AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

B Ravi Kumar

B Ravi Kumar

Staff Reporter - TV9 Telugu

ravikumar.bandikatla@tv9.com

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 23 సంవత్సరాల అనుభవం ఉంది. విజయవాడలో వార్త దినపత్రిక లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభమైంది. 2008 వరకు వార్త దిన పత్రికలోనే పని చేస్తూ ఆ ఏడాది సెప్టెంబర్ లో టివి9లో స్టాఫ్ రిపోర్టర్ గా చేరటం జరిగింది. అక్కడ నుంచి బదిలీపై పశ్చిమ గోదావరి జిల్లాకు 2011 మే 15 వచ్చి ప్రస్తుతం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. రెండు సార్లు వరుసగా యునిసెఫ్ అవార్డు లు , యన్టీ అవార్డు లభించాయి.

Read More
Follow On:
రుద్రంకోటలోని వేల ఏళ్ల చరిత్రకు పోలవరం ముంపు.. చారిత్రక సంపదకు జలసమాధి ప్రమాదం!

రుద్రంకోటలోని వేల ఏళ్ల చరిత్రకు పోలవరం ముంపు.. చారిత్రక సంపదకు జలసమాధి ప్రమాదం!

ఏదైనా ఒక ప్రాంతానికి ఒక నిర్దిష్టమైన చారిత్రక నేపథ్యం ఉండటం సహజం. కానీ, ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని 'రుద్రంకోట' మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. రెండు వేర్వేరు కాలఘట్టాలకు చెందిన అరుదైన, అమూల్యమైన చరిత్రను తన గర్భంలో దాచుకున్న విశిష్ట నేల ఇది. ఒకవైపు సింధు నాగరికత కంటే పూర్వపు ఆదిమానవుల జీవన విధానానికి, మరోవైపు కాకతీయ సామ్రాజ్యపు దేదీప్యమాన పాలనా వైభవానికి ఈ గ్రామం నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. అయితే, శరవేగంగా పూర్తవుతున్న పోలవరం ప్రాజెక్టు ముంపు పరిధిలో ఈ ప్రాంతం ఉండటంతో, తరతరాల నాటి ఈ సాంస్కృతిక నిధి గోదావరి జలాల్లో శాశ్వతంగా లీనమైపోయే ముప్పు పొంచి ఉంది..

ప్రకృతి ఒడిలో అద్భుతం.. చెట్లకు కాపలాగా ఆకుపచ్చ నేత చీమలు.. ఈ రహస్యం మీకు తెలుసా..?

ప్రకృతి ఒడిలో అద్భుతం.. చెట్లకు కాపలాగా ఆకుపచ్చ నేత చీమలు.. ఈ రహస్యం మీకు తెలుసా..?

ఏలూరు జిల్లా కుక్కునూరు ప్రాంతంలో అరుదైన గ్రీన్ ట్రీ యాంట్స్ (వీవర్ యాంట్స్) కనిపించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆకులను తమ లార్వాల స్రావంతో కుట్టి గూళ్లు నిర్మించుకునే ఈ చీమలు చెట్లకు సహజ రక్షకులుగా పనిచేస్తాయి. హానికరమైన పురుగులను ఆహారంగా తీసుకోవడం ద్వారా తోటలు, అడవుల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Andhra: ఏపీలో పాఠశాలల్లో చదివే బాలురు అందరికీ ఒకటే హెయిట్ స్టైల్.. ఉత్వర్వులు జారీ..

Andhra: ఏపీలో పాఠశాలల్లో చదివే బాలురు అందరికీ ఒకటే హెయిట్ స్టైల్.. ఉత్వర్వులు జారీ..

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే బాలురకు ఏకరీతి హెయిర్ కట్ తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. స్పైకీ, ముల్లెట్, ఫేడ్ ప్యాటర్న్స్, ఎక్స్‌ట్రీమ్ ఫేడ్, హెయిర్ కలరింగ్ వంటి హెయిర్ స్టైల్స్‌ను నిషేధిస్తూ, విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమానత్వ భావన, చదువుపై ఏకాగ్రత పెంపొందించడమే ఈ నిర్ణయం లక్ష్యమని అధికారులు తెలిపారు.

