పెనుకొండ
ఏపీ రాజకీయాల్లో పెనుకొండది ప్రత్యేక స్థానం. పెనుకొండ విజయనగర రాజుల రెండవ రాజధానిగా వెలుగొందింది. పెనుకొండ శతృదుర్భేద్యమైన దుర్గం. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న గిరి దుర్గాలలో ప్రఖ్యాతి గాంచింది. శాసనాల్లో దీనిని 'పెనుకొండ ఘనగిరి' గా లిఖించినట్లు తెలుస్తుంది. పెనుకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని పట్టణం. ఇక్కడ పెనుకొండ కోట పేరుతో ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా ఉంది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి శంకర్ నారాయణ బరిలో నిలిచారు. ఈయన టీడీపీ అభ్యర్థిపై పార్థసారథిపై 15,058 ఓట్లతో గెలిపారు. 2024 ఎన్ని్కల్లో అటు వైసీపీ, ఇటు టీడీపీ పెనుకొండను దక్కించుకోవాలని కసరత్తులు చేస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు భారీ బహిరంగ సభను నిర్వహించి ఓటర్లను ఆకట్టుకున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 233,895. మగవాళ్లు 117,517 ఉండగా, మహిళలు 116,375 ఉన్నారు.
Phase | Date | State | Seat |
---|---|---|---|
1 | April 19, 2024 | 21 | 102 |
2 | April 26, 2024 | 13 | 89 |
3 | May 07, 2024 | 12 | 94 |
4 | May 13, 2024 | 10 | 96 |
5 | May 20, 2024 | 8 | 49 |
6 | May 25, 2024 | 7 | 57 |
7 | Jun 01, 2024 | 8 | 57 |