21 సంవత్సరాలుగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ వంటి సంస్థల్లో పనిచేసి.. 2018లో టీవీ9 తెలుగులో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నాను. రెండు దశాబ్దాలకు పైచిలుకు రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన, ప్రజా హితమైన కథనాలను కవర్ చేశాను.
Andhra: ఆదమరిచి నిద్రపోతున్న వృద్ద మహిళ.. తెల్లారేసరికి కోడలు లేపడానికి వెళ్లగా
అప్పయ్యమ్మ మాత్రం రేకుల షెడ్డులో ఒంటరిగా జీవించేది. పెద్ద కుమారుడు కొబ్బరికాయలు తీసే పని నిమిత్తం అమలాపురం వెళ్లగా, ఇంటి సమీపంలో పెద్ద కోడలు లక్ష్మి, మనవడు గౌరి నివాసముంటున్నారు. చిన్న కుమారుడు సూరప్పన్న కుటుంబంతో కలిసి భవానీ మాల దీక్ష విరమణ కోసం ఈ నెల 11న విజయవాడ వెళ్లాడు.
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 17, 2025
- 2:02 pm
Sreeleela: శ్రీలీల చెప్పిన ఆ మాటకు పోలీసులతో పాటు అందరూ క్లాప్స్..
విజయనగరం జిల్లా రాజాంలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె, యువతను ఉద్దేశించి డ్రగ్స్కు వ్యతిరేకంగా బలమైన సందేశం ఇచ్చారు. నో డ్రగ్స్ నినాదాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని పిలుపునిచ్చిన శ్రీలీల వ్యాఖ్యలకు మంచి స్పందన లభించింది.
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 15, 2025
- 10:03 pm
Vizianagaram: అయ్యయ్యో చలి కోసం వాడిన కుంపటి ఎంత పని చేసింది..?
విజయనగరం జిల్లా తెర్లాం మండలం గొలుగువలస గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు పది పూరిళ్లను పూర్తిగా దగ్ధం చేయగా, పాపమ్మ అనే వృద్ధురాలు మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 13, 2025
- 6:59 pm
Andhra: కాటికి పోయే వయసులో ఇదేం పనిరా.. మనుమరాలిపై తాత అఘాయిత్యం.. చివరకు..
విజయనగరం జిల్లా గాజులరేగలో చోటుచేసుకున్న అమానుష ఘటన పై పోక్సో ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరించింది. తన సొంత మనవరాలిపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు బొండపల్లి సత్యారావు (59)కి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించింది. అంతేకాకుండా ఐదు వేల రూపాయల జరిమానాను కూడా విధించింది.
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 8, 2025
- 8:47 pm
Andhra: దండలు మార్చుకొని.. ఏడడుగులు నడిచే గడియల్లో విగతజీవిగా మారిన వరుడి విషాద గాథ
విజయనగరం దాసన్నపేట యాదవవీధిలో విషాదం నెలకొంది. మరికొద్ది గంటల్లో దండలు మార్చుకోవాల్సిన 25 ఏళ్ల వీరేంద్ర ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. బీకాం పూర్తి చేసి కార్పొరేట్ సంస్థలో క్యాషియర్గా పనిచేస్తున్న వీరేంద్ర, చిన్నప్పటి స్నేహితురాలినే ప్రేమించి, ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే..
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 6, 2025
- 9:49 pm
Vizianagaram: ఓరి కంత్రీగా.. శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నావ్గా
విజయనగరం జిల్లాలో సినిమా స్టైల్లో సాగిన కిడ్నాప్ డ్రామాకు పోలీసులు ఎండ్ కార్డ్ చెప్పారు. కోస్ట్గార్డ్ ఉద్యోగి మహేష్ కుమార్ను అపహరించి లక్షలు దోచుకోవాలని చూసిన కిడ్నాప్ గ్యాంగ్ చివరకు కటకటాల పాలయ్యింది. వివరాలు తెలుసుకుందాం పదండి ... .. ..
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 6, 2025
- 8:12 pm
Andhra Pradesh: బాబోయ్.. ఆ పురుగు కుడితే ఇక అంతే.. మహిళ మృతితో ఏపీలో భయం భయం..
