AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gamidi Koteswara Rao

Gamidi Koteswara Rao

Senior Correspondent - TV9 Telugu

koteswararao.gamidi@tv9.com

21 సంవత్సరాలుగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ వంటి సంస్థల్లో పనిచేసి.. 2018లో టీవీ9 తెలుగులో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నాను. రెండు దశాబ్దాలకు పైచిలుకు రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన, ప్రజా హితమైన కథనాలను కవర్ చేశాను.

Read More
బాబోయ్.. బైక్‌ స్టార్ట్ చేస్తుండగా ఏవేవో శబ్ధాలు.. కట్ చేస్తే, వణికిపోయే సీన్.. ఇదిగో వీడియో

బాబోయ్.. బైక్‌ స్టార్ట్ చేస్తుండగా ఏవేవో శబ్ధాలు.. కట్ చేస్తే, వణికిపోయే సీన్.. ఇదిగో వీడియో

విజయనగరం జిల్లా రాజాం ఆదర్శనగర్ కాలనీలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్రవాహనంలోకి సుమారు ఐదు అడుగుల నాగుపాము దూరడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రమణయ్య ప్రత్యేక పరికరాల సహాయంతో పామును సురక్షితంగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

అరుదైన గౌరవం.. అయోధ్య రామాలయానికి కానుకగా బొబ్బిలి వీణ!

అరుదైన గౌరవం.. అయోధ్య రామాలయానికి కానుకగా బొబ్బిలి వీణ!

ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన బొబ్బిలి వీణకు అరుదైన గౌరవం లభించింది. అయోధ్య శ్రీరామ మందిరాన్ని అలంకరించనున్న ఈ వీణను బొబ్బిలి శిల్పి సర్వసిద్ధి గంగాధరాచారి రెండున్నర సంవత్సరాలు శ్రమించి రూపొందించారు. మరుగున పడుతున్న కళకు తిరిగి జీవం పోస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు.

ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన

ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన

విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో స్థానికుల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన తోమడపు ఎద్దుకు సోమవారం ఘనంగా అంతిమ యాత్ర నిర్వహించారు. సింహాద్రి అప్పన్న స్వామి స్వరూపంగా భావించి ఎన్నో సంవత్సరాలుగా పూజలు అందుకున్న ఈ ఎద్దు మృతి చెందడంతో స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Andhra News: లవ్వంటూ.. డాక్టర్‌కు పదేపదే మెసేజ్‌లు.. సీన్‌కట్‌చేస్తే.. ఇదీ పరిస్థితి

Andhra News: లవ్వంటూ.. డాక్టర్‌కు పదేపదే మెసేజ్‌లు.. సీన్‌కట్‌చేస్తే.. ఇదీ పరిస్థితి

విజయనగరం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్థానికింగా ఉన్న ఓ క్లీనిక్ నేమ్‌ బోర్డుపై మహిళా డాక్టర్ నెంబర్ తీసుకున్న ఓ కేటుగాడు.. తరచూ ఆమెకు కాల్స్, మెసేజ్‌లు చేస్తూ వేదించడం స్టార్ట్ చేశారు. నెంబర్ బ్లాక్ చేసినా మరో నెంబర్‌తో ఇబ్బందులు పెట్టడంతో విసిగిపోయిన యువతి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి నిందితుడిని అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేశారు.

వరుస నేరాలకు చెక్.. ముగ్గురిపై పీడీ యాక్ట్, నేరస్థులకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్!

వరుస నేరాలకు చెక్.. ముగ్గురిపై పీడీ యాక్ట్, నేరస్థులకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్!

Vizianagaram Police, PD Act: విజయనగరం జిల్లాలో వరుసగా దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు అలవాటు నేరస్థులపై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేసి విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పష్టం చేశారు.

Vizianagaram: ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎస్సై వీరంగం.. ల్యాబ్ అసిస్టెంట్‌పై దాడి

Vizianagaram: ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎస్సై వీరంగం.. ల్యాబ్ అసిస్టెంట్‌పై దాడి

విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం రేగింది. ఏఆర్ ఏఎస్సై సోమేశ్వరరావుకి, ఆసుపత్రి ల్యాబ్ అసిస్టెంట్ భాగ్యరావుకి మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. పార్కింగ్ విషయంలో గొడవ చోటుచేసుకోగా.. అది కాస్త ముదిరి తారాస్థాయికి చేరుకుంది. అసిస్టెంట్‌పై ఏఎస్సై దాడికి దిగడంతో ఉద్రిక్తత రేగింది.

