21 సంవత్సరాలుగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ వంటి సంస్థల్లో పనిచేసి.. 2018లో టీవీ9 తెలుగులో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నాను. రెండు దశాబ్దాలకు పైచిలుకు రిపోర్టింగ్ ప్రయాణంలో.. కష్టతరమైన పరిస్థితులకు వెరవకుండా పలు సాహసోపేతమైన, ప్రజా హితమైన కథనాలను కవర్ చేశాను.
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం..ఆ లాస్ట్ మెసేజ్ చూస్తే..
ప్రజా సమస్యల పరిష్కారం కోసం దశాబ్దానికి పైగా కలం పట్టిన ఓ జర్నలిస్ట్, తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలకు తాళలేక తనువు చాలించడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. రాజాం మున్సిపాలిటీ పరిధిలోని మెంటిపేటకు చెందిన మాజీ విలేకరి అద్దంకి కృష్ణ అలియాస్ మధు (45) శనివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు స్నేహితులకు ఓ భావోద్వేగ చివరి సందేశం పంపారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Aug 30, 2026
- 2:09 pm
Andhra Pradesh: వాళ్లు బతికే ఉన్నారు.. నేపాల్ వరద బాధితుల కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..
Andhra Pradesh: ముగ్గురు కుమారుల్లో సంతోష్ కుమార్ సాహు పెద్దవారు. సంతోష్ కుమార్ సాహు పదో తరగతి వరకు పార్వతీపురంలోనే చదువుకున్నారు. అనంతరం విశాఖపట్నంలో ఇంటర్, డిగ్రీ విద్యను పూర్తి చేసి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం లండన్ వెళ్లి అక్కడే..
- Gamidi Koteswara Rao
- Updated on: Aug 30, 2026
- 11:41 am
నేపాల్ వరదల్లో గల్లంతైన ఏపీకి చెందిన నలుగురు NRIలు.. కాపాడాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి!
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు యాత్రికులు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకోగా వారిలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన నలుగురు యాత్రికులు గల్లంతయ్యారు. నేపాల్లో సంభవించిన భారీ వరదలతో ఈ ప్రమాదం నెలకొంది.
- Gamidi Koteswara Rao
- Updated on: Aug 28, 2026
- 2:53 pm
ఆలయంలో అద్భుతం.. పవిత్ర సోమవారం శివాలయంలో ప్రత్యక్షమైన నాగేంద్రుడు!
విజయనగరం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందిన సంగం సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం అరుదైన దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. భక్తులంతా స్వామివారి పూజలు చేస్తుండగా ఆలయంలో అకస్మాత్తుగా నాగుపాము ప్రత్యక్షం కావడంతో భక్తుల్లో భక్తిభావం వెల్లివిరిసింది. పవిత్రమైన సోమవారం రోజున నాగేంద్రుడు ఆలయంలో దర్శనమివ్వడాన్ని భక్తులు శుభసూచకంగా భావించారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Aug 24, 2026
- 9:19 pm
108 రకాల పిండి వంటలతో కురుపాం పైడిమారమ్మ అమ్మవారికి శ్రావణమాసం సారె
శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గ్రామదేవత పైడిమారమ్మ అమ్మవారికి గ్రామస్థులు అత్యంత వైభవంగా 108 రకాల పిండి వంటలతో శ్రావణ సారెను సమర్పించారు. గ్రామంలోని దూళికేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన సారె ఊరేగింపు మేళతాళాలు, భక్తుల నామస్మరణల నడుమ కోలాహలంగా సాగి అమ్మవారి ఆలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Aug 24, 2026
- 8:37 pm
తల్లిదండ్రులు చెన్నైలో.. ఇంట్లో ఒంటరిగా కొడుకు.. తెల్లావారాక తలుపు తీసి చూస్తే షాక్..!
