AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gamidi Koteswara Rao

Gamidi Koteswara Rao

Senior Correspondent - TV9 Telugu

koteswararao.gamidi@tv9.com

21 సంవత్సరాలుగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ వంటి సంస్థల్లో పనిచేసి.. 2018లో టీవీ9 తెలుగులో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నాను. రెండు దశాబ్దాలకు పైచిలుకు రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన, ప్రజా హితమైన కథనాలను కవర్ చేశాను.

Read More
Watch: ఎంతకు తెగించార్రా.. పైకి చూస్తే కూరగాయలు.. కాస్త జరిపి చూడగా కళ్లు చెదిరే దృశ్యం

Watch: ఎంతకు తెగించార్రా.. పైకి చూస్తే కూరగాయలు.. కాస్త జరిపి చూడగా కళ్లు చెదిరే దృశ్యం

విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై నార్కొటిక్ కంట్రోల్ బృందం చేపట్టిన తనిఖీలలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం నుంచి విజయనగరం వైపు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని అధికారులు అర్ధరాత్రి సమయంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Andhra: బాబోయ్.. 15 అడుగులు.. కారు చీకట్లో బుసలు కొట్టిన కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే

Andhra: బాబోయ్.. 15 అడుగులు.. కారు చీకట్లో బుసలు కొట్టిన కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే

పార్వతీపురం మన్యం జిల్లాలో కింగ్ కోబ్రా హాల్ చల్ చేసింది. గ్రామంలో అకస్మాత్తుగా ప్రత్యక్షం కావడంతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సాలూరు మండలం తుండ గ్రామంలో ఆదివారం సాయంత్రం జనావాస ప్రాంతంలో భారీ కింగ్ కోబ్రా కనిపించడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Andhra: అతనికి 24.. ఆమెకు 16.. ఇన్‌స్టాలో కలిశారు.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా..?

Andhra: అతనికి 24.. ఆమెకు 16.. ఇన్‌స్టాలో కలిశారు.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా..?

విజయనగరం జిల్లాలో నమోదైన ఒక పోక్సో కేసులో నిందితుడికి ప్రత్యేక కోర్టు కఠిన శిక్ష విధించింది. నెల్లిమర్ల పోలీసు స్టేషన్ పరిధిలో 2025 మే నెలలో నమోదైన ఈ కేసులో నిందితుడు పంది నారాయణ (24)కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధిస్తూ విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి తీర్పును వెల్లడించారు.

భార్యను ఎరగా వేసి.. వీడు చేసిన పని తెలిస్తే నివ్వెరపోవాల్సిందే..

భార్యను ఎరగా వేసి.. వీడు చేసిన పని తెలిస్తే నివ్వెరపోవాల్సిందే..

సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని యువకుడిని హనీట్రాప్‌లోకి దించి దాడి చేసి బంగారు చైన్ దోచుకున్న ఘటన విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దంపతులతో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. .. ..,

దుమ్ము లేపిన బొబ్బిలి యువకులు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేసి..

దుమ్ము లేపిన బొబ్బిలి యువకులు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేసి..

విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఇద్దరు యువకులు బ్యాంకింగ్ పోటీ పరీక్షల్లో ఏకంగా నాలుగు చొప్పున ఉద్యోగాలు సాధించి ప్రతిభ చాటుకున్నారు. కళ్యంపూడి భానుప్రకాశ్, పెంట రాకేశ్ కుమార్ వరుస విజయాలతో స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నారు. పూర్తి వివరాలు కథనం లోపల ...

Andhra: చూస్తే విస్తరాకులు కుప్ప అనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు

Andhra: చూస్తే విస్తరాకులు కుప్ప అనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు

చంద్ర గ్రహణం సమయంలో గిట్టని వారిపై కొందరు ఈ క్షుద్రపూజలు నిర్వహించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ సమయంలో క్షుద్రపూజలు చేస్తే తమ శత్రువులకు హాని తలపెట్టవచ్చని, అందుకే గ్రహణం రోజు క్షుద్రపూజలు జరిపారని చెప్పుకొస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Andhra News: అయ్యో ఎంత పని చేశావ్ బ్రో.. మందు మానేయమంటే.. ఏకంగా ప్రాణాలే వదిలేసి వ్యక్తి!

Andhra News: అయ్యో ఎంత పని చేశావ్ బ్రో.. మందు మానేయమంటే.. ఏకంగా ప్రాణాలే వదిలేసి వ్యక్తి!

