రాప్తాడు
ఏపీ రాజకీయాల్లో ఆనంతపురం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే అనంతపురం జిల్లా రాజకీయాలు అనగానే మొదట అందరికీ గర్తుకు వచ్చేది రాప్తాడు నియోజకవర్గం. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి 1,11,201 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, రెండో స్థానంలో టీడీపీకి చెందిన పరిటాల శ్రీరామ్ నిలిచారు. గెలుపు మార్జిన్: 25,575 ఓట్లుగాగా ఉంది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతమ్మ 91,394 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో (2019) మాత్రం వైసీపీకి చెందిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గెలిచి రేసులోకి వచ్చారు. అయితే 2024 ఎన్నికలు కూడా రసవత్తరంగా జరుగబోతున్నాయి. టీడీపీ నుంచి పరిటాల సునీత బరిలో నిలుస్తుండగా, వైసీపీ నుంచి ప్రకాశ్ రెడ్డి ఖరారు అయ్యారు. అయితే రాప్తాడు ప్రజలు ఈ సారి టీడీపీకి మొగ్గు చూపవచ్చునని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
Phase | Date | State | Seat |
---|---|---|---|
1 | April 19, 2024 | 21 | 102 |
2 | April 26, 2024 | 13 | 89 |
3 | May 07, 2024 | 12 | 94 |
4 | May 13, 2024 | 10 | 96 |
5 | May 20, 2024 | 8 | 49 |
6 | May 25, 2024 | 7 | 57 |
7 | Jun 01, 2024 | 8 | 57 |