AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

B Ravi Kumar

B Ravi Kumar

Staff Reporter - TV9 Telugu

ravikumar.bandikatla@tv9.com

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 23 సంవత్సరాల అనుభవం ఉంది. విజయవాడలో వార్త దినపత్రిక లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభమైంది. 2008 వరకు వార్త దిన పత్రికలోనే పని చేస్తూ ఆ ఏడాది సెప్టెంబర్ లో టివి9లో స్టాఫ్ రిపోర్టర్ గా చేరటం జరిగింది. అక్కడ నుంచి బదిలీపై పశ్చిమ గోదావరి జిల్లాకు 2011 మే 15 వచ్చి ప్రస్తుతం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. రెండు సార్లు వరుసగా యునిసెఫ్ అవార్డు లు , యన్టీ అవార్డు లభించాయి.

Read More
Follow On:
Andhra: పని చేసుకుంటున్న రైతులు.. పొలంలో గడ్డి మాటున ఇది..

Andhra: పని చేసుకుంటున్న రైతులు.. పొలంలో గడ్డి మాటున ఇది..

తూర్పు గోదావరి జిల్లాలో పొలాల్లో చిన్న అడవి పిల్లి కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వరి కోతల తర్వాత ఖాళీగా ఉన్న పొలాల్లో ఈ వన్యప్రాణి సంచారం రైతుల్లో ఆందోళనకు దారితీసింది. సమాచారం అందుకున్న వైల్డ్‌లైఫ్ రెస్క్యూ టీమ్ అడవి పిల్లిని సురక్షితంగా పట్టుకుని తరలించింది.

జై హనుమాన్ చెప్పకుండా ఉండలేరు..! పెన్సిల్ లిడ్‌పై అద్భుత కళ

జై హనుమాన్ చెప్పకుండా ఉండలేరు..! పెన్సిల్ లిడ్‌పై అద్భుత కళ

ప్రపంచం ఎంత ఆధునికత వైపు దూసుకెళ్తున్నా చేతివృత్తి కళల విలువ తగ్గదు. ముఖ్యంగా సూక్ష్మ కళారూపాలు చిన్న పరిమాణంలోనే అద్భుత భావాలను ప్రతిబింబిస్తాయి. ఇలాంటి అరుదైన కళలో ప్రత్యేక గుర్తింపు పొందిన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రుస్తుంబాధకు చెందిన గిన్నిస్ రికార్డు గ్రహీత కొప్పినీడి విజయ మోహన్ తన కళా ప్రతిభతో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కోటలా కనిపించే ఆచంట మదనగోపాలస్వామి ఆలయం.. 16వ శతాబ్దపు రాజుల వైభవానికి సజీవ సాక్ష్యం

కోటలా కనిపించే ఆచంట మదనగోపాలస్వామి ఆలయం.. 16వ శతాబ్దపు రాజుల వైభవానికి సజీవ సాక్ష్యం

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆధ్యాత్మిక సొబగులకు, పురాతన కట్టడాలకు సాక్ష్యంగా నిలిచే అరుదైన ఆలయాల్లో ఆచంట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత మదనగోపాలస్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు అది ఒక దేవాలయమా లేక శత్రుదుర్భేద్యమైన ఒక చారిత్రక కోటనా అనే సందేహం కలగక మానదు.

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు బంద్..శుభకార్యాలకు బ్రేక్..? జూన్ 19 వరకు వేచి చూడాల్సిందే! కారణం

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు బంద్..శుభకార్యాలకు బ్రేక్..? జూన్ 19 వరకు వేచి చూడాల్సిందే! కారణం

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సుమారు 36 రోజుల పాటు శుభకార్యాలకు విరామం కలగనుంది. మళ్లీ జూన్ 19 నుండి కొత్త ముహూర్తాలు ప్రారంభం కానున్నాయని పురోహితులు పేర్కొంటున్నారు. ఈ విరామం వల్ల పౌరోహిత్యం, కల్యాణ మండపాలు, క్యాటరింగ్, ఫొటోగ్రఫీ వంటి రంగాలపై ఆధారపడిన వేలాది మంది ఉపాధిపై ప్రభావం పడనుంది. బుధవారం ఆఖరి పెద్ద ముహూర్తం కావడంతో పుణ్యక్షేత్రాల్లో వివాహాలు భారీగా జరిగాయి. ఇంతకీ, అసలు సంగతేంటో ఇప్పుడు చూద్దాం..

