21 సంవత్సరాలుగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ వంటి సంస్థల్లో పనిచేసి.. 2018లో టీవీ9 తెలుగులో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నాను. రెండు దశాబ్దాలకు పైచిలుకు రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన, ప్రజా హితమైన కథనాలను కవర్ చేశాను.
Andhra Pradesh: బాబోయ్.. ఆ పురుగు కుడితే ఇక అంతే.. మహిళ మృతితో ఏపీలో భయం భయం..
చాలా మందికి ఈ వ్యాధి పేరు కూడా తెలియకపోవడంతో ప్రజలు దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వైద్యుల వివరాల ప్రకారం, నేలపై ఉండే కొన్ని రకాల నల్లని నల్లి వంటి పురుగులు కాటేయడం ద్వారా ఈ వ్యాధి మనిషికి సోకుతుంది. ముఖ్యంగా పొలాల్లో పని చేసే రైతులు, జంతువులకు దగ్గరగా ఉండేవారు, అడవి ప్రాంతాల్లో తిరిగేవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 1, 2025
- 11:28 am
Andhra Pradesh: ప్రధాని మోదీ చేతుల మీదగా ప్రారంభానికి సిద్ధమవుతున్న మరో ఉత్తరాంధ్ర మణిహారం.. ఏంటో తెలుసా..?
త్వరలో ప్రారంభం కాబోయే ఓ కీలక గ్రీన్ ఫీల్డ్ హైవే ఆ వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి కీలకం కానుంది. అంతేకాకుండా నూతన వ్యాపార, వ్యవహారాలకు బాటలు వేయనుంది. దేశంలో రవాణా వ్యవస్థను వేగవంతం చేయాలన్న లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ఆ ప్రాజెక్ట్ పనులు తుది దశకు చేరుకోవడంతో వాహనదారులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం కానుంది..? దానివల్ల అభివృద్ధి ఎలా సాధ్యం అనేదిఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Gamidi Koteswara Rao
- Updated on: Nov 30, 2025
- 9:59 pm
Kottavalasa: ఓవర్ నైట్ కోట్లకు పడగెత్తుదామని ఈ తహశీల్దార్ ఎంత పని చేశాడో తెలుసా..?
విజయనగరం జిల్లా కొత్తవలస తహసిల్దార్ అప్పలరాజు సస్పెన్షన్ భారీ సంచలనంగా మారింది. మూడు నెలల్లోనే వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు మ్యూటేషన్ చేయించినట్టు విచారణలో బయటపడింది. జాయింట్ కలెక్టర్ ఆమోదం లేకుండా మ్యూటేషన్లు చేయడం, ప్రభుత్వ భూముల పక్కదారి ఎంట్రీలు వంటి ఘోర అక్రమాలపై ప్రాథమిక విచారణలో నిజానిజాలు రుజువవడంతో అప్పలరాజును తక్షణమే సస్పెండ్ చేశారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Nov 30, 2025
- 9:47 pm
Vizianagaram: పైడితల్లి సిరిమాను పండుగలో అపశృతి.. బొత్స ఫిర్యాదుతో స్పందించిన ప్రభుత్వం..
Vizianagaram: పైడితల్లి జాతర జిల్లాలో అత్యంత పవిత్రమైన, పెద్ద పండుగ. అలాంటి వేడుకలో ఈ తరహా ప్రమాదం జరగడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. విచారణ నివేదిక రాగానే కాంట్రాక్టర్ పై, సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో..
- Gamidi Koteswara Rao
- Updated on: Nov 30, 2025
- 10:05 pm
Andhra: మహిళను వేధించిన కేసులో ఇరుక్కున మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్సనల్ సెక్రెటరీ
ఏపి రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అడిషనల్ పీఎస్ సతీష్పై కేసు నమోదు అయిన వ్యవహారం సంచలనం రేపుతుంది. సతీష్ తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తనను రాజకీయ లబ్ధి కోసం ఇరికిస్తారని మంత్రి సెక్రటరీ ఆరోపించడంతో రాజకీయ దుమారునికి తెరలేపింది. ఇంతకీ అసలు మంత్రి సెక్రెటరీపై మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఏంటి? తనపై వచ్చిన ఫిర్యాదు పై మంత్రి సెక్రటరీ ఏమంటున్నాడో తెలుసుకుందాం...
- Gamidi Koteswara Rao
- Updated on: Nov 29, 2025
- 9:59 pm
Andhra: ఆంధ్రా అధికారులను Vs ఒరిస్సా అధికారులు.. ఎక్కడో? ఎందుకో తెలుసా?
