వైసీపీ
వైఎస్సార్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)ని నెలకొల్పారు. కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా 2010 నవంబరు 29న ఎంపీ పదవికి రాజీనామా చేసిన జగన్.. 2010 డిసెంబరు 7న కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు పులివెందులలో ప్రకటించారు. 2011 మార్చిలో తన పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా ప్రకటించారు. సమైక్యవాద నినాదంతో ఏపీలో పట్టు సాధించారు. 2014 ఎన్నికల్లో 67 స్థానాలకు పరిమితమై అధికారాన్ని కోల్పోయినప్పటికీ ప్రత్యేక హోదా కోసం ప్రజా ఉద్యమాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా ఆవిర్భవించింది. 2019 ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 స్థానాలు సాధించి వైఎస్ జగన్ నవ్యాంధ్రప్రదేశ్కు రెండో ముఖ్యమంత్రి అయ్యారు. నాటి ఎన్ని్కల్లో మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఏకంగా 22 స్థానాల్లో విజయం సాధించి వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్ ప్రకటించిన జనాకర్షక పథకాలు ఆ పార్టీ విజయానికి దోహదపడ్డాయి. 2014 ఎన్నికల్లో 44.47 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్సీపీ.. 2019లో తన ఓటింగ్ శాతాన్ని 49.95 శాతానికి పెంచుకుంది. సమైక్యవాద నినాదం కారణంగా 2014లో తెలంగాణలో వైఎస్సార్సీపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
వైసీపీ అధినేత జగన్ పార్టీలో ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వరా? ఎవరైనా తలాడించడమేనా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్రెడ్డి జగన్మోహన్ రెడ్డితో తన బంధం నమ్మకం, కృతజ్ఞతపై ఆధారపడిందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు, ఈవీఎంలలో అక్రమాలు, బీజేపీతో పార్టీ సంబంధాలు, అంతర్గత ప్రజాస్వామ్యం వంటి కీలక అంశాలపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్కు ఇచ్చిన క్రాస్ఫైర్లో మిథున్ రెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 9:05 pm
నారా కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా?
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నారా కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా? అమరరాజా కంపెనీ కొద్దిరోజులు మూసివేయడానికి, అదనపు పెట్టుబడులు పారపోవడానికి కూడా పెద్దిరెడ్డి కుటుంబమే కారణమా? రోజా, నారాయణస్వామి వంటి నాయకులపై వచ్చిన ఆరోపణలను నిజమేనా? దీనిపై సంచలన విషయాలు బయటపెట్టారు మిథున్రెడ్డి.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 8:44 pm
లిక్కర్స్కామ్లో మిథున్ రెడ్డి కుటుంబాన్ని ఇరికించింది విజయసాయిరెడ్డినా? మాస్టర్ మైండ్ ఎవరు?
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇది రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకున్న కక్ష సాధింపేనని ఆయన అన్నారు. తనపై వేల కోట్ల రూపాయల స్కామ్ ఆరోపణలకు ఒక్క రూపాయి సాక్ష్యమైనా చూపాలని సిట్కు, ఈడీకి సవాల్ విసిరారు. ఎలాంటి అక్రమ లావాదేవీలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 8:21 pm
పార్లమెంటులో పార్టీ ఎంపీల తీరుతో వైసీపీకి మైనస్గా మారిందా.. మిథున్ రెడ్డి క్లారిటీ ఇదే..!
వైసీపీ విధానపరంగానే అమరావతిని వ్యతిరేకిస్తుందా.. అందుకే పార్లమెంట్లో వాకౌట్ చేసిందా? ఎంపీల వ్యవహరించిన తీరుతో వైసీపీకి ఇది మైనస్గా మారిందా.. ఇదే అంశంపై ఆ పార్టీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మూడు రాజధానుల విషయంలో వైసీపీ నిర్ణయం వెనక్కు తీసుకుందా?
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 8:05 pm
మావిగన్ నినాదం తెరమీదకు ఎందుకు వచ్చింది? టీవీ9 క్రాస్ఫైర్లో మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యల
మూడు రాజధానుల విషయంలో వైసీపీ నిర్ణయం వెనక్కు తీసుకుందా? మరి సొంత పార్టీ నేతలకు జగన్ సమాధానం చెప్పగలరా.. ధర్మాన, రోజా వంటి నేతలు ప్రాంతీయవాదాలు తెరమీదకు తీసుకువస్తున్నారా? వైసీపీని ప్రజలు కూడా నమ్మడం లేదా.. అందుకే మావిగన్ నినాదం తెరమీదకు వచ్చిందా? టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్కు ఇచ్చిన క్రాస్ఫైర్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజధాని అమరావతిపై ఆసక్తికర అంశాలు వెల్లడించారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 6:50 pm
టెంపుల్ సిటీ తిరుపతిలో మరో వివాదం.. వన్ ప్రాజెక్టుకు భూ కేటాయింపులపై రాజకీయ రచ్చ!
