21 సంవత్సరాలుగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ వంటి సంస్థల్లో పనిచేసి.. 2018లో టీవీ9 తెలుగులో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నాను. రెండు దశాబ్దాలకు పైచిలుకు రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన, ప్రజా హితమైన కథనాలను కవర్ చేశాను.
Andhra News: ఆ ఒక్క పొరపాటు.. ఏకంగా యువకుడి ప్రాణాలే తీసింది.. అసలు ఏం జరిగిందంటే?
పార్వతీపురం మన్యం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మక్కువ మండలం ఎర్రసామంతవలస సమీపంలో విద్యుత్ లైన్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తూ కరెంట్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు వైఎస్ వలస గ్రామానికి చెందిన పీడిక నవీన్ (24)గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Gamidi Koteswara Rao
- Updated on: May 17, 2026
- 2:28 pm
Andhra: ఇదేంటో మీకు తెలుసా..? అసలు ఎప్పుడైనా చూశారా..?
పార్వతీపురం మన్యం జిల్లా గొర్లివలస అటవీ ప్రాంతంలో అరుదైన దుంప జాతికి చెందిన “ఎలిఫెంట్ ఫుట్ యామ్” మొక్క కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఘాటైన వాసన వెదజల్లే ఈ ప్రత్యేక పుష్పాన్ని చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ప్రకృతి వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే ఈ మొక్కను సంరక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
- Gamidi Koteswara Rao
- Updated on: May 16, 2026
- 11:04 am
ఇళ్లు ఉడ్చేందుకు లైట్ స్విచ్ వేసిన పని మనిషి.. ఇంతలోనే భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా
వేసవి కాలం వచ్చిందంటే చాలూ ప్రతి ఒక్క ఇంట్లో 24 గంటల పాటు ఏసీ, ఫ్యాన్లు రన్ అవుతూనే ఉంటాయి. కానీ అధికంగా ఎండలు ఉన్నప్పుడు ఇలా నిరంతరాయంగా వాటిని నడిపించడం పెను ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిపై ఎక్కవ భారం పడి పేలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తాజాగా విజయం నగరంలో జరిగిన ఘటనే ఇప్పుడు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
- Gamidi Koteswara Rao
- Updated on: May 16, 2026
- 8:40 am
Andhra News: ఉదయానే పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు.. ఇంటికొచ్చి చూడగా..
విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలం జగన్నాధవలసలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ ఇవ్వలేదనే మనస్తాపంతో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారంతో ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
- Gamidi Koteswara Rao
- Updated on: May 15, 2026
- 9:37 pm
Andhra: పొదల్లో అలజడి.. ఏంటా అని వెళ్లి చూడగా.. ఏకంగా 3 కలిసి…
విజయనగరం జిల్లా మద్దివలస గ్రామంలో ఒకేసారి మూడు జెర్రిపోతు పాములు గంటల తరబడి సయ్యాట ఆడటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. అరుదైన ఈ దృశ్యాన్ని గ్రామస్థులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. విషపూరితం కాదని, రైతులకు మేలు చేసే పాములేనని నిపుణులు చెబుతున్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: May 14, 2026
- 11:34 am
Andhra: మాటిచ్చారు.. ఫ్లైట్లో తీసుకెళ్లారు.. మీరు గ్రేట్ మాస్టర్..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు తెలుగు ఉపాధ్యాయుడు సత్యారావు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఫ్లైట్ జర్నీ చేయిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆరుగురు విద్యార్థులకు విశాఖ నుంచి విజయవాడ వరకు విమాన ప్రయాణం చేయించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పెద్ద లక్ష్యాలపై నమ్మకం పెంచిందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: May 12, 2026
- 5:46 pm
పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే ఘోర ప్రమాదం.. వియ్యంకుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం!
పెళ్లి బాజాలు మోగిన కొద్ది గంటల్లోనే ఆ కుటుంబంలో చావుబాజాలు మోగాయి. విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వివాహం ముగించుకుని వరుడి స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా, జన్నివలస వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లికొడుకు తండ్రి మట్లా సన్యాసిరావు, పెళ్లికూతురు చిన్నాన్న పైడిరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వరుడి తల్లి, సోదరి పరిస్థితి విషమంగా ఉంది. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్
- Gamidi Koteswara Rao
- Updated on: May 12, 2026
- 11:58 am
ప్రయాణిస్తున్న బైక్లో ఒక్కసారిగా మంటలు.. విజయనగరం జిల్లాలో కలకలం.. క్షణాల్లో బూడిదైన ద్విచక్ర వాహనం
విజయనగరం జిల్లాలో ప్రయాణిస్తున్న బైక్ నుంచి మంటలు చెలరేగి భయాందోళనకు గురిచేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. రాజాం మండలం కంచరాం గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. కంచరాంకి చెందిన అల్లు రామారావు, సూర్యనారాయణలు కలిసి గ్రామ సమీపంలోని కల్లాలకు వెళ్లి పనులు ముగించుకుని ద్విచక్ర వాహనం పై తిరిగి వస్తున్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: May 11, 2026
- 9:15 pm
మృత్యువులోనూ మారని మానవత్వం.. ఇద్దరు బిడ్డలను కోల్పోయిన.. గొప్ప మనస్సు చాటుకున్న తల్లిదండ్రులు!
విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన, మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచింది. కడుపుకోతను అనుభవిస్తూ కూడా ఇద్దరు కుమారుల కళ్లను దానం చేసిన ఆ తల్లిదండ్రుల నిర్ణయం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని, పరహితం కోరిన ఆ తల్లిదండ్రుల నిర్ణయంపై నెటిజన్లు, స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: May 7, 2026
- 3:32 pm
దమ్ముంటే పట్టుకోరా శికావత్! దొంగతనం చేసి మరీ సవాల్.. పోలీసుల మైండ్ బ్లాక్ చేస్తున్న వింత చోరీ
విజయనగరం జిల్లాలో ఒక దొంగ పోలీసులకే సవాల్ విసిరిన విచిత్ర ఘటన కలకలం రేపుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా దొంగలు దొరక్కుండా జాగ్రత్త పడతారు. కానీ, ఈ శికావత్ స్టైల్ దొంగ మాత్రం ఏకంగా పోలీసులకే సవాల్ విసిరి వార్తల్లో నిలిచాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...
- Gamidi Koteswara Rao
- Updated on: May 6, 2026
- 8:32 am
Andhra News: కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి.. అసలు ఏం జరిగిందంటే?
విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మిర్తివలసలో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. భాజాభజంత్రీలు, మేళతాళాలు, బంధువుల హడావుడి, పెళ్లికి రెడీ అవుతున్న వధూవరులు, ఇల్లంతా హడావుడి.. ప్రతి ఒక్కరిలో ఆనందం వెల్లివిరుస్తుంది. మరికాసేపట్లో పెళ్లికొడుకు, పెళ్లి కూతురు పెళ్ళిపీటల పై కూర్చొని ఒకటవ్వాల్సిన శుభ సమయం దగ్గర పడుతుంది. కానీ ఇంతలో పెళ్లికొడుకు ఇంట ఒక్కసారిగా ఆర్తనాదాలు అందరిలో విషాదాన్ని నింపాయి.
- Gamidi Koteswara Rao
- Updated on: May 1, 2026
- 10:36 pm
Bobbili: ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకొని ఆసుపత్రి పాలైన మహిళలు
బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సులో జరిగిన చిన్న వివాదం ఘర్షణకు దారి తీసి 14 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. చిన్న విషయంలో ప్రారంభమైన మాటల యుద్ధం చినికిచినికి గాలివానలా మారి, ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పండుగ రద్దీ నేపథ్యంలో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
- Gamidi Koteswara Rao
- Updated on: Apr 30, 2026
- 9:59 pm