AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gamidi Koteswara Rao

Gamidi Koteswara Rao

Senior Correspondent - TV9 Telugu

koteswararao.gamidi@tv9.com

21 సంవత్సరాలుగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ వంటి సంస్థల్లో పనిచేసి.. 2018లో టీవీ9 తెలుగులో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నాను. రెండు దశాబ్దాలకు పైచిలుకు రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన, ప్రజా హితమైన కథనాలను కవర్ చేశాను.

Read More
అక్క పెళ్లి కోసమని ఇంటికి వచ్చాడు.. అంతలోనే అనంతలోకాలకు..!

అక్క పెళ్లి కోసమని ఇంటికి వచ్చాడు.. అంతలోనే అనంతలోకాలకు..!

విజయనగరం జిల్లా గజపతినగరంలో పెళ్లి సందడి నెలకొన్న ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అక్క వివాహానికి 13 రోజుల ముందు 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి ఆకుల ఏడుకొండలు విద్యుదాఘాతంతో మరణించాడు. విద్యుత్ శాఖ, రహదారి అథారిటీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Andhra Pradesh: బైక్‌ బ్యాటరీ మారుస్తుండగా చెలరేగిన మంటలు.. పక్కనే పెట్రోల్ బంక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Andhra Pradesh: బైక్‌ బ్యాటరీ మారుస్తుండగా చెలరేగిన మంటలు.. పక్కనే పెట్రోల్ బంక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

పార్వతీపురం మన్యం జిల్లాలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. మంటలు గనుక బంక్‌కు వ్యాపిస్తే పరిస్థితి ఏంటి? అనే భయాందోళనలు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఒక చిన్న బ్యాటరీ మార్పు ఎంతటి అనర్థానికి దారితీసింది? అసలు మంటల ఎలా చెలరేగాయలి..? అనేది తెలుసుకుందాం..

Andhra: ఛీ.. ఛీ.. నువ్వేం కొడుకువురా.. కళ్లల్లో పెట్టుకొని పెంచితే గుండెలపై తన్నాడు..

Andhra: ఛీ.. ఛీ.. నువ్వేం కొడుకువురా.. కళ్లల్లో పెట్టుకొని పెంచితే గుండెలపై తన్నాడు..

ఎన్నో ఆశలతో కొడుకును పెంచాడు.. అయితే.. ఆ కొడుకే.. ఆ తండ్రి పాలిట యముడిలా మారాడు.. ఇల్లు కోసం కన్న తండ్రిని దారుణంగా హతమార్చాడు.. ఈ ఘటన గతేడాది విజయనగరంలో సంచలనంగా మారింది.. ఈ కేసులో న్యాయమూర్తి కీలక తీర్పును వెలువరించారు.

Andhra: చూడండి చెడు అలవాట్లు మనిషిని ఎంత స్థాయికి తీసుకెళ్తాయో..

Andhra: చూడండి చెడు అలవాట్లు మనిషిని ఎంత స్థాయికి తీసుకెళ్తాయో..

అప్పుల భారంతో కుంగిపోయిన ఓ యువకుడు చివరికి కిరాతకానికి తెగబడ్డాడు. బెట్టింగ్‌, ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన ఈశ్వరరావు… సొంత మేనత్తలాంటి వృద్ధురాలినే టార్గెట్ చేసి హత్య చేశాడు. వర్షం నెపంతో ఇంట్లోకి ప్రవేశించి, నమ్మకాన్ని ద్రోహంగా మార్చి బంగారం కోసం ప్రాణాలు తీశాడు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ దారుణం సంచలనం రేపుతోంది.

రామ నవమి ఉత్సవం: ధనుస్సు ఆకార శ్రీరాముని థీమ్ పార్క్‌కు పోటెత్తిన భక్తులు

రామ నవమి ఉత్సవం: ధనుస్సు ఆకార శ్రీరాముని థీమ్ పార్క్‌కు పోటెత్తిన భక్తులు

Sri Ram Navami celebrations in Vizianagaram: విజయనగరంలో శ్రీరామనవమి సందర్భంగా రామనారాయణం ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సుమారు 25,000 మంది భక్తులు పాల్గొని రామనామ స్మరణతో ఆధ్యాత్మిక ఆనందం పొందారు. మూడు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

Andhra Pradesh: వామ్మో.. ఇంత పెద్ద పామును మీ లైఫ్‌లో చూసి ఉండరు.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

Andhra Pradesh: వామ్మో.. ఇంత పెద్ద పామును మీ లైఫ్‌లో చూసి ఉండరు.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ భారీ కింగ్ కోబ్రా హల్‌చల్ చేసింది. పోడు వ్యవసాయం కోసం పొలాలకు వెళ్లిన రైతులకు ఈ భారీ పాము ఎదురుపడటంతో ఒక్కసారిగా ముచ్చెమటలు పట్టాయి. ప్రాణభయంతో రైతులు పరుగులు తీయడంతో ఆ ప్రాంతమంతా అలజడి నెలకొంది. పిల్లలు, పశువులకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళనతో గ్రామస్తులంతా ఏకమై ఆ కింగ్ కోబ్రాను హతమార్చారు.

