AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup Trophy : మొహ్సిన్ నక్వీకి బీసీసీఐ వార్నింగ్.. ఆసియా కప్ ట్రోఫీపై రేపే తుది నిర్ణయం ?

భారత జట్టు ఆసియా కప్ గెలిచి నెల రోజులు గడిచినా విజేతకు దక్కాల్సిన ట్రోఫీ మాత్రం ఇంకా వివాదాల్లోనే ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ ట్రోఫీని భారత జట్టుకు అప్పగించడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన బీసీసీఐ సంచలన హెచ్చరిక జారీ చేసింది.

Asia Cup Trophy  : మొహ్సిన్ నక్వీకి బీసీసీఐ వార్నింగ్.. ఆసియా కప్ ట్రోఫీపై రేపే తుది నిర్ణయం ?
Asia Cup Trophy
Rakesh
|

Updated on: Nov 03, 2025 | 7:23 PM

Share

Asia Cup Trophy : భారత జట్టు ఆసియా కప్ గెలిచి నెల రోజులు గడిచినా విజేతకు దక్కాల్సిన ట్రోఫీ మాత్రం ఇంకా వివాదాల్లోనే ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ ట్రోఫీని భారత జట్టుకు అప్పగించడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన బీసీసీఐ సంచలన హెచ్చరిక జారీ చేసింది. నవంబర్ 4న జరగబోయే ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవ్ జీత్ సైకియా స్పష్టం చేశారు. అయితే మొహ్సిన్ నక్వీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై రేపు (నవంబర్ 4న) తుది నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తోంది.

భారత జట్టు ఆసియా కప్ గెలిచి నెల రోజుల కంటే ఎక్కువ సమయం గడిచినప్పటికీ విజేతకు దక్కాల్సిన ట్రోఫీ ఇంకా బీసీసీఐకి చేరలేదు. ఏసీసీ ఛైర్మన్, పీసీబీ ఛైర్మన్ అయిన మొహ్సిన్ నక్వీ ట్రోఫీని తమ వద్దే అట్టిపెట్టుకోవడం వివాదానికి దారితీసింది. ఈ జాప్యం పట్ల నిరాశ చెందిన బీసీసీఐ కార్యదర్శి దేవ్ జీత్ సైకియా.. ఇటీవల నక్వీకి తీవ్ర హెచ్చరిక చేశారు. ట్రోఫీని రెండు రోజుల్లో భారత జట్టుకు అప్పగించకపోతే, నవంబర్ 4న దుబాయ్‌లో జరగబోయే ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని ఆయన పీటీఐ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.

బీసీసీఐ హెచ్చరికను మొహ్సిన్ నక్వీ పట్టించుకోనట్లుగా కనిపిస్తోంది. బీసీసీఐ చేసిన విజ్ఞప్తిపై ఆయన నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. ట్రోఫీ వివాదంపై నవంబర్ 4 నుంచి 7 వరకు దుబాయ్‌లో జరగబోయే ఐసీసీ సమావేశంలో బీసీసీఐ తన ప్రతినిధి ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఐసీసీ మధ్యవర్తిత్వం వహించి, ఈ ట్రోఫీ వివాదంపై రేపే (నవంబర్ 4న) ఒక తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ వివాదంపై సెప్టెంబర్ 30న జరిగిన ఏసీసీ సమావేశంలో కూడా చర్చ జరిగింది. అప్పుడు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, మొహ్సిన్ నక్వీతో ఘాటుగా మాట్లాడుతూ.. ఆసియా కప్ ట్రోఫీపై నక్వీకి ఎలాంటి వ్యక్తిగత హక్కు లేదని, దాని అసలైన వారసులు టీమిండియా అని, కాబట్టి వెంటనే ట్రోఫీని అప్పగించాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ ట్రోఫీని అందించడంలో నక్వీ విఫలమయ్యారు.

ఈ సమావేశంలో ఆసియా కప్ ట్రోఫీ అంశంతో పాటు, క్రికెట్ భవిష్యత్తుకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలు చర్చకు రానున్నాయి. మీడియా నివేదికల ప్రకారం, ఐసీసీ సమావేశంలో మొబైల్ గేమింగ్ హక్కులను విక్రయించడం, అండర్-19 ప్రపంచకప్ ఫార్మాట్ గురించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. క్రికెట్ పరిధిని పెంచే అంశంపై కూడా చర్చ జరగవచ్చు. ముఖ్యంగా దక్షిణ అమెరికాచ పాన్ అమెరికన్ క్రీడలలో క్రికెట్‌కు స్థానం కల్పించడం వంటి అంశాలపై కూడా చర్చలు జరగవచ్చని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..