పెనమలూరు
పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం : ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన నియోజకవర్గాలలో పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి.. పెనమలూరు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉంది. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పెనమలూరు ఒకటి.. ఈ నియోజకవర్గంలో మొత్తం 267,751 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కంకిపాడు, వుయ్యూరు, పెనమలూరు మండలాలు ఉన్నాయి. డిలిమిటేషన్ ఆర్డర్స్ (2008) ప్రకారం 2008లో నియోజకవర్గాన్ని స్థాపించారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో YSR కాంగ్రెస్ పార్టీకి చెందిన కొలుసు పార్థ సారథి గెలుపొందారు. అంతకుముందు 2009లో కొలుసు పార్థసారథి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఈ నియోజకవర్గంలో 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి బోడే ప్రసాద్ గెలుపొందారు.
పెనమలూరులో ప్రధానంగా వైసీపీ, తెలుగుదేశం మధ్య ప్రధాన పొటీ నెలకొంది. కాగా.. పెనమలూరులో వైసీపీ నుంచి మంత్రి జోగి రమేష్ 2024 ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.
Phase | Date | State | Seat |
---|---|---|---|
1 | April 19, 2024 | 21 | 102 |
2 | April 26, 2024 | 13 | 89 |
3 | May 07, 2024 | 12 | 94 |
4 | May 13, 2024 | 10 | 96 |
5 | May 20, 2024 | 8 | 49 |
6 | May 25, 2024 | 7 | 57 |
7 | Jun 01, 2024 | 8 | 57 |