చేపలతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు ఖాయం..
Fish: చేపలు అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. చేపల కూర లేదా వేపుడు గురించి ఆలోచిస్తేనే నోరూరడం సహజం. చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ వాటిని ఏ ఆహార పదార్థాలతో కలిపి తింటున్నామనేది చాలా ముఖ్యం. కొన్ని ఆహార పదార్థాలను చేపలతో కలిపి తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చి, ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం ఉంది. మీరు చేపలతో కలిపి అస్సలు తీసుకోకూడని ముఖ్యమైన 5 ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 15, 2025 | 1:41 PM

పాల ఉత్పత్తులు: చేపలతో పాటు పెరుగు, పాలు, మజ్జిగ లేదా జున్ను వంటి ఇతర పాల ఉత్పత్తులను కలిపి తినకూడదని నిపుణులు గట్టిగా సిఫార్సు చేస్తున్నారు. చేపలలో, పాల ఉత్పత్తులలో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఈ రెండింటిలోని నిర్దిష్ట సమ్మేళనాలు జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ఇది తీవ్రమైన కడుపు నొప్పి, అసౌకర్యం లేదా జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

సిట్రస్ పండు: చేపలతో పాటు ఎక్కువ మొత్తంలో నిమ్మకాయ లేదా ఇతర విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లను తీసుకోకూడదు. పాత లేదా నిల్వ ఉంచిన చేపలతో సిట్రస్ పండ్లను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే, అరుదైన సందర్భాలలో ఆర్సెనిక్ విషం లేదా చేపల పాయిజన్ జరిగే ప్రమాదం ఉంటుంది. చాలా తక్కువ పరిమాణంలో రుచి కోసం విటమిన్ సి ఉపయోగించవచ్చు. కానీ అధికంగా తీసుకోవడం మంచిది కాదు.

కొన్ని ఆకుకూరలు: చేపలతో కలిపి పాలకూర, కొత్తిమీర వంటి కొన్ని రకాల ఆకుకూరలను ఎక్కువగా తీసుకోకూడదు. ఇలా తినడం వల్ల శరీరం చేపలలోని కాల్షియంను సరిగ్గా గ్రహించలేదు. అంతేకాకుండా గ్యాస్, కడుపు ఉబ్బరం గుండెల్లో మంట వంటి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. రెండూ ఆరోగ్యకరమైనవే అయినా, వాటిని వేర్వేరు సమయాల్లో తినడం ఉత్తమం.

స్వీట్స్: చేపలు తిన్న వెంటనే తీపి పదార్థాలు లేదా డెజర్ట్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది శరీరంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతుంది. ఇది దీర్ఘకాలంలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే జీవక్రియ సమస్యలు, బరువు పెరగడం కూడా జరగవచ్చు.

ఆల్కహాల్ - వైన్: చేపలవేపుడు లేదా కూరతో ఆల్కహాల్ లేదా వైన్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయడం ఉత్తమం. ఈ అలవాటు కాలేయంపై అధిక ఒత్తిడిని పెంచుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. చేపలు తిన్న వెంటనే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ కాంబినేషన్ చాలా ప్రమాదకరం.

చేపలను తేలికగా, ఆరోగ్యకరమైన పద్ధతిలో తినడం చాలా ముఖ్యం. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, చేపలను సరైన పరిమాణంలో, సరైన కాంబినేషన్లో తినడం చాలా ముఖ్యం. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే చేపల వల్ల పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.




