జగ్గంపేట
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజవర్గాల్లో జగ్గంపేట ఒకటి. కాకినాడ జిల్లాలోని ఒక నియోజకవర్గం ఈ జగ్గంపేట. ఇది కాకినాడ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. జ్యోతుల నాగ వీర వెంకట విష్ణు సత్య మార్తాండ రావు(చంటిబాబు) జగ్గంపేట ప్రస్తుత ఎమ్మెల్యే. ఈయన 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 211,402 మంది ఓటర్లు ఉన్నారు. డిలిమిటేషన్ ఆర్డర్స్(1955) ప్రకారం 1955లో నియోజకవర్గం స్థాపించబడింది. జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో గోకవరం, జగ్గంపేట, గండేపల్లె, కిర్లంపూడి నాలుగు మండలాలుగా ఉన్నాయి. ఇక ఈ నియోజవర్గంలో 1955 నుంచి 2019 ఎన్నికల వరకు వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే.. ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ, రెండుసార్లు టీడీపీ పార్టీ, రెండుసార్లు స్వతంత్ర అభ్యర్ధులు, ఒక్కసారి వైసీపీ పార్టీ అభ్యర్ధి గెలిచారు. ఇక 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి తోట నరసింహం, 2014లో వైసీపీ పార్టీ అభ్యర్ధి జ్యోతుల నెహ్రూ, 2019లో మళ్లీ వైసీపీ పార్టీకి చెందిన జ్యోతుల చంటిబాబు జగ్గంపేట నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
Phase | Date | State | Seat |
---|---|---|---|
1 | April 19, 2024 | 21 | 102 |
2 | April 26, 2024 | 13 | 89 |
3 | May 07, 2024 | 12 | 94 |
4 | May 13, 2024 | 10 | 96 |
5 | May 20, 2024 | 8 | 49 |
6 | May 25, 2024 | 7 | 57 |
7 | Jun 01, 2024 | 8 | 57 |