పార్వతీపురం మన్యం జిల్లాలోని కొటియా వివాదాస్పద గ్రామాల్లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. ప్రభుత్వ పథకాల అమలు కోసం వెళ్లిన ఆంధ్రప్రదేశ్ అధికారులను ఒడిశా పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించడంతో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మరోసారి ఎజెండాలోకి వచ్చింది. ...
- Gamidi Koteswara Rao
- Updated on: Nov 29, 2025
- 9:23 pm
ఎందుకు ఇలా చేశావురా బాబు.. ఉద్యోగానికి వెళ్లమని మందలించిన తల్లిదండ్రులు..!
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొమరాడ మండలం మాదలింగిలో జరిగిన ఆత్మహత్య ఘటన స్థానికులను కలిచివేసింది. భవిష్యత్తు బాగుండాలంటే ఉద్యోగం చేసుకోవాలని హెచ్చరించిన తల్లిదండ్రుల మాటలకు మనస్తాపం చెంది యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Nov 29, 2025
- 8:20 pm
ఆ నాలుగు కారణాల వల్లే 99శాతం మందిలో గుండెపోటు
భారతదేశంలో అధిక మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణంగా మారుతున్నాయి. 2014- 2019 మధ్య దేశంలో గుండెపోటుల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగింది. పట్టణీకరణ, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, ఒత్తిడి, ధూమపానం, మధుమేహం వంటి వ్యాధులు ప్రధాన కారణాలు. ఈ సమస్య ఆరోగ్యానికే పరిమితం కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థ, కుటుంబ స్థిరత్వం, పని విధానాన్ని కూడా ప్రభావితం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Nov 29, 2025
- 2:33 pm
Andhra: ఆ తలుపు గడియ వేసి ఉంది.. కూతురికి అనుమానమొచ్చి కిటికీలో తొంగి చూడగా
అనంతరం తన పిల్లలతో సారధి రోడ్లోనే వేరొక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడే ఉండటం ప్రారంభించింది. అనంతరం తన జీవనోపాధి కోసం స్థానికంగా ఉన్న ఓ వస్త్రదుకాణంలో ఉద్యోగానికి జాయిన్ అయింది. భర్తకు దూరమైన సావిత్రి ఏదో ఒక విధంగా మన్మధ కుమార్ సహాయంతో తన పిల్లలతో జీవనాన్ని ముందుకు సాగించాలని అనుకుంది.
- Gamidi Koteswara Rao
- Updated on: Nov 29, 2025
- 1:45 pm
Vizianagaram: జిల్లాకు గుడ్ న్యూస్ వచ్చేసింది… మంత్రి కొండపల్లి కృషితో..
విజయనగరం జిల్లాలో మరో భారీ పరిశ్రమకు మార్గం సుగమమైంది. గుర్ల మండలం కెల్ల సమీపంలో గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో ఉద్యోగావకాశాలు పెంచేందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చేసిన కృషి ఫలించినట్లు తెలుస్తోంది.
- Gamidi Koteswara Rao
- Updated on: Nov 22, 2025
- 1:16 pm
Andhra: ఏముంది.. అక్కడంతా చెత్తేగా అనుకోకండి.. పొరపాటున కాలు పెడితే ఖేల్ ఖతం..
విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన రైతు సింహాచలం తన తోటలో రోజువారీ పని చేస్తుండగా పొదల నుంచి అకస్మాత్తుగా కదలికలు గమనించాడు. మొదట ఏదో సాధారణ జంతువు అనుకున్నాడు. కానీ అది పొదల మధ్య నుండి పొలంలోకి రావడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. సుమారు 12 అడుగుల పొడవున్న...
- Gamidi Koteswara Rao
- Updated on: Nov 21, 2025
- 11:55 am
Andhra: నాన్-వెజ్ లవర్స్ అటెన్షన్.. రూపాయ్ నోటుకే అరకేజీ చికెన్.. ఆఫర్ వెనుక అసలు మ్యాటర్ ఇదే
నాన్ వెజ్ ప్రియులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్. రూపాయి నోటుకు చికెన్ ఇస్తామని ఓ షాప్ ప్రకటించింది. దెబ్బకు అందరూ క్యూ కట్టారు. మరి అదేంటో చూసేద్దాం. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.
- Gamidi Koteswara Rao
- Updated on: Nov 20, 2025
- 9:31 pm