ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 23 సంవత్సరాల అనుభవం ఉంది. విజయవాడలో వార్త దినపత్రిక లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభమైంది. 2008 వరకు వార్త దిన పత్రికలోనే పని చేస్తూ ఆ ఏడాది సెప్టెంబర్ లో టివి9లో స్టాఫ్ రిపోర్టర్ గా చేరటం జరిగింది. అక్కడ నుంచి బదిలీపై పశ్చిమ గోదావరి జిల్లాకు 2011 మే 15 వచ్చి ప్రస్తుతం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. రెండు సార్లు వరుసగా యునిసెఫ్ అవార్డు లు , యన్టీ అవార్డు లభించాయి.
మృగశిర రోజు అక్కడికి వెళ్తే.. మీకు నచ్చిన నాన్ వంటకం కుమ్మెయొచ్చు.. ఉచితంగా..
మృగశిర కార్తె సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ ఉచిత ఆక్వా విందు ఏర్పాటు చేశారు. జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతుసంఘం ఆధ్వర్యంలో పాలకొల్లు, నర్సాపురం, ఆచంట నియోజకవర్గాల్లో చేపల పులుసు, గోంగూర రొయ్యలతో పేదలకు భోజనం అందిస్తున్నారు. వాతావరణ మార్పుల సమయంలో చేపలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
- B Ravi Kumar
- Updated on: Jun 8, 2026
- 11:31 am
బర్త్డే పార్టీలు హద్దు దాటితే జైలు శిక్ష తప్పదు.. పోలీసుల మాస్ వార్నింగ్
యువతలో పుట్టినరోజు వేడుకల పేరిట సాగుతున్న హంగామా మితిమీరిపోతోంది. నాలుగు గోడల మధ్య, కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవాల్సిన జన్మదిన వేడుకలు కాస్తా, నేడు నడిరోడ్డుపైకి వచ్చి చేరుతున్నాయి. అర్ధరాత్రి వేళల్లో ప్రధాన రహదారులను దిగ్బంధించి, కేకులు కట్ చేస్తూ, బాణాసంచా కాలుస్తూ వాహనదారులను, స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేయడం ఒక ఫ్యాషన్గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు పునరావృతమవుతుండటంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. పబ్లిక్ న్యూసెన్స్ కలిగిస్తున్న ఆకతాయిల ఆటకట్టించేందుకు తణుకు పోలీసులు వినూత్న శైలిలో ఉక్కుపాదం మోపుతున్నారు..
- B Ravi Kumar
- Updated on: Jun 5, 2026
- 9:03 pm
కుక్క చెవిపై ‘V’ ఆకారం మార్క్ ఉందా? అయితే దానికి ఫ్యామిలీ ప్లానింగ్ అయినట్లే!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ వంటి మెట్రో నగరాల నుంచి పల్లెటూళ్ల గల్లీల వరకు శునకాల సంచారం, వాటి దాడులు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. కుక్కల కాటుకు గురై ఎంతో మంది తీవ్ర గాయాలపాలవుతుండగా, మరికొందరు చిన్నారులు ప్రాణాలు సైతం కోల్పోతున్న ఉదంతాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి..
- B Ravi Kumar
- Updated on: Jun 5, 2026
- 8:48 pm
హైదరాబాద్లో చేప ప్రసాదం.. గోదావరిలో చేపలు-రొయ్యల విందు.. జూన్ 8న రెండు ప్రత్యేక కార్యక్రమాలు!
Mrigasira Karthi 2026: మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8న తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతుండగా, పశ్చిమ గోదావరి జిల్లాలో పేదల కోసం ఉచిత చేపలు, రొయ్యల విందును ఏర్పాటు చేస్తున్నారు. ఈ వినూత్న కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుందాం.
- B Ravi Kumar
- Updated on: Jun 3, 2026
- 10:28 pm
జీడిమామిడి తోటలో ఏం జరిగింది..? శవాలుగా తల్లీకూతురు.. ఉలిక్కిపడ్డ ఏలూరు..
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామ శివారులోని జీడిమామిడి తోటలో తల్లి, కుమార్తె మృతదేహాలు లభ్యమవడం కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లికి చెందిన మద్దా అంతోభాయి (62), ఆమె అంధురాలైన కుమార్తె మద్దా వెంకటలక్ష్మి (46) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. మే 29 నుంచి అదృశ్యమైన వీరిద్దరూ సోమవారం తోటలో శవాలుగా కనిపించడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
- B Ravi Kumar
- Updated on: Jun 1, 2026
- 7:34 pm
అరెరే.. బైక్ను బోనులో వేశారేంటి అనుకుంటున్నారా? అసలు మ్యాటర్ తెలిస్తే నోరెళ్లబెడతారు!
వ్యవసాయ రంగంలో పరిశోధనలు సాగించే చోట వినూత్న ఆలోచనలకు కొదవ ఉండదు. సమస్య ఏదైనా సరే, దానికి తమదైన శైలిలో పరిష్కారం కనుగొనడం శాస్త్రవేత్తలకు, అక్కడి సిబ్బందికి అలవాటే. తాజాగా ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఇలాంటి ఒక ఆసక్తికరమైన, వినూత్నమైన ఘటనే వెలుగుచూసింది.
- B Ravi Kumar
- Updated on: Jun 1, 2026
- 6:05 pm
Andhra Pradesh: దృశ్యం సినిమాను మించి.. మహిళను చంపి పూడ్చిపెట్టాడు.. ఆమె ఫోన్తో భర్తకు వాట్సప్ మెసేజ్.. కట్ చేస్తే..
