ఇదేం బాధరా నాయన.. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లు నడవాలా..?
వేసవి వస్తుందంటేనే మన్యం జిల్లాలో పలు గ్రామాల గిరిజనులు వణికిపోతున్నారు. ఇంకా నిండు వేసవి ప్రారంభం కాక ముందే జిల్లాలో గిరిజనులకు త్రాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. నీటి ఎద్దడితో పలు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి ఊట బావులను ఆశ్రయిస్తున్నారు గిరిజనులు. గుక్కెడు నీరు ఇప్పించండి మహాప్రభో అని అధికారులను వేడుకుంటున్న ఫలితం మాత్రం శూన్యం.
- G Koteswara Rao
- Updated on: Mar 23, 2025
- 6:02 pm
Andhra: పండు ముసలమ్మ చనిపోయింది.. అందరూ సాధారణ మరణమే అనుకున్నారు.. కానీ
మూడు వేల రూపాయలు అప్పు ఇవ్వలేదని ఓ వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హతమార్చారు నిందితులు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం రెల్లిగూడెం గ్రామంలో జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.. కాగా....
- G Koteswara Rao
- Updated on: Mar 21, 2025
- 8:37 pm
SSMB 29: ఆంధ్ర ఒడిశా బోర్డర్లో జక్కన్న.. గిరిజన యువతతో కలిసి వాలీబాల్ ఆడిన రాజమౌళి
సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు చివరిగా నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. దాంతో మహేష్ బాబు, రాజమౌళి సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.
- G Koteswara Rao
- Updated on: Mar 21, 2025
- 11:23 am
Andhra News: టీ తాగేందుకు వెళ్లాడు.. కట్ చేస్తే, 20 ఏళ్ల తరువాత ఇంటికి.. ఇతని కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
కూలీపనుల కోసం తమిళనాడు వెళ్తూ మార్గమధ్యలో టీ తాగేందుకు ట్రైన్ దిగి తప్పిపోయిన సుక్కు ఎట్టకేలకు తమ కుటుంబసభ్యుల వద్దకు చేరుకున్నాడు. 22 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులకు దూరమై అప్పటి నుంచి బ్రతుకు తెరువు కోసం కూలీ కూడా లేకుండా వెట్టిచాకరీ చేస్తూ తమిళనాడులో జీవనం సాగించాడు.
- G Koteswara Rao
- Updated on: Mar 17, 2025
- 12:23 pm
AP: వణికిస్తున్న విషజ్వరాలు.. బెడ్స్ లేక అల్లాడుతున్న గిరిజనులు! ఎక్కడంటే..?
పార్వతీపురం మన్యం జిల్లాలో వైరల్ జ్వరాలు, మలేరియా విజృంభిస్తున్నాయి. గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రుల్లో పడకల కొరత, సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడం వంటి సమస్యలున్నాయి. పారిశుధ్యం లేమి, నీటి కొరత కూడా ఈ జ్వరాలకు కారణమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్.
- G Koteswara Rao
- Updated on: Mar 15, 2025
- 9:39 pm
Andhra News: ఒకే నియోజక వర్గంలో ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎమ్మెల్సీ.. సర్దుకుపోతారా..?
పెద్దల సభలోకి అడుగు పెడుతున్న కావలి గ్రీష్మ ఎంట్రీతో ఆమె సొంత నియోజకవర్గం రాజాంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక్కడ మొదటి నుండి ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ వర్గానికి... కావలి గ్రీష్మ వర్గానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.. ఎందుకో డీటేల్స్ తెలుసుకుందాం పదండి
- G Koteswara Rao
- Updated on: Mar 15, 2025
- 9:58 pm
Vizianagaram: ‘మూడవ బిడ్డ ఆడపిల్ల అయితే యాభై వేలు.. మగ పిల్లోడు అయితే ఆవు, దూడ’
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన స్ఫూర్తితో విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఎవరికైనా మూడో సారి ఆడ బిడ్డ జన్మిస్తే వెంటనే అమ్మాయి పేరిట రూ.50వేలు డిపాజిట్ చేయునున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రకటించారు. అదేవిధంగా మూడో సారి మగ బిడ్డ పుడితే ఆవు, దూడ బహుమతిగా అందజేస్తానని అన్నారు.