Andhra: నువ్వు మనిషి రూపంలో ఉన్న మృగానివిరా.. తనకు పుట్టలేదంటూ కొడుకును హింసించి..

Andhra: నువ్వు మనిషి రూపంలో ఉన్న మృగానివిరా.. తనకు పుట్టలేదంటూ కొడుకును హింసించి..

తెల్లగా ఉన్న తండ్రికి నల్లటి పిల్లవాడు పుట్టకూడదా.. నలుపు రంగు భర్త ఉన్న మహిళ తెల్లటి పిల్లవాడికి జన్మ నివ్వకూదదా.. ఆకుపచ్చని తమలపాకు, తెల్లని సున్నం , కాఫీ రంగులో ఉండే వక్క కలిపి నమిలితే నోరు ఎర్రగా పండినట్లు.. తల్లిదండ్రుల మేని ఛాయకు పుట్టిన బిడ్డ రంగుకు ఖచ్చితంగా సారూప్యం ఉండాలనే నిభందన లేదు. కానీ..

Andhra Pradesh: లక్షకు రూ.30 వేల వడ్డీ.. రూ.25 కోట్లు వసూల్.. ఈ కిలాడి జంట చేసిన పని తెలిస్తే నోరెళ్లబెడతారు..

Andhra Pradesh: లక్షకు రూ.30 వేల వడ్డీ.. రూ.25 కోట్లు వసూల్.. ఈ కిలాడి జంట చేసిన పని తెలిస్తే నోరెళ్లబెడతారు..

అధిక వడ్డీ ఆశ చూపిస్తే చాలు.. అమాయక జనం ఆకర్షితులవుతారని భావించిన ఆ జంట కోట్లకు పడగలెత్తింది. తక్కువ ధరకే బంగారం, భారీగా వడ్డీలంటూ నమ్మించి సుమారు 25 కోట్ల రూపాయల మేర టోకరా వేసింది. తణుకు పట్టణంలో వెలుగుచూసిన ఈ కిలాడీ జంట బాగోతం ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనంగా మారింది.

బస్టాండ్‌లో ఒంటరిగా తచ్చాడుతున్న మహిళ.. మ్యాట్రిక్స్ కెమెరాలతో చెక్ చేయగా.. పెద్ద ముదురే..

బస్టాండ్‌లో ఒంటరిగా తచ్చాడుతున్న మహిళ.. మ్యాట్రిక్స్ కెమెరాలతో చెక్ చేయగా.. పెద్ద ముదురే..

ఏలూరు జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ నేరాల నియంత్రణలో ముందంజలో ఉన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీటీవీ, మ్యాట్రిక్స్ కెమెరాలను పర్యవేక్షించి, జంగారెడ్డిగూడెంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న పాత మహిళా నేరస్తురాలు దిగుమర్తి భవానిని పట్టుకున్నారు. AI ఆధారిత ఈ వ్యవస్థ ప్రజల భద్రతకు ఎంతగానో దోహదపడుతుందని మరోసారి నిరూపితమైంది.

మమతా బెనర్జీ గద్దె దిగే వరకు చెప్పులు లేకుండా నడిచిన తాడేపల్లి గూడెం మహిళ.. ఎందుకు?

మమతా బెనర్జీ గద్దె దిగే వరకు చెప్పులు లేకుండా నడిచిన తాడేపల్లి గూడెం మహిళ.. ఎందుకు?

వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయే వరకు చెప్పులు ధరించకుండా ఉంటానని తాడేపల్లి గూడెంకు చెందిన ఒక మహిళ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఆసక్తిని రేపుతోంది. మమతా బెనర్జీ ఓటమి అనంతరం బీజేపీ కార్యకర్తలు ఆమెకు కొత్త చెప్పులు బహుకరించినట్లు తెలుస్తోంది. ఈ మహిళ ఇంత కఠినమైన ప్రతిజ్ఞ ఎందుకు తీసుకుంది అనే విషయంపై తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.

నరసాపురం వీధుల్లో వింటేజ్ వైభవం..  నెటిజన్లను ఆకట్టుకుంటున్న 1947 నాటి రోల్స్‌ రాయిస్‌!

నరసాపురం వీధుల్లో వింటేజ్ వైభవం.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న 1947 నాటి రోల్స్‌ రాయిస్‌!

ఆధునిక కార్ల యుగంలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును చాటుకుంటూవస్తున్న కారు రోల్స్ రాయిస్. తాజాగా ఆరు దశాబ్దాల క్రితం నాటి ఈ రాజసం నరసాపురం వీధుల్లో ఇప్పుడు సందడి చేసింది. స్వాతంత్ర్య కాలం నాటి జ్ఞాపకాలను నెమరువేస్తూ, 1947 మోడల్ రోల్స్ రాయిస్ కారు పట్టణ వాసులను మంత్రముగ్ధులను చేసింది. ఈ స్టైలిష్ వింటేజ్ కార్‌ను చేసేందుకు జనాలు క్యూ కడుతున్నారు.

నాణాలతో నారాయణుడు ..చూడటానికీ రెండు కళ్లు చాలవే..

నాణాలతో నారాయణుడు ..చూడటానికీ రెండు కళ్లు చాలవే..

తూర్పుగోదావరి జిల్లా రైతు యర్రంశెట్టి రామకృష్ణ భక్తికి నిదర్శనంగా లక్ష నాణేలతో అద్భుత శ్రీవారి విగ్రహాన్ని రూపొందించారు. 1.08 లక్షల నాణాలతో, నాలుగు అడుగుల ఎత్తులో తీర్చిదిద్దిన ఈ ప్రతిమను 60 రోజుల్లో పూర్తిచేశారు. ఈ కళాఖండాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల దేవస్థానానికి అప్పగించనున్నారు. ఇది భక్తులందరికీ ఒక విలక్షణమైన, అపురూపమైన అనుభూతిని ఇస్తుంది.

Andhra Pradesh: ఈ మహిళకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. సక్సెస్ అంటే ఇది కదా.. కొడుకుతో పాటు..

Andhra Pradesh: ఈ మహిళకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. సక్సెస్ అంటే ఇది కదా.. కొడుకుతో పాటు..

చదువుకు వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది ఓ మహిళ. పెళ్లైన తర్వాత చదువు ఆగకూడదనే ఉద్దేశంతో కొడుకుతో కలిసి టెన్త్ పరీక్ష రాసి పాసైంది. గురువారం విడుదలైన టెన్త్ పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణణ సాధించింది. దీంతో ఆమె ఆనందంతో ఎగిరి గంతేసింది.

మద్యం మత్తులో పెను విషాదం.. ఆవేశంలో తండ్రీకొడుకుల ఆత్మహత్య..అసలేం జరిగిందంటే..

మద్యం మత్తులో పెను విషాదం.. ఆవేశంలో తండ్రీకొడుకుల ఆత్మహత్య..అసలేం జరిగిందంటే..

క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం గరువు పల్లవపాలెంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మద్యం మత్తులో తలెత్తిన గొడవ, తండ్రీకొడుకుల ఆత్మహత్యకు దారితీయడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళితే...