
వైసీపీ
వైఎస్సార్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)ని నెలకొల్పారు. కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా 2010 నవంబరు 29న ఎంపీ పదవికి రాజీనామా చేసిన జగన్.. 2010 డిసెంబరు 7న కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు పులివెందులలో ప్రకటించారు. 2011 మార్చిలో తన పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా ప్రకటించారు. సమైక్యవాద నినాదంతో ఏపీలో పట్టు సాధించారు. 2014 ఎన్నికల్లో 67 స్థానాలకు పరిమితమై అధికారాన్ని కోల్పోయినప్పటికీ ప్రత్యేక హోదా కోసం ప్రజా ఉద్యమాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా ఆవిర్భవించింది. 2019 ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 స్థానాలు సాధించి వైఎస్ జగన్ నవ్యాంధ్రప్రదేశ్కు రెండో ముఖ్యమంత్రి అయ్యారు. నాటి ఎన్ని్కల్లో మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఏకంగా 22 స్థానాల్లో విజయం సాధించి వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్ ప్రకటించిన జనాకర్షక పథకాలు ఆ పార్టీ విజయానికి దోహదపడ్డాయి. 2014 ఎన్నికల్లో 44.47 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్సీపీ.. 2019లో తన ఓటింగ్ శాతాన్ని 49.95 శాతానికి పెంచుకుంది. సమైక్యవాద నినాదం కారణంగా 2014లో తెలంగాణలో వైఎస్సార్సీపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
AP-Telangana Politics: బుక్ చేస్తాం ఖబడ్దార్.. ఆ రెండిటి చుట్టూ ఏపీ, తెలంగాణలో రసవత్తర రాజకీయాలు..
తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. బుక్స్ మెయింటెయిన్ చేస్తున్నాం బుక్ చేస్తాం జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తున్నారు విపక్షనేతలు. ఏపీలో రెడ్బుక్ పాలనకు జగనన్న 2.0 సర్కార్లో రివేంజ్ ఉంటుందని వైసీపీ అధినేత ప్రకటించారు. అయితే ఈ బుక్కుల గోల తెలంగాణకు కూడా పాకింది. తమ కార్యకర్తలను వేధిస్తున్నవారి పేర్లను పింక్ బుక్లో ఎక్కిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది.
- Shaik Madar Saheb
- Updated on: Feb 14, 2025
- 8:26 pm
Vallabhaneni Vamsi: ప్రత్యర్ధి ఎంతటోడైనా సరే.. మాటకు నో సెన్సార్.. ఎగొట్టిదిగ్గొట్టడమే..!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్టు చేశారు. ఈ కేసుతో పాటు మరికొన్ని కేసుల్లోనూ ఆయన నిందితుడుగా ఉన్నారు. వంశీ అరెస్టుపై వైసీపీ, టీడీపీ పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి.
- Balaraju Goud
- Updated on: Feb 13, 2025
- 10:00 pm
YS Jagan: కూటమి నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు: వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
రాష్ట్రంలో స్కామ్లు తప్ప ఏమీ జరగడంలేదని ఆరోపించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి... చట్టవిరుద్ధంగా, అన్యాయాలు చేసేవారెవ్వరినీ తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా వస్తుందని.. నేతలంతా ధైర్యంగా ఉండాలన్నారు. కొన్నాళ్లుగా వేర్వేరు జిల్లాల నేతలతో సమావేశమవుతూ వస్తున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులతో సమావేశమయ్యారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 12, 2025
- 8:45 pm
AP Politics: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏపీ మంత్రులకు ఇచ్చిన ర్యాంకులపై పొలిటికల్ ఫైట్..
ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ర్యాంకులపై పొలిటికల్ ఫైట్ కొనసాగుతోంది. ఏపీ మంత్రులకు ఇచ్చిన ర్యాంకింగ్స్పై వైసీపీ నేత కామెంట్స్ రాజకీయ రగడకు తెరలేపాయి. విపక్షంపై టీడీపీ నేతలు పొలిటికల్ ఎటాక్ మొదలుపెట్టారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 7, 2025
- 6:53 pm
Andhra Pradesh: వైసీపీ అధినేత జగన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. వరుసగా పార్టీని వీడుతున్న ముఖ్యనేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో అంతే ధీటుగా పార్టీకి గుడ్ బై చెప్పిన నేతలు రియాక్ట్ అవుతున్నారు. మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డిలు వైఎస్ జగన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
- Balaraju Goud
- Updated on: Feb 7, 2025
- 12:01 pm
Tirupati: నెగ్గేందుకు కూటమి స్కెచ్.. తగ్గేదీలే అంటున్న వైసీపీ.. ఎవరి ధీమా వారిదే..!
ఒక్కసారిగా తిరుపతిలో వాతావరణం వేడెక్కింది. డిప్యూటీ మేయర్ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కార్పొరేటర్ శేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన భవనాల కూల్చివేత వ్యవహారం చర్చగా మారింది. అనుమతులు లేకుండా, నిషేధిత జాబితాలోని స్థలాల్లో జరిగిన కట్టడాల నిర్మాణాలను అడ్డుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
- Raju M P R
- Updated on: Feb 1, 2025
- 10:01 pm
AP Camp Politics: అటు గుంటూరు.. ఇటు హిందూపురం.. కాకరేపుతోన్న క్యాంపు రాజకీయం!
రాజకీయాలందు ఏపీ రాజకీయాలు వేరయా...! అని మరోసారి రుజువైంది. ఎన్నిక చిన్నదైనా.. రాజకీయం మాత్రం తగ్గేదేలే అన్నట్లుంది. అటు గుంటూరులో మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. ఇటు హిందూపురంలో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక కాక పుట్టిస్తోంది. మరి ఎవరి క్యాంపు పాలిటిక్స్ ఫలితాన్నిస్తాయన్నది తెలియాలంటే ఫిబ్రవరి 3వరకు ఆగాల్సిందే..!
- Balaraju Goud
- Updated on: Jan 31, 2025
- 9:44 pm
TDP vs YSRCP: ఏపీ రాజకీయాల్లో దుమ్ముదుమారం.. పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై విచారణకు ఆదేశం..
మాజీమంత్రి పెద్దిరెడ్డి భూ ఆక్రమణల ఆరోపణలు.. ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఇవి కక్షసాధింపు చర్యలని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే..అటు అధికార పక్షం మాత్రం విచారణలో అన్నీ వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెబుతోంది. ఈ లోపే ఉలికిపాటు ఎందుకని ప్రశ్నిస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన కమిటీ.. క్షేత్రస్థాయి పర్యటనలో అసలు విషయం బయటపెట్టేందుకు చర్యలు చేపట్టింది.
- Raju M P R
- Updated on: Jan 31, 2025
- 1:48 pm
Budget 2025: బడ్జెట్ సమావేశాలు.. టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. మరి వైసీపీ పరిస్థితేంటి..?
పార్లమెంట్ సమావేశాలు ఈనెల 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.. దీంతో టీడీపీ ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. నిధులు ఎలా రాబట్టాలి... బడ్జెట్పై చర్చలో ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు. మరి వైసీపీ పరిస్థితేంటి...? బడ్జెట్పై చర్చలేవి...? నేతలతో మీటింగులెక్కడ...? విజయసాయి తర్వాత రాజ్యసభలో వైసీపీ టీమ్ లీడ్ ఎవరు...? ఇప్పుడివే అంశాలు చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ సెలెన్స్పై చర్చలూ ఊపందుకున్నాయి.
- Shaik Madar Saheb
- Updated on: Jan 29, 2025
- 7:40 am
Chandrababu: మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నా: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
ఏపీని శ్రీలంక పరిస్థితికి గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని సీఎం చద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే.. ప్రజలకు ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేమని తెలిపారు. మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నానని, ప్రజలు అర్థం చేసుకోవాలని.. సూచించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jan 28, 2025
- 7:18 am