21 సంవత్సరాలుగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ వంటి సంస్థల్లో పనిచేసి.. 2018లో టీవీ9 తెలుగులో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నాను. రెండు దశాబ్దాలకు పైచిలుకు రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన, ప్రజా హితమైన కథనాలను కవర్ చేశాను.
Andhra News: ఎంత పనిచేశావ్ పెద్దాయన.. భార్య మందలిస్తే చనిపోవాలా?
కుటుంబ బాధ్యతలను పట్టించుకోవడం లేదని భార్య మందలించడంతో మనస్తాపానికి గురైన 60 ఏళ్ల వృద్ధుడు పురుగుల మందు తాగి మృతి చెందాడు. కొంతకాలంగా మద్యానికి అలవాటు పడిన అతడు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ పోషణ కోసం పనికి వెళ్లాలని భార్య సూచించి పొలం పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది..
- Gamidi Koteswara Rao
- Updated on: Aug 7, 2026
- 3:36 pm
అప్పుడు ఇందిరా.. ఇప్పుడు మోదీ.. 43 ఏళ్ల తర్వాత విజయనగరంలో ప్రధాని పర్యటన..
దాదాపు 43 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి హోదాలో విజయనగరం జిల్లాకు నరేంద్ర మోదీ రానుండటం చారిత్రక ఘట్టంగా మారింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొనే మోదీ పర్యటనతో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమవుతుందని భావిస్తున్నారు. ఇందిరా గాంధీ తర్వాత ప్రధానమంత్రి హోదాలో జిల్లాకు వస్తున్న నాయకుడిగా మోదీ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.
- Gamidi Koteswara Rao
- Updated on: Jul 26, 2026
- 2:46 pm
బాబోయ్.. బైక్ స్టార్ట్ చేస్తుండగా ఏవేవో శబ్ధాలు.. కట్ చేస్తే, వణికిపోయే సీన్.. ఇదిగో వీడియో
విజయనగరం జిల్లా రాజాం ఆదర్శనగర్ కాలనీలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్రవాహనంలోకి సుమారు ఐదు అడుగుల నాగుపాము దూరడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రమణయ్య ప్రత్యేక పరికరాల సహాయంతో పామును సురక్షితంగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Jul 21, 2026
- 10:01 am
అరుదైన గౌరవం.. అయోధ్య రామాలయానికి కానుకగా బొబ్బిలి వీణ!
ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన బొబ్బిలి వీణకు అరుదైన గౌరవం లభించింది. అయోధ్య శ్రీరామ మందిరాన్ని అలంకరించనున్న ఈ వీణను బొబ్బిలి శిల్పి సర్వసిద్ధి గంగాధరాచారి రెండున్నర సంవత్సరాలు శ్రమించి రూపొందించారు. మరుగున పడుతున్న కళకు తిరిగి జీవం పోస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Jul 19, 2026
- 8:21 pm
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో స్థానికుల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన తోమడపు ఎద్దుకు సోమవారం ఘనంగా అంతిమ యాత్ర నిర్వహించారు. సింహాద్రి అప్పన్న స్వామి స్వరూపంగా భావించి ఎన్నో సంవత్సరాలుగా పూజలు అందుకున్న ఈ ఎద్దు మృతి చెందడంతో స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Jul 7, 2026
- 10:45 pm
Andhra News: లవ్వంటూ.. డాక్టర్కు పదేపదే మెసేజ్లు.. సీన్కట్చేస్తే.. ఇదీ పరిస్థితి
విజయనగరం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్థానికింగా ఉన్న ఓ క్లీనిక్ నేమ్ బోర్డుపై మహిళా డాక్టర్ నెంబర్ తీసుకున్న ఓ కేటుగాడు.. తరచూ ఆమెకు కాల్స్, మెసేజ్లు చేస్తూ వేదించడం స్టార్ట్ చేశారు. నెంబర్ బ్లాక్ చేసినా మరో నెంబర్తో ఇబ్బందులు పెట్టడంతో విసిగిపోయిన యువతి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి నిందితుడిని అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేశారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Jul 4, 2026
- 9:19 pm
వరుస నేరాలకు చెక్.. ముగ్గురిపై పీడీ యాక్ట్, నేరస్థులకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్!