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాదిలో ప్రేమ విఫలమై పి.చంద్రశేఖర్ (23) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు చెన్నైలో ఉండగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. మరుసటి రోజు ఉదయం ఈ విషయం బయటపడటంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. కాల్ డేటా ఆధారంగా పోలీసులు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Aug 23, 2026
- 12:15 pm
Andhra: ఎంత పని చేశావ్ తల్లి.. పెళ్లి జ్ఞాపకాలు మరువకముందే నవ వధువు బలవన్మరణం
టెట్ పరీక్షలో ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదనే మనస్తాపంతో విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినరాజేరు గ్రామంలో నవ వధువు తనూజ ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయిన 50 రోజులకే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
- Gamidi Koteswara Rao
- Updated on: Aug 21, 2026
- 10:17 am
Andhra: మొదట ప్రియుడు.. ఆ తర్వాత ప్రియురాలు.. అసలు ఏమైందంటే..?
విజయనగరం జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గుర్ల మండలం కోటగండ్రేడు గ్రామానికి చెందిన యువకుడు దేవకీనందన్, అదే గ్రామానికి చెందిన బాలిక ప్రేమించుకున్నారు. పెళ్లి విషయంలో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో నందన్ ఆత్మహత్య చేసుకోగా.. మరుసటి రోజే బాలిక కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఒక్కరోజు వ్యవధిలో ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
- Gamidi Koteswara Rao
- Updated on: Aug 19, 2026
- 5:18 pm
ఆర్మీ అగ్నివీర్గా వారంలో కొలువు.. తమ్ముడిని కాపాడేందుకు బావిలోకి దిగి దారుణం
అన్నదమ్ములు బావిలో మునిగి ఒకేరోజు ప్రాణాలు కోల్పోయారు. ఇంటి మోటార్ను బయటకు తీసేందుకు బావిలోకి దిగిన తమ్ముడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతుండగా, అతడిని రక్షించేందుకు అన్న కూడా బావిలోకి దిగాడు. అయితే ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఒకేసారి ఇద్దరు కుమారులను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి..
- Gamidi Koteswara Rao
- Updated on: Aug 18, 2026
- 1:29 pm
Viral Video: శ్రావణం మాసం రోజు శివాలయం ముందుకు ఏనుగుల గుంపు.. ఏం చేశాయో చూడండి!
జంతువులు చేసే కొన్ని పనులు జనాలను కొన్ని సార్లు భయాందోళనకు గురిచేసినా.. మరికొన్ని సార్లు ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగు చూసింది. అడవిలోంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన ఓ ఏనుగుల గుంపు.. అక్కడే ఉన్న శివాలయం ముందు ఆగి.. ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నట్టు కనింపించింది. ఈ దృశ్యం చూసిన స్థానిక జనాలు.. ఇది ఆ శివయ్య మహిమే అంటున్నారు.
- Gamidi Koteswara Rao
- Updated on: Aug 14, 2026
- 11:00 am
Andhra News: ఎంత పనిచేశావ్ పెద్దాయన.. భార్య మందలిస్తే చనిపోవాలా?
కుటుంబ బాధ్యతలను పట్టించుకోవడం లేదని భార్య మందలించడంతో మనస్తాపానికి గురైన 60 ఏళ్ల వృద్ధుడు పురుగుల మందు తాగి మృతి చెందాడు. కొంతకాలంగా మద్యానికి అలవాటు పడిన అతడు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ పోషణ కోసం పనికి వెళ్లాలని భార్య సూచించి పొలం పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది..
- Gamidi Koteswara Rao
- Updated on: Aug 7, 2026
- 3:36 pm
అప్పుడు ఇందిరా.. ఇప్పుడు మోదీ.. 43 ఏళ్ల తర్వాత విజయనగరంలో ప్రధాని పర్యటన..
దాదాపు 43 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి హోదాలో విజయనగరం జిల్లాకు నరేంద్ర మోదీ రానుండటం చారిత్రక ఘట్టంగా మారింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొనే మోదీ పర్యటనతో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమవుతుందని భావిస్తున్నారు. ఇందిరా గాంధీ తర్వాత ప్రధానమంత్రి హోదాలో జిల్లాకు వస్తున్న నాయకుడిగా మోదీ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.
- Gamidi Koteswara Rao
- Updated on: Jul 26, 2026
- 2:46 pm