పాలకొల్లు
పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం.. పాలకొల్లు.. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక నియోజకవర్గం. ఇది నరసాపురం లోకసభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గంలో మొత్తం 190,125 మంది ఓటర్లు ఉన్నారు. డిలిమిటేషన్ ఆర్డర్స్ ప్రకారం.. 1951లో నియోజకవర్గాన్ని స్థాపించారు. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి. పాలకొల్లు, యలమంచిలి, పోడూరు ఉన్నాయి. 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 2014లో కూడా ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం పాలకొల్లులో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరి పోరు నెలకొంది. వైసీపీ నుంచి గుడాల శ్రీహరి గోపాలరావు పోటీచేస్తుండగా.. టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు బరిలో ఉన్నారు. 1952 నుంచి పాలకొల్లు నియోజకవర్గంలో.. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు 7 సార్లు చొప్పున గెలుపొందగా.. సీపీఐ ఒకసారి గెలుపొందింది.
Phase | Date | State | Seat |
---|---|---|---|
1 | April 19, 2024 | 21 | 102 |
2 | April 26, 2024 | 13 | 89 |
3 | May 07, 2024 | 12 | 94 |
4 | May 13, 2024 | 10 | 96 |
5 | May 20, 2024 | 8 | 49 |
6 | May 25, 2024 | 7 | 57 |
7 | Jun 01, 2024 | 8 | 57 |