G Koteswara Rao

G Koteswara Rao

Reporter - TV9 Telugu

koteswararao.gamidi@tv9.com
Andhra Pradesh: అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి.. పోలీసుల ఆరాతో వెలుగులోకి సంచలనం!

Andhra Pradesh: అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి.. పోలీసుల ఆరాతో వెలుగులోకి సంచలనం!

యధేచ్చగా సాగుతున్న బెట్టింగ్స్ బారినపడి మరో యువకుడు బలయ్యాడు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెద మేడపల్లికి చెందిన కిల్లాడ ఈశ్వరరావు అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాత్రి ఇంట్లో పడుకున్న ఈశ్వరరావును కుటుంబసభ్యులు తెల్లవారుజామున లేచి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు.

AP Election: ఆ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే.. ఆ పార్టీదే సర్కార్.. జోరుగా సాగుతున్న బెట్టింగ్స్!

AP Election: ఆ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే.. ఆ పార్టీదే సర్కార్.. జోరుగా సాగుతున్న బెట్టింగ్స్!

ఉత్తరాంధ్రలోనే హాట్ సీట్ గా ఉన్న చీపురుపల్లిలో ఏ పార్టీ గెలుస్తుంది అన్న అంశం పై ఇప్పుడు జోరుగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. అందుకు ఆ నియోజకవర్గంలో తలపండిన ఇద్దరు రాజకీయ యోధులు తలపడటం ఒక కారణం కాగా మరో కారణం ఇప్పుడు తీవ్ర చర్చకు తెర లేపింది. ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సెంటిమెంట్ తెరమీదకు రావడంతో చీపురుపల్లిలో ఎన్నికలు మరింత ఆసక్తిగా మారాయి.

AP News: బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..

AP News: బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..

ఎప్పుడు గంభీరంగా కనిపించే మంత్రి బొత్స సడన్‎గా చిన్నపిల్లాడిలా మారిపోయారు. భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. అది కూడా నాలుగు గోడల మధ్య కాదు.. వేలాది మంది ప్రజలు చూస్తున్న సమయంలోనే తన కంటి నుంచి నీరు కార్చారు. ఆయన కళ్ల నుండి వచ్చిన కన్నీరును చూసిన కార్యకర్తలు సైతం తమ అభిమానాన్ని ఆపుకోలేక కంటతడిపెట్టుకున్నారు.

Top Ranker: పట్టణం నుండి పల్లె బాటపట్టిన విద్య కుసుమం.. టాప్ ర్యాంకర్ గా నిలిచిన విద్యార్థి

Top Ranker: పట్టణం నుండి పల్లె బాటపట్టిన విద్య కుసుమం.. టాప్ ర్యాంకర్ గా నిలిచిన విద్యార్థి

నాణ్యమైన విద్య కోసం అనేక రకాల కసరత్తు చేసి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్‌లో మరీ చదివించి మంచి ప్రయోజకుడిని చేయాలని కలలు కంటారు. అయితే విజయనగరం జిల్లాలో గంప ఈశ్వర్ కార్తీక్ అనే విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించి తమ కుమారుడిని టాప్ ర్యాంకర్‌గా నిలిచేలా చేశారు.

శ్రీరామునికి రెండు సార్లు కళ్యాణం.. ఆ తరువాతే గ్రామంలో పెళ్లి ముహూర్తాలు.. అదెక్కడో తెలుసా..

శ్రీరామునికి రెండు సార్లు కళ్యాణం.. ఆ తరువాతే గ్రామంలో పెళ్లి ముహూర్తాలు.. అదెక్కడో తెలుసా..

శ్రీరామునికి ఏడాదికి ఒక్కసారి మాత్రమే అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరగడం ఆనవాయితీ. కానీ విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో మాత్రం రెండు సార్లు జరగడం సంప్రదాయం. అందుకు అక్కడ ఒక విశిష్ట పురాణ చరిత్ర ఉంది. సహజంగా శ్రీరామనవమి అంటే దేశవ్యాప్తంగా వేలాది రామాలయాల్లో కల్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాంటి అరుదైన కళ్యాణ క్రతువు చూసి తరించడానికి రెండు కళ్లు చాలవు.

AP News: ఈ జిల్లాలో ప్రత్యక్ష రాజకీయాలకు ఇద్దరు ఉద్ధండులు గుడ్ బై.. అసలు కారణం ఇదే?

AP News: ఈ జిల్లాలో ప్రత్యక్ష రాజకీయాలకు ఇద్దరు ఉద్ధండులు గుడ్ బై.. అసలు కారణం ఇదే?

