G Koteswara Rao

G Koteswara Rao

Reporter - TV9 Telugu

koteswararao.gamidi@tv9.com
AP News: సేమ్ టు సేమ్.. దిశ ఎన్‌కౌంటర్ సీన్.. ఎక్కడో తెలుసా?

AP News: సేమ్ టు సేమ్.. దిశ ఎన్‌కౌంటర్ సీన్.. ఎక్కడో తెలుసా?

పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల అదుపులో ఉన్న కర్రి రాకేష్ అనే యువకుడు రైలు క్రింద పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే పోలీసుల అదుపులో ఉన్న రాకేష్ మృతికి పోలీసులే కారణమని రాకేష్ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. పార్వతీపురం మండలం గోపాలపురంలో ఓ మైనర్ బాలికపై డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కర్రి రాకేష్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Andhra Pradesh: డయేరియా విలయ తాండవం.. ఐదుగురు మృతి

Andhra Pradesh: డయేరియా విలయ తాండవం.. ఐదుగురు మృతి

విజయనగరంలో జిల్లాలో డయేరియా భయబ్రాంతులకు గురి చేస్తోంది. నాలుగు రోజుల వ్యవధిలో డయేరియా కారణంగా 5గురు మృతి చెందారు. వంద మందికి పైగా డయేరియా వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. డయేరియాను అదుపు చేసేందుకు అధికారులు శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అధికారుతులు తెలిపారు..

AP News: డ్వాక్రా బజార్..ఇక్కడ అన్నీ అగ్గువే.!

AP News: డ్వాక్రా బజార్..ఇక్కడ అన్నీ అగ్గువే.!

విజయనగరం జిల్లాలో అఖిలభారత డ్వాక్రా బజార్ (సరస్)ను జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. సుమారు పదిహేను రాష్ట్రాల నుండి డ్వాక్రా మహిళలు తాము తయారుచేసిన ఉత్పత్తులతో పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ డ్వాక్రా బజార్లో తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామీణ చిరు వ్యాపారులకు మార్కెటింగ్ అవకాశాలు విస్తృతంగా కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ సరస్ జరుగుతుంటుంది.

Vizianagaram: బొబ్బిలి యుద్దంలో వాడిన ఆయుధాలు ఇవే..

Vizianagaram: బొబ్బిలి యుద్దంలో వాడిన ఆయుధాలు ఇవే..

బొబ్బిలి చరిత్రను భావితరాలకు అందించే నేపథ్యంలో కోటలోని దర్బార్ మహల్‌లో మ్యూజియం ఏర్పాటు చేసి రాజులు వాడిన అన్ని వస్తువులను సందర్శకులకు అందుబాటులో ఉంచారు. అలా ఉంచిన ఆ వస్తువులను ప్రతి విజయదశమికి బయటకు తీసి శుభ్రపరిచి ఆయుధాలకు ఆయుధ పూజ చేస్తారు.

Andhra Pradesh: విజయనగరంలో అంతర్రాష్ట్ర లేడీ గ్యాంగ్ హల్‌చల్‌

Andhra Pradesh: విజయనగరంలో అంతర్రాష్ట్ర లేడీ గ్యాంగ్ హల్‌చల్‌

విజయనగరం జిల్లాలో అంతర్రాష్ట్ర లేడీ గ్యాంగ్ హల్చల్ చేసింది. ఆరుగురు మహిళలు అర్ధరాత్రి షాపు షాపుకు తిరిగి తాళాలు పగలగొట్టే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచే తెల్లవారుజామున 5:00 వరకు యధేచ్ఛగా స్వైర విహారం చేశారు. కాగితాలు, చెత్త ఏరుకునే మహిళల వలె నటిస్తూ యాచకుల వేషధారణలో భుజాలకు సంచులు తగిలించుకొని వీధుల్లో తిరిగారు.

Vegetable Prices Hike: తగ్గేదేలే.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. టమోటా కిలో ఎంత ఉందో తెలుసా..?

Vegetable Prices Hike: తగ్గేదేలే.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. టమోటా కిలో ఎంత ఉందో తెలుసా..?

మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని కూరగాయలూ సెంచరీ మార్క్‌కు చేరువ అవుతున్నాయి. ధరలతో సామాన్యులు తిప్పలు పడుతున్నారు.. రూ.500 తీసుకెళ్తే ఐదారు రకాల కూరగాయలు తెచ్చుకోవడం కష్టంగా మారిందంటున్నారు వినియోగదారులు..

