ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 23 సంవత్సరాల అనుభవం ఉంది. విజయవాడలో వార్త దినపత్రిక లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభమైంది. 2008 వరకు వార్త దిన పత్రికలోనే పని చేస్తూ ఆ ఏడాది సెప్టెంబర్ లో టివి9లో స్టాఫ్ రిపోర్టర్ గా చేరటం జరిగింది. అక్కడ నుంచి బదిలీపై పశ్చిమ గోదావరి జిల్లాకు 2011 మే 15 వచ్చి ప్రస్తుతం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. రెండు సార్లు వరుసగా యునిసెఫ్ అవార్డు లు , యన్టీ అవార్డు లభించాయి.
భీమవరం ఆలయంలో అంగరంగ వైభవంగా సారె సమర్పణ.. 8,000 కేజీల మిఠాయిలతో శోభాయాత్ర!
ఈ వేడుకలో భాగంగా ఏకంగా 8,000 కేజీల వివిధ రకాల మిఠాయిలు, పండ్లతో కూడిన భారీ సారెను అమ్మవార్లకు సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రకరకాల స్వీట్లు, పండ్లతో అలంకరించిన ఎడ్లబండ్లతో భక్తులు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ శోభాయాత్ర సోమగుండం చెరువు వద్ద ప్రారంభమై నాచువారి సెంటర్, బ్రాహ్మణ వీధి మీదుగా ప్రధాన ఆలయానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని మంగళహారతులతో ఊరేగింపులో నడిచారు.
- B Ravi Kumar
- Updated on: Aug 30, 2026
- 3:27 pm
84 సీసీటీవీలు తేల్చలేని కేసు.. ఒక్క సర్జికల్ స్క్రూతో హంతకుడిని పట్టుకున్న పోలీసులు
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో వెలుగుచూసిన గుర్తుతెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఎలాంటి గుర్తింపు కార్డులు గానీ, ప్రాథమిక ఆధారాలు గానీ లేని ఈ కేసులో.. మృతురాలి ఎడమ కాలికి అమర్చిన సర్జికల్ ఇంప్లాంట్ స్టీల్ ప్లేట్, స్క్రూ సీరియల్ నంబర్ ప్రధాన ఆధారంగా మారి నిందితుడిని పట్టించింది. ఇంతకూ పోలీసులు నిందితుడిని ఎలా పట్టుకున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- B Ravi Kumar
- Updated on: Aug 24, 2026
- 10:23 pm
Andhra News: గుళ్లకు వెళ్లే వారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఆలయాల్లో ఈ రూల్స్ పాటించకపోతే అంతే!
మీరు గుడికి వెళ్లి ఫొటోలు తీస్తున్నారా? గుడిలో రీల్స్ చేస్తున్నారా? జాగ్రత్త.. ఇకపై అలా చేస్తే మీరు తప్పకుండా చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవలసిందే. అవును పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో గర్భగుడిలోని మూలవిరాట్ విగ్రహాలను ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేదాన్ని విధిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
- B Ravi Kumar
- Updated on: Aug 22, 2026
- 2:20 pm
వంద కేజీల స్వర్ణంతో శ్రీ మావుళ్లమ్మ తల్లి.. దేశంలోనే అత్యధిక బంగారంతో దర్శనమిచ్చే ఏకైక అమ్మవారు..!
వంద కేజీల బంగారం నిక్షిప్తం కానున్న నేపథ్యంలో ఆలయ భద్రతను అత్యున్నత స్థాయికి పెంచుతున్నారు. భక్తుల రద్దీ, ఆభరణాల విలువను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రతిపాదించారు. ఆలయ రక్షణకు గన్ మెన్లను కేటాయించాలని డీజీపీని కోరారు. ప్రస్తుతం ఉన్న 40కి పైగా సీసీ కెమెరాలు, హోంగార్డులతో పాటు త్వరలోనే ఆధునిక మెటల్ డిటెక్టర్లు, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్లను అందుబాటులోకి తేనున్నారు.
- B Ravi Kumar
- Updated on: Aug 21, 2026
- 3:09 pm
దూది, వత్తులతో పనిలేని వింత మొక్క: ప్రకృతి ప్రసాదించిన పూజా దీపం
పత్తి వత్తులు లేకుండానే కేవలం ఓ ఆకుతో దీపం వెలిగించవచ్చా? అవునంటోంది ‘పాండవ పత్తి’ మొక్క. ఏలూరు జిల్లా నాచుగుంటలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో సంరక్షిస్తున్న ఈ మొక్క ఆకును నూనె లేదా నెయ్యిలో ముంచి వెలిగిస్తే పత్తి వత్తిలా జ్యోతి వెలుగుతుంది. సహజసిద్ధమైన ఈ మొక్క విశేషం ఇప్పుడు ప్రకృతి ప్రేమికులు, భక్తులను ఆకట్టుకుంటోంది.
- B Ravi Kumar
- Updated on: Aug 21, 2026
- 7:55 am
ఎకరన్నర పొలంలో అద్భుతం చేసిన రైతు.. ఆ క్షేత్రానికి వివిధ దేశాల శాస్త్రవేత్తల క్యూ..
