AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gamidi Koteswara Rao

Gamidi Koteswara Rao

Senior Correspondent - TV9 Telugu

koteswararao.gamidi@tv9.com

21 సంవత్సరాలుగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ వంటి సంస్థల్లో పనిచేసి.. 2018లో టీవీ9 తెలుగులో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నాను. రెండు దశాబ్దాలకు పైచిలుకు రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన, ప్రజా హితమైన కథనాలను కవర్ చేశాను.

Read More
కింగ్ కోబ్రా పిల్లకు కూడా ఇంత పవరుంటుందా..? మన్యం జిల్లాలో ఏం జరిగిందంటే..?

కింగ్ కోబ్రా పిల్లకు కూడా ఇంత పవరుంటుందా..? మన్యం జిల్లాలో ఏం జరిగిందంటే..?

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని ఊసకొండ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోకి చొరబడిన కింగ్ కోబ్రా కాటుకు ఆరిక బాబురావు అనే యువకుడు మృతి చెందాడు. సాధారణంగా కింగ్ కోబ్రాలు మనుషులపై దాడి చేయవని, తమకు ముప్పు ఉందని భావించినప్పుడే రక్షణాత్మకంగా స్పందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పగలు డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న కుర్రాడు.. రాత్రయితే అంతా కచోరీ వ్యవహారం!

పగలు డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న కుర్రాడు.. రాత్రయితే అంతా కచోరీ వ్యవహారం!

పైకి చూస్తే చేతిలో పార్శిళ్లతో అమాయకంగా కనిపించే డెలివరీ బాయ్.. కానీ కట్ చేస్తే రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారం దోచుకునే గజదొంగ! పగటిపూట ఇళ్లను రెక్కీ చేస్తూ, రాత్రిళ్లు చోరీలకు పాల్పడుతున్న ఒక కిలాడీ డెలివరీ బాయ్‌ను జిల్లా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న ఒక బంగారు వ్యాపారిని కూడా పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

Andhra: నోటిలో చేప పిల్లతో కనిపించిన అరుదైన సర్పం…

Andhra: నోటిలో చేప పిల్లతో కనిపించిన అరుదైన సర్పం…

పార్వతీపురం మన్యం జిల్లాలో అరుదుగా కనిపించే పంట్ల పాము సంచరించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సాలూరు మండలంలోని దేవుబుచ్చింపేట చెరువు సమీపంలో బుధవారం రాత్రి చేపను నోటితో పట్టుకుని రోడ్డుపైకి వచ్చిన ఈ పామును చూసేందుకు గ్రామస్తులు గుమికూడారు. .. .. ..

రావి ఆకుపై బక్రీద్ కళాఖండం.. విజయనగరం టీచర్ ప్రతిభకు ప్రశంసల వెల్లువ

రావి ఆకుపై బక్రీద్ కళాఖండం.. విజయనగరం టీచర్ ప్రతిభకు ప్రశంసల వెల్లువ

విజయనగరం జిల్లాకు చెందిన డ్రాయింగ్ టీచర్ జీఎంజీ పరమేశ్వరరావు బక్రీద్ సందర్భంగా రావి ఆకుపై ప్రత్యేక కళాఖండాన్ని రూపొందించి అందరినీ ఆకట్టుకున్నారు. పండుగకు ప్రతీకగా భావించే చిహ్నాన్ని సూక్ష్మంగా కత్తిరించి రూపొందించిన ఈ ఆర్ట్ మత సామరస్యాన్ని ప్రతిబింబిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న కళాత్మక ప్రతిభకు ఇది అద్భుత ఉదాహరణగా నిలుస్తోంది.

అయ్యో.. ఎంత విషాదం.. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కన్నుమూత.. గంటల వ్యవధిలోనే..!

అయ్యో.. ఎంత విషాదం.. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కన్నుమూత.. గంటల వ్యవధిలోనే..!

Vizianagaram: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం రంగరాయపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. జీవితాంతం కలిసి జీవించిన వృద్ధ దంపతులు కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందారు. వంగపండు వెంకటస్వామి (80) మృతిని తట్టుకోలేక ఆయన భార్య అప్పలనరసమ్మ (72) కూడా కన్నుమూయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Andhra Pradesh: శభాష్ రుద్ర.. ట్రైన్‌లో కేరళ స్మగ్లర్ల గుట్టరట్టు చేసిన పోలీస్ డాగ్..

Andhra Pradesh: శభాష్ రుద్ర.. ట్రైన్‌లో కేరళ స్మగ్లర్ల గుట్టరట్టు చేసిన పోలీస్ డాగ్..

