నిడదవోలు
నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం: ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన నియోజకవర్గాలలో నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఈ నిడదవోలు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇది రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గంలో 2019 లెక్కల ప్రకారం మొత్తం 2,03,084 మంది ఓటర్లు ఉన్నారు. డిలిమిటేషన్ ఆర్డర్స్ 2008 ప్రకారం ఆదే సంవత్సరంలో నియోజకవర్గం స్థాపించబడింది. ఈ నియోజకవర్గంలో ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు మండలాలు ఉన్నాయి. 2009, 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బూరుగుపల్లి శేషారావు గెలుపొందారు. 2019లో జి శ్రీనివాస్ నాయుడు వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా అతికాల రమ్య శ్రీ పోటీ చేశారు. బీజేపీ కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడింది.
నిడదవోలులో ప్రధానంగా వైఎస్సార్సీపీ, తెలుగుదేశం మధ్య ప్రధాన పొటీ ఉంటుంది. ఇప్పటి పొత్తులో భాగంగా జనసేన కూడా ఎన్నికల యుద్దానికి కాలుదువ్వుతోంది. నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం ఇంకా అభ్యర్థిని ప్రటించలేదు. వైసీపీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది.
Phase | Date | State | Seat |
---|---|---|---|
1 | April 19, 2024 | 21 | 102 |
2 | April 26, 2024 | 13 | 89 |
3 | May 07, 2024 | 12 | 94 |
4 | May 13, 2024 | 10 | 96 |
5 | May 20, 2024 | 8 | 49 |
6 | May 25, 2024 | 7 | 57 |
7 | Jun 01, 2024 | 8 | 57 |