చాలా మందికి ఈ వ్యాధి పేరు కూడా తెలియకపోవడంతో ప్రజలు దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వైద్యుల వివరాల ప్రకారం, నేలపై ఉండే కొన్ని రకాల నల్లని నల్లి వంటి పురుగులు కాటేయడం ద్వారా ఈ వ్యాధి మనిషికి సోకుతుంది. ముఖ్యంగా పొలాల్లో పని చేసే రైతులు, జంతువులకు దగ్గరగా ఉండేవారు, అడవి ప్రాంతాల్లో తిరిగేవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 1, 2025
- 11:28 am
Andhra Pradesh: ప్రధాని మోదీ చేతుల మీదగా ప్రారంభానికి సిద్ధమవుతున్న మరో ఉత్తరాంధ్ర మణిహారం.. ఏంటో తెలుసా..?
త్వరలో ప్రారంభం కాబోయే ఓ కీలక గ్రీన్ ఫీల్డ్ హైవే ఆ వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి కీలకం కానుంది.అంతేకాకుండా నూతన వ్యాపార, వ్యవహారాలకు బాటలు వేయనుంది. దేశంలో రవాణా వ్యవస్థను వేగవంతం చేయాలన్న లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ఆ ప్రాజెక్ట్ పనులు తుది దశకు చేరుకోవడంతో వాహనదారులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వెనుకబడిన ఆ ప్రాంత ఆర్థిక పురోగతికి కీలకంగా మారనున్న ఆ ప్రాజెక్ట్ ఏది? దాని వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలు ఏమిటి? ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం కానుంది? దానివల్ల ఆ ప్రాంత అభివృద్ధి ఎలా సాధ్యం కానున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- Gamidi Koteswara Rao
- Updated on: Dec 9, 2025
- 9:59 pm
Kottavalasa: ఓవర్ నైట్ కోట్లకు పడగెత్తుదామని ఈ తహశీల్దార్ ఎంత పని చేశాడో తెలుసా..?
విజయనగరం జిల్లా కొత్తవలస తహసిల్దార్ అప్పలరాజు సస్పెన్షన్ భారీ సంచలనంగా మారింది. మూడు నెలల్లోనే వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు మ్యూటేషన్ చేయించినట్టు విచారణలో బయటపడింది. జాయింట్ కలెక్టర్ ఆమోదం లేకుండా మ్యూటేషన్లు చేయడం, ప్రభుత్వ భూముల పక్కదారి ఎంట్రీలు వంటి ఘోర అక్రమాలపై ప్రాథమిక విచారణలో నిజానిజాలు రుజువవడంతో అప్పలరాజును తక్షణమే సస్పెండ్ చేశారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Nov 30, 2025
- 9:47 pm
Vizianagaram: పైడితల్లి సిరిమాను పండుగలో అపశృతి.. బొత్స ఫిర్యాదుతో స్పందించిన ప్రభుత్వం..
Vizianagaram: పైడితల్లి జాతర జిల్లాలో అత్యంత పవిత్రమైన, పెద్ద పండుగ. అలాంటి వేడుకలో ఈ తరహా ప్రమాదం జరగడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. విచారణ నివేదిక రాగానే కాంట్రాక్టర్ పై, సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో..
- Gamidi Koteswara Rao
- Updated on: Nov 30, 2025
- 10:05 pm
Andhra: మహిళను వేధించిన కేసులో ఇరుక్కున మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్సనల్ సెక్రెటరీ
ఏపి రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అడిషనల్ పీఎస్ సతీష్పై కేసు నమోదు అయిన వ్యవహారం సంచలనం రేపుతుంది. సతీష్ తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తనను రాజకీయ లబ్ధి కోసం ఇరికిస్తారని మంత్రి సెక్రటరీ ఆరోపించడంతో రాజకీయ దుమారునికి తెరలేపింది. ఇంతకీ అసలు మంత్రి సెక్రెటరీపై మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఏంటి? తనపై వచ్చిన ఫిర్యాదు పై మంత్రి సెక్రటరీ ఏమంటున్నాడో తెలుసుకుందాం...
- Gamidi Koteswara Rao
- Updated on: Nov 29, 2025
- 9:59 pm
Andhra: ఆంధ్రా అధికారులను Vs ఒరిస్సా అధికారులు.. ఎక్కడో? ఎందుకో తెలుసా?
పార్వతీపురం మన్యం జిల్లాలోని కొటియా వివాదాస్పద గ్రామాల్లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. ప్రభుత్వ పథకాల అమలు కోసం వెళ్లిన ఆంధ్రప్రదేశ్ అధికారులను ఒడిశా పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించడంతో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మరోసారి ఎజెండాలోకి వచ్చింది. ...
- Gamidi Koteswara Rao
- Updated on: Nov 29, 2025
- 9:23 pm