నూజివీడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల్లో నూజివీడు ఒకటి. ఏలూరు జిల్లాలోని ఒక నియోజకవర్గం ఈ నూజివీడు. ఇది ఏలూరు లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. వైసీపీ పార్టీకి చెందిన మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఈ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే. 2019 ఎన్నికల్లో సమీప టీడీపీ అభ్యర్ధి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుపై సుమారు 16 వేల ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్ధి వెంకట ప్రతాప్ అప్పారావు గెలుపొందారు. 2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 230,650 మంది ఓటర్లు ఉన్నారు. డిలిమిటేషన్ ఆర్డర్స్(1951) ప్రకారం 1951లో నియోజకవర్గం స్థాపించబడింది. నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆగిరిపల్లి, చత్రై, ముసునూరు, నూజివీడు నాలుగు మండలాలుగా ఉన్నాయి. ఇక 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ, మూడుసార్లు టీడీపీ, ఒక్కసారి స్వతంత్ర అభ్యర్ధి, ఒక్కసారి వైసీపీ పార్టీ అభ్యర్ధి గెలుపొందారు. 2024 ఎన్నికలకు నూజీవీడు నుంచి కోలుసు పార్ధసారధి టీడీపీ-జనసేన కూటమి అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు.
Phase | Date | State | Seat |
---|---|---|---|
1 | April 19, 2024 | 21 | 102 |
2 | April 26, 2024 | 13 | 89 |
3 | May 07, 2024 | 12 | 94 |
4 | May 13, 2024 | 10 | 96 |
5 | May 20, 2024 | 8 | 49 |
6 | May 25, 2024 | 7 | 57 |
7 | Jun 01, 2024 | 8 | 57 |