టెంపుల్ సిటీ తిరుపతిలో ఇప్పుడు మరో వివాదంపై రచ్చ నడుస్తోంది. తిరుపతి వన్ ప్రాజెక్టుకు కేటాయించిన 22 ఎకరాల ప్రభుత్వ భూముల వివాదంపై సర్కార్తో వైసీపీ ఢీ అంటే ఢీ అంటోంది. విలువైన భూములను అనుభవం లేని సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టారని, దీని వెనుక వందల కోట్ల అవినీతి దాగి ఉందని వైసీపీ ఆరోపిస్తుంటే, ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని టీడీపీ అంతే బలంగా తిప్పికొడుతోంది
- Balaraju Goud
- Updated on: Apr 3, 2026
- 10:42 am
లోక్సభ ముందుకు ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లు.. మద్దతు పలికిన కాంగ్రెస్, వైసీపీ వాకౌంట్!
అమరావతి చట్టబద్ధతకు మరో కీలక అడుగు పడింది. ఇవాళ బుధవారం (ఏప్రిల్ 01, 2026 ) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత లోక్సభ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు తీసుకువచ్చారు. అయితే లోక్సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.
- Balaraju Goud
- Updated on: Apr 1, 2026
- 1:07 pm
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. వైసీపీ నిరసన, వాకౌట్.. లైవ్ వీడియో
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. మొదటి రోజు.. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. సభ పనిదినాలు, బడ్జెట్ తేదీలపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి మొదటి వారం వరకు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
- Shaik Madar Saheb
- Updated on: Feb 12, 2026
- 10:38 am
పంచ్కి పంచ్.. సవాల్కి ప్రతిసవాల్..! ఉప్పెనై విరుచుకుపడ్డ నారీ శక్తి !
రాజకీయాల్లో ఉన్నా.. ఉమెన్ పొలిటీషియన్స్ అంటే కాస్త సాఫ్ట్గానే ఉంటారు, అలాగే కనిపిస్తారు. ఒకరిద్దరు ఫైర్ బ్రాండ్స్ తప్పితే. కానీ, పార్టీల్లో శివంగుల్లాంటి మహిళా నేతలు ఇంత మంది ఉన్నారా అని మొదటిసారి తెలిసింది గుంటూరు ఎపిసోడ్తో..! పార్టీ ఆదేశాలతో పనిలే.. మీరెళ్లి మాట్లాడండి అని ఎవరూ ఆర్డర్స్ ఇవ్వలే.. వచ్చేశారంతే మీడియా ముందుకు. గోరంట్లలో ఫ్లెక్సీ రగడ నుంచి మొదలుపెడితే.. పరామర్శల దాకా స్టోరీ ట్విస్టులతో నడిచింది. అలా మలుపు తిరిగిన ప్రతిసారీ.. ఉమెన్ పొలిటీషియన్సే నోటికి పని చెప్పారు. మల్టీ స్టార్ సినిమాలో సోలో పర్ఫామెన్స్ చూపించారు.
- Balaraju Goud
- Updated on: Feb 6, 2026
- 10:05 pm
YS Jagan: మరికాసేపట్లో మాజీ సీఎం జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన.. రూట్ మ్యాప్పై ఉత్కంఠ
జోగి రమేష్ ఇంటిపై దాడి తర్వాత విజయవాడ హీట్ ఎక్కింది. ఇప్పుడు వైసీపీ అధినేత.. జోగి రమేష్ ఇంటికి వెళ్లి పరామర్శించడానికి సిద్ధమయ్యారు. అయితే జగన్ పర్యటన రూట్ మ్యాప్ విజయవాడ నుంచే ఉంటుందని వైసీపీ ప్రకటించడం.. పోలీసులు కాదు కాదు.. వేరే మార్గాన్ని చూసుకోవాలని చెప్పడంతో.. ఆయన పర్యటన ఎటు నుంచి సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
- Ram Naramaneni
- Updated on: Feb 6, 2026
- 7:25 am
Andhra Politics: ఘాటెక్కిన గుంటూరు..! ఉమెన్ సెంటిమెంట్స్.. ఫ్యామిలీ ఎమోషన్స్..
'వాళ్లు చేసిన నేరమేంటి'? సింగిల్ పాయింట్ క్వశ్చన్తో గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రశ్నించారు వైఎస్ జగన్. అసలు ఇదంతా జరిగింది.. తిరుమల నెయ్యి వ్యవహారం నుంచే అంటూ మొదలుపెట్టారు జగన్. నెయ్యిలో జంతువుల కొవ్వే కలవలేదని సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి.. చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారానికి దిగి.. పరిస్థితిని దాడులు, కేసులు, అరెస్టుల దాకా తెచ్చారని ఫైర్ అయ్యారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 4, 2026
- 9:54 pm
YS Jagan: వారంతా అందుకే వచ్చారు.. గతంలో పవన్, లోకేష్ నన్ను తిట్టలేదా.. జగన్ సంచలన వ్యాఖ్యలు..
వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులకు జగన్ పరామర్శించారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు... ఇటీవల ధ్వంసమైన అంబటి రాంబాబు ఆఫీస్, కార్లు, ఇంటిని జగన్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 4, 2026
- 7:11 pm