ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 23 సంవత్సరాల అనుభవం ఉంది. విజయవాడలో వార్త దినపత్రిక లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభమైంది. 2008 వరకు వార్త దిన పత్రికలోనే పని చేస్తూ ఆ ఏడాది సెప్టెంబర్ లో టివి9లో స్టాఫ్ రిపోర్టర్ గా చేరటం జరిగింది. అక్కడ నుంచి బదిలీపై పశ్చిమ గోదావరి జిల్లాకు 2011 మే 15 వచ్చి ప్రస్తుతం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. రెండు సార్లు వరుసగా యునిసెఫ్ అవార్డు లు , యన్టీ అవార్డు లభించాయి.
Tholi Ekadashi: నేడు రైతుల పండగ తొలి ఏకాదశి.. ద్వారకా తిరుమల ఆలయానికి పోటెత్తిన భక్తులు..
తొలి ఏకాదశి సందర్భంగా ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో తలనీలాలు, మొక్కుబడులు సమర్పించి స్వామిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం మంచినీటి సదుపాయంతో పాటు, కంపార్ట్మెంట్లో వేచి ఉండే చంటి బిడ్డల కోసం పాలు బిస్కెట్లు అందుబాటులో ఉంచారు.
- B Ravi Kumar
- Updated on: Jul 17, 2024
- 9:35 am
ఇది మామూలు రిటైర్మెంట్ ఫంక్షన్ కాదు.. అన్నదాతలకు అరుదైన గౌరవం..!
సహజంగా ప్రభుత్వ ఉద్యోగస్థుల పదవీ విరమణ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, సంబంధిత అధికారులు ఘనంగా నిర్వహించడం పరిపాటి. ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ వృద్ధాప్యంలో రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత తమ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని ఉద్యోగస్థులు భావిస్తారు.
- B Ravi Kumar
- Updated on: Jul 11, 2024
- 3:24 pm
ఏపీలోని ఆ చిన్న ఊరు.. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ ఎందుకయ్యింది? అసలేంటి ఆ ఊరి స్పెషాలిటీ?
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అజ్జరం గ్రామం ఇత్తడి వస్తువులకు ఎంతో ఫేమస్.. అక్కడ ఎక్కడ చూసినా ఇత్తడి వస్తువులే మనకు దర్శనమిస్తాయి. గ్రామంలోకి మొదలైంది మొదలు ఏ గడపలో చూసిన ఇత్తడి వస్తువుల తయారీలో స్థానికులు నిమగ్నమై ఉంటారు. అజ్జరం గ్రామం సుమారు 4 వేలమంది పైచిలుకు జనాభా కలిగిన ఓ గ్రామం.
- B Ravi Kumar
- Updated on: Jul 11, 2024
- 1:54 pm
Andhra Lace: ఇది కదా తెలుగువారి సత్తా..! ఒలింక్ క్రీడాకారులకు నర్సాపురం లేస్ ఉత్పత్తులు..!
విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఒలంపిక్స్ ఈసారి ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరం వేదిక కానుంది. యూరప్లో జరిగే ఈ విశ్వక్రీడల్లో ఈ సారి మన. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురలో తయారైన చేతి ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
- B Ravi Kumar
- Updated on: Jul 12, 2024
- 12:00 pm
Shravan Masam 2024: ఐదు సోమవారాలు, నాలుగు మంగళవారాలు.. ఈసారి శ్రావణం చాలా ప్రత్యేకం..
శ్రావణమాసం మహిళలకు ఎంతో ఇష్టమైన నెల... ఆ నెల అంతా మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో సందడిగా తెలుగు సాంప్రదాయాలు ఉట్టి పడేటట్టుగా పూజలు వ్రతాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శ్రావణమాసంలో శ్రావణ వరలక్ష్మీ వ్రతాలతో పాటు, శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు కూడా నిర్వహించడం మహిళలకు పరిపాటి. వాటితోపాటు సోమవారం కూడా ఎంతో విశిష్టమైన రోజు.
- B Ravi Kumar
- Updated on: Jul 6, 2024
- 3:36 pm
Chirri Balaraju: ఆదర్శ నేతల వారసుడిగా జనసేన ఎమ్మెల్యే.. అభిమానులు ఇచ్చిన కారును ఏం చేశారో తెలుసా..?
అభిమానులంటే అలా ఉండాలి. కార్యకర్తలంటే ఇలా ఉండాలి. మరి నాయకుడెలా ఉండాలి? అచ్చం ఆ ఎమ్మెల్యేలాగా ఉండాలి. ఏమిటంటా ఆయన గొప్పతనం? అంటారా.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆమ్యామ్యాలకు అలవాటుపడిన నేతలను చూస్తున్న మనకు అభిమానంతో ఇచ్చిన బహుమతిని కూడా తిరిగి ఇచ్చేసిన వ్యక్తిత్వం ఆయనది. ఎవరా ఎమ్మెల్యే? ఏమిటా గిఫ్ట్?