టెక్నాలజీ ముందు నేరగాళ్లు ఎంతటి హైడ్రామా ఆడినా దొరికిపోవాల్సిందే. ఒక మహిళ మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించిన ఏలూరు త్రీ టౌన్ పోలీసులు.. ఆ మిస్టరీ వెనుక ఉన్న అక్రమ సంబంధం, అనుమానం, దారుణ హత్య ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చారు. చంపేసి శవాన్ని పూడ్చిపెట్టి, ఆపై ఆమె బతికే ఉందంటూ నిందితుడు ఆడిన వాట్సాప్ చాటింగ్ నాటకాలకు ఖాకీలు ఎలా ఎండ్ కార్డ్ వేశారో తెలుసుకుందాం..
- B Ravi Kumar
- Updated on: May 30, 2026
- 8:39 am
అడవే ప్రపంచంగా జీవిస్తున్న కొండరెడ్డి గిరిజనుల అద్భుత సంస్కృతి
ఆధునిక ప్రపంచపు అలికిడికి దూరంగా, దట్టమైన అడవులు, ఎత్తైన కొండకోనల మధ్య సాగే గిరిజన జీవన విధానం ఎప్పుడూ విలక్షణమైనదే. పచ్చని ప్రకృతిని నమ్ముకుని బతికే గిరిపుత్రుల సంస్కృతి, వారి ఆచార వ్యవహారాలు నిఖార్సైన మానవీయ విలువలకు అద్దం పడతాయి. . ముఖ్యంగా ఏలూరు జిల్లా బుట్టాయగూడెం..
- B Ravi Kumar
- Updated on: May 26, 2026
- 3:46 pm
ఎడారిలా మారిన కొల్లేరు.. ఆకలితో అలమటిస్తున్న విదేశీ పక్షులు
ఏలూరు : పచ్చని ప్రకృతికి, కలకలలాడే విదేశీ విహంగాలకు, వేలాది రకాల మత్స్య సంపదకు ఆవాసమై నిలిచిన ఆసియా ఖండపు అతిపెద్ద సహజసిద్ధ తీపి నీటి సరస్సు ‘కొల్లేరు’ ఎడారిని తలపిస్తుంది. తీవ్ర అస్తిత్వ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. వేసవి తీవ్రతకు తోడు ప్రతియేటా పూడిక పేరుకుపోవటం తో సరస్సు పరివాహక ప్రాంతాలు చుక్క నీరు కనిపించటం లేదు. నేర్రెలబారిన నేల పై చేపలు దొరక్క పోవటం తో తీవ్ర ఆహార కొరతను సైబీరియన్ పక్షులు ఎదుర్కుంటున్నాయి. కొల్లేరు సరస్సు గర్భం ప్రస్తుతం పూర్తిగా ఎండిపోయి, నెర్రెలు బారిన భూములతో దర్శనమిస్తోంది.
- B Ravi Kumar
- Updated on: May 26, 2026
- 10:10 am
చరిత్రకు సజీవ సాక్ష్యం.. 375 ఏళ్ల డచ్ భవన ప్రస్థానం.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
ఏలూరు: భారతదేశాన్ని పాలించిన రాజులు, నవాబులు, మరియు విదేశీ వర్తకులు తమ పాలనకు గుర్తుగా ఎన్నో కోటలు, కట్టడాలను నిర్మించారు. వందల సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ చెక్కుచెదరకుండా నిలిచిన ఈ చారిత్రాత్మక కట్టడాల ద్వారానే.. అప్పటి సంస్కృతి, సాంప్రదాయాలను, నిర్మాణ నైపుణ్యాలను నేటి తరం వారు తెలుసుకోగలుగుతున్నారు. ఈ కోవలోకే వస్తుంది పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలోని ప్రముఖ ‘శ్రీ యర్రమిల్లి నారాయణ మూర్తి (వై.ఎన్.) కళాశాల’ ప్రాంగణంలో ఉన్న పురాతన పరిపాలనా భవనం. మూడు శతాబ్దాలకు పైగా చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ భవనం.. నాటి విదేశీ వాణిజ్యానికి, నేటి విద్యా ప్రగతికి వారధిగా నిలుస్తోంది. డచ్ కాలం నాటి వాచ్ టవర్.. బ్రిటీష్ వారి కార్యాలయం
- B Ravi Kumar
- Updated on: May 25, 2026
- 2:33 pm
రోడ్డున పడ్డ ‘డాలర్ల పంట’.. కష్టానికి ఫలితం లేక ‘క్రాప్ హాలిడే’ వైపు ఆక్వా రైతుల అడుగులు!
పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేజీకి రూ. 50 వరకు ధరలు తగ్గించడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన బాటపట్టారు. ఒకప్పుడు డాలర్ల పంటగా పిలవబడిన రొయ్యల సాగు, నేడు పెట్టుబడులు పెరిగి, మద్దతు ధర కరువై రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేస్తోంది.
- B Ravi Kumar
- Updated on: May 24, 2026
- 8:21 am
ఘనంగా మామిడి కాయల పండుగ.. దీని ప్రత్యేకత తెలుసా?
ఏలూరు: దసరా, సంక్రాంతి, దీపావళి వంటి పండుగలు అందరికీ తెలిసిందే. కానీ “మామిడికాయల పండుగ” గురించి చాలామందికి తెలియదు. ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు అత్యంత భక్తి, సంప్రదాయబద్ధంగా జరుపుకునే విశిష్టమైన ప్రకృతి పండుగ ఇదే.
- B Ravi Kumar
- Updated on: May 21, 2026
- 1:18 pm