- G Koteswara Rao
- Updated on: Mar 10, 2025
- 1:21 pm
Andhra : ఇంజనీర్ను అంతర్రాష్ట్ర దొంగగా మార్చిన చిన్ననాటి అల్లరి పనులు
చిన్నతనంలో స్నేహితులతో సరదాగా చేసిన చిల్లర దొంగతనం నేడు అంతర రాష్ట్ర దొంగగా మార్చింది. సెల్ ఫోన్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తున్నా దొంగతనం అనే అలవాటు మాత్రం అతన్ని నిద్రపోనీయ లేదు. చివరికి కటకటాలపాలు చేసింది. డీటేల్స్ తెలుసుకుందాం పదండి....
- G Koteswara Rao
- Updated on: Mar 8, 2025
- 10:03 pm
Success Story: తండ్రి కలను తీర్చిన తనయ.. అతి చిన్న వయసులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక
కెంబూరి నైమిశా అతి చిన్న వయసులోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ప్రశంసలు అందుకుంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగిన ఆమె, చిన్నతనం నుంచి న్యాయ వ్యవస్థపై ఆసక్తి కలిగి ఉంది. లా సెట్లో 300వ ర్యాంకు సాధించి ఆంధ్ర యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివి, కష్టపడి చదివి జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఆమె విజయం మహిళలకు స్ఫూర్తినిస్తుంది.
- G Koteswara Rao
- Updated on: Mar 8, 2025
- 12:09 pm
కొంపముంచిన ఛాయ్.. టీ త్రాగడానికి ట్రైన్ దిగి 20 ఏళ్లుగా వెట్టి చాకిరీ..!
రెండు రోజులు అటూ ఇటూ తిరిగి ఏం చేయాలో పాలుపోక తినటానికి తిండి కోసం తమిళనాడులోని ఓ వ్యక్తి వద్ద గొర్రెల కాపలాదారుడిగా పనిలో జాయిన్ అయ్యాడు. అలా జాయిన్ అయిన అప్పారావుకు కూలీ డబ్బులు ఇవ్వకుండా బలవంతంగా తన వద్దనే ఉంచుకున్నాడు యజమాని. అప్పారావు బయటికి వెళితే తిరిగి రాడేమోనని ఉద్దేశ్యంతో ఆ ప్రదేశం నుండి బయటకు కూడా వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.
- G Koteswara Rao
- Updated on: Mar 2, 2025
- 3:22 pm
బాడీ బిల్డింగ్ కాంపిటేషన్స్లో అద్భుతాలు సృష్టిస్తున్న దివ్యాంగుడు..
ఒక మనిషి లక్ష్యం ఎంత పెద్దదైనా గమ్యాన్ని చేరుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తే విజయం సొంతం అవుతుందని నిరూపించాడు సూర్యనారాయణ. ఇతని పట్టుదలకు అందరూ ప్రశంసిస్తున్నారు. జిమ్ లో జాయిన్ అయి కండలు పెంచాడు. అనంతరం బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కు వెళ్ళటం ప్రారంభించాడు. సూర్యనారాయణ పాల్గొన్న ప్రతి ఒక్క పోటీలో అతనిదే పైచేయి.
- G Koteswara Rao
- Updated on: Mar 1, 2025
- 5:03 pm
Andhra News: హమ్మయ్యా.. ఏనుగుల హోల్డింగ్ జోన్కు రంగం సిద్ధం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
పార్వతీపురం మన్యం జిల్లాలో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల గుంపు సమస్యకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఏనుగులు సంచారంతో ఇప్పటివరకు పదిమంది వరకు మృత్యువాత పడగా, మరో 40 మంది వరకు గాయాలపాలయ్యారు.
- G Koteswara Rao
- Updated on: Feb 23, 2025
- 7:20 pm