ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 23 సంవత్సరాల అనుభవం ఉంది. విజయవాడలో వార్త దినపత్రిక లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభమైంది. 2008 వరకు వార్త దిన పత్రికలోనే పని చేస్తూ ఆ ఏడాది సెప్టెంబర్ లో టివి9లో స్టాఫ్ రిపోర్టర్ గా చేరటం జరిగింది. అక్కడ నుంచి బదిలీపై పశ్చిమ గోదావరి జిల్లాకు 2011 మే 15 వచ్చి ప్రస్తుతం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. రెండు సార్లు వరుసగా యునిసెఫ్ అవార్డు లు , యన్టీ అవార్డు లభించాయి.
సాగినన్ని రోజులూ సాగించాడు.. 15 ఏళ్ళలో ఓ దొంగోడి ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. !
జీవితంలో ఏం చేసావంటే చెప్పుకోవటానికి కొన్ని మంచి పనులైనా ఉండాలి. అలా మంచిపనులు సమాజ హితం కోసం పనిచేసిన వ్యక్తులకు ఆత్మ తృప్తి కలుగుతుంది. ఇక చెడు ప్రవర్తన, నేర స్వభావం కలిగిన వ్యక్తుల జీవితాలు సైతం సాగినన్ని రోజులు సాగుతాయి. చివరకు ఎదోక రోజు ఎదురు దెబ్బ తగిలితే జీవితం మొత్తం తలకిందులవుతుంది.
- B Ravi Kumar
- Updated on: Apr 10, 2025
- 12:04 pm
తరతరాల ఆచారం ఆగిపోయింది! ఈ సారి చిత్రపటాలతో శ్రీరామనవిమి వేడుకలు..
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం లక్ష్మీపురంలోని గిరిజనులు శ్రీరామనవమిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఉత్సవ విగ్రహాలకు బదులుగా, సండ్ర, పాల, ఊడిగ, రావి చెట్ల మానులను సీతా రామ లక్ష్మణ ఆంజనేయులుగా పూజిస్తారు. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. కానీ ఈ ఏడాది, చెట్ల కొరత కారణంగా, చిత్రపటాలను ఉపయోగించి కళ్యాణం జరిగింది.
- B Ravi Kumar
- Updated on: Apr 7, 2025
- 1:27 pm
Andhra: ఐదు లక్షల గాజులుతో అమ్మవారికి అలంకరణ.. వాటిని భక్తులు ధరించవచ్చా..?
కుంకుళ్లమ్మ ఆలయంలో వసంత నవ రాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ముందుగా ఆలయాన్ని పరిసరాలను పుష్పమాలికలు, మామిడి తోరణాల తో నయనానందకరంగా అలంకరించారు. 5 లక్షగాజుల అలంకరణలో నిండు ముత్తెదువుగా ఉన్న అమ్మవారికి పూజలు జరిపి పంచ హారతులను సమర్పించారు.
- B Ravi Kumar
- Updated on: Apr 6, 2025
- 7:00 am
Andhra Pradesh: అమ్మో చిరుత.. హడలిపోయిన స్థానికులు.. అసలు విషయం తెలిసి షాక్!
నిర్మానుష్య ప్రాంతం.. జనసంచారం లేదు. కాని కుక్కలు పెద్దగా అరుస్తున్నాయి. వాటి గోల ఆర్తనాదాలుగా మారి సమీప జువ్వలపాలెం రోడ్డు వరకు వినిపించింది. దీంతో అటుగా వెళ్లే కొందరు పరుగు పరుగున అక్కడకు వెళ్లారు. కుక్కలు అరుస్తూనే ఉన్నాయి. వారి కళ్లు ముందు చనిపోయిన ఓ కుక్క కళేబరం కనిపించింది. కుక్కలు ఎందుకు అరుస్తున్నాయో వారికి అర్ధం కాలేదు.
- B Ravi Kumar
- Updated on: Apr 5, 2025
- 7:44 pm
ఆనప బుర్ర… నేచురల్ వాటర్ బాటిల్… ఇంకా ఎన్నో బెనిఫిట్స్
అసలే వేసవి కాలం. ఎండలు మండి పోతున్నాయి. చేతిలో వాటర్ బాటిల్ ఉన్నా తాగాలంటే వేడెక్కి దాహం తీరని పరిస్థితి. ఇక వాటర్ సహజ సిద్ధంగా కూల్ అయ్యేందుకు మట్టి కుండలను సైతం ఎక్కువగా వాడుతున్నారు. ఐతే ఏజెన్సీలో గిరిజనులు నీటి కోసం సొరకాయ బుర్రలను వాడుతున్నారు.
- B Ravi Kumar
- Updated on: Apr 4, 2025
- 4:04 pm
అక్షర పేరంటం…ఊరంతా ఆహ్వానం..! ఇదేందబ్బా కొత్తగా ఉంది..?
ముందుగా గ్రామ పెద్దలు అందరినీ కలిసారు. గ్రామంలో మంచి విద్యను అందిస్తామని, అన్ని వసతులు ఉన్నాయని తమకు సహకరించాలని కోరారు. ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇంటికి గ్రామ పెద్దలతో కలిసి వెళ్ళారు. విద్యార్దుల తల్లిదండ్రులు తమ పిల్లలను చదివిస్తే మంచి భవిష్యత్తు అందిస్తామని గ్రామస్తులతో కలిసి భరోసా ఇచ్చారు.