Andhra Pradesh: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మన్యం జిల్లా వాసులకు దసరా బొనాంజా..

Andhra Pradesh: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మన్యం జిల్లా వాసులకు దసరా బొనాంజా..

పార్వతీపురం మన్యం జిల్లావాసులకు విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పటనుంది. ఏళ్ల తరబడి జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల సమస్యకు చెక్ పెట్టనుంది. ఆ దిశగా ఇప్పటికే ఏపి ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇంతకీ ఏనుగుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెక్ చెప్పనుంది? తీసుకోబోయే చర్యలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలతో ఏనుగుల సమస్యకి పరిష్కారం దొరికేనా? అనేది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

సిరిమానోత్సవానికి వేళాయరా..! ముస్తాబవుతున్న పైడితల్లి అమ్మవారు.. ఈ పండగ విశిష్టత ఏమిటంటే

సిరిమానోత్సవానికి వేళాయరా..! ముస్తాబవుతున్న పైడితల్లి అమ్మవారు.. ఈ పండగ విశిష్టత ఏమిటంటే

ఉత్తరాంధ్ర పెద్ద పండుగగా చెప్పుకునే విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా అధికారులు. ఈ నెల 15న జరగనున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం కోసం నిపుణులయిన వడ్రంగులు కఠోర దీక్షతో నిరంతరం శ్రమిస్తున్నారు. అరవై అడుగుల పొడువున్న చింతచెట్టును పదమూడు మంది వండ్రంగులు సిరిమానుగా మలుస్తున్నారు.

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.. పెళ్లి చూపులకని వచ్చాడు.. వెళ్లేటప్పుడు ఏం చేశాడంటే..

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.. పెళ్లి చూపులకని వచ్చాడు.. వెళ్లేటప్పుడు ఏం చేశాడంటే..

జులై 26 వ తేదీన ఈమె సమీప బంధువులు అయిన దేవబత్తుల ధనలక్ష్మి, ఇద్దరు కుమారులు దేవబత్తుల లక్ష్మణ్, నాగమహేష్, కుమార్తె దేవీలు రాజమండ్రి నుంచి మణమ్మ ఇంటికి వచ్చారు. అలా వచ్చిన తరువాత మణమ్మ కుమార్తె హెప్సిబాను తన కుమారుడు లక్ష్మణ్ కు ఇవ్వాలని అడిగింది దేవబత్తుల ధనలక్ష్మి.

Vizianagaram: దేశంలోనే మొట్టమొదటి వాల్మీకి రిసెర్చ్ సెంటర్ ప్రారంభం

Vizianagaram: దేశంలోనే మొట్టమొదటి వాల్మీకి రిసెర్చ్ సెంటర్ ప్రారంభం

విజయనగరంలో వాల్మీకి రీసెర్చ్‌ సెంటర్‌ను ప్రారంభించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రామాయణంపై అధ్యయనం,పరిశోధనల కోసం రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు నారాయణం కుటుంబసభ్యులు. మూడు రోజుల పాటు జరిగే వేడుకల్లో తొలిరోజు రామయణాన్ని కళ్లకు కట్టింది లేజర్‌ షో.

Valmiki Research Center: ఏపీలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్.. పోస్టర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..

Valmiki Research Center: ఏపీలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్.. పోస్టర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..

ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలిచే రామనారాయణంలో ఏర్పాటు చేస్తున్న వాల్మీకి రిసెర్చ్ సెంటర్ ప్రారంభానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. రామనారాయణంలో ప్రారంభం కానున్న వాల్మీకి రిసెర్చ్ సెంటర్ ను జాతీయ సంస్కృత యూనివర్శిటి తో అనుసంధానం చేశారు నిర్వాహకులు.

రెండు పాముల మధ్య భీకర పోరు.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసిన ఘటన..!

రెండు పాముల మధ్య భీకర పోరు.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసిన ఘటన..!

వన్యప్రాణులకు, సరీసృపాలకు సంబంధించిన అనేక భీకర పూరులు టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ మీరు చూసే ఉంటారు, అయితే గంటల తరబడి రెండు పాముల మధ్య గొడవ మన కళ్ల ముందే కనిపిస్తే, అదే జరిగింది మన ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లాలో..!