నరసాపురం
నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం: ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన నియోజకవర్గాలలో నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఈ నరసాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది నరసాపురం లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గంలో 2019 లెక్కల ప్రకారం మొత్తం 1,68,122 మంది ఓటర్లు ఉన్నారు. డిలిమిటేషన్ ఆర్డర్స్ 1951 ప్రకారం ఆదే సంవత్సరంలో నియోజకవర్గం స్థాపించబడింది. ఈ నియోజకవర్గంలో రెండు మండలాలు మాత్రమే ఉన్నాయి. మొగల్తూరు, నర్సాపురం మండలాలు ఉన్నాయి. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బండారు మాధవ నాయుడు గెలుపొందారు. 2019 అసెంబ్లీ ఎన్నకల్లో జనసేన అభ్యర్థిగా బొమ్మిడి నాయక్ బరిలో నిలవడంతో బండారు మాధవ్ మూడవ స్థానానికి పరిమితం అయ్యారు. వైఎస్సార్సీపీ నుంచి ముదునూరి ప్రసాద్ రాజు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.
నరసాపురంలో ప్రధానంగా వైఎస్సార్సీపీ, తెలుగుదేశం మధ్య ప్రధాన పొటీ ఉంటుంది. ఇప్పటి పొత్తులో భాగంగా జనసేన కూడా ఎన్నికల బరిలో సిద్దంగా ఉంది. నరసాపురం ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఈ మూడు పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అందుకే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన కూటమి ఇంకా అభ్యర్థిని ప్రటించలేదు. వైసీపీ కూడా అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది.
Phase | Date | State | Seat |
---|---|---|---|
1 | April 19, 2024 | 21 | 102 |
2 | April 26, 2024 | 13 | 89 |
3 | May 07, 2024 | 12 | 94 |
4 | May 13, 2024 | 10 | 96 |
5 | May 20, 2024 | 8 | 49 |
6 | May 25, 2024 | 7 | 57 |
7 | Jun 01, 2024 | 8 | 57 |