Andhra: వాయమ్మో.. 30 అడుగుల బావిలో పడిన మహిళ.. బయటకు ఎలా వచ్చిందంటే..

Andhra: వాయమ్మో.. 30 అడుగుల బావిలో పడిన మహిళ.. బయటకు ఎలా వచ్చిందంటే..

ఏలూరు జిల్లా నూజివీడు బొందిలిపేటలో 30 అడుగుల లోతైన బావిలో ప్రమాదవశాత్తు పడిపోయిన మహిళను పోలీసులు, స్థానికుల సహకారంతో సురక్షితంగా బయటకు తీశారు. జిల్లా శైలజ అనే మహిళ ఇంటి ముందు ఉన్న బావి వద్దకు వెళ్లిన సమయంలో అదుపుతప్పి బావిలో పడిపోగా, ఆమె కేకలు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Watch: సూడి పశువులపై పైశాచిక దాడి.. గర్భంతో ఉన్న గేదెల కాళ్లు నరికిన కిరాతకులు

Watch: సూడి పశువులపై పైశాచిక దాడి.. గర్భంతో ఉన్న గేదెల కాళ్లు నరికిన కిరాతకులు

తూర్పుగోదావరి జిల్లాలె దారుణం చోటు చేసుకుంది. నిడదవోలు మండలం సూరాపురంలో గుర్తుతెలియని దుండగులు గర్భంతో ఉన్న రెండు గేదెల కాళ్లను నరికి అమానుషానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో ఒక గేదె మృతి చెందగా, మరో గేదె ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనతో పాడి రైతు కన్నీరుమున్నీరవుతుండగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు..

భార్య పసుపు, కుంకుమలు తీయకూడదు! – ఆచారాలకు భిన్నంగా ముద్రగడ తీసుకున్న సంచలన నిర్ణయాలు!

భార్య పసుపు, కుంకుమలు తీయకూడదు! – ఆచారాలకు భిన్నంగా ముద్రగడ తీసుకున్న సంచలన నిర్ణయాలు!

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణంతో ఆయన రాజకీయ జీవితం మాత్రమే కాదు, జీవితాంతం పాటించిన విలక్షణమైన ఆలోచనలు కూడా చర్చనీయాంశమయ్యాయి. భార్య పసుపు, కుంకుమలు తీయొద్దని, తన భౌతికకాయాన్ని దహనం చేయకుండా ఇంటి ఆవరణలోనే సమాధి చేయాలని ఆయన ముందుగానే కోరిన విషయాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌, లోకేష్ కోసం ఇల్లు వదిలి వచ్చిన బాలుడు.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌కు..!

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌, లోకేష్ కోసం ఇల్లు వదిలి వచ్చిన బాలుడు.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌కు..!

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని వేల్పూరు అనే ఒక చిన్న గ్రామం. అక్కడ తొమ్మిదో తరగతి చదువుతున్న చందు సాయి దుర్గారెడ్డి వయస్సు 13 సంవత్సరాలు. చందుకి నాయకులను చూడటమన్నా, వారితో ఫోటోలు దిగటమన్నా అమితమైన పిచ్చి. ఇప్పటికే చాలా మంది నాయకులతో ఫోటోలు దిగి వాటిని భద్రంగా దాచుకుంటున్నాడు. కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఇలా పలువురు రాజకీయ నాయకులతో ఫోటోలు దిగాడు.

