర్వర్తించడంలేదని మండిపడ్డారు. కుప్పం లోనూ రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వైసీపీ పాలనలో ఎప్పుడూ రైతులు రోడ్డెక్కలేదని.. అప్పుడు లేని రైతు కష్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయన్నారు..

Andhra: రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ముద్రగడను కలిసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ..

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశం కావడం ఆసక్తి రేపింది. గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన ముద్రగడ ఇటీవలే డిశ్చార్చ్‌ అయ్యారు. ప్రస్తుతం కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. ముద్రగడను కలిసి పరామర్శించారు వర్మ.

లిక్కర్ స్కాం కేసులో ఐదుగురికి బెయిల్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో MP మిథున్‌రెడ్డి ఓటు!

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఏ30 పైలా దిలీప్, ఏ1 ధనుంజయ రెడ్డి, ఏ32కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప, బెయిల్‌పై విడుదలయ్యారు. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్..

Kethireddy Pedda Reddy: తాడిపత్రి నుంచి వెళ్లిపోండి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మళ్లీ షాక్..

నిన్న పోలీసులు సెక్యూరిటీ కల్పించి ఇంటికి తీసుకొచ్చారు.. ఇవాళ వెళ్లిపోవాలని చెప్పడంతో వెళ్లిపోయారు. నిన్న పోలీసు భద్రత మధ్య తాడిపత్రికి చేరుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి.. చంద్రబాబు టూర్‌ నేపథ్యంలో ఇవాళ మళ్లీ వెళ్లిపోవాల్సి వచ్చింది.. సీఎం చంద్రబాబు అనంతపురం పర్యటన తర్వాత తాడిపత్రి రావాలని .. కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు సూచించారు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి తిమ్మంపల్లికి వెళ్లారు

ఏపీ లిక్కర్‌ కేసు.. ఎంపీ మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్‌.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత..

సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్‌ నిందితుల్లో పలువురికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ఇక కేసులో 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేయగా.. ఎంపీ మిథున్ రెడ్డి సహా నలుగురికి బెయిల్ లభించింది. అయితే.. ఎంపీ మిథున్ రెడ్డి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత.. మళ్లీ సరెండర్ కావాలని సూచించింది.