పొన్నూరు
పొన్నూరు నియోజకవర్గం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలలో పొన్నూరు నియోజకవర్గం ఒకటి.. గుంటూరు జిల్లాలో ఉంది. ఇది గుంటూరు లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 227,727 మంది ఓటర్లు ఉన్నారు. డిలిమిటేషన్ ఆర్డర్స్ ప్రకారం 1951లో పొన్నూరు నియోజకవర్గాన్ని స్థాపించారు. ఈ నియోజకవర్గ పరిధిలో పొన్నూరు, చేబ్రోలు, పెదకాకాని మండలాలు ఉన్నాయి.
YSR కాంగ్రెస్ పార్టీకి చెందిన కిలారి వెంకట రోశయ్య 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో YSR కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు. అంతకుముందు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వరుసగా ఐదుసార్లు ఆయన ఇక్కడ గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య గట్టి పోటి నెలకొంది.
ఈ నియోజకవర్గంలో ఆరు సార్లు తెలుగుదేశం పార్టీ, నాలుగు సార్లు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ, కృషికర్ లోక్ పార్టీ, వైసీపీ ఒక్కోసారి, ఇండిపెండెంట్ ఒకసారి గెలుపొందారు.
Phase | Date | State | Seat |
---|---|---|---|
1 | April 19, 2024 | 21 | 102 |
2 | April 26, 2024 | 13 | 89 |
3 | May 07, 2024 | 12 | 94 |
4 | May 13, 2024 | 10 | 96 |
5 | May 20, 2024 | 8 | 49 |
6 | May 25, 2024 | 7 | 57 |
7 | Jun 01, 2024 | 8 | 57 |