AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gamidi Koteswara Rao

Gamidi Koteswara Rao

Senior Correspondent - TV9 Telugu

koteswararao.gamidi@tv9.com

21 సంవత్సరాలుగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ వంటి సంస్థల్లో పనిచేసి.. 2018లో టీవీ9 తెలుగులో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నాను. రెండు దశాబ్దాలకు పైచిలుకు రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన, ప్రజా హితమైన కథనాలను కవర్ చేశాను.

Read More
Andhra: కుక్క కరవగానే వెంటనే రేబిస్ వ్యాక్సిన్ వేయించారు.. కానీ కొన్ని రోజుల తర్వాత..

Andhra: కుక్క కరవగానే వెంటనే రేబిస్ వ్యాక్సిన్ వేయించారు.. కానీ కొన్ని రోజుల తర్వాత..

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం దిబ్బగుడ్డివలసలో కుక్క కాటు ఘటనలో 9 ఏళ్ల బాలుడు రవణ మృతి చెందాడు. గత నెలలో కుక్క దాడిలో గాయపడిన బాలుడికి రేబిస్ టీకాలు వేసినా.. రెండు రోజుల క్రితం జ్వరం వచ్చి పరిస్థితి క్షీణించి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వీధికుక్కల నియంత్రణలో అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సామాజిక సమానత్వ దిశగా ముందడుగు.. చారిత్రాత్మక పట్టణంలో వీధుల పేర్ల మార్పు..!

సామాజిక సమానత్వ దిశగా ముందడుగు.. చారిత్రాత్మక పట్టణంలో వీధుల పేర్ల మార్పు..!

చారిత్రాత్మక పట్టణంలో వీధుల పేర్లు మారుస్తూ మున్సిపల్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంవత్సరాలుగా కులాల పేర్లతో కొనసాగుతున్న పలు వీధుల పేర్లను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బొబ్బిలి పట్టణంలోని మొత్తం పదకొండు వీధులకి కొత్త పేర్లు నిర్ణయించింది.

ఏపీలోని ఆ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ గుర్తింపు.. ఐసీఏఓ కోడ్ ‘VOVI కేటాయింపు!

ఏపీలోని ఆ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ గుర్తింపు.. ఐసీఏఓ కోడ్ ‘VOVI కేటాయింపు!

ఆంధ్రప్రదేశ్‌లోనేఇ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరో గనత సొంతం చేసుకుంది. ఎయిర్‌పోర్టుకు ఐసీఏఓ కోడ్ 'VOVI' గా అధికారికంగా కేటాయించడంతో ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగం కొత్త దశలోకి అడుగుపెట్టింది. అల్లూరి సీతారామరాజు పేరుతో ప్రారంభంకానున్న ఈ విమానాశ్రయం ప్రపంచ విమాన మ్యాప్‌లో తన ప్రత్యేక స్థానాన్ని పొందింది.

అరటిపండు, ఖర్జూరంతో అలసటకు చెక్.. ఏ టైంలో తినాలంటే..?

అరటిపండు, ఖర్జూరంతో అలసటకు చెక్.. ఏ టైంలో తినాలంటే..?

అలసట, బలహీనత వంటి సమస్యలకు అరటిపండు, ఖర్జూరం ఉత్తమ పరిష్కారాలు. వీటిని సరైన సమయంలో తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అరటిపండు నిదానంగా శక్తినివ్వగా, ఖర్జూరం తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే, వీటిని ఎప్పుడు, ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం.

Andhra: మా కొడుకు జాడ చెప్పరూ అంటూ 8 ఏళ్లుగా పోలీస్ స్టేషన్‌కు తల్లిదండ్రులు.. చివరకు

Andhra: మా కొడుకు జాడ చెప్పరూ అంటూ 8 ఏళ్లుగా పోలీస్ స్టేషన్‌కు తల్లిదండ్రులు.. చివరకు

ఎనిమిదేళ్లుగా తప్పిపోయిన తనయుడు తిరిగి వస్తాడేమోనన్న ఆశతో తల్లడిల్లిన తల్లిదండ్రుల కలను నిజం చేశారు విజయనగరం జిల్లా పోలీసులు. గుర్ల మండలానికి చెందిన పైడిరాజు మిస్సింగ్ కేసును ఆధునిక సాంకేతికతతో విజయవంతంగా ఛేదించి, అతడిని సురక్షితంగా కుటుంబానికి చేరవేశారు. ఈ ఘటన పోలీసులపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచుతోంది.

Andhra: పోలీసు శాఖలో అత్యంత దిగువ స్థాయిలో ఉండి.. కోట్లకు పడగలెత్తాడు.. వామ్మో..

Andhra: పోలీసు శాఖలో అత్యంత దిగువ స్థాయిలో ఉండి.. కోట్లకు పడగలెత్తాడు.. వామ్మో..