వైకాల్యాన్ని జయించి విజయకేతనం.. విద్యార్థి చరిత్ర

వైకాల్యాన్ని జయించి విజయకేతనం.. విద్యార్థి చరిత్ర

ఏలూరు : శారీరక లోపాలు ప్రగతికి ప్రతిబంధకాలు కావని, అండగా నిలిచే మనసు.. ప్రోత్సహించే సమాజం ఉంటే ఎంతటి శిఖరాన్నైనా అధిరోహించవచ్చని నిరూపించాడు ఆ దివ్యాంగ విద్యార్థి. పుట్టుకతోనే వినికిడి లోపం వేధిస్తున్నా, మాటలు రాకపోయినా.. తన సంకల్ప బలాన్నే శ్వాసగా మార్చుకుని నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంపును ముద్దాడాడు.

ఆధ్యాత్మిక వ్రతాల ఆషాఢం.. ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరంటే?

ఆధ్యాత్మిక వ్రతాల ఆషాఢం.. ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరంటే?

ఏలూరు : హిందూ సంప్రదాయంలో కాల గమనానికి, ఋతు మార్పులకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. సూర్యుడు మిథున రాశి నుంచి కర్నాటక రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలంతో ఉత్తరాయణం ముగిసి, దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ సంక్రాంతి కాలంలోనే తెలుగు నూతన సంవత్సరంలో నాలుగవ నెల అయిన 'ఆషాఢ మాసం' ప్రవేశిస్తుంది. జూలై 15 పాడ్యమి తిథి నుంచి ప్రారంభమై, ఆగస్టు 12 అమావాస్యతో ముగిసే ఈ మాసాన్ని కొందరు శూన్య మాసంగా భావిస్తారు.

Andhra News: ఏం స్కెచ్ వేశావ్ భయ్యా.. మనీహీస్ట్ లెవల్ గోల్డ్‌ స్కామ్.. కట్‌చేస్తే.. ప్లాన్ అట్టర్ ప్లాప్..

Andhra News: ఏం స్కెచ్ వేశావ్ భయ్యా.. మనీహీస్ట్ లెవల్ గోల్డ్‌ స్కామ్.. కట్‌చేస్తే.. ప్లాన్ అట్టర్ ప్లాప్..

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో భారీ గోల్డ్ లోన్ మోసం వెలుగుచూసింది. బ్యాంక్‌లో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఏకంగా లాకర్‌లో ఉన్న 6.449 కిలోల అసలు బంగారాన్ని వాటి ప్లేస్‌లో నకిలీ ఆభరణాలు ఉంచి భారీ మోసానికి తెరలేపాడు. అయితే పోలీసుల దర్యాప్తు అలసు విషయాలు వెలుగులోకి రావడంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతన్ని నుండి రూ. 5.81 కోట్ల విలువైన 4.120 కిలోల బంగారాన్ని రికవరీ చేశారు. మిగిలిన బంగారం కోసం విచారణ కొనసాగిస్తున్నారు.

ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు.. వినూత్న రీతిలో నిరసనకు దిగిన జనసేన నేత

ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు.. వినూత్న రీతిలో నిరసనకు దిగిన జనసేన నేత

ఆక్రమణల పర్వంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ ఆస్తులను కాపాడాలంటూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో, ఓ రాజకీయ నాయకుడు వినూత్న పంథాలో నిరసన తెలియజేశారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగుతున్న ఆక్రమణలపై అధికారుల ఉదాసీనతను ఎండగట్టేందుకు ఆయన ఎంచుకున్న మార్గం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకూ అతనేం చేశాడో తెలియాలంటే ఇది చదవాల్సిందే.

Yellow Frogs: వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? పెద్ద కథే..

Yellow Frogs: వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? పెద్ద కథే..

సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలో మనకు పసుపు రంగు కల్పలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి కనిపిస్తే వర్షాకాలం ప్రారంభం అయినట్టేనని చాలా మంది నమ్ముతారు. ఇలాగే కైకలూరులో పసుపు రంగు కప్పలు ప్రత్యక్షమై సందడి చేశాయి. నార్మల్‌ ఆడ కప్పలను ఆకర్షించడానికి మగ కప్పలు రంగులు మారుస్తుంటాయి. కానీ ఈ వింత వెనుక సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా? అయితే అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.