Andhra Pradesh: ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. వీపుపై మోసి విద్యార్థిని ప్రాణం నిలబెట్టిన వార్డెన్.. వీడియో చూడండి..

Andhra Pradesh: ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. వీపుపై మోసి విద్యార్థిని ప్రాణం నిలబెట్టిన వార్డెన్.. వీడియో చూడండి..

ఒకవైపు దేశం బుల్లెట్ ట్రైన్లు, అంతరిక్ష ప్రయోగాల వైపు దూసుకుపోతుంటే.. మరోవైపు మారుమూల గిరిజన ప్రాంతాల్లో కనీసం అత్యవసర వైద్యం అందాలన్నా రోడ్లు లేని దయనీయ స్థితి నేటికీ కొనసాగుతుంది. తాజాగా విజయనగరం జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినిని తన వీపుపై ఏకంగా 6 కిలోమీటర్లు మోసుకెళ్లి ఆస్పత్రికి చేర్చింది ఆశ్రమ వార్డెన్. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..

Andhra: అయ్యో.. బుజ్జమ్మ.. అప్పడే నూరేళ్లు నిండిపోయాయా..?

Andhra: అయ్యో.. బుజ్జమ్మ.. అప్పడే నూరేళ్లు నిండిపోయాయా..?

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న 18 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు నీటితో నింపిన టబ్‌లో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు గమనించేలోపే ఈ ఘటన జరగడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పొలం పనులకు వెళ్లిన వదిన.. ఇంట్లోకి చొరబడ్డ మరదలు! సీన్ కట్ చేస్తే.. ఊహించని షాక్

పొలం పనులకు వెళ్లిన వదిన.. ఇంట్లోకి చొరబడ్డ మరదలు! సీన్ కట్ చేస్తే.. ఊహించని షాక్

విజయనగరం జిల్లా వీరసాగరంలో కుటుంబ ఆస్తి వివాదాలు, పుస్తెలతాడు వాటా విషయంలో వదిన ఇంట్లో మరదలు వసంత 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేసింది. పగటిపూట ఎవరూ లేని సమయంలో బీరువా పగలగొట్టి దొంగతనానికి పాల్పడింది. పోలీసుల దర్యాప్తులో నిందితురాలు పట్టుబడి, బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Andhra: ఇంట్లో ఉన్నప్పుడేమో ఒకటి.. బయటకు వచ్చేసరికి 2.. ఏమైందంటే..?

Andhra: ఇంట్లో ఉన్నప్పుడేమో ఒకటి.. బయటకు వచ్చేసరికి 2.. ఏమైందంటే..?

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వత్తాడ గ్రామంలోని ఓ ఇంట్లో అరుదైన కింగ్ కోబ్రా కనిపించడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. జెర్రిపోతు పామును మింగడంతో కదలలేని స్థితికి చేరిన కింగ్ కోబ్రాను అటవీశాఖ అధికారులు, స్నేక్ క్యాచర్ సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇలాంటి విషసర్పాలు కనిపిస్తే భయపడకుండా వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

Andhra News: సర్కారు బడిపై విశ్వాసం.. గవర్నమెంట్ హైస్కూల్‌లో కలెక్టర్ కుమారుడికి అడ్మిషన్

Andhra News: సర్కారు బడిపై విశ్వాసం.. గవర్నమెంట్ హైస్కూల్‌లో కలెక్టర్ కుమారుడికి అడ్మిషన్

ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ తన కుమారుడిని స్వయంగా స్థానిక డీవీఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో చేర్పించారు. సాధారణంగా ఉన్నతాధికారులు ప్రైవేట్ పాఠశాలలను ఎంచుకునే పరిస్థితుల్లో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోంది. కలెక్టర్ నిర్ణయంపై విద్యావేత్తలు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు..

కింగ్ కోబ్రా పిల్లకు కూడా ఇంత పవరుంటుందా..? మన్యం జిల్లాలో ఏం జరిగిందంటే..?

కింగ్ కోబ్రా పిల్లకు కూడా ఇంత పవరుంటుందా..? మన్యం జిల్లాలో ఏం జరిగిందంటే..?

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని ఊసకొండ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోకి చొరబడిన కింగ్ కోబ్రా కాటుకు ఆరిక బాబురావు అనే యువకుడు మృతి చెందాడు. సాధారణంగా కింగ్ కోబ్రాలు మనుషులపై దాడి చేయవని, తమకు ముప్పు ఉందని భావించినప్పుడే రక్షణాత్మకంగా స్పందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.