ఏలూరు జిల్లా నాచుగుంటకు చెందిన రైతు జి. వెంకటరత్నం ఇండోనేషియా ‘ఫిష్–ప్యాడీ’ విధానాన్ని అనుసరిస్తూ 1.5 ఎకరాల్లో సమీకృత సాగుతో సిరులు పండిస్తున్నారు. వరి, చేపలు, పండ్ల తోటలు, కూరగాయలను ఒకే క్షేత్రంలో సాగు చేస్తూ ఏటా లక్షల రూపాయల నికర లాభం ఆర్జిస్తున్నారు.
- B Ravi Kumar
- Updated on: Aug 19, 2026
- 3:44 pm
చరిత్ర గర్భంలో దాగివున్న అపురూప ఘట్టం.. చెన్నకేశవ ఆలయంలో అరుదైన శాసనం.. దీని గురించి మీకు తెలుసా..
ఏలూరు శనివారపుపేటలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో అరుదైన చారిత్రక శాసనం వెలుగులోకి వచ్చింది. 1808 అక్టోబర్ 28న జమీందారు శ్రీ నృసింహ అప్పారావు నిర్వహించిన ‘తులాభార’ దాన విశేషాలను ఈ శాసనం వెల్లడిస్తోంది. తన శరీర బరువుకు సమానంగా మేలిమి బంగారం, నవరత్నాలను తూచి దానం చేసినట్లు శాసనంలో పేర్కొన్నారు. ఆలయ అర్చకులు, నర్తకీమణులు, సంగీత విద్వాంసులు, ఇతర సేవా సిబ్బందికి ఈ దానాన్ని పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.
- B Ravi Kumar
- Updated on: Aug 18, 2026
- 9:26 am
Andhra: రోడ్డు పక్కన తుప్పల్లో కనిపించిన దుప్పటి.. ఏంటా అని దగ్గరకెళ్లి చూస్తే..
ఏలూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆకివీడు పరిధిలోని ఉప్పుటేరు వంతెన సమీపంలో తుప్పల్లో దుప్పట్లో చుట్టి ఉన్న గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. ఒంటిపై తీవ్ర గాయాలు ఉండటంతో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించగా.. మహిళ వివరాల కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
- B Ravi Kumar
- Updated on: Aug 16, 2026
- 11:52 am
మిలటరీ మాధవరం.. ప్రతి ఇంటికో సైనికుడు! దేశభక్తికి నిలువెత్తు నిదర్శనంగా ఆ గ్రామం
Military Madhavaram: పశ్చిమగోదావరి జిల్లాలోని మాధవరం దేశ రక్షణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గ్రామం. ఒకప్పుడు ప్రతి కుటుంబం నుంచి యువకులు సైన్యంలో చేరడం ఆనవాయితీగా ఉండేది. బ్రిటిష్ కాలం నాటి ప్రపంచ యుద్ధాల నుంచి నేటి సరిహద్దు పోరాటాల వరకు ఈ గ్రామానికి చెందిన ఎందరో సైనికులు సేవలందించారు. అందుకే మాధవరం కాస్తా ‘మిలటరీ మాధవరం’గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
- B Ravi Kumar
- Updated on: Aug 15, 2026
- 9:08 am
1921లో ఏలూరులో గాంధీ తాత నాటిన మొక్క ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
1921 ఏప్రిల్ 3న మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ ఏలూరులో పర్యటించారు. ఆ సందర్భంగా గాంధీజీ మేడి మొక్క నాటారు. వందేళ్లకు పైగా పెరిగిన ఆ చారిత్రక చెట్టు 2022లో ఎండిపోయింది. అయితే అదే ప్రదేశంలో మొలిచిన వేపచెట్టు ఇప్పుడు విద్యార్థులకు నీడనిస్తూ, బాపూజీ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతోంది.
- B Ravi Kumar
- Updated on: Aug 14, 2026
- 9:34 am
అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?
ఏలూరు జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ప్రాణాలతో ఉన్న వ్యక్తిని ప్రభుత్వ రికార్డుల్లో మృతుడిగా నమోదు చేశారు. తీవ్ర అనారోగ్యంతో ఆపరేషన్ కోసం ఆరోగ్యశ్రీని ఆశ్రయించిన మురళీకృష్ణకు.. రికార్డుల్లో తాను ఇప్పటికే చనిపోయినట్లు నమోదై ఉందని తెలియడంతో షాక్కు గురయ్యాడు. తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఉన్నతాధికారులను కోరుతున్నాడు.
- B Ravi Kumar
- Updated on: Aug 12, 2026
- 5:59 pm
Andhra Pradesh: 12లక్షలు ఇస్తే మీ కూతురిని పంపిస్తా.. తాళికట్టిన రోజే భార్యను బేరం పెట్టిన నీచుడు.. అసలు ఏం జరిగిందంటే..?
తాళి కట్టిన కాసేపటికే ఆ పెళ్లి కొడుకు అసలు ముసుగు తొలగిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుని భార్యనే బేరం పెట్టారు. రూ.12 లక్షలు ఇస్తే మీ కూతురిని మీకు అప్పగిస్తామంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. డబ్బులిస్తేనే మీ అమ్మాయిని సజీవంగా చూస్తారు అంటూ బెదిరింపులకు దిగాడు. అసలు జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- B Ravi Kumar
- Updated on: Aug 11, 2026
- 6:20 am