విజయనగరం జిల్లాలో హోంగార్డ్ నెట్టి శ్రీనివాసరావు అవినీతి కేసు రోజురోజుకీ మరింత ఉత్కంఠను రేపుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏసీబీ సోదాల్లో బయటపడిన రూ.20 కోట్ల అక్రమ సంపాదన, జిల్లా స్థాయి అధికారులతో ఉన్న లింకులు, గోప్య సమాచారం లీక్ చేసిన ఆధారాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇది ఒక్కడి పని కాదన్న అనుమానాలతో ఏసీబీ అధికారులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Manyam District: కాఫీ తోటలో దీన్ని అంతర పంటగా వేశాడు.. ఇంకేముందే డబ్బులే డబ్బులు..

Manyam District: కాఫీ తోటలో దీన్ని అంతర పంటగా వేశాడు.. ఇంకేముందే డబ్బులే డబ్బులు..

మన్యం జిల్లాలో కాఫీ సాగుతో పాటు మిరియాల అంతర పంట గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచుతోంది. శతాబి గ్రామ రైతు లచ్చయ్య తన కాఫీ తోటలో మిరియాలను సాగుచేస్తూ ఏటా రూ.40-50 వేల నికర లాభం ఆర్జిస్తున్నాడు. కాఫీ చెట్ల నీడన పెరిగే మిరియాలకు మంచి డిమాండ్ ఉండటంతో, తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వస్తున్నాయి. ఇది గిరిజన రైతుల ఆర్థిక స్థితికి కొత్త మార్గం.

మాములోడు కాదుగా.. జీతం 18 వేలు.. ఆస్తులు మాత్రం 20 కోట్లు.. ఎలా సంపాదించాడో తెలిస్తే

మాములోడు కాదుగా.. జీతం 18 వేలు.. ఆస్తులు మాత్రం 20 కోట్లు.. ఎలా సంపాదించాడో తెలిస్తే

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో ఓ హోంగార్డ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిశాయి. ఆ హోమ్ గార్డ్ స్థిర, చర ఆస్తులు విలువ చూసి ఏసీబీ అధికారులు నోరెళ్లబెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక హోమ్ గార్డ్ వద్ద ఇంత భారీ మొత్తం ఆస్తులు ఉండడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచనం సృష్టిస్తుంది. ఇంతకు అతని ఆస్తుల విలువెంతో తెలుసా?

ఎంత పనిచేశావురా.. నాలుగు వందల కోసం పిడిగుద్దులు.. ప్రాణాలు వదిలిన వృద్ధుడు!

ఎంత పనిచేశావురా.. నాలుగు వందల కోసం పిడిగుద్దులు.. ప్రాణాలు వదిలిన వృద్ధుడు!

మానవత్వ విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయి అనడానికి విజయనగరం జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన నిదర్శనం. అప్పు తీసుకున్న నాలుగు వందలు తిరిగి ఇవ్వమని అడిగిన వృద్ధుడిని దారుణంగా కొట్టి చంపాడు ఓ దుర్మార్గుడు. నన్ను వదిలిపెట్టు బాబు అని వేడుకున్నా కనికరించకుండా కిరాతకంగా హింసించారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో సంచలనంగా మారింది.

Vizianagaram: రామాయణ యంగ్ ఇండియన్స్ కాంక్లేవ్‌ ప్రారంభం.. అబ్బుర పరిచిన ముస్లీం విద్యార్థుల ప్రసంగాలు

Vizianagaram: రామాయణ యంగ్ ఇండియన్స్ కాంక్లేవ్‌ ప్రారంభం.. అబ్బుర పరిచిన ముస్లీం విద్యార్థుల ప్రసంగాలు

యువతలో నైతిక విలువలు, ధర్మబద్ధమైన జీవన విధానంపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో రామనారాయణం ప్రాంతంలో కాంక్లేవ్‌ను నిర్వహించారు. జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు, ఆధ్యాత్మికవేత్తలు, అధ్యాపకులు ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కాంక్లేవ్‌లో రామాయణంలోని ముఖ్య ఘట్టాలు..

ఎంత ఘోరం.. ఎంత ఘోరం..ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న నిప్పుల కుంపటి!

ఎంత ఘోరం.. ఎంత ఘోరం..ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న నిప్పుల కుంపటి!

పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలసలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, చిన్నారి మృతిచెందారు. చలి నివారణకు నిప్పుల కుంపటి పెట్టుకుని నిద్రపోవడం లేదా ఆర్థిక ఇబ్బందులు ఆత్మహత్యకు కారణమా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక నివేదికలో విషవాయువు వల్ల మరణాలు తేలినా, అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు ఆడపిల్లలు అనాథలయ్యారు, గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Andhra News: రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు.. తల్లిబిడ్డ సేఫ్

Andhra News: రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు.. తల్లిబిడ్డ సేఫ్

పార్వతీపురం మన్యం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రైలు పట్టాలపై ఓ మహిళ ప్రసవించింది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా పురిటినొప్పులు రావడంతో రైలు దిగి ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కానీ పట్టాలు దాటే క్రమంలోనే ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. తోటి ప్రయాణికుల మానవత్వంతో కూడిన సాయంతో తల్లిబిడ్డలు క్షేమంగా ఆసుపత్రికి చేరారు