గోమాతకు ప్రత్యేక అలంకరణ.. గాజులు, చీర కట్టించి పూజలు! దీని వెనుక ఉన్న సంప్రదాయం తెలుసా?

గోమాతకు ప్రత్యేక అలంకరణ.. గాజులు, చీర కట్టించి పూజలు! దీని వెనుక ఉన్న సంప్రదాయం తెలుసా?

Cow Puja: హిందువులు పరమ పవిత్రంగా పూజించే గోమాతకు చీర, గాజులు, ప్రత్యేక అలంకరణ చేసి ఎంతో ఘనంగా సీమంతం నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంతో విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి గ్రామంలో గోస్తనీ నది తీరాన ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక పండగ వాతావరణాన్ని సంతరించుకుంది.

అనుమానం హత్యకు దారితీసింది.. ఇప్పుడు జీవిత ఖైదు శిక్ష, కానీ కొడుకు ఏమైపోయాడో చూడండి!

అనుమానం హత్యకు దారితీసింది.. ఇప్పుడు జీవిత ఖైదు శిక్ష, కానీ కొడుకు ఏమైపోయాడో చూడండి!

అనుమానంతో ఓ వ్యక్తి భార్యను దారుణంగా హత్య చేశాడు. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిందితుడుని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతడికి జీవితఖైదు విధించారు. ఈ ఘటన విజయంనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వైపు తల్లి హత్యకు గురికావడం, మరోవైపు, తండ్రి జైలుకు వెళ్లడంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు అనాథయ్యాడు.

విజయనగరంలో అర్ధరాత్రి సెగలు.. కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు! ఎమ్మెల్యే సహా 42 మంది ప్రయాణికులు

విజయనగరంలో అర్ధరాత్రి సెగలు.. కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు! ఎమ్మెల్యే సహా 42 మంది ప్రయాణికులు

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం తారాపురం వద్ద ఒడిశాకు చెందిన ఒక ప్రైవేట్ బస్సులో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బరంపురం నుండి మల్కన్‌గిరి వెళ్తున్న ఈ బస్సు టైర్ ఫంక్చర్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లో బస్సు అంతా వ్యాపించాయి. ఆ సమయంలో బస్సులో ఒడిశా చిత్రకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే మంగు ఖిల్లాతో సహా మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదాన్ని ముందుగానే గమనించిన డ్రైవర్..

Watch: ఎంతకు తెగించార్రా.. పైకి చూస్తే కూరగాయలు.. కాస్త జరిపి చూడగా కళ్లు చెదిరే దృశ్యం

Watch: ఎంతకు తెగించార్రా.. పైకి చూస్తే కూరగాయలు.. కాస్త జరిపి చూడగా కళ్లు చెదిరే దృశ్యం

విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై నార్కొటిక్ కంట్రోల్ బృందం చేపట్టిన తనిఖీలలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం నుంచి విజయనగరం వైపు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని అధికారులు అర్ధరాత్రి సమయంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Andhra: బాబోయ్.. 15 అడుగులు.. కారు చీకట్లో బుసలు కొట్టిన కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే

Andhra: బాబోయ్.. 15 అడుగులు.. కారు చీకట్లో బుసలు కొట్టిన కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే

పార్వతీపురం మన్యం జిల్లాలో కింగ్ కోబ్రా హాల్ చల్ చేసింది. గ్రామంలో అకస్మాత్తుగా ప్రత్యక్షం కావడంతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సాలూరు మండలం తుండ గ్రామంలో ఆదివారం సాయంత్రం జనావాస ప్రాంతంలో భారీ కింగ్ కోబ్రా కనిపించడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Andhra: అతనికి 24.. ఆమెకు 16.. ఇన్‌స్టాలో కలిశారు.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా..?

Andhra: అతనికి 24.. ఆమెకు 16.. ఇన్‌స్టాలో కలిశారు.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా..?

విజయనగరం జిల్లాలో నమోదైన ఒక పోక్సో కేసులో నిందితుడికి ప్రత్యేక కోర్టు కఠిన శిక్ష విధించింది. నెల్లిమర్ల పోలీసు స్టేషన్ పరిధిలో 2025 మే నెలలో నమోదైన ఈ కేసులో నిందితుడు పంది నారాయణ (24)కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధిస్తూ విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి తీర్పును వెల్లడించారు.