AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gamidi Koteswara Rao

Gamidi Koteswara Rao

Senior Correspondent - TV9 Telugu

koteswararao.gamidi@tv9.com

21 సంవత్సరాలుగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ వంటి సంస్థల్లో పనిచేసి.. 2018లో టీవీ9 తెలుగులో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నాను. రెండు దశాబ్దాలకు పైచిలుకు రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన, ప్రజా హితమైన కథనాలను కవర్ చేశాను.

Read More
Andhra News: రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు.. తల్లిబిడ్డ సేఫ్

Andhra News: రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు.. తల్లిబిడ్డ సేఫ్

పార్వతీపురం మన్యం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రైలు పట్టాలపై ఓ మహిళ ప్రసవించింది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా పురిటినొప్పులు రావడంతో రైలు దిగి ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కానీ పట్టాలు దాటే క్రమంలోనే ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. తోటి ప్రయాణికుల మానవత్వంతో కూడిన సాయంతో తల్లిబిడ్డలు క్షేమంగా ఆసుపత్రికి చేరారు

ఉద్యోగాల కోసమని 27మంది మయన్మార్ వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..?

ఉద్యోగాల కోసమని 27మంది మయన్మార్ వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..?

ఉద్యోగ అవకాశాల పేరుతో మయున్మార్ వెళ్లి మోసపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 27 మంది యువకులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో ఈ యువకులు సురక్షితంగా భారత్‌కు తిరిగి వచ్చారు. మయున్మార్‌లో నెలల తరబడి నరకయాతన అనుభవించిన బాధితుల కథ అందరినీ కలచివేసింది.

Botsa Jhansi Lakshmi: మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మీ అకడమిక్ ప్రయాణంలో నిత్య విద్యార్థినిగా మరో రికార్డ్

Botsa Jhansi Lakshmi: మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మీ అకడమిక్ ప్రయాణంలో నిత్య విద్యార్థినిగా మరో రికార్డ్

విద్యారంగంలో తనదైన ముద్ర వేసుకున్న డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మీ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE XX)లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించి మరో విద్యా మైలురాయిని అధిగమించారు. న్యాయ రంగంలో ప్రాక్టీస్‌కు అవసరమైన అర్హతను సాధించడం ద్వారా ఆమె అకడమిక్ ప్రయాణం మరింత బలపడింది. మహిళలు బహుళ రంగాల్లో రాణించేందుకు ఈ విజయం ప్రేరణగా నిలుస్తోంది.

అమ్మ బాబోయ్..! ఊర్లపై పడ్డ ఏనుగుల గుంపు.. భయంతో వణికిపోతున్న మన్యం జనం..!

అమ్మ బాబోయ్..! ఊర్లపై పడ్డ ఏనుగుల గుంపు.. భయంతో వణికిపోతున్న మన్యం జనం..!

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం కొనసాగుతోంది. ‎కొమరాడ మండలం కుమ్మరిగుంటలో సంచరిస్తూ, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పంట పొలాల్లోకి ప్రవేశించి వాణిజ్య పంటలను నాశనం చేస్తున్నాయి. ఏనుగుల గుంపు కారణంగా టమాటా, పామాయిల్‌, కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి. నెలల తరబడి కష్టపడి పండించిన పంటలు ఏనుగుల కారణంగా నేలపాలవుతున్నాయని రైతులు వాపోతున్నారు రైతులు.

Andhra Pradesh: భీమాళి మామిడి తాండ్రకు ప్రత్యేక గుర్తింపు.. రైతులకు అండగా సర్కార్ సరికొత్త ప్లాన్..

Andhra Pradesh: భీమాళి మామిడి తాండ్రకు ప్రత్యేక గుర్తింపు.. రైతులకు అండగా సర్కార్ సరికొత్త ప్లాన్..

విజయనగరం జిల్లా అంటేనే నోరూరించే మామిడి తాండ్రకు పెట్టింది పేరు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ సంప్రదాయ రుచికి ఇప్పుడు మరింత గుర్తింపు లభించనుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ఒక జిల్లా – ఒక ఉత్పత్తి కింద ఈ జిల్లా నుంచి మామిడి తాండ్రను ప్రతినిధి ఉత్పత్తిగా ఎంపిక చేశారు. భీమాళి ప్రాంతంలో తయారయ్యే ఈ తాండ్రను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చేందుకు జిల్లా కలెక్టర్ భారీ ప్రణాళికను సిద్ధం చేశారు.

Andhra: బాలికలపై ఎక్కడపడితే అక్కడ చేతులేస్తున్నాడు.. ఏంటి సార్ ఇది అని అడిగితే..