విజయనగరం జిల్లా నుండి మరో ఇద్దరు రాజకీయ ఉద్దండులు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. నాలుగు దశబ్దాలకుపైగా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు రాజకీయాలకు దూరమయ్యారు. రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆ ఇద్దరు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పటం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‎గా మారింది. వారిలో ప్రధానంగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ కేంద్రమంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ ఒకరు.

AP Elections 2024: కలిసిమెలిసి పనిచేయాల్సిన కూటమి నేతలు అక్కడ మాత్రం తలోదారి..!

AP Elections 2024: కలిసిమెలిసి పనిచేయాల్సిన కూటమి నేతలు అక్కడ మాత్రం తలోదారి..!

వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది. సీట్ల కేటాయింపు ఎలా జరిగిందనే దానిపై తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎలా పనిచేయాలనే దానిపైనా కేడర్‌కి దిశానిర్దేశం చేశారు. అయితే కలిసి మెలిసి పనిచేయాల్సిన కూటమి నేతలు అక్కడ మాత్రం తలోదారి అన్నట్లు మారారు.

నాయనమ్మకు ప్రేమతో.. ఈ వాహనమే గిరిజన యువకుడి రోల్స్ రాయిస్

నాయనమ్మకు ప్రేమతో.. ఈ వాహనమే గిరిజన యువకుడి రోల్స్ రాయిస్

గిరిశిఖర గ్రామానికి చెందిన ఓ యువకుడు తన నాయనమ్మ పడుతున్న అవస్థలు చూసి చలించాడు. ఎలాగైనా సరే తన నాయనమ్మకు ఇబ్బందులు లేకుండా తన వంతు సహకారం అందించాలని అనుకున్నాడు. వెంటనే తన మెదడుకు పని చెప్పాడు. నాయనమ్మ అవసరం తీర్చి అందర్నీ అబ్బురుపరిచాడు.

AP News: ఈ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు.. ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్ బై..

AP News: ఈ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు.. ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్ బై..

దశాబ్దాల పాటు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన విజయనగరం జిల్లాకు చెందిన పలువురు రాష్ట్ర, కేంద్రమంత్రులు ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో రాణించి తమకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకొని ప్రజా జీవితంలో ఉన్న నేతలు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు సైతం గుడ్ బై చెప్పారు.

AP Election: అందరి చూపు ఆ నియోజకవర్గం పైనే.. రెండు దశాబ్దాలుగా ఏలుతున్న బొత్సకు అడ్డుకట్ట పడేనా..?

AP Election: అందరి చూపు ఆ నియోజకవర్గం పైనే.. రెండు దశాబ్దాలుగా ఏలుతున్న బొత్సకు అడ్డుకట్ట పడేనా..?

అందరి చూపు ఆ నియోజకవర్గం పైనే ఉంటుంది. ఒకరు సీనియర్ పొలిటిషియన్, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను శాసించిన నేత. మరొకరు పాలిటిక్స్‌లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా పనిచేసిన నేత. వీరిద్దరి మధ్య పోరు జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆసక్తిగానే మారింది. అక్కడ అధికార, ప్రతిపక్షాలకు ఎవరి ఓటు బ్యాంక్ వారికుంటుంది. ఎవరి రాజకీయాలూ వారివే.

Telugu Desam: ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన టిడిపి సీనియర్ నేత.. ఎందుకో తెలుసా..

Telugu Desam: ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన టిడిపి సీనియర్ నేత.. ఎందుకో తెలుసా..

ఆయన పార్టీలో నెంబర్ టూ.. పార్టీ అధినేతకు సమకాలీకుడు.. పార్టీ పట్ల అత్యంత విధేయుడు. ప్రక్కచూపులు చూడని నేత.. అంతటి ప్రొఫైల్ ఉన్న ఆ నేత ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఆయన ఎవరంటే అశోక్ గజపతిరాజు.

పెళ్ళిలో సందడిగా గడిపిన నవ వధువు.. నిద్ర నుంచి మృత్యువు ఒడిలోకి.. ఆ రాత్రి ఏం జరిగింది..

పెళ్ళిలో సందడిగా గడిపిన నవ వధువు.. నిద్ర నుంచి మృత్యువు ఒడిలోకి.. ఆ రాత్రి ఏం జరిగింది..

పార్వతీపురం మన్యం జిల్లాలో నవవధువు వివాహం జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే అనుమానాస్పద మృతి చెందింది. మక్కువ మండలం దబ్బగెడ్డలో జరిగిన ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతుంది. పార్వతీపురంకు చెందిన వెత్స అఖిలకు, మక్కువ మండలం దెబ్బగడ్డ గ్రామానికి చెందిన భాస్కర్ రావుతో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో శుభముహూర్తాన అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో వివాహం జరిగింది.