Vizianagaram Police, PD Act: విజయనగరం జిల్లాలో వరుసగా దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు అలవాటు నేరస్థులపై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేసి విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పష్టం చేశారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Jul 4, 2026
- 9:11 pm
Vizianagaram: ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎస్సై వీరంగం.. ల్యాబ్ అసిస్టెంట్పై దాడి
విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం రేగింది. ఏఆర్ ఏఎస్సై సోమేశ్వరరావుకి, ఆసుపత్రి ల్యాబ్ అసిస్టెంట్ భాగ్యరావుకి మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. పార్కింగ్ విషయంలో గొడవ చోటుచేసుకోగా.. అది కాస్త ముదిరి తారాస్థాయికి చేరుకుంది. అసిస్టెంట్పై ఏఎస్సై దాడికి దిగడంతో ఉద్రిక్తత రేగింది.
- Gamidi Koteswara Rao
- Updated on: Jul 4, 2026
- 9:07 pm
Andhra Pradesh: ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. వీపుపై మోసి విద్యార్థిని ప్రాణం నిలబెట్టిన వార్డెన్.. వీడియో చూడండి..
ఒకవైపు దేశం బుల్లెట్ ట్రైన్లు, అంతరిక్ష ప్రయోగాల వైపు దూసుకుపోతుంటే.. మరోవైపు మారుమూల గిరిజన ప్రాంతాల్లో కనీసం అత్యవసర వైద్యం అందాలన్నా రోడ్లు లేని దయనీయ స్థితి నేటికీ కొనసాగుతుంది. తాజాగా విజయనగరం జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినిని తన వీపుపై ఏకంగా 6 కిలోమీటర్లు మోసుకెళ్లి ఆస్పత్రికి చేర్చింది ఆశ్రమ వార్డెన్. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..
- Gamidi Koteswara Rao
- Updated on: Jul 2, 2026
- 6:15 pm
Andhra: అయ్యో.. బుజ్జమ్మ.. అప్పడే నూరేళ్లు నిండిపోయాయా..?
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న 18 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు నీటితో నింపిన టబ్లో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు గమనించేలోపే ఈ ఘటన జరగడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Jun 28, 2026
- 10:42 am
పొలం పనులకు వెళ్లిన వదిన.. ఇంట్లోకి చొరబడ్డ మరదలు! సీన్ కట్ చేస్తే.. ఊహించని షాక్
విజయనగరం జిల్లా వీరసాగరంలో కుటుంబ ఆస్తి వివాదాలు, పుస్తెలతాడు వాటా విషయంలో వదిన ఇంట్లో మరదలు వసంత 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేసింది. పగటిపూట ఎవరూ లేని సమయంలో బీరువా పగలగొట్టి దొంగతనానికి పాల్పడింది. పోలీసుల దర్యాప్తులో నిందితురాలు పట్టుబడి, బంగారం స్వాధీనం చేసుకున్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Jun 19, 2026
- 5:57 pm
Andhra: ఇంట్లో ఉన్నప్పుడేమో ఒకటి.. బయటకు వచ్చేసరికి 2.. ఏమైందంటే..?
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వత్తాడ గ్రామంలోని ఓ ఇంట్లో అరుదైన కింగ్ కోబ్రా కనిపించడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. జెర్రిపోతు పామును మింగడంతో కదలలేని స్థితికి చేరిన కింగ్ కోబ్రాను అటవీశాఖ అధికారులు, స్నేక్ క్యాచర్ సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇలాంటి విషసర్పాలు కనిపిస్తే భయపడకుండా వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Jun 19, 2026
- 1:14 pm