21 సంవత్సరాలుగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ వంటి సంస్థల్లో పనిచేసి.. 2018లో టీవీ9 తెలుగులో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నాను. రెండు దశాబ్దాలకు పైచిలుకు రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన, ప్రజా హితమైన కథనాలను కవర్ చేశాను.
Andhra News: ఆ ఒక్క ప్రయాణం.. ఈ యువతి జీవితాన్ని ఎలా మార్చేసిందో చూశారా?
హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం.. విజయనగరం జిల్లాలోని ఓ చిన్న కుటుంబాన్ని చిద్రం చేసింది. ఈ ప్రమాదంలో ఆ పేద కుటుంబానికి పెద్ద ఆశగా మిగిలిన అక్షిత అర్ధాంతరంగా తనువుచాలించి ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 10లో ట్యాంకర్ బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో అక్షిత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన యువతి స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
- Gamidi Koteswara Rao
- Updated on: Feb 26, 2026
- 9:12 pm
Andhra: కొత్త ఆటో కొని పూజలు చేయించి ఇంటి ముందు పెట్టాడు.. తెల్లారేసరికి
బ్రతుకుతెరువు కోసం అప్పు చేసి కొన్న కొత్త ఆటో గంటల వ్యవధిలో మాయమైన ఘటన విజయనగరం జిల్లాలో కలకలం రేపింది. కొత్తవలస మండలం రెల్లి కాలనీలో నివసించే బంగారి అప్పలరాజు రూ.3.18 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఆటోను పూజలు చేసి ఇంటి ముందు ఉంచగా, తెల్లవారుజామున అది కనిపించలేదు.
- Gamidi Koteswara Rao
- Updated on: Feb 26, 2026
- 8:22 am
Andhra: మాధవి ఆ సమయంలో ఎవరితో మాట్లాడింది.. రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత..
అందరితో సరదాగా గడిపే స్కూల్ టీచర్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో విషాదంగా మారింది. బొబ్బిలి కుమ్మరివీధికి చెందిన సుంకరి మాధవీదేవి (40) గత 16 ఏళ్ల క్రితం నరేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. అనంతరం పెద్దలకు చెప్పి వారిని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది.
- Gamidi Koteswara Rao
- Updated on: Feb 25, 2026
- 7:13 pm
Andhra: అయ్యో భవానీ.. సాయం చేద్దామని పక్కింటికి వెళ్లింది.. ఇంతలోనే ఊహించని ఘటన..
పక్కింట్లో సాయం చేయడానికి వెళ్లిన మహిళ.. ఊహించని విధంగా అగ్ని ప్రమాదానికి గురై సజీవ దహనం అయింది. అందరినీ కలిచి వేస్తున్న ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.. వివరాల ప్రకారం. విజయనగరం నగరం పట్టణం హుకుంపేట జంక్షన్లోని పేద కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది.
- Gamidi Koteswara Rao
- Updated on: Feb 25, 2026
- 4:54 pm
అంతఃపురం నుంచి బాహ్య ప్రపంచలోకి అడుగు పెట్టిన యువరాణి
బొబ్బిలి రాజులు అంటే తెలియని వారుండరు. శతాబ్దాల చరిత్ర ఉన్న బొబ్బిలి రాజకుటుంబం పేరు వినగానే అందరికీ ఒక ప్రత్యేక గౌరవం. బొబ్బిలి రాజుల చరిత్రలో 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధమే అందరికీ గుర్తొస్తుంది. బొబ్బిలి స్థానం ఆవిర్భావం నుంచి వారి రాజరిక ఆచారాలు, సంప్రదాయాలు, అదే కట్టుదిట్టత నేటికి కొనసాగుతూ వస్తున్నాయి. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే బొబ్బిలి సంస్థాన మహిళలు మాత్రం బయట ప్రపంచానికి దూరంగా ఇంకా ఘోష విధానంలోనే కొనసాగుతున్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Feb 24, 2026
- 2:58 pm
Andhra Pradesh: ఫుల్లుగా తాగొచ్చిన భర్త.. భార్య తిట్టడంతో ఇంట్లో ఎవరూ సమయంలో ఘోరం..