గంజాయి స్మగ్లర్లు పక్కా స్కెచ్‌తో రద్దీగా ఉండే ప్యాసింజర్ రైలు ఎక్కారు. పోలీసుల కళ్లు గప్పి గంజాయిని సరిహద్దులు దాటించాలనుకున్నారు. కానీ, అక్కడ సీన్‌లోకి ఎంటరైంది పోలీసు నార్కోటిక్ డాగ్ రుద్ర. ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన రైలు బోగీలోకి దూసుకెళ్లిన రుద్ర.. తన పవర్ ఫుల్ స్మెల్లింగ్ సెన్స్‌తో కేరళకు చెందిన అంతరాష్ట్ర స్మగ్లర్ల గుట్టును రట్టు చేసింది. ఏకంగా 13.5 కిలోల గంజాయిని పట్టించింది.

రౌడీయిజంపై ఉక్కుపాదం.. బేత లల్లూపై పీడీ యాక్ట్.. భయం భయంగా రౌడీ షీటర్లు

రౌడీయిజంపై ఉక్కుపాదం.. బేత లల్లూపై పీడీ యాక్ట్.. భయం భయంగా రౌడీ షీటర్లు

Preventive Detention Act: విజయనగరం జిల్లాలో రౌడీయిజం, చైన్ స్నాచింగ్, గంజాయి అక్రమ రవాణా వంటి నేరాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న బేత లల్లూ (23)పై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ అమలు చేశారు.

Andhra News: ఆ ఒక్క పొరపాటు.. ఏకంగా యువకుడి ప్రాణాలే తీసింది.. అసలు ఏం జరిగిందంటే?

Andhra News: ఆ ఒక్క పొరపాటు.. ఏకంగా యువకుడి ప్రాణాలే తీసింది.. అసలు ఏం జరిగిందంటే?

పార్వతీపురం మన్యం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మక్కువ మండలం ఎర్రసామంతవలస సమీపంలో విద్యుత్ లైన్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తూ కరెంట్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు వైఎస్ వలస గ్రామానికి చెందిన పీడిక నవీన్ (24)గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Andhra: ఇదేంటో మీకు తెలుసా..? అసలు ఎప్పుడైనా చూశారా..?

Andhra: ఇదేంటో మీకు తెలుసా..? అసలు ఎప్పుడైనా చూశారా..?

పార్వతీపురం మన్యం జిల్లా గొర్లివలస అటవీ ప్రాంతంలో అరుదైన దుంప జాతికి చెందిన “ఎలిఫెంట్ ఫుట్ యామ్” మొక్క కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఘాటైన వాసన వెదజల్లే ఈ ప్రత్యేక పుష్పాన్ని చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ప్రకృతి వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే ఈ మొక్కను సంరక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఇళ్లు ఉడ్చేందుకు లైట్ స్విచ్ వేసిన పని మనిషి.. ఇంతలోనే భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా

ఇళ్లు ఉడ్చేందుకు లైట్ స్విచ్ వేసిన పని మనిషి.. ఇంతలోనే భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా

వేసవి కాలం వచ్చిందంటే చాలూ ప్రతి ఒక్క ఇంట్లో 24 గంటల పాటు ఏసీ, ఫ్యాన్‌లు రన్‌ అవుతూనే ఉంటాయి. కానీ అధికంగా ఎండలు ఉన్నప్పుడు ఇలా నిరంతరాయంగా వాటిని నడిపించడం పెను ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిపై ఎక్కవ భారం పడి పేలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తాజాగా విజయం నగరంలో జరిగిన ఘటనే ఇప్పుడు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

Andhra News: ఉదయానే పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు.. ఇంటికొచ్చి చూడగా..

Andhra News: ఉదయానే పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు.. ఇంటికొచ్చి చూడగా..

విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలం జగన్నాధవలసలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ ఇవ్వలేదనే మనస్తాపంతో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారంతో ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Andhra: పొదల్లో అలజడి.. ఏంటా అని వెళ్లి చూడగా.. ఏకంగా 3 కలిసి…

Andhra: పొదల్లో అలజడి.. ఏంటా అని వెళ్లి చూడగా.. ఏకంగా 3 కలిసి…

విజయనగరం జిల్లా మద్దివలస గ్రామంలో ఒకేసారి మూడు జెర్రిపోతు పాములు గంటల తరబడి సయ్యాట ఆడటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. అరుదైన ఈ దృశ్యాన్ని గ్రామస్థులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. విషపూరితం కాదని, రైతులకు మేలు చేసే పాములేనని నిపుణులు చెబుతున్నారు.