Andhra: బాలికలపై ఎక్కడపడితే అక్కడ చేతులేస్తున్నాడు.. ఏంటి సార్ ఇది అని అడిగితే..

రాజాం మునిసిపాలిటీ పరిధిలోని డోలపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు దూసి ఆశియ్యపై ముగ్గురు విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పోక్సో చట్టం కింద కేసు నమోదు కాగా, డీఈవో ఆదేశాలతో ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. అయితే కేసు నమోదైన విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Bhogapuram: భోగాపురం ఎయిర్‌పోర్టులో ట్రయల్ రన్‌ సక్సెస్.. ల్యాండైన తొలి విమానం

Bhogapuram: భోగాపురం ఎయిర్‌పోర్టులో ట్రయల్ రన్‌ సక్సెస్.. ల్యాండైన తొలి విమానం

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ట్రయల్ రన్ విజయవంతమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన తొలి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ కావడంతో, భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి మరో అడుగు ముందుకెళ్లింది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం ..

Vijayanagaram: కనులు కనులను దోచాయంటే సినిమా స్టైల్‌లో దొంగతనాలకు దిగిన ప్రేమజంట

Vijayanagaram: కనులు కనులను దోచాయంటే సినిమా స్టైల్‌లో దొంగతనాలకు దిగిన ప్రేమజంట

విలాసవంతమైన జీవనశైలికి అలవాటుపడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రేమజంట చివరకు దొంగతనాలకు పాల్పడి పోలీసుల వలలో చిక్కింది. ఉద్యోగాలు ఉన్నప్పటికీ ఖర్చులు జీతాలను మించడంతో నేరబాట పట్టిన ఈ దంపతులు… దేశవ్యాప్తంగా తిరుగుతూ తప్పించుకునే ప్రయత్నం చేసినా చివరకు భువనేశ్వర్‌లో పట్టుబడ్డారు.

AOB: ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లో టెన్షన్, టెన్షన్.. ఎందుకో తెలుసా?

AOB: ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లో టెన్షన్, టెన్షన్.. ఎందుకో తెలుసా?

ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా ప్రాంతం మరోసారి ఉద్రిక్తంగా మారింది. సుప్రీంకోర్టు స్టేటస్‌–కో కొనసాగుతున్నప్పటికీ నాల్కో సంస్థకు బాక్సైట్ తవ్వకాల అనుమతులు ఇవ్వడంపై గిరిజనులు ఆందోళనకు దిగారు. తవ్వకాలతో తమ భూములు, అటవీ హక్కులు, జీవనాధారం ప్రమాదంలో పడతాయంటూ కొటియావాసులు ప్రశ్నిస్తున్నారు.

Andhra Pradesh: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల ఎంట్రీ.. చివరకు..

Andhra Pradesh: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల ఎంట్రీ.. చివరకు..

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. చేతినిండా జీతం కానీ ఆమెకు విలాసాలే లోకం. కోట్లు సంపాదించాలనే ఆశతో లేడీ డాన్‌గా మారిన రేణుక అసలు కథ ఏంటి? ఆమెను ఎలా పట్టుకున్నారు? గంజాయితో ఆమెకున్న సంబంధం ఏంటీ..? తవ్వేకొద్దీ బయటపడుతున్న ఆమె నేర చరిత్ర గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Andhra: అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించావ్‌రా.. పెళ్లి చేసుకున్న 3 నెలలకే..

Andhra: అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించావ్‌రా.. పెళ్లి చేసుకున్న 3 నెలలకే..

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని ఎరుకొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన వివాహిత శొఠ్యాం పుష్ప (20) మంగళవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పూసపాటిరేగ ఎస్సీ కాలనీకి చెందిన పుష్ప, ఎరుకొండ గ్రామానికి చెందిన శొఠ్యాం శివ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

Andhra: టీచర్ అవ్వాల్సిన మహేష్ ఇలా చేస్తడనుకోలేదు.. రాత్రివేళ అంతా వెళ్లి పోయాక..

Andhra: టీచర్ అవ్వాల్సిన మహేష్ ఇలా చేస్తడనుకోలేదు.. రాత్రివేళ అంతా వెళ్లి పోయాక..

ఉపాధ్యాయుడిగా సమాజానికి సేవ చేయాలన్న కలలతో శిక్షణకు వచ్చిన ఓ యువకుడు అర్ధాంతరంగా తన జీవితాన్నే ముగించుకోవడం విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన కుమారుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తల్లిదండ్రులు, బంధువులను, తోటి విద్యార్థులను తీవ్రంగా కలచివేసింది.