మద్యం మత్తులో మనిషి విచక్షణ కోల్పోతే.. ఆ పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పడానికి విజయనగరంలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. భార్య మందలించిందని, సంసారం గడవట్లేదని చేసిన హెచ్చరికను అర్థం చేసుకోలేక.. ఆవేశంలో ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఇద్దరు పసికందులను తండ్రి లేని వారిని చేసింది. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
- Gamidi Koteswara Rao
- Updated on: Feb 22, 2026
- 12:53 pm
Andhra: డ్యాన్స్ మాస్టర్ డేంజరస్ గేమ్.. కోచింగ్ ఇస్తానని బాయ్స్ను రప్పించి..
డ్యాన్స్ క్లాస్ పేరుతో మొదలైన పరిచయం… మెల్లగా మత్తు వైపు మళ్లిన అడుగులు… చివరికి గంజాయి రవాణా గ్యాంగ్లో చిక్కుకున్న విద్యార్థులు. విజయనగరం జిల్లాలో డ్యాన్స్ మాస్టర్ గణేష్ యువతను ఆకర్షించి, వ్యసనంలోకి దించి స్మగ్లర్లుగా మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ..
- Gamidi Koteswara Rao
- Updated on: Feb 21, 2026
- 9:30 pm
Andhra: వాహనాల హెడ్లైట్లు పడడంతో మెరుస్తూ కనిపించింది.. దగ్గరికి వెళ్లగా
చిమ్మచీకటిలో రహదారిపై ఒక్కసారిగా హెడ్లైట్లు పడగానే భారీ కొండచిలువ కదలిక… వాహనాలు ఒక్కసారిగా బ్రేక్… గ్రామస్తుల్లో ఆందోళన. విజయనగరం జిల్లా జామి మండలం శాసనాపల్లిలో రాత్రివేళ కొండచిలువ ప్రత్యక్షమవడంతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పరిసర ప్రాంతాల్లో వన్య ప్రాణులు సంచారం పెరుగుతుండటంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Feb 21, 2026
- 9:24 pm
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి కుటుంబసభ్యులు ఏమి చేశారంటే?
విజయనగరం జిల్లా రాజాం సురేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అనారోగ్యంతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన బాలికను వైద్యులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది. వైద్యుల తీరుకు నిరసనగా బాధిత కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగగా హాస్పిటల్ సిబ్బంది వారిపైనే దాడి చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Feb 9, 2026
- 6:00 am
Andhra News: అయ్యో దేవుడా? ఇంకా ఎన్నాళ్లీ మరణమృదంగం..!సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
పార్వతీపురం మన్యం జిల్లాలో గుండెల్ని పిండేసే ఘటన చోటుచేసుకుంది. గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న నిమ్మక రూప (14) అనే బాలిక అనారోగ్యంతో మృత్యువాత పడింది. సకాలంలో వైద్యం అందక హాస్పిటల్కు చేరేలోపే చిన్నారికి తుదిశ్వాస విడిచింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుముననీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
- Gamidi Koteswara Rao
- Updated on: Feb 8, 2026
- 11:40 pm
Andhra News: టీకా వేసినా దక్కని ఫలితం.. కుక్క కరిచిన కొన్ని రోజులకే బాలుడు మృతి.. అసలేం జరిగిందంటే?
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం దిబ్బగుడ్డివలసలో 9 ఏళ్ల బాలుడు రామవరపు రవణ వీధి కుక్క దాడిలో రేబిస్ బారిన పడి మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. కొద్ది వారాల క్రితం కుక్క కాటుకు గురైన బాలుడికి రేబిస్ టీకాలు వేయించినా, జ్వరం వచ్చి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అధికారుల నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుక్కల బెడద, ప్రజా భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
- Gamidi Koteswara Rao
- Updated on: Feb 8, 2026
- 4:59 pm
Andhra News: భార్యతో మనస్పర్థలు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భర్త.. ఏం చేశాడంటే?
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సాలూరు పట్టణం డబ్బివీధిలో జరిగిన విషాద ఘటన స్థానికులను కలచివేసింది. స్థానికంగా నివాసముంటున్న బొబ్బిలి పరమేశు (37) అనే వ్యక్తి తన ఇంట్లోనే చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేమాన్ని స్వాధీనం చేసుకొని.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Feb 7, 2026
- 3:45 pm