రాజమండ్రి రూరల్
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం : ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన నియోజకవర్గాలలో రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి.. ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇది రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గంలో 2019 లెక్కల ప్రకారం మొత్తం 254,339 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కడియం, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని వార్డులు, రాజమండ్రి రూరల్ మండలాలు ఉన్నాయి. డిలిమిటేషన్ ఆర్డర్స్ (2008) ప్రకారం 2008లో నియోజకవర్గాన్ని స్థాపించారు. 2014, 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. అంతకుముందు 2009లో ఇదే తెలుగుదేశం పార్టీ నుంచి చందన రమేష్ గెలుపొందారు.
రాజమండ్రి రూరల్లో ప్రధానంగా వైఎస్సార్సీపీ, తెలుగుదేశం మధ్య ప్రధాన పొటీ నెలకొంది. తాజాగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన కూడా కొంత ప్రభావం చూపుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కందుల దుర్గేష్ ఈ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో దిగారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ తరఫున తనకు టికెట్ వస్తుందని ఆశించారు కందుల దుర్గేష్. అయితే పొత్తులో భాగంగా టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికే ఈ స్థానాన్ని కేటాయించారు చంద్రబాబు.
Phase | Date | State | Seat |
---|---|---|---|
1 | April 19, 2024 | 21 | 102 |
2 | April 26, 2024 | 13 | 89 |
3 | May 07, 2024 | 12 | 94 |
4 | May 13, 2024 | 10 | 96 |
5 | May 20, 2024 | 8 | 49 |
6 | May 25, 2024 | 7 | 57 |
7 | Jun 01, 2024 | 8 | 57 |