వైసీపీ
వైఎస్సార్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)ని నెలకొల్పారు. కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా 2010 నవంబరు 29న ఎంపీ పదవికి రాజీనామా చేసిన జగన్.. 2010 డిసెంబరు 7న కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు పులివెందులలో ప్రకటించారు. 2011 మార్చిలో తన పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా ప్రకటించారు. సమైక్యవాద నినాదంతో ఏపీలో పట్టు సాధించారు. 2014 ఎన్నికల్లో 67 స్థానాలకు పరిమితమై అధికారాన్ని కోల్పోయినప్పటికీ ప్రత్యేక హోదా కోసం ప్రజా ఉద్యమాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా ఆవిర్భవించింది. 2019 ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 స్థానాలు సాధించి వైఎస్ జగన్ నవ్యాంధ్రప్రదేశ్కు రెండో ముఖ్యమంత్రి అయ్యారు. నాటి ఎన్ని్కల్లో మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఏకంగా 22 స్థానాల్లో విజయం సాధించి వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్ ప్రకటించిన జనాకర్షక పథకాలు ఆ పార్టీ విజయానికి దోహదపడ్డాయి. 2014 ఎన్నికల్లో 44.47 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్సీపీ.. 2019లో తన ఓటింగ్ శాతాన్ని 49.95 శాతానికి పెంచుకుంది. సమైక్యవాద నినాదం కారణంగా 2014లో తెలంగాణలో వైఎస్సార్సీపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. వైసీపీ నిరసన, వాకౌట్.. లైవ్ వీడియో
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. మొదటి రోజు.. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. సభ పనిదినాలు, బడ్జెట్ తేదీలపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి మొదటి వారం వరకు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
- Shaik Madar Saheb
- Updated on: Feb 11, 2026
- 10:17 am
పంచ్కి పంచ్.. సవాల్కి ప్రతిసవాల్..! ఉప్పెనై విరుచుకుపడ్డ నారీ శక్తి !
రాజకీయాల్లో ఉన్నా.. ఉమెన్ పొలిటీషియన్స్ అంటే కాస్త సాఫ్ట్గానే ఉంటారు, అలాగే కనిపిస్తారు. ఒకరిద్దరు ఫైర్ బ్రాండ్స్ తప్పితే. కానీ, పార్టీల్లో శివంగుల్లాంటి మహిళా నేతలు ఇంత మంది ఉన్నారా అని మొదటిసారి తెలిసింది గుంటూరు ఎపిసోడ్తో..! పార్టీ ఆదేశాలతో పనిలే.. మీరెళ్లి మాట్లాడండి అని ఎవరూ ఆర్డర్స్ ఇవ్వలే.. వచ్చేశారంతే మీడియా ముందుకు. గోరంట్లలో ఫ్లెక్సీ రగడ నుంచి మొదలుపెడితే.. పరామర్శల దాకా స్టోరీ ట్విస్టులతో నడిచింది. అలా మలుపు తిరిగిన ప్రతిసారీ.. ఉమెన్ పొలిటీషియన్సే నోటికి పని చెప్పారు. మల్టీ స్టార్ సినిమాలో సోలో పర్ఫామెన్స్ చూపించారు.
- Balaraju Goud
- Updated on: Feb 6, 2026
- 10:05 pm
YS Jagan: మరికాసేపట్లో మాజీ సీఎం జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన.. రూట్ మ్యాప్పై ఉత్కంఠ
జోగి రమేష్ ఇంటిపై దాడి తర్వాత విజయవాడ హీట్ ఎక్కింది. ఇప్పుడు వైసీపీ అధినేత.. జోగి రమేష్ ఇంటికి వెళ్లి పరామర్శించడానికి సిద్ధమయ్యారు. అయితే జగన్ పర్యటన రూట్ మ్యాప్ విజయవాడ నుంచే ఉంటుందని వైసీపీ ప్రకటించడం.. పోలీసులు కాదు కాదు.. వేరే మార్గాన్ని చూసుకోవాలని చెప్పడంతో.. ఆయన పర్యటన ఎటు నుంచి సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
- Ram Naramaneni
- Updated on: Feb 6, 2026
- 7:25 am
Andhra Politics: ఘాటెక్కిన గుంటూరు..! ఉమెన్ సెంటిమెంట్స్.. ఫ్యామిలీ ఎమోషన్స్..
'వాళ్లు చేసిన నేరమేంటి'? సింగిల్ పాయింట్ క్వశ్చన్తో గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రశ్నించారు వైఎస్ జగన్. అసలు ఇదంతా జరిగింది.. తిరుమల నెయ్యి వ్యవహారం నుంచే అంటూ మొదలుపెట్టారు జగన్. నెయ్యిలో జంతువుల కొవ్వే కలవలేదని సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి.. చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారానికి దిగి.. పరిస్థితిని దాడులు, కేసులు, అరెస్టుల దాకా తెచ్చారని ఫైర్ అయ్యారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 4, 2026
- 9:54 pm
YS Jagan: వారంతా అందుకే వచ్చారు.. గతంలో పవన్, లోకేష్ నన్ను తిట్టలేదా.. జగన్ సంచలన వ్యాఖ్యలు..
వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులకు జగన్ పరామర్శించారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు... ఇటీవల ధ్వంసమైన అంబటి రాంబాబు ఆఫీస్, కార్లు, ఇంటిని జగన్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 4, 2026
- 7:11 pm
ఏపీలో ‘మాటల’ మంటలు! దాడుల్లో కులాల ప్రస్తావనలు.. ఏది అనుచితం.. ఏది సముచితం!
ఒకే సినిమాను మళ్లీమళ్లీ చూస్తున్నట్టుంది ఏపీలో పరిస్థితి. ఏపీలో బూతుల దాడులు, భౌతిక దాడులు, ఇళ్లపై దాడులు, పార్టీ ఆఫీసులపై దాడులు.. ఇకపై వెరీ కామనేమో అని జనం అనుకునేంతగా తయారవుతోంది పరిస్థితి. దిష్టిబొమ్మలు మాత్రమే తగలబెట్టే సంస్కృతి ఉండేది కాస్తా.. ఇళ్లు, పార్టీ ఆఫీసులను తగలబెట్టుకునేదాకా వెళ్లింది. కొన్ని వ్యాఖ్యలు.. దాని కారణంగా చెలరేగిన మంటలు.. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. అసలు.. ఎక్కడ మొదలైందీ రచ్చంతా? తెలుగు ప్రజలంతా కళ్లార్పకుండా చూసేంత స్టోరీ ఈ రెండ్రోజుల్లో ఏం జరిగింది?
- Balaraju Goud
- Updated on: Feb 2, 2026
- 9:47 pm
Andhra Pradesh: బీఅలర్ట్.. వైసీపీ ట్రాప్లో పడొద్దు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.. మొన్న అంబటి రాంబాబు, నిన్న జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని, శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ విరుచుకుపడుతోంది. వైసీపీ విమర్శలతో టీడీపీ అధిష్ఠానం అలర్ట్ అయింది.
- Shaik Madar Saheb
- Updated on: Feb 2, 2026
- 4:46 pm
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్ట్ సక్సెస్.. పీక్స్కు చేరిన పొలిటికల్ క్రెడిట్ గేమ్..
ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్ట్ సాకారానికి మరింత చేరువైంది. భోగాపురం ఎయిర్పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయ్యింది. దీనిపై ఓ వైపు సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంటే.. అదే సమయంలో ప్రాజెక్ట్ క్రెడిట్ గేమ్ కూడా మొదలైంది. భోగాపురం ఎయిర్పోర్టుపై అధికార, ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ మధ్య క్రెడిట్ వార్ మొదలు కావడం చర్చనీయాంశంగా మారింది.
- Shaik Madar Saheb
- Updated on: Jan 4, 2026
- 9:40 pm
YS Jagan Mohan Reddy: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత.. ఇవాళ్టి కార్యక్రమాలు రద్దు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పల్ప అస్వస్థతకు గురయ్యారు. గత రెండ్రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్న వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైద్యుల సూచన మేరకు ఇవాళ్టి కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు.
- Anand T
- Updated on: Dec 24, 2025
- 4:19 pm
Andhra Politics: జోగి రమేష్ అరెస్ట్తో ఏపీలో పొలిటికల్ తుఫాన్.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు?
కల్తీమద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్తో ఏపీలో పొలిటికల్ తుఫాన్ రేగింది. ఆయన అరెస్ట్ అక్రమం అంటోంది.. వైసీపీ. కక్ష సాధింపేనని వాదిస్తోంది. అయితే.. ఫ్యాన్ పార్టీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది అధికార కూటమి. ఇంతకీ.. ఈ కేసులో నెక్ట్స్ టార్గెట్ ఎవరు?
- Shaik Madar Saheb
- Updated on: Nov 2, 2025
- 8:12 pm
Andhra Politics: ఆల్మట్టి ప్రాజెక్ట్ అంశంపై ఏపీలో పొలిటికల్ హీట్.. జగన్ సంచలన వ్యాఖ్యలు.. మంత్రి నిమ్మల కౌంటర్..
ఆల్మట్టి ప్రాజెక్ట్ అంశంపై ఏపీలో పొలిటికల్ వార్ మొదలైంది. కర్నాటక నిర్ణయంతో ఏపీకి అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వానికి పట్టదా? ప్రాజెక్ట్ ఎత్తు పెంచకుండా అడ్డుకోరా? అని జగన్ ప్రశ్నిస్తోంటే.. వట్టి మాటలు కట్టి పెట్టు అంటూ కౌంటర్ ఇస్తోంది అధికారపక్షం.. దీంతో ఏపీ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి..
- Shaik Madar Saheb
- Updated on: Oct 2, 2025
- 8:06 pm
YS Jagan: రెడ్ బుక్ అంటున్నవారికి డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తాం: వైసీపీ అధినేత జగన్
ఇప్పుడు రెడ్బుక్ అంటున్న వాళ్లకు డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం పార్టీ కీలక నాయకులతో జరిగిన సమావేశంలో మాజీ సీఎం జగన్ డిజిటల్ బుక్ ప్రారంభించారు. అన్యాయానికి గురైన కార్యకర్తలు డిజిటల్ బుక్ ఉపయోగించుకోవాలన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 24, 2025
- 5:24 pm