21 సంవత్సరాలుగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ వంటి సంస్థల్లో పనిచేసి.. 2018లో టీవీ9 తెలుగులో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నాను. రెండు దశాబ్దాలకు పైచిలుకు రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన, ప్రజా హితమైన కథనాలను కవర్ చేశాను.
Andhra: అయ్యో.. బుజ్జమ్మ.. అప్పడే నూరేళ్లు నిండిపోయాయా..?
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న 18 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు నీటితో నింపిన టబ్లో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు గమనించేలోపే ఈ ఘటన జరగడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Jun 28, 2026
- 10:42 am
పొలం పనులకు వెళ్లిన వదిన.. ఇంట్లోకి చొరబడ్డ మరదలు! సీన్ కట్ చేస్తే.. ఊహించని షాక్
విజయనగరం జిల్లా వీరసాగరంలో కుటుంబ ఆస్తి వివాదాలు, పుస్తెలతాడు వాటా విషయంలో వదిన ఇంట్లో మరదలు వసంత 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేసింది. పగటిపూట ఎవరూ లేని సమయంలో బీరువా పగలగొట్టి దొంగతనానికి పాల్పడింది. పోలీసుల దర్యాప్తులో నిందితురాలు పట్టుబడి, బంగారం స్వాధీనం చేసుకున్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Jun 19, 2026
- 5:57 pm
Andhra: ఇంట్లో ఉన్నప్పుడేమో ఒకటి.. బయటకు వచ్చేసరికి 2.. ఏమైందంటే..?
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వత్తాడ గ్రామంలోని ఓ ఇంట్లో అరుదైన కింగ్ కోబ్రా కనిపించడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. జెర్రిపోతు పామును మింగడంతో కదలలేని స్థితికి చేరిన కింగ్ కోబ్రాను అటవీశాఖ అధికారులు, స్నేక్ క్యాచర్ సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇలాంటి విషసర్పాలు కనిపిస్తే భయపడకుండా వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Jun 19, 2026
- 1:14 pm
Andhra News: సర్కారు బడిపై విశ్వాసం.. గవర్నమెంట్ హైస్కూల్లో కలెక్టర్ కుమారుడికి అడ్మిషన్
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ తన కుమారుడిని స్వయంగా స్థానిక డీవీఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో చేర్పించారు. సాధారణంగా ఉన్నతాధికారులు ప్రైవేట్ పాఠశాలలను ఎంచుకునే పరిస్థితుల్లో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోంది. కలెక్టర్ నిర్ణయంపై విద్యావేత్తలు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు..
- Gamidi Koteswara Rao
- Updated on: Jun 19, 2026
- 1:00 pm
కింగ్ కోబ్రా పిల్లకు కూడా ఇంత పవరుంటుందా..? మన్యం జిల్లాలో ఏం జరిగిందంటే..?
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని ఊసకొండ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోకి చొరబడిన కింగ్ కోబ్రా కాటుకు ఆరిక బాబురావు అనే యువకుడు మృతి చెందాడు. సాధారణంగా కింగ్ కోబ్రాలు మనుషులపై దాడి చేయవని, తమకు ముప్పు ఉందని భావించినప్పుడే రక్షణాత్మకంగా స్పందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Jun 6, 2026
- 10:45 am
పగలు డెలివరీ బాయ్గా పనిచేస్తున్న కుర్రాడు.. రాత్రయితే అంతా కచోరీ వ్యవహారం!
పైకి చూస్తే చేతిలో పార్శిళ్లతో అమాయకంగా కనిపించే డెలివరీ బాయ్.. కానీ కట్ చేస్తే రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారం దోచుకునే గజదొంగ! పగటిపూట ఇళ్లను రెక్కీ చేస్తూ, రాత్రిళ్లు చోరీలకు పాల్పడుతున్న ఒక కిలాడీ డెలివరీ బాయ్ను జిల్లా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న ఒక బంగారు వ్యాపారిని కూడా పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.