- B Ravi Kumar
- Updated on: Jul 3, 2024
- 7:51 pm
Andhra Pradesh: అభిమానం అంటే ఇదే..! ఎమ్మెల్యేకే కారు గిఫ్ట్.. అభిమానం చాటుకున్న జనసైనికులు..!
ఎన్నికల సమయంలో జెండాలు మోయటం, పార్టీ ఎజెండా ప్రజల్లోకి తీసుకుని వెళ్లటం, ఓట్లు వేయండయ్యా.. అంటూ ప్రజలను రిక్వెస్ట్ చేయటం ఇది సగటు పార్టీ కార్యకర్తలు పని అనుకుంటాం. కానీ పోలవరం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు మరో అడుగు ముందుకు వేశారు. ఓ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారంటే పెద్ద ఎత్తున హడావుడి ఉంటుంది.
- B Ravi Kumar
- Updated on: Jul 2, 2024
- 4:19 pm
Andhra Pradesh: పెన్షనర్కు అరుదైన గౌరవం.. వృద్దురాలి కాళ్లు కడిగిన మంత్రి..
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. వృద్దులు, దివ్యాంగుల కాళ్ళు కడిగి పెన్షన్ సొమ్మును పళ్లెంలో పెట్టి అందించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పెన్షన్దారులకు పాదాభివందనం చేసి కాళ్లు కడిగిన మంత్రి నిమ్మల రామానాయుడు తన సేవా దృక్పదంను మరోసారి చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో మంచం పట్టి ఉన్న పితాని సూర్యనారాయణ అనే లారీ డ్రైవర్కు మంత్రి తొలి పెన్షన్ అందజేశారు.
- B Ravi Kumar
- Updated on: Jul 1, 2024
- 1:15 pm
మావూళ్ళమ్మకు జేష్ఠమాసంలో జాతర.. ఆశాఢంలో ప్రత్యేక అలంకరణ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు..
భీమవరం మావుళ్ళమ్మకు నెల రోజులపాటు వైభవంగా జేష్ఠ మాస జాతర ప్రతియేటా నిర్వహిస్తారు. భీమవరం ప్రజలు తమ ఇలవేల్పుగా మావుళ్ళమ్మను కొలవటం ఆనవాయితీగా వస్తోంది. నిత్యం ఒంటినిండా బంగారంతో మెరిసిపోతూ భక్తులను అనుగ్రహిస్తున్న తల్లి మావుళ్ళమ్మ. మావుళ్ళమ్మ అమ్మవారికి జ్యేష్ఠ మాస జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
- B Ravi Kumar
- Updated on: Jun 28, 2024
- 4:28 pm
ఓ చేతిలో వల.. మరో చేతిలో చేప.. మత్స్యకారుని వేషధారణలో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే..
ఎంత ఎదిగినా సొంత సామాజిక వర్గాన్ని, ఊరును మర్చిపోకూడదు అంటారు పెద్దలు.. అందుకేనేమో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినా తన మూలాలు మరిచిపోలేదు. ఏపీ అసెంబ్లీలో తొలి రోజైన శుక్రవారంనాడు (జూన్ 21) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సాంప్రదాయ మత్సకారుని వేషధారణలో అసెంబ్లీకి వచ్చారు.
- B Ravi Kumar
- Updated on: Jun 22, 2024
- 3:30 pm
Teachers to Ministers: రాజకీయాల్లోకి వచ్చిన మహిళ టీచర్లకు ఏకంగా మంత్రి పదవులే..!
ఏపీలో ఓ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ ట్రెండు ఇప్పుడేమి కొత్తగా మొదలైందీ కాదు..! ఓ సినిమాలో నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా.. అన్నట్లు ఇక్కడ వ్యవహారం ఉంది. అయితే ఇక్కడ అదే ట్రెండు ఫాలో అవుతూ జాక్పాట్ కొట్టేస్తున్నారు ఆ మహిళా నేతలు.
- B Ravi Kumar
- Updated on: Jun 19, 2024
- 12:51 pm
Andhra Pradesh: ఆయ్.. గోదారోళ్ల మర్యాదంటే మాములుగా ఉండదండి మరి.. 152 రకాలతో విందు
గోదావరి జిల్లాల ఆప్యాయతకు మురిసిపోయారు అతిధులు. ఆంధ్రా వంటకాలను రుచి చూసి, ఆహా ఏమి రుచి అంటూ కేరళావాసులు లొట్టలు వేశారు. అతిధి సత్కారం చేయాలంటే గోదావరి వాసుల ప్రత్యేకతే వేరు. కొత్తగా పెళ్ళి జరిగినా, కొత్త అల్లుడు ఇంటికి వచ్చినా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా విందు మాత్రం అదిరిపోవాల్సిందే..! రకరకాల స్వీట్లు, పిండి వంటలు, బిర్యానీలు, నాన్ వేజ్ పచ్చళ్ళు అన్ని రకాలు ఉండాల్సిందే. కొందరైతే వంద రకాలకు పైనే వడ్డిస్తారు.
- B Ravi Kumar
- Updated on: Jun 17, 2024
- 11:09 am