విజయనగరం జిల్లా రేగిడి మండలం బూరాడలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. మద్యం వ్యసనం ఒక కుటుంబాన్ని ఛిద్రం చేసింది. మద్యం అలవాటు మానుకోవాలని కుటుంబ సభ్యులు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశమై, మద్యం దుష్ప్రభావాలను మరోసారి కళ్ళకు కట్టింది.

Andhra News: ఆ ఒక్క ప్రయాణం.. ఈ యువతి జీవితాన్ని ఎలా మార్చేసిందో చూశారా?

Andhra News: ఆ ఒక్క ప్రయాణం.. ఈ యువతి జీవితాన్ని ఎలా మార్చేసిందో చూశారా?

హైదరాబాద్‌ నగరంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం.. విజయనగరం జిల్లాలోని ఓ చిన్న కుటుంబాన్ని చిద్రం చేసింది. ఈ ప్రమాదంలో ఆ పేద కుటుంబానికి పెద్ద ఆశగా మిగిలిన అక్షిత అర్ధాంతరంగా తనువుచాలించి ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబర్ 10లో ట్యాంకర్‌ బైక్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో అక్షిత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన యువతి స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Andhra: కొత్త ఆటో కొని పూజలు చేయించి ఇంటి ముందు పెట్టాడు.. తెల్లారేసరికి

Andhra: కొత్త ఆటో కొని పూజలు చేయించి ఇంటి ముందు పెట్టాడు.. తెల్లారేసరికి

బ్రతుకుతెరువు కోసం అప్పు చేసి కొన్న కొత్త ఆటో గంటల వ్యవధిలో మాయమైన ఘటన విజయనగరం జిల్లాలో కలకలం రేపింది. కొత్తవలస మండలం రెల్లి కాలనీలో నివసించే బంగారి అప్పలరాజు రూ.3.18 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఆటోను పూజలు చేసి ఇంటి ముందు ఉంచగా, తెల్లవారుజామున అది కనిపించలేదు.

Andhra: మాధవి ఆ సమయంలో ఎవరితో మాట్లాడింది.. రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత..

Andhra: మాధవి ఆ సమయంలో ఎవరితో మాట్లాడింది.. రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత..

అందరితో సరదాగా గడిపే స్కూల్ టీచర్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో విషాదంగా మారింది. బొబ్బిలి కుమ్మరివీధికి చెందిన సుంకరి మాధవీదేవి (40) గత 16 ఏళ్ల క్రితం నరేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. అనంతరం పెద్దలకు చెప్పి వారిని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది.

Andhra: అయ్యో భవానీ.. సాయం చేద్దామని పక్కింటికి వెళ్లింది.. ఇంతలోనే ఊహించని ఘటన..

Andhra: అయ్యో భవానీ.. సాయం చేద్దామని పక్కింటికి వెళ్లింది.. ఇంతలోనే ఊహించని ఘటన..

పక్కింట్లో సాయం చేయడానికి వెళ్లిన మహిళ.. ఊహించని విధంగా అగ్ని ప్రమాదానికి గురై సజీవ దహనం అయింది. అందరినీ కలిచి వేస్తున్న ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.. వివరాల ప్రకారం. విజయనగరం నగరం పట్టణం హుకుంపేట జంక్షన్‌లోని పేద కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది.

అంతఃపురం నుంచి బాహ్య ప్రపంచలోకి అడుగు పెట్టిన యువరాణి

అంతఃపురం నుంచి బాహ్య ప్రపంచలోకి అడుగు పెట్టిన యువరాణి

బొబ్బిలి రాజులు అంటే తెలియని వారుండరు. శతాబ్దాల చరిత్ర ఉన్న బొబ్బిలి రాజకుటుంబం పేరు వినగానే అందరికీ ఒక ప్రత్యేక గౌరవం. బొబ్బిలి రాజుల చరిత్రలో 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధమే అందరికీ గుర్తొస్తుంది. బొబ్బిలి స్థానం ఆవిర్భావం నుంచి వారి రాజరిక ఆచారాలు, సంప్రదాయాలు, అదే కట్టుదిట్టత నేటికి కొనసాగుతూ వస్తున్నాయి. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే బొబ్బిలి సంస్థాన మహిళలు మాత్రం బయట ప్రపంచానికి దూరంగా ఇంకా ఘోష విధానంలోనే కొనసాగుతున్నారు.