- Gamidi Koteswara Rao
- Updated on: May 31, 2026
- 8:13 pm
Andhra: నోటిలో చేప పిల్లతో కనిపించిన అరుదైన సర్పం…
పార్వతీపురం మన్యం జిల్లాలో అరుదుగా కనిపించే పంట్ల పాము సంచరించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సాలూరు మండలంలోని దేవుబుచ్చింపేట చెరువు సమీపంలో బుధవారం రాత్రి చేపను నోటితో పట్టుకుని రోడ్డుపైకి వచ్చిన ఈ పామును చూసేందుకు గ్రామస్తులు గుమికూడారు. .. .. ..
- Gamidi Koteswara Rao
- Updated on: May 29, 2026
- 8:34 pm
రావి ఆకుపై బక్రీద్ కళాఖండం.. విజయనగరం టీచర్ ప్రతిభకు ప్రశంసల వెల్లువ
విజయనగరం జిల్లాకు చెందిన డ్రాయింగ్ టీచర్ జీఎంజీ పరమేశ్వరరావు బక్రీద్ సందర్భంగా రావి ఆకుపై ప్రత్యేక కళాఖండాన్ని రూపొందించి అందరినీ ఆకట్టుకున్నారు. పండుగకు ప్రతీకగా భావించే చిహ్నాన్ని సూక్ష్మంగా కత్తిరించి రూపొందించిన ఈ ఆర్ట్ మత సామరస్యాన్ని ప్రతిబింబిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న కళాత్మక ప్రతిభకు ఇది అద్భుత ఉదాహరణగా నిలుస్తోంది.
- Gamidi Koteswara Rao
- Updated on: May 28, 2026
- 7:46 pm
అయ్యో.. ఎంత విషాదం.. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కన్నుమూత.. గంటల వ్యవధిలోనే..!
Vizianagaram: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం రంగరాయపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. జీవితాంతం కలిసి జీవించిన వృద్ధ దంపతులు కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందారు. వంగపండు వెంకటస్వామి (80) మృతిని తట్టుకోలేక ఆయన భార్య అప్పలనరసమ్మ (72) కూడా కన్నుమూయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Gamidi Koteswara Rao
- Updated on: May 27, 2026
- 11:21 am
Andhra Pradesh: శభాష్ రుద్ర.. ట్రైన్లో కేరళ స్మగ్లర్ల గుట్టరట్టు చేసిన పోలీస్ డాగ్..
గంజాయి స్మగ్లర్లు పక్కా స్కెచ్తో రద్దీగా ఉండే ప్యాసింజర్ రైలు ఎక్కారు. పోలీసుల కళ్లు గప్పి గంజాయిని సరిహద్దులు దాటించాలనుకున్నారు. కానీ, అక్కడ సీన్లోకి ఎంటరైంది పోలీసు నార్కోటిక్ డాగ్ రుద్ర. ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన రైలు బోగీలోకి దూసుకెళ్లిన రుద్ర.. తన పవర్ ఫుల్ స్మెల్లింగ్ సెన్స్తో కేరళకు చెందిన అంతరాష్ట్ర స్మగ్లర్ల గుట్టును రట్టు చేసింది. ఏకంగా 13.5 కిలోల గంజాయిని పట్టించింది.
- Gamidi Koteswara Rao
- Updated on: May 21, 2026
- 10:34 pm
రౌడీయిజంపై ఉక్కుపాదం.. బేత లల్లూపై పీడీ యాక్ట్.. భయం భయంగా రౌడీ షీటర్లు
Preventive Detention Act: విజయనగరం జిల్లాలో రౌడీయిజం, చైన్ స్నాచింగ్, గంజాయి అక్రమ రవాణా వంటి నేరాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న బేత లల్లూ (23)పై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ అమలు చేశారు.
- Gamidi Koteswara Rao
- Updated on: May 18, 2026
- 10:48 pm
Andhra News: ఆ ఒక్క పొరపాటు.. ఏకంగా యువకుడి ప్రాణాలే తీసింది.. అసలు ఏం జరిగిందంటే?
పార్వతీపురం మన్యం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మక్కువ మండలం ఎర్రసామంతవలస సమీపంలో విద్యుత్ లైన్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తూ కరెంట్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు వైఎస్ వలస గ్రామానికి చెందిన పీడిక నవీన్ (24)గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Gamidi Koteswara Rao
- Updated on: May 17, 2026
- 2:28 pm