- B Ravi Kumar
- Updated on: Apr 3, 2025
- 1:06 pm
Andhra Pradesh: ఆ గుడిలోకి అకస్మాత్తుగా వచ్చిన ఆవు.. భక్తులు ఆశ్చర్య పోయేలా ఏంచేసిందంటే..
సాధారణంగా భక్తులు ఏదైనా ఆలయానికి వెళ్లిన సమయంలో ముందుగా ఎంతో భక్తి శ్రద్ధలతో గుడి చుట్టూరు 3, 9, 11, 108 ఇలా ఎవరికి నచ్చినన్నిసార్లు వారు ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి మూలవిరాట్ ను దర్శించి పూజలు నిర్వహించడం పరిపాటి. అయితే కొన్ని సార్లు ఆలయాల్లో జంతువులు ప్రదక్షిణలు చేసిన సంఘటనలు మనం చూసాం, విన్నాం.. అలాంటి ఒక ఘటన ఏలూరు జిల్లాలో ఇప్పుడు వైరల్ గా మారింది.
- B Ravi Kumar
- Updated on: Mar 26, 2025
- 12:43 pm
Andhra Pradesh: మద్యం దుకాణంలో విచిత్ర పూజ.. భగవంతునికి మద్యం బాటిళ్లు నైవేద్యం.. ఎక్కడంటే..
చట్ట బద్దమైన హెచ్చరిక మద్యం తాగుట హానికరం అని సీసాలపైనే ముద్రించి ఉంటుంది. కొన్నిసార్లు గ్రామదేవతలకు మొక్కు తీర్చికునే సమయంలో కల్లుతో పాటు నాన్ వెజ్ వంటలతో కూడిన ఆహార పదార్ధాలు పెడుతుంటారు. ఇక చాలా మద్యం షాపులకు దేవుళ్ళ పేర్లనే పెడుతుంటారు .
- B Ravi Kumar
- Updated on: Mar 18, 2025
- 12:01 pm
Andhra Pradesh: పిల్లాడనే కనికరం లేకుండా పోయింది.. కుక్కల గొలుసుతో కట్టేశారు..!
మనుషులలో రాను రాను మానవత్వం మంటగలుస్తోంది. తాజాగా మరో ఘటన నిడమర్రులో వెలుగు చూసింది. జంతువులలో సైతం తమ తోటి జంతువులకు ఎవరైనా హాని తలపెడితే అవి అన్ని కలిసి సమిష్టిగా పోరాడుతాయి. కానీ మనుషులలో మాత్రం ఏమాత్రం జాలి దయ ఉండడం లేదు. కనీసం చిన్నపిల్లలనే విషయం మరిచి ప్రవర్తించడం మనిషి విలువలను దిగజార్చుతున్న పరిస్థితి.
- B Ravi Kumar
- Updated on: Mar 16, 2025
- 11:01 am
Andhra News: కొడుకును కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న తల్లిని ఓదార్చిన కొండముచ్చు
మనుషుల్లో కనుమరుగవుతున్న మానవత్వం జంతువుల్లో కనిపిస్తుందా అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల కాలంలో పక్కింటి వాడికి ఆపద వచ్చి అలోమని ఏడుస్తున్నా పక్కనుంచి వెళ్లిపోయేవాళ్లే కానీ.. ఆప్యాయంగా పలకరించి ఓదార్చే వాళ్లే కరువైపోతున్నారు. కానీ, ప్రమాదంలో తన బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో బాధపడుతున్న ఓ తల్లిని ఓ మూగజీవి ఓదార్చుతూ, కన్నీళ్ళు తుడిచింది. నీ బిడ్డ అల్లరిని నాలో చూసుకో అన్నట్టుగా చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది. ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.
- B Ravi Kumar
- Updated on: Mar 9, 2025
- 4:09 pm
Viral Video: ఓర్నీ.. ఇదేదో మ్యాజిక్లా ఉందే.. ఈకల్లేని కోడిపుంజును ఎక్కడైనా చూశారా..?
కోడి పుంజు, పెట్ట , ఫారం కోడి, బాయిలర్ కోడి.. వీటిని వివిధ రంగుల్లో ఈకలతో చూస్తుంటాము. కాని అసలు కోడికి ఈకలు లేకపోతే ఎలా ఉంటుంది. చూసేందుకు కాస్త చిత్రంగానే ఉంటుంది కదూ. అలాంటి అరుదైన కోడి సహజమైన కోడిలా జీవించగలుగంతుందా..? ఏ లోపం వల్ల దానికి ఇలాంటి సమస్యలు వస్తాయి.. అనే ఆసక్తికర విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- B Ravi Kumar
- Updated on: Feb 18, 2025
- 12:48 pm
తొలితరం నటి క్రృష్ణ వేణి బ్యాగ్రౌండ్.. ఆమె మీర్జాపురం రాణి అని మీకు తెలుసా.?
ప్రముఖ నటి, సీనియర్ నిర్మాత కృష్ణవేణి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు కాగా.. కొన్ని రోజులుగా వయోభార సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. సీనియర్ హీరో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)ను సినీరంగానికి హీరోగా పిరచయం చేశారు కృష్ణవేణి. ఆమె నిర్మించిన మనదేశం చిత్రంలో ఎన్టీఆర్ చిన్న పాత్ర పోషించారు.
- B Ravi Kumar
- Updated on: Feb 17, 2025
- 9:17 am